-
ఈవీఎంపై రైట్ గుర్తులు
మరిపెడ రూరల్/ బయ్యారం: మరిపెడ మండలంలోని లూనావత్తండా పోలింగ్ కేంద్రంలోని ఈవీఎంలో చేతి గుర్తు ఎదుట రైట్గుర్తు పెట్టి.. టిక్ చేసి ఉన్న చేతి గుర్తుకు ఓటు వేయాలని పోలింగ్ బూత్ బయట ప్రచారం చేశారని బీఆర్ఎస్ ఏజెంట్ ఆరోపించాడు. అందుకు సంబంధించిన ఈవీఎం ఫొటో తీసి వాట్సాప్ ద్వారా ఎన్నికల కమిషనర్కు ఫిర్యాదు చేసినట్లు బీఆర్ఎస్ ఏజెంట్ తెలిపాడు. అయితే సిబ్బంది రైట్ గుర్తును చెరిపేసి పోలింగ్ను కొనసాగించారు. అలాగే మండలంలోని బీచ్రాజ్పల్లి పోలింగ్ కేంద్రాన్ని ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్ సందర్శించి సిబ్బందికి పలు సూచనలు చేశారు. అలాగే బయ్యారం మండలంలోని వెంకట్రాంపురంలోని 26వ పోలింగ్బూత్లో గుర్తుతెలియని వ్యక్తి ఈవీఎంలో ఉన్న చేతిగుర్తు వద్ద ఇంకుమార్కు పెట్టడం వివాదాస్పదంగా మారింది. కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇంకుమార్కు పెట్టి ఓటర్లను ప్రలోభపెట్టారని బీఆర్ఎస్ పార్టీకి చెందిన నాయకులు ఎన్నికల సిబ్బంది దృష్టికి తీసుకెళ్లారు. దీంతో గంటపాటు ఆ బూత్లో పోలింగ్ను నిలిపివేసిన సిబ్బంది మరో ఈవీఎంను ఏర్పాటు చేసి పోలింగ్ను కొనసాగించారు. -
ఆ నాలుగు మండలాల్లో ముందే..
● మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో 74శాతం పోలింగ్ మహబూబాబాద్ పార్లమెంట్ పరిధి మానుకోట జిల్లాలోని మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో సాయంత్రం 4గంటలకే పోలింగ్ ముగిసింది. ఇల్లెందు నియోజకవర్గంలోని బయ్యారం, గార్ల, ములుగు నియోకవర్గంలోని కొత్తగూడ, గంగారం మండలాల్లో ఉదయం 7గంటలకే పోలింగ్ ప్రారంభించి సాయంత్రం 4గంటలకు ముగింశారు. కాగా ఎప్పుడు పోలింగ్లో వెనకబడి ఉండే ఈ ప్రాంతాల్లో 74శాతం పోలింగ్ నమోదు కావడం విశేషం. ఓటరు చైతన్య, అవగాహన కార్యక్రమాలు, పోలీసులు ముందస్తు భద్రతా చర్యలు తీసుకోవడంతోనే పోలింగ్ శాతం పెరిగిందని అధికారులు చెబుతున్నారు. ఏజెన్సీ మండలాల్లో నమోదైన పోలింగ్శాతం మండలం మొత్తం ఓట్లు పోలైన ఓట్లు పోలింగ్శాతం కొత్తగూడ 23,460 17,126 73 గంగారం 9,041 7,395 82 బయ్యారం 38,092 26,530 69 గార్ల 30,399 21,603 72 -
ఏజెన్సీలో పోలీసు బాస్
● జిల్లాను జల్లెడపట్టిన పోలీసు యంత్రాంగం మహబూబాబాద్ రూరల్/గూడూరు/గంగారం: కేంద్ర ఎన్నికల సంఘం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ సజావుగా సాగేందుకు జిల్లా పోలీసుశాఖ చేపట్టిన చర్యలు సత్ఫలితాలు ఇచ్చాయి. స్వయంగా ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్ ఎలాంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండా ఆకస్మికంగా తనిఖీలు చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సిబ్బందిని అప్రమత్తం చేస్తూ జాగ్రత్త చర్యలు తీసుకున్నారు. దీంతో ఎన్నికల పోలింగ్ ప్రక్రియ సజావుగా జరగడంతోపాటుగా ప్రజలు కూడా స్వేచ్ఛాయుత వాతావరణంలో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ముందస్తుగా ఎస్పీ ఆదివారం రాత్రి జిల్లాలోని డోర్నకల్ మండలంలోని ఉయ్యాలవాడ, కురవి మండలం మొగిలిచర్ల, సీరోలు, మహబూబాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని బేతోలు గ్రామాలను సందర్శించి తనిఖీ చేశారు. సోమవారం ఉద యం మహబూబాబాద్ ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో ఓటు హక్కు వినియోగించుకున్నారు. అక్కడి నుంచి జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతాలైన బయ్యారం మండలంలోని వెంకట్రాంపురం, మొట్ల తిమ్మాపురం, రంగాపురం, గంగారం మండలంలోని కామారం, మర్రిగూడెం, గూడూరు మండలంలోని గుండెంగ, దంతాలపల్లి, మహబూబాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని సాలార్తండా ప్రాంతాల్లోని పోలింగ్ కేంద్రాలను సందర్శించి తనిఖీ చేశారు. -
కొనుగోలు కేంద్రంలో తడిసిన ధాన్యం
మహబూబాబాద్ అర్బన్: మానుకోట మున్సిపల్ పరిధిలోని గాంధీపురం, అనంతారం శివారులో మెప్మా ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రంలో ఆదివా రం రాత్రి కురిసిన వర్షానికి రైతుల ధాన్యం తడిసిపోయింది. అధికారులు సరిపడా టార్పాలిన్లు అందజేయకపోవడంతోనే ధాన్యం తడిసిపోయిందని రైతులు వాపోయారు. సోమవారం ధాన్యాన్ని ఆరబెట్టుకున్నారు. మంత్రాల నెపంతో వ్యక్తిపై దాడికొత్తగూడ: మంత్రాల నెపంతో ఓ వ్యక్తిపై దాడి జరిగిన ఘటన మండలంలోని వేలుబెల్లి గ్రామంలో సోమవారం రాత్రి జరిగింది. బాధితుడు సింగం యుగేందర్ తెలిపిన వివరాల ప్రకారం.. తాను శివసత్తిగా శివ పూజలు చేసుకుంటానని తెలిపాడు. దీన్ని సాకుగా చూపిస్తూ.. తనకు మంత్రాలు వస్తాయని ఆరోపిస్తూ గ్రామానికి చెందిన మొర్లి కృష్ణ, అతడి భార్య సరోజ, లక్ష్మీనర్సు తనపై కర్రలతో దాడి చేసి గాయపర్చినట్లు చెప్పాడు. విషయం తెలుసుకున్న ఎస్సై దిలీప్ బాధితుడిని వైద్యం కోసం ఆస్పత్రికి తరలించారు. కేసు నమో దు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపా రు. కేంద్రాల పరిశీలన నెల్లికుదురు: మండల కేంద్రంలోని పోలింగ్ కేంద్రంలో తొర్రూరు