-
ఏప్రిల్ నుంచి జరిగే మార్పులివే..
ఏప్రిల్ 1నుంచి 2024-25 ఆర్థిక సంవత్సరం ప్రారంభం అవుతుంది. కొత్తగా ఆర్థిక సంస్థలు అమలు చేయబోయే నిబంధనలు ఈ నెల నుంచే వర్తించనున్నాయి. ఎన్పీఎస్ లాగిన్తోపాటు క్రెడిట్ కార్డులకు రివార్డులు, బీమా రంగంలో ఈ-ఇన్సూరెన్స్, ఎస్బీఐ డెబిట్ కార్డ్ ఛార్జీల పెంపు తదితర నిబంధనలు అమల్లోకి రానున్నాయి.ఆన్లైన్ మోసాలు పెరిగిపోతున్న నేపథ్యంలో పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అధారిటీ (పీఎఫ్ఆర్డీఏ) కీలక నిర్ణయం తీసుకుంది. నేషనల్ పెన్షన్ సిస్టమ్ (ఎన్పీఎస్) ఖాతాల లాగిన్ కోసం ప్రస్తుతం అమల్లో ఉన్న విధానాన్ని పూర్తిగా పునర్వ్వవస్థీకరించింది. దీని ప్రకారం ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి 2-ఫ్యాక్టర్ ఆధార్ అథెంటికేషన్ విధానం అమల్లోకి తెచ్చింది. ఈ విధానంలోని నిబంధనల ప్రకారం ఎన్పీఎస్లోని సెంట్రల్ రికార్డ్ కీపింగ్ ఏజెన్సీ (సీఆర్ఏ)లో వివరాలు నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ మేరకు 2024 మార్చి 15న పీఎఫ్ఆర్డీఏ సర్క్యులర్ జారీ చేసింది.ఎస్బీఐ డెబిట్ కార్డు ఛార్జీలు పెంపుదేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు (ఎస్బీఐ) తన ఖాతాదారుల డెబిట్ కార్డు ఛార్జీలు పెంచింది. కొత్త ఛార్జీలు ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి అమల్లోకి వస్తాయి. క్లాసిక్ డెబిట్ కార్డులు, సిల్వర్, గ్లోబల్, కాంటాక్ట్ లెస్ డెబిట్ కార్డులపై వార్షిక నిర్వహణ ఫీజు రూ.125 నుంచి రూ.200లకు పెంచింది. యువ, గోల్డ్, కాంబో డెబిట్ కార్డు, మై కార్డ్ నిర్వహణ చార్జీలు రూ.175 నుంచి రూ.250లకు, ప్లాటినం డెబిట్ కార్డు చార్జీ రూ.250 నుంచి రూ.325, ప్లాటినం బిజినెస్ కార్డు ఫీజు రూ.350 నుంచి రూ.425లకు పెంచింది.ఫ్రీలాంజ్ యాక్సెస్..ఐసీఐసీఐ బ్యాంకుతోపాటు, యెస్ బ్యాంక్, యాక్సిస్ బ్యాంకు క్రెడిట్ కార్డుల సాయంతో విమానాశ్రయాల్లో ఫ్రీ లాంజ్ యాక్సెస్ పొందడానికి కీలక నిబంధనలో మార్పులు తెచ్చాయి. క్రెడిట్ కార్డుదారులు త్రైమాసికంలో చేసిన ఖర్చును బట్టి ఎయిర్ పోర్ట్ లాంజ్ యాక్సెస్ ఆఫర్ వర్తించనుంది. ఐసీఐసీఐ బ్యాంకు కార్డు దారులు రూ.35 వేలు, యెస్ బ్యాంక్ క్రెడిట్ కార్డు దారులు రూ.10వేలు, యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డు దారులు రూ.50 వేలు ఖర్చు చేయాలి. ఐసీఐసీఐ బ్యాంకుకు చెందిన కోరల్ క్రెడిట్ కార్డు, మేక్ మై ట్రిప్ ఐసీఐసీఐ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్ ప్లాటినం క్రెడిట్ కార్డులకు ఈ నిబంధనలు అమల్లోకి వస్తాయి. యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డులకు ఏప్రిల్ 20 నుంచి అమలవుతాయి.పాలసీ డిజిటలైజేషన్ఇన్సూరెన్స్ పాలసీకి డిజిటలైజేషన్ తప్పనిసరి చేశారు. ఇక నుంచి అన్ని రకాల ఇన్సూరెన్స్ పాలసీలను డిజిటలైజ్ చేయాల్సి ఉంటుంది. జీవిత, ఆరోగ్య, జనరల్ ఇన్సూరెన్స్ పాలసీలన్నీ ఎలక్ట్రానిక్ పద్ధతిలోనే అందించాలి. ఈ నిబంధన ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి అమల్లోకి వస్తుంది. -
పాకిస్థాన్ కోర్ పాలసీ ఇదే: జైశంకర్
ఢిల్లీ: సీమాంతర ఉగ్రవాదం ఉపయోగించి భారత్ను అంతర్జాతీయంగా చర్చకు తీసుకురావడమే పాకిస్థాన్ ప్రధాన విధానం అని భారత విదేశాంగశాఖ మంత్రి జైశంకర్ తెలిపారు. పాక్ దుష్టవైఖరికి భారత్ అడ్డుకట్ట వేయగలిగిందని అన్నారు. 'భారత్ను అంతర్జాతీయ వేదికపై చర్చకు తీసుకురావడానికి పాక్ ఎన్నో ఏళ్లుగా ఉగ్రవాదం మార్గాన్ని ఎంచుకుంది. ఇందుకోసం అక్కడ ఉగ్రవాదాన్ని చట్టబద్దంగా చేసినట్లు కనిపిస్తోంది. పొరుగుదేశంతో భారత్ ఇలా ఎప్పటికీ వ్యవహరించదు.' అని జైశంకర్ అన్నారు. కెనడాలో వ్యాపిస్తున్న ఖలిస్థానీల ప్రభావం గురించి కూడా జైశంకర్ మాట్లాడారు. భారత్కు వ్యతిరేకంగా పనిచేయడానికి కెనడాలో ఖలిస్థానీయులకు అవకాశం ఇస్తున్నారని అన్నారు. ఇదే భారత్, కెనడా మధ్య దౌత్య సంబంధాలు దెబ్బతినడానకి కారణమైందని చెప్పారు. ఈ విధానం ఇటు.. భారతదేశానికి గానీ, కెనడాకు గానీ ఉపయోగం కానప్పటికీ ఆ దేశ రాజకీయాలు అలా ఉన్నాయని విమర్శించారు. ఇదీ చదవండి: దేశవ్యాప్తంగా ట్రక్కు డ్రైవర్ల ఆందోళన.. పెట్రోల్ బంక్లపై ఎగబడ్డ జనం -
