రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలి. ఓటు వజ్రాయుధం. ఎన్నికల సంఘం ట్రాన్స్జెండర్లకు గుర్తింపునిచ్చింది. యువ ఓటర్లలో వచ్చిన చైతన్యమే మంచి నేత విజయానికి తోడ్పాటు అందిస్తుంది. – లైలా, ట్రాన్స్జెండర్స్ అసోసియేషన్ ప్రతినిధి
తొలి ఓటు వేయడం ఆనందంగా ఉంది
ఓటు హక్కు వచ్చిన తర్వాత తొలిసారి ఓటు వేయడం ఆనందంగా ఉంది. నా తొలి ఓటును ప్రజా సమస్యలు తీర్చే, అభివృద్ధి చేసే, నీతి, నిజాయితీ గల మంచి నాయకుడిని ఎంచుకొనేందుకు వేశా. ప్రజాస్వామ్యంలో ఓటు విలువైంది. – ఎస్.సునాయన దీప్తి, శివనగర్, వరంగల్
అభివృద్ధికే నా తొలి ఓటు
అభివృద్ధి చేస్తానని భరోసా ఇచ్చిన నాయకుడికి నాతొలి ఓటు వేయడం సంతోషంగా ఉంది. ప్రస్తుత రాజకీయాల్లో అవినీతి, బంధు ప్రీతి, స్వార్థాన్ని నివారించాలంటే నిజాయితీ గల నాయకులను గెలిపించాలి. అందుకు యువత తమ చేతిలో ఉన్న ఓటు అనే ఆయుధాన్ని సమర్థంగా వాడుకోవాలి. భవిష్యత్లో మంచి రాజకీయ వ్యవస్థను నిర్మించే బాధ్యత యవతరంపైనే ఉందని నా అభిప్రాయం.
– మునుగోటి మిథిలి, పెరకవాడ వరంగల్