డీఎస్పీ సురేష్ 80 ఏళ్ల వృద్ధురాలిని వీల్చైర్లో కూర్చోబెట్టి ఓటింగ్కు పంపించారు. అలాగే మండలంలోని ఎర్రబెల్లిగూడెం, మేచరాజుపల్లి పోలింగ్ కేంద్రాలను ఎస్సై కాంతికిరణ్తో కలిసి ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్ పరిశీలించారు. మండల కేంద్రంతో పాటు ఇనుగుర్తి మండలంలోని చిన్ననాగారం గ్రామాల్లో ఎమ్మెల్యే భూక్య మురళీనాయక్ సందర్శించి పోలింగ్ సరళిని పరిశీలించారు. గాంధీపురంలో ఘర్షణమహబూబాబాద్ అర్బన్: మానుకోట మున్సిపల్ పరిధి గాంధీపురం నాలుగోవార్డు ప్రభుత్వ పాఠశాల పోలింగ్ బూత్ సమీపంలో సోమవారం బీఆర్ఎస్, కాంగ్రెస్ నాయకుల మధ్య ఘర్షణ జరిగింది. వివరాలు ఇలా ఉన్నాయి. పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ జరుగుతున్న క్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రచారం చేశారు. ఇది గమనించిన బీఆర్ఎస్ నాయకులు వారి ప్రచారాన్ని అడ్డుకోవడంతో పాటు వాగ్వాదానికి దిగారు. అనంతరం మధ్యాహ్నం సమయంలో కాంగ్రెస్ నాయకులు బిర్యానీ ప్యాకెట్లు తెచ్చుకొని తింటుండగా.. బీఆర్ఎస్ నాయకులు వారిపై దౌర్జన్యం చేశారు. మీరే తింటారా మాకు కూడా ప్యాకెట్లు ఇవ్వాలని దాడి చేశారు. ఈ క్రమంలో ఓ యువకుడి తలపై బలమైన దెబ్బ తగిలింది. కాగా ఆ యువకుడి తండ్రి మానుకోట రూరల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు సమాచారం. ఈమేరకు పోలీసులు గాంధీపురం పోలింగ్ బూత్ సమీపానికి చేరుకొని ఇరువర్గాల నాయకులను చెదరగొట్టారు. హమ్మయ్య దొరికారు..కొత్తగూడ: ఏజెన్సీ గ్రామాల్లో వైద్య సిబ్బంది సికిల్సెల్ ఎనిమియా వ్యాధి నిర్ధారణ కోసం యువతీ యువకులకు రక్తపరీక్షలు చేస్తున్నారు. అయితే పీహెచ్సీ సిబ్బందికి కొంతమంది యువత అందుబాటులోకి రాలేదు. ఈ క్రమంలో సోమవారం ఓటు వేసేందుకు వచ్చిన వారి నుంచి పోలింగ్ కేంద్రం వద్ద రక్త నమూనాలు సేకరించి పరీక్షలు చేశారు. దీంతో హమ్మయ్య ఎట్టకేలకు ఇక్కడ దొరికారు అంటూ సిబ్బంది ఊపిరి పీల్చుకున్నారు. అనారోగ్యాన్ని లెక్క చేయకుండా..బయ్యారం: మండల కేంద్రానికి చెందిన సొసైటీ మాజీ చైర్మన్ తిరుమల సంజీవరెడ్డి కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. అయితే సోమవారం ఆయన ఆస్పత్రి నుంచి వాహనంలో వచ్చి పార్లమెంట్ ఎన్నికల్లో ఓటుహక్కును వినియోగించుకున్నారు. -
సూర్యప్రభ వాహనంపై అమ్మవారి ఊరేగింపు
హన్మకొండ కల్చరల్ : శ్రీభద్రకాళి దేవాలయంలో శ్రీభద్రకాళిభద్రేశ్వరుల కల్యాణ బ్రహ్మోత్సవాల్లో భాగంగా సోమవారం ఆలయప్రధానార్చకుడు భద్రకాళి శేషు ఆధ్వర్యంలో ఉదయం నుంచి నిత్యాహ్నికం జరిపి అనంతరం చతుస్థానార్చన సదస్యం నిర్వహించారు. అమ్మవారిని పూలమాలలతో శోభాయమానంగా అలంకరించారు. ఉదయం అమ్మవారి ఉత్సవమూర్తిని సూర్యప్రభవాహనంపై జైభద్రకాళి అంటూ జయజయద్వానాలు చేస్తుండగా మంగళవాయిద్యాలు, వేదమంత్రోచ్ఛాణలతో ఊరేగించారు. అదే విధంగా సాయంత్రం హంసవాహనంపై ఊరేగించారు. పూజా కార్యక్రమాలకు బాకరాజు చంద్రశేఖర్రావు, రాజశ్రీ దంపతులు ఉభయదాతలుగా వ్యవహరించారు. -
ఓటు వేసిన వీడియో వైరల్..
● వ్యక్తిపై కేసు నమోదు నెల్లికుదురు : మండలంలోని హేమ్లా తండాలో ఓ వ్యక్తి ఓటు వేస్తూ వీడియో తీశాడు. అనంతరం సోషల్ మీడియాలో పోస్టు చేయగా వైరలైంది. ఈ ఘటనలో సదరు వ్యక్తిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై క్రాంతికిరణ్ సోమవారం తెలిపారు. తండాలోని 160 పోలింగ్ కేంద్రంలో తండాకు చెందిన బానోత్ బాలకృష్ణ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తున్న వీడియో తీసి సోషల్ మీడియాలో వైరల్ చేశాడు. దీంతో బీఆర్ఎస్, కాంగ్రెస్ వర్గాల మధ్య పోలింగ్ కేంద్రం సమీపంలో స్వల్ప ఘర్షణ జరిగింది. ఈ విషయంపై ప్రిసైడింగ్ ఆఫీసర్ ఎస్. నాగరాజు ఫిర్యాదు మేరకు బాలకృష్ణపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై క్రాంతికిరణ్ తెలిపారు. మానుకోటలో యువకుడిపై.. మహబూబాబాద్ రూరల్ : తాను ఓ పార్టీకి ఓటు వేసిన దృశ్యాలను ఓ యువకుడు సోషల్ మీడియాలో పోస్టు చేయగా అతడిపై పోలీసులు సోమవారం కేసు నమోదు చేశారు. మహబూబాబాద్ మున్సిపాలిటీ పరిధి గాంధీపురం గ్రామానికి చెందిన దేవనబోయిన శ్రీకాంత్ స్థానిక పోలింగ్ కేంద్రంలో తన ఓటు హక్కు వినియోగించుకున్నాడు. అదేవిధంగా తాను ఏ పార్టీకి ఓటు వేశాడో అనే విషయ దృశ్యాలను సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. దీంతో ఎన్నికల ప్రిసైడింగ్ అధికారి వీరన్న పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసినట్లు మహబూబాబాద్ రూరల్ ఎస్సై వి.దీపికారెడ్డి తెలిపారు. వీవీ ప్యాట్ ఫొటో వైరల్ సంగెం: మండలంలోని ఎల్గూర్స్టేషన్లోని 211 పోలింగ్ కేంద్రంలో ఓటు వేసిన తర్వాత వీవీ ప్యాట్లో వచ్చిన ఫొటో తీసి గుగులోత్ గోపి వాట్సాప్ గ్రూపుల్లో వైరల్ చేశాడు. దీంతో అతడిపై చర్య తీసుకోవాలని స్థానిక బీఆర్ఎస్ నాయకులు ఎన్నికల సెక్టార్ అధికారి సాయిరాజ్తో వాగ్వాదానికి దిగారు. ఈ విషయాన్ని ఫోన్ ద్వారా ఉన్నతాధికారులకు తెలియజేసినట్లు సెక్టార్ అధికారి సాయిరాజ్ తెలిపారు. -
మూడు గుట్టలు..16 కిలోమీటర్లు..