ఓలా, ఉబెర్లపై ఢిల్లీ ప్రభుత్వ కీలక నిర్ణయం
న్యూఢిల్లీ: త్వరలో ఢిల్లీలో ఓలా, ఉబెర్ లాంటి యాప్ బేస్డ్ క్యాబ్ అగ్రిగేటర్లను ప్రభుత్వం నియంత్రించనుంది. ఇందు కోసం కొత్త నిబంధనలు అమల్లోకి రానున్నాయి.ఢిల్లీ ప్రభుత్వం రూపొందించిన డ్రాఫ్ట్ పాలసీకి లెఫ్టినెంట్ గవర్నర్ ఆమోదం తెలపడంతో కొత్త పాలసీని త్వరలో నోటిఫై చేస్తామని రవాణా శాఖ మంత్రి కైలాష్ గెహ్లాట్ తెలిపారు. కొత్త పాలసీ ప్రకారం ఓలా ఉబెర్ లాంటి యాప్ ఆధారిత క్యాబ్ సర్వీసు ప్రొవైడర్లు ఢిల్లీలో వాడే తమ వాహనాలను 2030లోగా ఎలక్ట్రిక్ వాహనాలుగా మార్చుకోవాల్సి ఉంటుంది. 25 కంటే ఎక్కువ వాహనాలున్న సర్వీస్ ప్రొవైడర్ కంపెనీలన్నింటికీ కొత్త పాలసీ వర్తిస్తుంది. ఈ పాలసీ కింద అగ్రిగేటర్లు లైసెన్స్ తీసుకోవాల్సి ఉంటుంది.క్యాబ్ ఆపరేటర్లు కస్టమర్ల వద్ద నుంచి పీక్ అవర్స్లో వసూలుచేసే అత్యధిక ఛార్జీలపై మాత్రం డ్రాఫ్ట్లో ఎలాంటి ప్రస్తావన లేకపోవడం గమనార్హం. ఈ కామర్స్ సేవలందించే అమెజాన్, ఫ్లిప్కార్ట్తో పాటు ఫుడ్ డెలివరీ యాప్లు జొమాటో, స్విగ్గీలకు కూడా ఈ కొత్త పాలసీ వర్తించనుంది.వారు కూడా తమ వాహనాలన్నింటినీ గడువులోగా విద్యుత్ వాహనాలుగా మార్చుకోవాల్సి ఉంటుంది.వాహనాలన్నీ రవాణా శాఖ నిబంధనలకు అనుగుణంగానే ఢిల్లీలో తిరగాల్సి ఉంటుంది.నిబంధనలు ఉల్లంఘించిన వారిపై లక్ష రూపాయల దాకా జరిమానాలు విధంచనున్నారు. ఇదీచదవండి..దివ్యాంగులకు రైల్వేశాఖ అందించే ప్రత్యేక సౌకర్యాలివే.. -
కాంతులీననున్న కొత్త సబ్స్టేషన్లు
సాక్షి, అమరావతి : అభివృద్ధి చెందుతున్న రాష్ట్రంగా రానున్న రోజుల్లో ఏపీ గణనీయమైన వృద్ధి, పట్టణీకరణ జరిగే క్రమంలో ఎదురయ్యే విద్యుత్ డిమాండ్ను అధిగమించేందుకు రాష్ట్ర ప్రభుత్వం శరవేగంగా అడుగులు వేస్తోంది. భవిష్యత్తులో నిరంతరం నాణ్యమైన విద్యుత్ను సరఫరా చేసేందుకు వీలుగా విద్యుత్ రంగం బలోపేతంపై దృష్టిపెట్టింది. ఇందులో భాగంగా.. రాష్ట్ర విద్యుత్ రంగ చరిత్రలో తొలిసారిగా ఒకేసారి 28 సబ్స్టేషన్లకు ఆంధ్రప్రదేశ్ ట్రాన్స్మిషన్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఏపీ ట్రాన్స్కో) శ్రీకారం చుడుతోంది. వీటిలో 16 సబ్స్టేషన్ల శంకుస్థాపన, 12 సబ్స్టేషన్ల ప్రారంపోత్సవాలను సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి మంగళవారం వర్చువల్ విధానంలో చేయనున్నారు. రూ.3,100 కోట్ల వ్యయంతో కర్నూలు, నంద్యాల, వైఎస్సార్ కడప, సత్యసాయి, ప్రకాశం, గుంటూరు, ఏలూరు, పశ్చిమ గోదావరి, కోనసీమ, తూర్పు గోదావరి, కాకినాడ, అనకాపల్లి, విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం, అల్లూరి సీతారామరాజు, పల్నాడు, ఎస్పీఎస్ఆర్ నెల్లూరు, అన్నమయ్య జిల్లాల పరిధిలోని 28 ప్రాంతాల్లో 132/33 కేవీ, 220/132 కేవీ, 400/220 కేవీ, 400/132 కేవీ సామర్థ్యాలతో ఈ సబ్స్టేషన్లు ఏర్పాటవుతున్నాయి. రెండు సోలార్ ప్రాజెక్టులు కూడా.. ఇవికాక.. కడపలో 750 మెగావాట్ల సోలార్ ప్రాజెక్టు, అనంతపురంలో 100 మెగావాట్ల మరో సోలార్ ప్రాజెక్టు నిర్మాణానికి కూడా ముఖ్యమంత్రి శంకుస్థాపన చేయనున్నారు. కడప జిల్లా మైలవరం మండలంలో 1,000 మెగావాట్ల సోలార్ పార్కు అభివృద్ధికి కేంద్ర పునరుత్పాదక ఇంధన మంత్రిత్వ శాఖ (ఎంఎన్ఆర్ఈ) ఆమోదం తెలిపింది. ఇందులో 250 మెగావాట్లను 2020 ఫిబ్రవరి 8న ప్రారంభించారు. మిగిలిన 750 మెగావాట్లను సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ అఫ్ ఇండియా (ఎస్ఈసీఐ) ద్వారా అభివృద్ధి చేయనున్నారు. ఈ 750 మెగావాట్ల సోలార్ ప్రాజెక్టుకు రూ.3 వేల కోట్లు పెట్టుబడి అవుతుందని అంచనా. ఏడాదిలో ఈ ప్రాజెక్టు నిర్మాణం పూర్తయి 1,500 మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయి. ఈ ప్లాంట్ ఏటా 1,500 మిలియన్ యూనిట్ల సౌర విద్యుత్ను ఉత్పత్తి చేస్తుంది. దీనిద్వారా సంవత్సరానికి 12 లక్షల టన్నుల కర్బన ఉద్గారాలను తగ్గించవచ్చని అంచనా. అలాగే.. శ్రీ సత్యసాయి, అన్నమయ్య జిల్లాల్లోని ఎన్.