● కాలినడకన వచ్చి ఓటు వేసిన పెనుగోలు వాసులు వాజేడు: అది గుట్టలపై ఉన్న ఆదివాసీల కుగ్రామం. మండల పరిధిలోని కొంగాల గ్రామ పంచాయతీలో ఉన్న పెనుగోలు. ఇక్కడ 12 కుటుంబాలు, 30 మంది జనాభా ఉంది. ఈ గ్రామంలో 22 మంది ఓటర్లు ఉన్నారు. రాజ్యాంగం తమకు కల్పించిన ఓటు హక్కును క్రమం తప్పకుండా వినియోగించుకుంటున్న వీరు.. సోమవారం కూడా మూడు గుట్టలు దిగి వచ్చి లోక్సభ ఎన్నికల్లో ఓటు వేశారు. గుట్టలపై ఉన్న పెనుగోలు గ్రామం నుంచి కాలి నడకన గుమ్మడి దొడ్డి వరకు 16 కిలో మీటర్లు వచ్చిన వారిని.. తహసీల్ కార్యాలయ సిబ్బంది ఆటో ద్వారా జంగాలపల్లి పోలింగ్ కేంద్రానికి తరలించారు. ఓటు వేసిన తరువాత వారు విలేకరులతో మాట్లాడుతూ రాజ్యాంగం కల్పించిన హక్కును వినియోగించుకోవాలని గుట్టలు దిగి వచ్చి ఓటు వేసినట్లు తెలిపారు. -
మంచి నేతకు తొలి ఓటు వేశా
వరంగల్ శివనగర్ ప్రకాశ్ మెమోరియల్ హైస్కూల్లోని 167వ పోలింగ్ బూత్లో నా తొలి ఓటు హక్కు వినియోగించుకున్నా. నిజాయితీ గల మంచి నాయకుడికి ఓటు వేశా. అభివృద్ధిని ఆకాంక్షించి మంచి నాయకుడి గెలుపునకు ఓటు వేశా. – శామంతుల తేజ్ దీప్తి, శివనగర్ ఓటు హక్కు గొప్పది ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు గొప్పది. మొదటిసారి ఓటు హక్కును వినియోగించుకున్నా. ప్రజలకు సేవ చేసే నాయకులను ఓటు ద్వారా ఎన్నుకునే గొప్ప అవకాశం రాజ్యాంగం మనకు కల్పించింది. – గోరంటల మణిచరణ్, బీటెక్, ఫైనలియర్, వరంగల్ మంచి నాయకుడిని ఎన్నుకోవడం అదృష్టం నేను మొదటిసారి ఓటు వేసినందుకు గర్వపడుతున్నా. ఒక మంచి నాయకుడిని ఎన్నుకోవడానికి నా ఓటు హక్కు దోహదపడింది. దేశానికి సేవ చేసే ప్ర జాప్రతినిధులు.. ఎన్నికై న అ నంతరం అందరికీ మేలు చేయాలి. అదే నా కోరిక. – గుగులోత్ నిఖిత, మహబూబాబాద్ -
ఓటు వజ్రాయుధం
రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలి. ఓటు వజ్రాయుధం. ఎన్నికల సంఘం ట్రాన్స్జెండర్లకు గుర్తింపునిచ్చింది. యువ ఓటర్లలో వచ్చిన చైతన్యమే మంచి నేత విజయానికి తోడ్పాటు అందిస్తుంది. – లైలా, ట్రాన్స్జెండర్స్ అసోసియేషన్ ప్రతినిధితొలి ఓటు వేయడం ఆనందంగా ఉంది ఓటు హక్కు వచ్చిన తర్వాత తొలిసారి ఓటు వేయడం ఆనందంగా ఉంది. నా తొలి ఓటును ప్రజా సమస్యలు తీర్చే, అభివృద్ధి చేసే, నీతి, నిజాయితీ గల మంచి నాయకుడిని ఎంచుకొనేందుకు వేశా. ప్రజాస్వామ్యంలో ఓటు విలువైంది. – ఎస్.సునాయన దీప్తి, శివనగర్, వరంగల్ అభివృద్ధికే నా తొలి ఓటు అభివృద్ధి చేస్తానని భరోసా ఇచ్చిన నాయకుడికి నాతొలి ఓటు వేయడం సంతోషంగా ఉంది. ప్రస్తుత రాజకీయాల్లో అవినీతి, బంధు ప్రీతి, స్వార్థాన్ని నివారించాలంటే నిజాయితీ గల నాయకులను గెలిపించాలి. అందుకు యువత తమ చేతిలో ఉన్న ఓటు అనే ఆయుధాన్ని సమర్థంగా వాడుకోవాలి. భవిష్యత్లో మంచి రాజకీయ వ్యవస్థను నిర్మించే బాధ్యత యవతరంపైనే ఉందని నా అభిప్రాయం. – మునుగోటి మిథిలి, పెరకవాడ వరంగల్ -
సీబీఎస్ఈ టెన్త్ ఫలితాల్లో ‘ఎస్ఆర్’ ప్రభంజనం
విద్యారణ్యపురి: సీబీఎస్ఈ టెన్త్ పరీక్షల ఫలితాలు సోమవారం విడుదలయ్యాయి. ఇందులో ఎస్ఆర్ విద్యాసంస్థల విద్యార్థులు ప్రభంజనం సృష్టించారని ఆ విద్యాసంస్థల చైర్మన్ ఎ వరదారెడ్డి, డైరెక్టర్లు ఎ మధుకర్రెడ్డి, ఎ సంతోష్ తెలిపారు. 500 మార్కులకుగాను జి వర్ష 485, టి సాయి ప్రణవ్రెడ్డి 484, ప్రేమ్చరణ్సాహు 481 మార్కులు, డి శ్రేష్టరెడ్డి 477 మార్కులు సాధించారని వారు తెలిపారు. ఈ విజయానికి కారణం క్రమశిక్షణతో కూడిన విద్య, పటిష్ట ప్రణాళిక, అంకితభావం కలిగిన అధ్యాపక బృందం అని తెలిపారు. ప్రతిభ చూపిన విద్యార్థులు, ప్రోత్సహించిన తల్లిదండ్రులు, అధ్యాపక బృందానికి వారు అభినందనలు తెలిపారు. 12వ తరగతి ఫలితాల్లో.. సీబీఎస్ఈ 12వ తరగతి పరీక్షల ఫలితాలు సోమవారం విడుదలయ్యాయి. ఈ ఫలితాల్లో ఎస్ఆర్ విద్యాసంస్ధల విద్యార్థులు విజయభేరి మోగించారని ఆ విద్యాసంస్థల చైర్మన్ ఎ వరదారెడ్డి, డైరెక్టర్లు ఎ మధుకర్రెడ్డి, ఎ సంతోష్రెడ్డి తెలిపారు. ఎంపీసీలో 500 మార్కులకు పి మేఘన 482 , తుమ్మ తేజస్వి 480, రిషికేష్రెడ్డి 478 మార్కులు సాధించారని తెలిపారు. ఈ విజయం సాధించిన విద్యార్థులు, ప్రోత్సహించిన తల్లిదండ్రులు, అధ్యాపక బృందానికి వారు అభినందనలు తెలిపారు. -
పోలింగ్ బహిష్కరించిన చింతలగడ్డ వాసులు
మరిపెడ రూరల్: సుదూర ప్రాంతంలో ఉన్న తమ తండాలో పోలింగ్ కేంద్రం ఏర్పాటు చేయాలని కొద్ది రోజులుగా విన్నవించినా తమ మాటను అధికారులు లెక్క చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేస్తూ మహబూబాబాద్ మండలం చింతలగడ్డతండా వాసులు సోమవారం పోలింగ్ బహిష్కరించారు. తాళ్లఊకల్ రెవెన్యూ పరిధిలోని చింతలగడ్డతండా, రేఖ్యతండా, రూప్సింగ్తండాను కలిపి చింతలగడ్డతండా జీపీగా ఏ ర్పాటు చేశారు. 295 ఓట్లు ఉన్న చింతలగడ్డతండాలో పో లింగ్ కేంద్రం ఏర్పాటు చేయాలని 20 రోజులుగా అధికారులకు విన్నవిస్తే పట్టించుకోలేదు. రాజకీయ ఒత్తిళ్ల కారణంగా రూప్సింగ్ తండాలో పోలింగ్ కేంద్రం ఏర్పాటు చేశారు. దీంతో రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న పోలింగ్ కేంద్రానికి నడవలేక పోతున్నామని, కావాలనే తమను ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఓటు వేయడానికి వెళ్లమని తండావాసులు మొండికేశారు. విషయం తెలుసుకున్న మరిపెడ తహసీల్దార్ సైదులు, సీఐ హతిరాంనాయక్, ఎస్సై షేక్ తాహేర్బాబా.. తండాకు చేరుకుని వారికి నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. అయినా ససేమిరా అనడంతో చేసేది లేక ఈ విషయాన్ని ఉన్నతాధికారులకు తెలిపి తండాకు బూత్ మంజూరయ్యేలా చూస్తామని సర్ది చెప్పి వెనుదిరిగారు. కాగా, అధికారులు వెళ్లాక కేవలం 15 మంది మాత్రమే వెళ్లి రూప్ సింగ్తండా పోలింగ్ కేంద్రంలో ఓటు వేసినట్లు తెలిసింది. బూత్ ఏర్పాటు చేయకపోవడంపై నిర్ణయం 295 ఓట్లకు గానూ 15 మందే ఓటు హక్కు వినియోగం -
ఓటుతో ప్రజాస్వామ్యాన్ని రక్షిస్తాం
ఓటుతో ప్రజాస్వామ్యాన్ని రక్షిస్తాం. మొదటిసారి ఓటు హక్కు వినియోగించుకోవడం సంతోషంగా ఉంది. నేను కూడా సమాజంలో గుర్తింపు పొందా. ఎదుటి వారికి ఓటు హక్కు ప్రాధాన్యం తెలియజేస్తాననే నమ్మకం కలిగింది. ఓటు హక్కుతో మంచి ప్రజాప్రతినిధిని ఎన్నుకోవాలి. – గుగులోత్ అంకిత, మహబూబాబాద్ సంతోషంగా ఉంది మొదటి సారిఓటు హక్కు వినియోగించుకోవడం సంతోషంగా ఉంది. రాజ్యాంగం.. ఓటు ద్వారా మనకు నచ్చిన నాయకుడిని ఎన్నుకునే గొప్ప అవకాశం కల్పించింది. ఓటు విలువైంది. – రాంనేని భార్గవి, గొర్లవీడు, భూపాలపల్లి -
మనస్తాపంతో మహిళ ఆత్మహత్య
ఎల్కతుర్తి: అనారోగ్య సమస్య కారణంగా మనస్తాపానికి గురైన ఓ మహిళ ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన సోమవారం హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం మంగళంపల్లిలో జరిగింది. వంగర ఎస్సై నీలోజు వెంకటేశ్వర్లు కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన దంపు శోభ(42) గతంలో పురుగుల మందు తాగింది. అప్పటి నుంచి అనారోగ్య సమస్యలు ప్రారంభమయ్యాయి. ఎన్ని ట్యాబ్లెట్లు వాడినా తగ్గకపోగ మరింత పెరిగాయి. దీంతో ఈ బాధ భరించలేక మనస్తాపానికి గురైన శోభ ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటనపై మృతురాలి కుటుంబీకుల మేరకు కేసు నమోదు చేసుకుని పోస్టుమార్ట నిమిత్తం మృతదేహాన్ని హుజూరాబాద్ మార్చురీకి తరలించినట్లు ఎస్సై నీలోజు వెంకటేశ్వర్లు తెలిపారు. -
గ్రీన్వుడ్ పాఠశాల విద్యార్థుల ప్రతిభ
కాజీపేట అర్బన్ : సీబీఎస్ఈ టెన్త్ పరీక్షల ఫలితాల్లో గ్రీన్వుడ్ విద్యాసంస్థల విద్యార్థులు ప్రతిభ చా టారని ఆ విద్యాసంస్థల డైరెక్టర్లు చల్లా ధర్మారెడ్డి, డాక్టర్ గిర్రెం భరద్వాజనాయుడు తెలిపారు. 500 మార్కులకు టి అరుణ్ బాబు 490, ఎం హర్షిణి 489, కె శృతీష్రెడ్డి 487, ఇ కారుణ్య 487, కె ప్రీతికారెడ్డి 484, సీహెచ్ వేదజ్ఞ 483 మార్కులు సాధించారన్నారు. 440 మార్కులపైన సాధించిన విద్యార్థులు 65 మంది ఉన్నారని తె లిపారు. ఈ సందర్భంగా ఆయా విద్యార్థులను అభినందించారు. గ్రీన్వుడ్ మేనేజర్ ప్రభుకుమార్, అకడమిక్ ప్రిన్సిపాళ్లు వి నవీన్కుమార్, మంజుల, అడ్మినిస్ట్రేటివ్ ప్రిన్సి పాల్ టి పవన్కుమార్, వైస్ ప్రిన్సిపాల్ వి సురేష్కుమార్, ఫైనాన్స్ ఆఫీసర్ షేక్ రబ్బాని మురళి, అకడమిక్ కోఆర్డినేటర్స్ శ్రీకాంత్, హర్ష అభినందించారు. -
కమలాపూర్లో మరో యువకుడు..