పీ.కుంట, గాలివీడు గ్రామాల వద్ద 1,500 మెగావాట్ల సోలార్ పార్క్కు ఎంఎన్ఆర్ఈ ఆమోదం తెలిపింది. వివిధ సోలార్ పవర్ డెవలపర్లు 1,400 మెగావాట్ల సామర్థ్యం గల సోలార్ ప్రాజెక్టులను ఇప్పటికే పూర్తిచేశారు. మిగిలిన 100 మెగావాట్ల కోసం, హెచ్పీసీఎల్ ముందుకొచ్చింది. ఈ సోలార్ ప్రాజెక్టుకు రూ.400 కోట్లు పెట్టుబడి అంచనా వేయగా, ఏడాది నిర్మాణ కాలంలో 200 మందికి ఉపాధి లభించనుంది. ఈ ప్లాంట్ ఏటా 200 మిలియన్ యూనిట్ల సౌర విద్యుత్ను ఉత్పత్తి చేస్తుంది. తద్వారా ఏటా 1.6 లక్షల టన్నుల కర్బన ఉద్గారాలను తగ్గించవచ్చు. గడువులోగా ప్రాజెక్టులు పూర్తి విద్యుత్ మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను నిర్ణిత సమయానికి పూర్తి చేసేందుకు పక్కాగా ప్రణాళికలు రూపొందించాలని విద్యుత్ సంస్థలను ఇంధనశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, ఏపీ ట్రాన్స్కో సీఎండీ కె. విజయానంద్ ఆదేశించారు. సీఎం కార్యక్రమం ఏర్పాట్లపై విద్యుత్ సౌధలో సోమవారం ఆయన అధికారులతో సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో పెరుగుతున్న విద్యుత్ డిమాండ్ను తీర్చడానికి, అందుకు తగ్గట్లుగా మౌలిక సదుపాయాలను బలోపేతం చేయడానికి రాష్ట్ర విద్యుత్ సంస్థలు సిద్ధంగా ఉన్నాయన్నారు. సీఎం జగన్, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అందించిన సహాయ సహకారాలతోనే వినియోగదారులకు 24 గంటలూ నాణ్యమైన విద్యుత్ను వినియోగదారులకు ఇవ్వగలుగుతున్నామని ఆయన తెలిపారు. ఈ సమావేశంలో జెన్కో ఎండీ, ట్రాన్స్కో జేఎండీ కేవీఎన్ చక్రధర్బాబు, విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ జేఎండీ బి. మల్లారెడ్డి, డిస్కంల సీఎండీలు ఐ. పధ్వితేజ్, జె. పద్మజనార్ధనరెడ్డి, కె. సంతోషరావు, ఏపీ సోలార్ పవర్ కార్పొరేషన్ ఎండీ, సీఈఓ కమలాకర్ బాబు, డైరెక్టర్లు, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. -
జనవరి 1 నుంచి బీమాలో కొత్త రూల్స్ - తెలుసుకోవాల్సిందే!
న్యూఢిల్లీ: బీమా సంస్థలు పాలసీలోని కనీస సదుపాయాల గురించి పాలసీదారులకు తప్పకుండా తెలియజేయాలి. పాలసీకి సంబంధించిన ప్రాథమిక సమాచారాన్ని పాలసీహోల్డర్లకు ఇకపై సులువుగా అర్థమయ్యేలా ఇవ్వాల్సిందేనని బీమా కంపెనీలకు ఇన్సురెన్స్ రెగ్యులేటరీ అథారిటీ ఐఆర్డీఏఐ సూచించింది. ఈ నూతన నిబంధన 2024, జనవరి 1 నుంచి అమల్లోకి రానుంది. సమ్ అష్యూర్డ్ (బీమా కవరేజీ), పాలసీలో వేటికి కవరేజీ ఉంటుంది, మినహాయింపులు, వెయిటింగ్ పీరియడ్, క్లెయిమ్ ఎలా చేయాలి తదితర వివరాలను తప్పకుండా వెల్లడించాలి. అలాగే, ఫిర్యాదుల ప్రక్రియ గురించీ చెప్పాలి. ఈ మేరకు కస్టమర్ సమాచార పత్రాన్ని (సీఐసీ) బీమా రంగ అభివృద్ధి, నియంత్రణ సంస్థ (ఐఆర్డీఏఐ) సవరించింది. దీనివల్ల పాలసీదారులు నియమ నిబంధనలు, షరతుల గురించి సులభంగా అర్థం చేసుకోగలుగుతారు. ఈ విషయంలో పాలసీ డాక్యుమెంట్ది కీలక పాత్ర అని పేర్కొంది. కాబట్టి పాలసీకి సంబంధించి ప్రాథమిక వివరాలు, అవసరమైన సమాచారాన్ని సులువైన పదాల్లో చెప్పాల్సిన అవసరం ఉందని సర్క్యులర్లో తెలిపింది. బీమా సంస్థకు, పాలసీ హోల్డర్కు మధ్య వివరాల విషయంలో అస్పష్టత మూలంగానే అనేక ఫిర్యాదులు వస్తున్నాయని, కాబట్టి కస్టమర్ ఇన్ఫర్మేషన్ షీట్ను సవరిస్తున్నట్లు ఐఆర్డీఏఐ చెప్పింది. సవరించిన సీఐఎస్ ప్రకారం.. బీమా ప్రొడక్ట్/ పాలసీ, పాలసీ నంబర్, ఇన్సురెన్స్ టైప్, సమ్ అష్యూర్డ్ వంటి ప్రాథమిక సమాచారం ఇవ్వాలి. అలాగే, హాస్పటల్ ఖర్చులు, పాలసీలో కవర్ కానివి, వెయిటింగ్ పీరియడ్, కవరేజీ పరిమితులు, క్లెయిమ్ ప్రొసీజర్, గ్రీవెన్స్/ కంప్లయింట్స్ వివరాలు వంటివీ పొందుపరచాలని ఐఆర్డీఏఐ పేర్కొంది. ఒకవేళ పాలసీ హోల్డర్ కోరితే సదరు వివరాలు స్థానిక భాషలోనూ అందుబాటులో ఉంచాలని సూచించింది. సవరించిన సీఐసీ జనవరి 1 నుంచి అమల్లోకి వస్తుందని ఐఆర్డీఏఐ ప్రకటించింది. -
ఎల్ఐసీ పాలసీ దారులకు శుభవార్త!