కమలాపూర్: కమలాపూర్కు చెందిన మాట్ల సందీప్ అమెరికా నుంచి వచ్చి తన స్వగ్రామం హనుమకొండ జిల్లా కమలాపూర్లో సోమవారం ఓటు హక్కు వినియోగించుకున్నాడు. మండల కేంద్రానికి చెందిన మాట్ల శంకర్, సరోజన దంపతుల రెండో కుమారుడు సందీప్ ఉన్నత చదువు నిమిత్తం ఆరు నెలల క్రితం అమెరికా వెళ్లాడు. తెలంగాణలో జరుగుతున్న లోక్సభ ఎన్నికల నేపథ్యంలో అమెరికా నుంచి వచ్చి ఓటు వేశాడు. తాను కేవలం ఓటు హక్కు వినియోగించుకోవడం కోసమే అమెరికా నుంచి వచ్చినట్లు తెలిపాడు. కాగా, సందీప్ను పలువురు అభినందించారు. -
ఓటు కోసం ఖండాతరాలు దాటిన ఎన్ఆర్ఐ..
● స్ఫూర్తి నింపిన విష్ణువర్ధన్రెడ్డి గీసుకొండ : ఓ ఎన్ఆర్ఐ ఓటు విలువ చాటి చెప్పాడు. అమెరికాలో ఉన్న తాను ఓటు హక్కు వినియోగించుకుని పలువురికి స్ఫూర్తిగా నిలిచారు. వరంగల్ జిల్లా గీసుకొండ మండలం కొమ్మాలకు చెందిన వీరాటి రవీందర్రెడ్డి, స్వర్ణ దంపతుల కుమారుడు విష్ణువర్ధన్రెడ్డి బీటెక్ పూర్తి చేసి ఎంఎస్ చదవడానికి అమెరికాలో వెళ్లాడు. ఎంఎస్ పూర్తి చేసి ఐదేళ్లుగా అమెరికాలోనే ఉంటూ సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నాడు. భారత్లో లోక్సభ ఎన్నికలు ఉన్నాయని తెలిసి ఐదు రోజుల క్రితం ఓటు వేయడానికి స్వగ్రామం వచ్చాడు. అమెరికా నుంచి రానుపోను ఫ్లైౖట్ చార్జీలు రూ. 2 లక్షలు చెల్లించి సోమవారం కొమ్మాలలో ఓటు వేశాడు. ఈ సందర్భంగా విష్ణువర్ధన్రెడ్డిని గ్రామస్తులు అభినందించారు. -
ఏకశిల విద్యాసంస్థల విజయభేరి
హసన్పర్తి: సీబీఎస్ఈ పదో తరగతి పరీక్ష ఫలితాల్లో ఏకశిల విద్యాసంస్థల విద్యార్థులు విజయభేరి మోగించారు. 500 మార్కులకు 483, 479, 479, 478, 477, 476 మార్కులు సాధించినట్లు ఏకశిల విద్యాసంస్థల చైర్మన్ డాక్టర్ గౌరు తిరుపతిరెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా ఆ విద్యార్థులను అభినందించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఈ ఏడాది కూడా సీబీఎస్ఈ పదో తరగతి పరీక్ష ఫలితాల్లో తమ విద్యాసంస్థల హవా కొనసాగిందన్నారు. ఉపాధ్యాయుల కృషి ఫలితమే ఈ ఫలితాలు అన్నారు. కార్యక్రమంలో ఏకశిల విద్యాసంస్థల డైరెక్టర్ సువిజారెడ్డి, వైస్ ప్రిన్సిపాల్ కేడీ స్వర్ణరాజ్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. -
పోల్.. కూల్..
పార్లమెంట్ ఎన్నికలు సోమవారం ప్రశాంతంగా జరిగాయి. వరంగల్, మహబూబాబాద్ లోక్సభ నియోజకవర్గాల పరిధిలో పోలింగ్ ఉదయం 7 గంటల ప్రారంభమై సాయంత్రం 6 గంటలకు ముగిసింది. సమస్యాత్మక ప్రాంతాల్లో సాయంత్రం 4గంటలకే ముగిసింది. ఓటు వేయడానికి ఉదయం నుంచే ఓటర్లు పోలింగ్ కేంద్రాల వద్ద బారులుదీరారు. దివ్యాంగులు, వృద్ధులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా వీల్చైర్లు, ఆటోల ద్వారా తరలించి ఓటు వేయించారు. ఎన్నికల అధికారులు, పోలీసు సిబ్బంది కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోండా పకడ్బందీ చర్యలు తీసుకున్నారు. -
వందేళ్ల నాటి బ్రిడ్జి కూల్చివేత
కాజీపేట రూరల్: దక్షిమ మధ్య రైల్వే పరిధిలోని కాజీపేట జంక్షన్లో దాదాపు వందేళ్ల కిందటి నిజాం కాలం నాటి ఫుట్ ఓవర్ బ్రిడ్జిని రైల్వే అధికారులు ఆదివారం కూల్చివేశారు. 2022లో బల్లార్ష స్టేషన్లో పాత ఫుట్ ఓవర్ బ్రిడ్జి కూలిపోయిన ఘటనతో కాజీపేట జంక్షన్లోని పాత కాలం నాటి ఫుట్ ఓవర్ బ్రిడ్జిని అధికారులు మూసేశారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రయాణికులను ఈ బ్రిడ్జి గుండా అనుమతించలేదు. కాజీపేట స్టేషన్ రీ డెవలప్మెంట్లో భాగంగా దాదాపు ఏడాదిన్నర కాలం తర్వాత రైల్వే అధికారులు బ్రిడ్జి తొలగింపు పనులు చేపట్టారు. కాగా దాదాపు 2 గంటల పాటు రైల్వే బ్లాక్ తీసుకొని ఓహెచ్ఈ విద్యుత్ సరఫరా నిలిపేశారు. ఐరన్ ఫుట్ ఓవర్ బ్రిడ్జిని రెండు వైపులా కట్ చేసి భారీ క్రేన్ సాయంతో తొలగించారు. దీంతో పలు రైళ్లకు అంతరాయం ఏర్పడింది. తొలగించిన ఫుట్ ఓవర్ బ్రిడ్జి స్థానంలో త్వరలో.. కొత్త ఫుట్ ఓవర్ బ్రిడ్జితో పాటు ర్యాంప్, ఎస్కలేటర్, లిఫ్ట్ నిర్మాణ పనుల్ని చేపట్టనున్నట్లు సంబంధిత రైల్వే అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో సికింద్రాబాద్, కాజీపేట రైల్వే అధికారులు, పోలీసులు తదితరులు పాల్గొన్నారు. -
పోలింగ్ సామగ్రి పంపిణీ