లైఫ్ ఇండియా ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఎల్ఐసీ) ఖాతాదారులకు శుభవార్త చెప్పింది. ల్యాప్స్ అయిన పాలసీలను పునరుద్దరించుకునే అవకాశాన్ని కల్పిస్తున్నట్లు ప్రకటించింది. సెప్టెంబర్ 1న ప్రారంభమైన ఈ క్యాంపెయిన్ అక్టోబర్ 31,2023 వరకు కొనసాగనుంది. పాలసీ ల్యాప్స్ ఎప్పుడు అవుతుంది? ఎల్ఐసీ పాలసీ హోల్డర్లు సాధారణ గడువు తేదీ లోపల ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. అన్వేక కారణాల వల్ల గడువు తేదీలోగా చెల్లించకపోతే మరో 15 రోజుల నుంచి 30 రోజుల లోపు (గ్రేస్ పీరియడ్) కట్టే అవకాశం ఉంది. అప్పటికీ ప్రీమియం చెల్లించకపోతే పాలసీ రద్దవుతుంది. అయితే, పాలసీదారులకు భరోసా కల్పించేలా ల్యాప్స్ అయిన పాలసీల పునరుద్ధరణ కోసం, ఎల్ఐసీ ఎప్పటికప్పుడు ప్రత్యేక కార్యాక్రమాల్ని నిర్వహిస్తుంది. తాజాగా, ఎల్ఐసీ రీవైవల్ క్యాంపెయిన్ని అందుబాటులోకి తెచ్చింది. LIC's Special Revival Campaign - An opportunity for policyholders to revive their lapsed policies. To know more, contact your nearest LIC Branch/Agent or visit https://t.co/jbk4JUmIi9#LIC #SpecialRevivalCampaign pic.twitter.com/xHfZzyrMkD — LIC India Forever (@LICIndiaForever) September 26, 2023 ఖాతాదారులకు ప్రత్యేక రాయితీలు ఈ క్యాంపెయిన్లో పాలసీదారులు రద్దయిన పాలసీలను పునరుద్దరించుకోవచ్చు. ఉదాహరణకు పాలసీదారు లక్ష రూపాయిల ప్రీమియం చెల్లించాలంటే ఈ రీవైవల్ క్యాంపెయిన్లో 30 శాతం వరకు రాయితీ పొందవచ్చు. లేట్ ఫీ ఛార్జీల కింద రూ.3,000 రాయితీ పొందే అవకాశాన్ని ఎల్ఐసీ కల్పిస్తుంది. అదే ప్రీమియం రూ.లక్ష నుంచి రూ.3లక్షల వరకు చెల్లించాలంటే 30 శాతంతో అంటే రూ.3,500 వరకు రాయితీ పొందవచ్చు. ప్రీమియం 3లక్షలు చెల్లించాలంటే అదనపు ఛార్జీలలో 30 శాతం కన్సెషన్తో రూ.4,000 రాయితీని పొందవచ్చని ఎల్ఐసీ తెలిపింది. పాలసీ ల్యాప్స్ అయిందా? లేదా అని తెలుసుకోవాలంటే? ♦ ఎల్ఐసీ పోర్ట్ల్ను ఓపెన్ చేయాలి ♦ అందులో రిజిస్టర్ యూజర్ అనే ఆప్షన్పై క్లిక్ చేయాలి. ♦ సంబంధిత వివరాల్ని ఎంటర్ చేసి లాగిన్ అవ్వొచ్చు. ♦ లాగిన్ తర్వాత పాలసీ స్టేటస్ క్లిక్ చేయాలి ♦ స్టేటస్ క్లిక్ చేస్తే మీ పాలసీ ల్యాప్స్ అయ్యిందా? లేదా అనేది తెలుసుకోవచ్చు -
వైద్య సేవల్లో ఏపీ భేష్
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ ప్రజలకు వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం కల్పిస్తున్న వైద్య సేవలు చాలా బాగున్నాయని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ డైరెక్టర్ హర్ష మంగ్లా చెప్పారు. ఫ్యామిలీ డాక్టర్ విధానం రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న మంచి నిర్ణయమని, ఈ విధానం ద్వారా గ్రామస్థాయిలో ప్రజలకు వైద్యుల సేవలు అందించడం శుభపరిణామం అని చెప్పారు. హర్ష మంగ్లా శనివారం ‘సాక్షి’కి ఇంటర్వ్యూ ఇచ్చారు. రాష్ట్రంలో వైద్య కార్యక్రమాలు, వైద్య శాఖ పని తీరు వంటి పలు అంశాలపై ఆయన చెప్పిన వివరాలు ఆయన మాటల్లోనే.. వైద్య సేవలు చేరువ ఎఫ్డీసీ ఓ వినూత్న కార్యక్రమం. దీని ద్వారా ప్రతి ఒక్కరికీ వైద్య సేవలు చేరువ అవుతాయి. రాష్ట్రంలో వంద శాతం విలేజ్ క్లినిక్స్ను హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్లుగా అభివృద్ధి చేయడం చాలా మంచి విషయం. వీటి ద్వారా ప్రజలకు వేగవంతమైన, నాణ్యమైన వైద్య సేవలు అందుతున్నాయి. గ్రామాల్లోనే 12 రకాల వైద్య సేవలు ప్రజలకు అందుబాటులోకి వచ్చాయి. కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్, ఏఎన్ఎం, ఆశా వర్కర్లు వీటిలో సేవలు అందిస్తున్నారు. వెల్నెస్ సెంటర్ల పరిధిలో నివసిస్తున్న ప్రతి వ్యక్తి ఆరోగ్య వివరాలు, చరిత్ర వీటిలో ఉంటాయి. వీటి ఆధారంగా వైద్య సేవలు అందుతాయి. ప్రజలకు డిజిటల్ వైద్య సేవల కల్పనే లక్ష్యంగా ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ (ఏబీడీఎం) అమలు చేస్తున్నాం. ఈ కార్యక్రమం అమలులోనూ ఏపీ ప్రభుత్వం ఉత్తమ పనితీరు కనబరుస్తోంది. అవయవ దానానికి ముందుకు రావాలి సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 2వ తేదీ వరకూ ఆయుష్మాన్ భవ కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా కేంద్రం అమలు చేస్తోంది. ఇందులో భాగంగా ప్రజలందరికీ ఆయుష్మాన్ భారత్ డిజిటల్ హెల్త్ అకౌంట్ కార్డుల జారీ, అవయవ దానం క్యాంపెయిన్, రక్తదానం క్యాంప్లు వంటి నిర్వహిస్తున్నాం. ప్రతి ఒక్కరూ అవయవ దానం, రక్తదానం చేయడానికి ముందుకు రావాలి. అవయవదానానికి ఏపీలో చాలా మంది ముందుకు వస్తున్నారు. ప్రైవేటు ఆస్పత్రుల్లోనూ ఉచిత వైద్యం ఆరోగ్య కార్యక్రమాల అమలులో ఏపీ మిగతా అన్ని రాష్ట్రాలకంటే ముందుంది. ప్రజలకు ప్రైవేట్ కార్పొరేట్ ఆస్పత్రుల్లోనూ ఉచిత వైద్యం అందించడానికి ఆరోగ్యశ్రీ పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తోంది. ఈ పథకం అమలుపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రత్యేక దృష్టి పెడుతున్నారు. ప్రతి కుటుంబానికి ఈ పథకం ఎంతో ముఖ్యమైనది. పేద, మధ్య తరగతి ప్రజలకు ఈ పథకంతో ఎంతో ప్రయోజనం చేకూరుతోంది. అర్హులైన ప్రతి ఒక్కరికీ ఆరోగ్యశ్రీ, ఆయుష్మాన్ కార్డుల జారీకి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటున్నాయి. -
ఉచిత విద్యుత్ మా పాలసీ
సాక్షి, హైదరాబాద్: ‘వ్యవసాయానికి ఉచిత విద్యుత్ మా ప్రభుత్వ పాలసీ. ఈ విషయానికి సంబంధించి కొందరు తెలిసీ తెలియక మాట్లాడుతున్నారు. వాటిని నేను పట్టించుకోను. పోరాడి తెచ్చుకున్న తెలంగాణలో ఈ పథకం నిలబడాలి. గ్రామీణ ప్రాంతాలు, రైతులు బాధలు తొలగిపోయి వంద శాతం బాగుండాలి..’అని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు అన్నారు. భూముల డిజిటలైజేషన్ కోసం తెచ్చిన ధరణిని సమస్యగా చిత్రీకరించేందుకు కొన్ని దుష్టశక్తులు పనిచేస్తున్నాయని విమర్శించారు. ధరణితో భూముల మీద యజమానులకు సంపూర్ణ అధికారం వచ్చిందని చెప్పారు. ఈ అధికారాన్ని మీ వద్దే పెట్టుకుంటారా? లేక వదిలేసుకుంటారా? అనేది మీరే నిర్ణయించుకోవాలని అన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు కుంభం అనిల్కుమార్రెడ్డి సోమవారం ప్రగతిభవన్లో సీఎం కేసీఆర్ సమక్షంలో భారత్ రాష్ట్ర సమితిలో చేరారు. అనిల్కుమార్ రెడ్డితో పాటు ఆయన వెంట వచ్చిన అనుచరులకు కేసీఆర్ గులాబీ కండువాలు కప్పి పార్టీ లోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. లోతుగా ఆలోచించిన తర్వాతే.. ‘తెలంగాణ ఉద్యమంతో పాటు రాష్ట్ర సాధనను ఒక టాస్క్గా తీసుకుని పనిచేశాం. మాకు రాజకీయం ఒక టాస్క్ లాంటిది. నేను సిద్దిపేట శాసనసభ్యుడిగా పనిచేసిన నాటి నుంచి మొదలుకుని తెలంగాణ రాష్ట్రం ఏర్పడేంత వరకు కరెంటు విషయంలో రైతులు ఎదుర్కొన్న ఇబ్బందులు వర్ణనాతీతం. రైతులకు 24 గంటలు ఉచిత విద్యుత్ ఇచ్చేందుకు అధికారులతో జరిపిన చర్చల ద్వారా సబ్స్టేషన్లు, ట్రాన్స్ఫార్మర్లు తదితర మౌలిక వసతుల్లో సమతుల్యత సాధించాం. ప్రభుత్వ సంపూర్ణ మద్దతు ఉంటే 24 గంటల ఉచిత విద్యుత్ సాధ్యమవుతుందనే అధికారుల వాదనకు కట్టుబడి, పూర్తిస్థాయిలో అండగా నిలిచి ఏడెనిమిది నెలల్లోనే విద్యుత్ సరఫరా లేక ఏర్పడిన దుష్పరిణామాలను సరిదిద్దాం.