మహబూబాబాద్/మహబూబాబాద్ అర్బన్ : జిల్లా కేంద్రంలోని టీఎస్డబ్ల్యూఆర్ఎస్జేసీలో మానుకోట అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించిన పోలింగ్ సామగ్రిని సిబ్బందికి ఆదివారం పంపిణీ చేశారు. 16 కౌంటర్లు ఏర్పాటు చేసి బ్యాలెట్ యూనిట్లు, ఇతర సామగ్రిని పంపిణీ చేసినట్లు అధికారులు తెలిపారు. ప్రతి పోలింగ్ కేంద్రంలో ఒక పీఓ, ఒక ఏపీఓ, ఇద్దరు ఓపీఓలకు విధులు కేటాయించారు. నియోజకవర్గంలో 344 మంది ఏపీఓలు, 688 మంది ఓపీఓలు, 344 మంది పీఓలు విధులు నిర్వర్తిస్తారు. 32 రూట్లకు గాను 32 మంది సెక్టోరియల్ అధికారులకు విధులు కేటాయించారు. నియోజకవర్గంలో 2,58,850 మంది ఓటర్లు ఉండగా 287 కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు ఎన్నికల అధికారులు పేర్నొన్నారు. ప్రతి కేంద్రంలో రెండు బ్యాలెట్ యూనిట్లను ఏర్పాటు చేశామన్నారు. సామగ్రి పంపిణీ కార్యక్రమాన్ని జిల్లా ఎన్నికల అధికారి అద్వైకుమార్ సింగ్, ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్, అడిషనల్ కలెక్టర్ డేవిడ్, ఆర్డీఓ అలివేలు పరిశీలించారు. కాగా సిబ్బంది, అధికారులు ఎన్నికల సామగ్రితో వారికి కేటాయించిన పోలింగ్ కేంద్రాలకు తరలివెళ్లారు. మరిపెడ నుంచి.. మరిపెడ: డోర్నకల్ నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లో ఎన్నికల ఏర్పాట్లు పూర్తి చేసినట్లు తహసీల్దార్ సైదులు తెలిపారు. మరిపెడలోని సెయింట్ అగస్టీయన్ పాఠశాలలో ఆదివారం ఎన్నికల సామగ్రి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా తహసీల్దార్ సైదులు మాట్లాడుతూ.. నియోజకవర్గంలో 264పోలింగ్ బూత్లు, 1,264మంది సిబ్బంది, 32 రూట్స్, 32జోన్లు ఉన్నాయన్నారు. 316మంది పీఓలు, 316 మంది ఏపీఓలు, 632మంది ఓపీఓలు ఎన్నికల విధులు నిర్వర్తిస్తారని చెప్పారు. 19సమస్యాత్మక కేంద్రాలను గుర్తించినట్లు చెప్పారు. -
సోమవారం శ్రీ 13 శ్రీ మే శ్రీ 2024
● ఉదయం 7గంటల నుంచి పోలింగ్ షురూ..●● సర్వం సిద్ధం చేసిన అధికారులు ● మానుకోట పార్లమెంట్ పరిధిలో 1,809 పోలింగ్ కేంద్రాలు సమస్యాత్మక సెంటర్లు 335.. ● బరిలో 23 మంది అభ్యర్థులు ● సామగ్రితో కేంద్రాలకు చేరుకున్న సిబ్బంది న్యూస్రీల్ -
ఇద్దరు మహిళా కానిస్టేబుళ్లకు గాయాలు
భూపాలపల్లి అర్బన్ : జిల్లా కేంద్రంలోని అంబేడ్కర్ స్టేడియంలోని ఈవీఎంల డిస్ట్రిబ్యూషన్ కేంద్రం వద్ద ఇద్దరు మహిళా కానిస్టేబుళ్ల తలలకు గాయాలైన సంఘటన ఆదివారం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్లితే.. ఎన్నికల విధుల నిర్వహణకోసం పోలీస్ సిబ్బంది అంబేడ్కర్ స్టేడియానికి చేరుకున్నారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసి టెంట్ల కింద మధ్యాహ్న భోజనం చేస్తున్న క్రమంలో ఒక్కసారిగా గాలి రావడంతో టెంట్, దానికి అడ్డుగా పెట్టిన ఇనుప పైపులు పడిపోయాయి. దీంతో అక్కడే ఉన్న రేగొండ పోలీస్స్టేషన్కు చెందిన సీహెచ్ జ్యోతి, భూపాలపల్లి పోలీస్స్టేషన్కు చెందిన కల్యాణిల తలకు తీవ్రమైన గాయాలు కావడంతో వెంటనే పట్టణంలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. ఊరుగొండలో ముగ్గురికి.. దామెర: కారును ఆర్టీసీ బస్సు ఢీకొన్న ప్రమాదంలో ముగ్గురికి గాయాలైన సంఘటన మండలంలోని ఊరుగొండ వద్ద ఆదివారం చోటుచేసుకుంది. స్ధాని కులు తెలిపిన వివరాల ప్రకారం.. ఊరుగొండకు చెందిన మద్ది రాజు తన తల్లిదండ్రులతో కలిసి ఊ రుగొండ నుంచి ఆత్మకూర్కు వెళ్తున్నాడు. ఈక్రమంలో హనుమకొండ నుంచి పరకాల వైపు వెళ్తున్న ఆర్టీ సీ బస్సు ఊరుగొండ శివారు మణికంఠ రైస్ మిల్లు వద్ద కారును వెనుక నుంచి ఢీకొట్టింది. దీంతో కారులో ఉన్న ముగ్గురికి గాయాలయ్యాయి. కారు వెనుక భాగం నుజ్జునుజ్జయింది. పోలీసులు వివరాలు సేకరించి కారు, బస్సును పోలీస్స్టేషన్కు తరలించినట్లు సమాచారం. -
పటిష్ట పోలీస్ భద్రత
మహబూబాబాద్ రూరల్ : పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ సందర్భంగా ఓటర్లు స్వేచ్ఛగా తమ ఓటు హక్కు వినియోగించుకునేలా పోలీస్శాఖ పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేసింది. ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్ ప్రత్యేక పర్యవేక్షణలో సోమవారం 3వేల పైచిలుకు అధికారులు, సిబ్బంది ఎన్నికల విధులు నిర్వహించనున్నారు. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల వద్ద సాయుధ బలగాలను మోహరించగా ఇప్పటికే స్థానిక పోలీసు సిబ్బంది, శిక్షణ పొందుతున్న ట్రైనీ సిబ్బందితో పాటు పలు కంపెనీల కేంద్ర బలగాలు విధుల్లో పాల్గొంటున్నాయి. మొబైల్ పార్టీ బృందాలు.. ఎన్నికల నియమావళి అమలు పరిశీలనకు 18 క్యూఆర్టీ, 95 మొబైల్ పార్టీ బృందాలను ఏర్పాటు చేశారు. బల్క్ ఎస్ఎంఎస్లు పంపడం, బాణసంచా కాల్చడం నిషేధమని, స్థానికేతరులు తమ స్వస్థలాలకు వెళ్లాలని పోలీస్ అధికారులు చూచించారు. కేంద్రాల్లో పోలింగ్ సిబ్బంది, ఓటర్లు మినహా ఇతరులెవరూ లోనికి వెళ్లకూడదని, అభ్యర్థులు, ఏజెంట్లు కూడా నిబంధనలు పాటించాలని, సెల్ఫోన్లు బూత్లోకి అనుమతించబడవని తెలిపారు. 144 సెక్షన్.. పోలింగ్ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సోమవారం సాయంత్రం 6గంటల వరకు జిల్లాలో 144 సెక్షన్ అమలులో ఉండనుంది. కాగా నలుగురు లేదా అంతకంటే ఎక్కువ మంది గుంపులు గుంపులుగా తిరగవద్దని, బహిరంగ సభలు, ర్యాలీలపై నిషేధం విధించారు. పోలింగ్ సాయంత్రం 6గంటల వరకు జరగనుండగా ఆ సమయంలోగా వచ్చి ఉన్న వారికి ఓటు వేసేందుకు అనుమతి ఇస్తారు. 6తర్వాత వచ్చిన వారిని లోపలికి పంపొద్దని ఆదేశాలు ఉన్నాయి. అనుమానాస్పదంగా కనిపిస్తే.. పోలింగ్ కేంద్రం వద్ద అనుమానాస్పదంగా ఎవరైనా కనిపిస్తే లేదా ఏదైనా సమస్య తలెత్తినా వెంటనే రూట్ మొబైల్ ఇన్చార్జ్ అధికారికి, స్థానిక పోలీసు అధికారులకు సమాచారం అందించాలని పోలీస్ అధికారులు తెలిపారు. ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గానికి పోలీస్ నోడల్ అధికారి ఉంటారని, అవసరమైతే సమస్య తీవ్రతను బట్టి వారికి కూడా సమచారం అందించాలని ఆదేశించారు. ప్రజలు సహకరించాలి.. స్వేచ్ఛాయుత వాతావరణంలో ఎన్నికలు జరిగేలా పోలీస్ సిబ్బంది కృషి చేయాలని, అదేవిధంగా ప్రజలు కూడా పోలీసులకు సహకరించాలని ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్ విజ్ఞప్తి చేశారు. 3వేలకు పైగా అధికారులు, సిబ్బంది విధులు 18 క్యూఆర్టీ, 95 మొబైల్ పార్టీ బృందాల ఏర్పాటు జిల్లాలో 144 సెక్షన్ అమలు -
వన్స్టాప్ సొల్యూషన్!
కాజీపేట అర్బన్: ఆపదలో ఉన్న మహిళలు, బాలికలకు సఖి వన్ స్టాప్ సెంటర్ అండగా నిలబడుతోంది. సమాజంలో, ఇంట్లో ఎదుర్కొంటున్న ఇబ్బందుల్ని పరిష్కరించేందుకు వేదికగా నిలుస్తోంది. ఇక్కడ వైద్య, పోలీస్, న్యాయ సాయాన్ని, తాత్కాలిక వసతిని పూర్తి ఉచితంగా అందిస్తున్నారు. బాధిత మహిళలకు కౌన్సెలింగ్ అందించి సమస్యను పరిష్కరిస్తున్నారు. సీ్త్ర, శిశు సంక్షేమ శాఖ, సర్వోదయ యూత్ ఆర్గనైజేషన్ సౌజన్యంతో సఖి వన్స్టాప్ సెంటర్ సమాజంలో మహిళలు శారీరకంగా, మానసికంగా, లైంగికంగా, ఆర్థికంగా ఇంట్లో, సమాజంలో ఎదుర్కొంటున్న హింస, వేధింపుల నుంచి రక్షణ కల్పిస్తూ ఆపదలోని మహిళలను ఆదుకునేందుకు తోడ్పడుతోంది. 2017 నుంచి అందుబాటులో.. హనుమకొండ జిల్లా ఎకై ్సజ్ కాలనీలో 2017లో ఆపదలోని మహిళలను ఆదుకునేందుకు సఖి వన్స్టాప్ సెంటర్ను ఏర్పాటు చేశారు. ప్రారంభించిన నాటి నుంచి నేటి వరకు సఖి వన్ స్టాప్ సెంటర్కు 1,975 మంది మహిళలు సమస్యల పరిష్కారం కోసం వచ్చారు. 1,511కు కేసులకు పరిష్కారం కల్పించారు. 24 గంటలు అందుబాటులో.. ఆపదలోని మహిళలకు 24 గంటల పాటు సఖి వన్ స్టాప్ సెంటర్ సిబ్బంది సెంటర్ అడ్మినిస్ట్రేటర్, సైకాలజీ కౌన్సిలర్, లీగల్ కౌన్సిలర్, కేస్ వర్కర్స్, పారామెడికల్, ఆఫీస్ అసిస్టెంట్, మల్టీపర్పస్ వర్కర్స్, సెక్యూరీటీ గార్డులు అందుబాటులో ఉంటారు. మహిళలు, బాలికలకు ఆపదలో సఖి వన్ స్టాప్ సెంటర్ సేవల కోసం టోల్ఫ్రీ నంబర్ 181కు కాల్ చేసుకునే అవకాశం ఉంది. సమస్యను బట్టి టోల్ఫ్రీ నంబర్ 181కు ఫిర్యాదు రాగానే.. రెస్క్యూ టీమ్లో సఖి సిబ్బంది వెళ్లి బాధిత మహిళలను ఆదుకుంటున్నారు. సఖి వన్ స్టాప్ సెంటర్ అందిస్తున్న ఉచిత సేవలతో పాటు మహిళా చట్టాలపై 2017 నుంచి వివిధ కళాశాలలు, పాఠశాలల్లో 941 అవగాహన సదస్సులు నిర్వహించారు.కుటుంబ వ్యవస్థను కాపాడడమే లక్ష్యం కుటుంబ వ్యవస్థను కాపాడడమే లక్ష్యంగా సఖి వన్స్టాప్ సెంటర్లో సేవలందిస్తున్నాం. విడిపోయే కుటుంబాలకు కౌన్సెలింగ్ ద్వారా భార్యాభర్తలు కలిసి ఉండేలా కౌన్సెలింగ్ ఇస్తున్నాం. బాధిత మహిళలకు అన్ని రకాల సమస్యల పరిష్కారానికి సఖి వన్ స్టాప్ సెంటర్ 24 గంటల పాటు అందుబాటులో ఉంటుంది. – పల్లెపాడు దామోదర్, చీఫ్ కౌన్సిలర్, సఖి వన్స్టాప్ సెంటర్ ఆపదలోని మహిళలు వినియోగించుకోవాలి.. ఆపదలోని మహిళలు సఖి వన్ స్టాప్ సెంటర్లో అందించే ఉచిత సేవలను వినియోగించుకోవాలి. ఆపదలోని మహిళలు టోల్ఫ్రీ నంబర్ 181 కు సమాచారం అందిస్తే రెస్క్యూ వాహనంలో ఘటనా స్థలికి వెళ్లి వారికి రక్షణ కల్పిస్తాం. – పేర్వారం హైమావతి, సెంటర్ అడ్మినిస్ట్రేటర్, సఖి వన్స్టాప్ సెంటర్ ఆపదలో ఉన్న మహిళలకు అండగా ‘సఖి’ వైద్య, వసతి, న్యాయ, పోలీస్ సేవలు అందుబాటులో టోల్ఫ్రీ నంబర్ 181 -