ఏడు గంటల పాటు ఒకేమారు వ్యవసాయ అవసరాలకు విద్యుత్ ఇవ్వడం వల్ల ఉత్పన్నమయ్యే సమస్యలను దృష్టిలో పెట్టుకునే 24 గంటల కరెంటుకు మొగ్గు చూపాం. గ్రిడ్ కుప్పకూలకుండా అవసరమైన సమయంలో విద్యుత్ కొనుగోలుకు అవసరమైన విచక్షణాధికారం అధికారులకు ఇవ్వడంతో పాటు సాంకేతిక అంశాలపై అవగాహన ఉండదనే ఉద్దేశంతో ట్రాన్స్కో, జెన్కో తదితర సంస్థల నుంచి ఐఏఎస్ అధికారులను తొలగించాం. విద్యుత్ అంశంపై ప్రతి విషయాన్ని లోతుగా ఆలోచించిన తర్వాతే తొమ్మిదేళ్లుగా అమలు చేస్తున్నాం. మూడు గంటల కరెంటు అంటే రైతులు తిడుతున్నారు. రైతుబంధు, రైతుబీమా, ఉచిత విద్యుత్, ధాన్యం కొనుగోలు అంశంపై ఆర్థికవేత్తలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నా గ్రామీణ ప్రాంతాలు కుదుటపడే వరకు కొనసాగిస్తాం. దీంతో ఆర్థికాభివృద్ధి జరిగి తెలంగాణ అన్ని రంగాల్లోనూ అగ్రస్థానానికి చేరుతుంది. ధాన్యం ప్రాసెసింగ్.. జపాన్ కంపెనీతో చర్చలు ఇప్పటికే కాళేశ్వరం ప్రాజెక్టు, చెక్డ్యాంలు తదితరాలతో భూగర్భ జలాలు పెరిగి పంటల దిగుబడి పెరిగింది. తెలంగాణలో ఇసుక పండినట్లు 3 కోట్ల టన్నుల ధాన్యం వస్తుండటంతో గిర్నీల సామర్ధ్యం కూడా సరిపోవడం లేదు. 2.5 కోట్ల టన్నుల ధాన్యం ప్రాసెసింగ్ కోసం జపాన్ సటాకా కంపెనీతో మాట్లాడుతున్నాం. నేను రైతుబిడ్డగా సిద్దిపేట మార్కెట్లో పడిగాపులు పడిన రోజులను దృష్టిలో పెట్టుకుని గ్రామాల్లోనే ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి రైతుల ఖాతాల్లో నేరుగా డబ్బులు వేస్తున్నాం..’అని సీఎం చెప్పారు. భూములపై సర్వాధికారాలు యజమానులకు.. ‘వీఆర్వోలు భూముల వివరాలు గందరగోళం చేశారు. ధరణి ద్వారా భూముల డిజిటలైజేషన్తో వాటిపై సర్వాధికారాలు యజమానుల చేతికి వచ్చాయి. రాష్ట్రంలోని 2.76 కోట్ల ఎకరాల్లో 1.56 కోట్ల భూమి ఇప్పటికే ధరణిలోకి వచ్చింది. ధరణి మూలంగా రైతుబంధు, భూమికి రక్షణ, ధాన్యం కొనుగోలు వంటివి సులభంగా సాధ్యమవుతాయి. ఇప్పుడు రాష్ట్రంలో భూముల విలువ ఎంతో పెరిగింది. ధరణి లేకపోతే శాంతిభద్రతల సమస్యలు తలెత్తేవి. కొందరు చెప్తున్నట్లు ధరణి తీసేస్తే మళ్లీ లంచాలు మొదలవుతాయి..’అని కేసీఆర్ అన్నారు. జోడెడ్ల బండిలా ముందుకు తీసుకెళ్లండి ‘భువనగిరిలో ఇద్దరూ పోటీ పడి డబ్బులు తగలేయొద్దు. చెరి ఒక పదవి తీసుకుని జోడెడ్ల బండిలా నియోజకవర్గాన్ని ముందుకు తీసుకెళ్లండి.. అని ఎమ్మెల్యే పైళ్ల శేఖర్రెడ్డి, అనిల్ కుమార్రెడ్డికి చెప్పా. కోడె లేగల మాదిరిగా వెలపల, దాపల సమానంగా ఉంటే కచ్చురంగా బాగా ముందుకు పోతుంది. అనిల్కుమార్ రెడ్డి రాజకీయ భవిష్యత్తుకు నాదే బాధ్యత. నాకు ఫిబ్రవరిలో 70 ఏళ్లు వస్తాయి. రేపటి తెలంగాణను పాలించేది మీరే. దారి చూపించి వెళతా..’అని కేసీఆర్ అన్నారు. సమావేశంలో మంత్రులు హరీశ్రావు, జగదీశ్రెడ్డితో పాటు ప్రభు త్వ విప్లు బాల్క సుమన్, గొంగిడి సునీత, ఎమ్మెల్యేలు పైళ్ల శేఖర్రెడ్డి, భూపాల్రెడ్డి, కె.ప్రభాకర్రెడ్డి, గ్యాదరి కిషోర్, భాస్కర్రావు, రవీంద్రకుమార్, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్రెడ్డి, జెడ్పీ చైర్మన్ సందీప్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. మహారాష్ట్రలో రెండేళ్లలో ఉచిత విద్యుత్: కేసీఆర్ మహారాష్ట్రలో రైతు ప్రభుత్వం ఏర్పడిన రెండేళ్లలోనే వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్ అందిస్తామని కేసీఆర్ ప్రకటించారు. మహారాష్ట్రలోని వివిధ పారీ్టలకు చెందిన 76 మంది సర్పంచ్లు కూడా సోమవారం బీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత వ్యవసాయంతో పాటు అనేక రంగాల్లో అభివృద్ధి చెంది దేశానికే ఆదర్శంగా నిలిచామని సీఎం చెప్పారు. మహారాష్ట్రలో కూడా రైతులు, ప్రజల జీవన ప్రమాణాలు మారాల్సిన అవసరం ఉందని అన్నారు. తెలంగాణలో అభివృద్ధి కార్యక్రమాలను స్వయంగా పరిశీలించాల్సిందిగా సర్పంచ్లకు సూచించారు. వారిని తెలంగాణ గ్రామాల పర్యటనకు తీసుకెళ్లాలని ఎమ్మెల్యే జీవన్రెడ్డిని ఆదేశించారు. బీఆర్ఎస్లో చేరిన వారిలో మహారాష్ట్ర అమరావతి డివిజన్ నుంచి బీజేపీ, శివసేన, కాంగ్రెస్, ఎన్సీపీతో పాటు రైతు సంఘటన, వంచిత్ బహుజన్ అఘాడీ, షెట్కారీ సంఘటనతో పాటు వివిధ పారీ్టలకు చెందిన 76 మంది సర్పంచ్లు, ఉప సర్పంచ్లు, మహారాష్ట్ర మీడియా యూనియన్ ప్రతినిధులు ఉన్నారు. -
ఈ–కామర్స్ విధానంపై చర్చలు
న్యూఢిల్లీ: ఈ–కామర్స్ విధానాన్ని రూపొందించడంపై అంతర్–మంత్రిత్వ శాఖల స్థాయిలో చర్చలు జరుగుతున్నాయని పరిశ్రమలు, అంతర్గత వాణిజ్య ప్రోత్సాహక విభాగం డీపీఐఐటీ కార్యదర్శి రాజేష్ కుమార్ సింగ్ తెలిపారు. పరిశ్రమ సమ్మిళిత వృద్ధి సాధించడానికి అనువైన పరిస్థితులను కల్పించే వ్యూహాల రూపకల్పన అనేది ఈ విధానం ప్రధాన లక్ష్యంగా ఉంటుందని ఆయన పేర్కొన్నారు. దీని ద్వారా వ్యాపారాల నిర్వహణను సులభతరం చేసేలా నియంత్రణ విధానాలను క్రమబద్ధీకరించడం, కొత్త సాంకేతికతలను అందిపుచ్చుకోవడం, సరఫరా వ్యవస్థలను సమగ్రపర్చడం, ఈ–కామర్స్ మాధ్యమం ద్వారా ఎగుమతులను పెంచడం తదితర అంశాలపై అంతర్–మంత్రిత్వ శాఖలు దృష్టి పెడుతున్నాయని సింగ్ వివరించారు. అటు జాతీయ రిటైల్ వాణిజ్య విధానంపై కూడా డీపీఐఐటీ కసరత్తు చేస్తున్నట్లు ఆయన చెప్పారు. భౌతిక రిటైల్ రంగం వృద్ధిని ప్రోత్సహించేందుకు, క్రమబద్ధీకరించేందుకు ఉపయోగపడే మార్గదర్శకాలను ఇందులో పొందుపర్చనున్నారు. -
ఇన్సూరెన్స్ పాలసీలపై పెరిగిన అవగాహన.. రూ.3 లక్షల కోట్ల బీమా రంగ ఆదాయం
న్యూఢిల్లీ: బీమా పరిశ్రమ స్థూల ప్రీమియం ఆదాయం 2025 మార్చి నాటికి రూ.3 లక్షల కోట్లకు చేరుకుంటుందని రేటింగ్ ఏజెన్సీ ఇక్రా అంచనా వేసింది. 2023 మార్చి నాటికి ఇది రూ.2.4 లక్షల కోట్లుగా ఉంది. ప్రైవేటు బీమా సంస్థల కంబైన్డ్ రేషియో మెరుగుపడుతుందని, రిటర్న్ ఆన్ ఈక్విటీ (ఆర్వోఈ) 2023–24లో 11.2–12.8 శాతానికి, 2024–25లో 12.5–13.9 శాతానికి పెరుగుతుందని పేర్కొంది. ప్రభుత్వరంగ బీమా సంస్థలు కంబైన్డ్ రేషియో అధికంగా ఉంటుందని, దీంతో వాటి నష్టాలు కొనసాగుతాయని తెలిపింది. ప్రభుత్వరంగ సాధారణ బీమా సంస్థలు 2024 మార్చి నాటికి సాల్వెన్సీ రేషియో (1.5 రెట్లు) చేరుకునేందుకు వీలుగా వాటికి రూ.17,500 కోట్ల నిధుల అవసరం అవుతాయని అంచనా వేసింది. పరిశ్రమ స్థూల ప్రీమియం ఆదాయం 2022–23లో వార్షికంగా చూస్తే 17.2 శాతం వృద్ధితో రూ.2.4 లక్షల కోట్లకు చేరుకున్న విషయాన్ని ప్రస్తావించింది. అంతకుముందు సంవత్సరంతో పోలిస్తే 2022–23లో నికరంగా రూ.35,000 కోట్ల మేర పెరిగినట్టు పేర్కొంది. హెల్త్ ఇన్సూరెన్స్ పట్ల అవగాహన పెరగడంతో ఈ విభాగం మెరుగైన వృద్ధిని చూసిందని, వృద్ధి చెందిన స్థూల ప్రీమియం ఆదాయంలో 50 శాతం వాటా హెల్త్ ఇన్సూరెన్స్ నుంచే వచ్చినట్టు వివరించింది. కరోనా సమయంలో లాక్డౌన్లతో దెబ్బతిన్న మోటారు బీమా విభాగం సైతం పుంజుకున్నట్టు ఇక్రా తెలిపింది. హెల్త్ ఇన్సూరెన్స్ క్లెయిమ్లు సాధారణ స్థితికి చేరినట్టు పేర్కొంది. వేతన సవరణ, అందుకు సంబంధించిన బకాయిల చెల్లింపులతో ప్రభుత్వరంగ సాధారణ బీమా సంస్థలకు నష్టాలు పెరిగినట్టు వివరించింది. -
AP: హిజ్రాల కోసం ట్రాన్స్జెండర్ పాలసీ
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో హిజ్రాల మేలు కోసం ట్రాన్స్జెండర్ పాలసీని ప్రభుత్వం అమలులోకి తెచ్చింది. ఇప్పటికే హిజ్రాలకు నవరత్నాల ద్వారా సంక్షేమ పథకాలను అందిస్తున్న ప్రభుత్వం ప్రత్యేకంగా వారికోసం మరిన్ని చర్యలు చేపట్టనుంది. ట్రాన్స్జెండర్లకు సరైన విద్య, వైద్యం అందించేలా ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. వారు నివసించే ప్రాంతాల్లో అందిరి మాదిరిగానే మంచినీటి సరఫరా, పారిశుధ్య సదుపాయాలు కల్పిస్తోంది. ఇళ్ల స్థలాలు, ఇళ్లు, ఆర్థిక సహాయాలు అందిస్తోంది. వారికి నైపుణ్యాభివృద్ధి శిక్షణ ఇచ్చి సాధికారత సాధించేలా తోడ్పాటు అందించనుంది. మొత్తంగా వారికి సామాజిక భద్రత కల్పించేలా ప్రభుత్వం పాలసీ అమలు చేస్తుంది. రాష్ట్రంలో ట్రాన్స్జెండర్లకు గుర్తింపు కార్డులు జారీచేయనుంది. ట్రాన్స్జెండర్స్ హక్కులను కాపాడటంతోపాటు వారి సంక్షేమానికి, అభివృద్ధికి ప్రభుత్వ ప్రస్తుత (2022–23) బడ్జెట్లో రూ.2 కోట్లు కేటాయించడం విశేషం. చదవండి: Heart Attack: టీకాల వల్లే యువత గుండెకు ముప్పు! -