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
స్టేషన్ఘన్పూర్: స్కూటీని కారు వెనుకనుంచి ఢీకొట్టిన ప్రమాదంలో గోనెల రమేశ్ అలియాస్ రాజన్న(52) అక్కడికక్కడే మృతిచెందిన సంఘటన జనగామ జిల్లా ఘన్పూర్ శివారు జాతీయ రహదారిపై ఆదివారం జరిగింది. రాజన్న భార్య గోనెల రాజమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. ఘన్పూర్కు చెందిన రమేశ్ స్థానిక బస్టాండ్ సమీపాన మీసేవ కేంద్రం నిర్వహిస్తూ, వ్యవసాయం చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. అతడికి భార్య, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. కాగా, ఆదివారం ఉదయం వ్యవసాయ పనుల నిమిత్తం తన ద్విచక్రవాహనంపై ఘన్పూర్ నుంచి పల్లగుట్ట క్రాస్రోడ్డు వైపు వెళ్తున్నాడు. ఈ క్రమంలో వజ్ర దాబాహోటల్ వద్ద జాతీయ రహదారిపై వెనుకాల వస్తున్న కారు వేగంగా ఢీకొట్టింది. ఈప్రమాదంలో రమేశ్ రోడ్డుపై అక్కడికక్కడే మృతిచెందారు. స్థానికులు రాజన్న కుటుంబసభ్యులకు సమాచారం అందించగా వారు 108 అంబులెన్స్లో స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కానీ, అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించి, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జనగామ ఏరియా ఆస్పత్రికి తరలించారు. కాగా, గోనెల రమేశ్ మృతిచెందిన విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే కడియం శ్రీహరి, మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య ఆదివారం మృతదేహాన్ని సందర్శించి ప్రగాఢ సంతాపం తెలిపారు. కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఇదిలా ఉండగా.. గోనెల రమేశ్కు కుమారులు లేకపోవడంతో పెద్ద కుమార్తె శిరీష తలకొరివి పెట్టింది. సంతాపం తెలిపిన వారిలో నాయకులు నరేందర్రెడ్డి, నీల గట్టయ్య, ఎంపీటీసీ రాజు, సారయ్య, వెంకన్న, కుమార్, శ్రీధర్ తదితరులు ఉన్నారు. వృద్ధురాలి మృతి స్టేషన్ఘన్పూర్: మండలంలోని ఛాగల్లు గ్రామంలో ఆదివారం గుర్తుతెలియని వాహనం ఢీకొని చెరుకు వెంకటలక్ష్మి (85) అనే వృద్ధురాలు అక్కడికక్కడే మృతిచెందింది. వివరాలు ఇలా ఉన్నాయి. ఛాగల్లుకు చెందిన వెంకటలక్ష్మి వ్యక్తిగత పనుల నిమిత్తం ఆదివారం ఉదయం ఐసీఐసీఐ బ్యాంకు వద్ద నడుచుకుంటూ జాతీయ రహదారి దాటుతుంది. ఈ క్రమంలో జనగామ నుంచి హనుమకొండ వైపు వెళ్తున్న గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడంతో తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మృతిచెందింది. వెంకటలక్ష్మి కుమారుడు చెరుకు నర్సయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ రాజు తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జనగామ ఏరియా ఆస్పత్రికి తరలించారు.
Pagination
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
లక్నోపై ఢిల్లీ ఘన విజయం.. ప్లే ఆఫ్స్ ఆశలు సజీవం
హల్దీరామ్స్పై జాతీయ కంపెనీల కన్ను.. మెజారిటీ వాటా కొనుగోలుకు బిడ్డింగ్
AP: డీజీపీకి హోంమంత్రి తానేటి వనిత ఫోన్
హీరోతో వివాదం.. ఊహించని షాకిచ్చిన డైరెక్టర్!
టీమిండియా హెడ్ కోచ్గా న్యూజిలాండ్ మాజీ కెప్టెన్..!?
తెలంగాణ లోక్సభ ఎన్నికల ఫైనల్ పోలింగ్ 65.67 శాతం
చెలరేగిన స్టబ్స్, అభిషేక్.. లక్నో ముందు భారీ టార్గెట్
వేలకోట్ల బ్యాంక్ ఫ్రాడ్.. డీహెచ్ఎఫ్ఎల్ ధీరజ్ వాధావన్ అరెస్ట్
ముంబై హోర్డింగ్ కుప్పకూలిన ఘటన,.. వెలుగులోకి కీలక విషయాలు
కోనసీమ: ఉడుమూడిలో ఘోర రోడ్డు ప్రమాదం
తప్పక చదవండి
- తెలంగాణ లోక్సభ ఎన్నికల ఫైనల్ పోలింగ్ 65.67 శాతం
- మోదీకి సొంత ఇళ్లు, కారు కూడా లేదట!.. ప్రధాని ఆస్తులివే..
- మాజీ భర్త గే అన్న సుచిత్ర.. స్పందించిన నటుడు
- Royal Challengers Bengaluru: తిరుమల శ్రీవారి సేవలో ఆర్సీబీ క్రికెటర్లు (ఫొటోలు)
- MS Dhoni: అందుకే వాళ్లంటే నాకు, జడ్డూకు చిరాకు!
- ప్రోటీన్ సప్లిమెంట్లను వాడుతున్నారా? హెచ్చరిస్తున్న మెడికల్ రీసెర్చ్
- స్వాతిమలివాల్పై దాడి.. ఆందోళనకు దిగిన బీజేపీ కార్పొరేటర్లు
- ఢిల్లి లిక్కర్ కేసులో కవిత జ్యుడీషియల్ రిమాండ్ పొడిగింపు
- Tandur: పసికందు ప్రాణం తీసిన పెంపుడు కుక్క
- టీడీపీ కార్యకర్తల్లా పోలీసులు: అనిల్కుమార్ ఆగ్రహం
Advertisement