15 ఏళ్లు దాటిన వాహనాలను ఏప్రిల్ 1 నుంచి తుక్కు కింద అమ్మేయాలి
కడప వైఎస్ఆర్ సర్కిల్: జిల్లాలో 15 ఏళ్లు దాటిన వాహనాలను ఏప్రిల్ 1 నుంచి తుక్కు కింద అమ్మాలని కేంద్ర ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చిందని జిల్లా ఉప రవాణాశాఖ కమిషనర్ మీరా ప్రసాద్ తెలిపారు. బుధవారం డీటీసీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ 15 ఏళ్లు దాటిన వాణిజ్య వాహనాలు, 20 ఏళ్లు దాటిన వ్యక్తిగత వాహనాలు సామర్ధ్య పరీక్షల్లో విఫలం అయితే తుక్కుగా మార్చే విధానాన్ని కేంద్ర ప్రభుత్వం అమలులోకి తీసుకొచ్చిందన్నారు. -
ఆభరణాల మరమ్మతుల మార్కెట్గా భారత్: జీజేఈపీసీ డిమాండ్
ముంబై: ఆభరణాల మరమ్మతుల (బాగు చేయడం/రీపేర్) సేవలకు ఔట్సోర్స్ మార్కెట్గా భారత్ అవతరించేందుకు కేంద్ర ప్రభుత్వం ఒక విధానాన్ని తీసుకు రావాలని జెమ్స్ అండ్ జ్యుయలరీ ఎగుమతుల ప్రోత్సాహక మండలి (జీజేఈపీసీ) డిమాండ్ చేసింది. విధానపరమైన ప్రోత్సాహంతో అంతర్జాతీయ జ్యులయరీ రిపేర్ మార్కెట్లో భారత్ వాటాను 10-20 శాతానికి తీసుకెళ్లొచ్చని సూచించింది. 2026 నాటికి భారత మార్కెట్ వాటా 5.75 బిలియన్ డాలర్లకు (రూ.47,150 కోట్లు) చేరుకోవచ్చని అంచనా వేసింది. ‘‘ప్రస్తుతం ఈ మార్కెట్లో అంతర్జాతీయంగా భారత్ కేవలం 3 శాతం వాటా కలిగి ఉంది. కేవలం 196.8 మిలియన్ డాలర్ల మేర విక్రయాలు ఉన్నాయి. కానీ, ఇదే మార్కెట్లో అమెరికాకు 30 శాతం వాటా ఉంటే, చైనా 9.2 శాతం వాటా కలిగి ఉంది. చేతితో తయారు చేసే ఆభరణాల్లో భారత్కు సహజ సిద్ధంగా ఉన్న నైపుణ్యాల దృష్ట్యా జ్యుయలరీ రిపేర్ రంగంలోనూ భారత్ తన సత్తా చూపించగలదు. ఇందుకు సంబంధించి తగిన విధానాన్ని తీసుకొస్తే ప్రపంచ మార్కెట్లో మన వాటాను 10-20 శాతానికి తీసుకెళ్లొచ్చు. బిలియన్ డాలర్ల పెట్టుబడులతోపాటు ఎన్నో ఉపాధి అవకాశాలను ఇది తీసుకొస్తుంది’’అని జీజేఈపీసీ చైర్మన్ విపుల్షా తెలిపారు. మరమ్మతుల విధానాన్ని ప్రకటించినట్టయితే ప్రముఖ బ్రాండ్లు భారత్లో తమ సేవా కేంద్రాలను ఏర్పాటు చేస్తాయన్నారు. ప్రస్తుతం ఇవి ఎక్కువగా దుబాయి, టర్కీ, హాంగ్కాంగ్ తదితర ప్రాంతాల్లో ఉన్నట్టు చెప్పారు. అన్ని రకాల జ్యుయలరీని దిగుమతి చేసుకుని, మరమ్మతులు చేయాలంటే అందుకు దేశీయంగా ఆభరణాల తయారీ పరిశ్రమలో టెక్నాలజీ ఉన్నతీకరణ అవసరపడుతుందని జీజేఈపీసీ తెలిపింది. పెద్ద ఎగుమతిదారులు తమ కస్టమర్లకు సంబంధించిన మరమ్మతుల అవసరాలను తీర్చే అవకాశం లభిస్తుందని పేర్కొంది. -
ఎల్ఐసీ పాలసీ దారులకు ముఖ్య గమనిక
ప్రముఖ లైఫ్ ఇన్స్యూరెన్స్ ఇండియా కార్పొరేషన్ (ఎల్ఐసీ) జీవర్ అమర్, టెక్ టర్మ్ పాలసీలను విరమించుకుంటున్నట్లు ప్రకటించింది. నవంబర్ 23 నుంచి ఆ రెండు పాలసీలు వినియోగంలో ఉండవని ఎల్ఐసీ విడుదల చేసిన ఓ ప్రకటనలో తెలిపింది. ఎల్ఐసీ 2019 ఆగస్ట్లో జీవన్ అమర్ ప్లాన్ను, అదే ఏడాది సెప్టెంబర్లో ఎల్ఐసీ టెక్ టర్మ్ ప్లాన్ను అందుబాటులోకి తెచ్చింది.అయితే తాజాగా ఆ ప్లాన్ను ఉపసంహరించుకుంటున్నట్లు ఎల్ఐసీ పేర్కొంది. అందుకు కారణం రీ ఇన్స్యూరెన్స్ ప్రీమియం ధరలు పెరగడమే కారణమని తెలుస్తోంది. కాగా, త్వరలో ఆ రెండు పాలసీలను మార్పులు చేసి మళ్లీ అందుబాటులోకి తెస్తామని సంస్థ చెబుతోంది. అర్హతలు 10 నుంచి 40 సంవత్సరాల కాలపరిమితితో పాలసీ దారుడు ఎల్ఐసీ జీవన్ అమర్ ప్లాన్ను కనీసం రూ.25 లక్షలు, ఎల్ఐసీ టెక్ టర్మ్ ప్లాన్ కనీసం రూ. 50 లక్షలు హామీ మొత్తంతో కొనుగోలు చేయాల్సి ఉంటుంది. ఈ రెండు ప్లాన్లలో పాలసీ కట్టే సమయంలో పాలసీదారుడు మరణిస్తే హామీ మొత్తాన్ని నామినీకి అందుతుంది. ప్లాన్ తీసుకొని ఉంటే పాలసీదారులు ఇప్పటికే ఈ రెండు ప్లాన్లను కొనుగోలు చేస్తే.. ఆ పాలసీలు అలాగే కొనసాగుతాయని ఎల్ఐసీ ప్రతనిధులు తెలిపారు. కొత్తగా పాలసీ తీసుకునేవారికి మాత్రం అందుబాటులో ఉండవు. -
ఆహార స్వావలంబన విధాన దిశగా...
గత యాభై ఏళ్లలో వన్యప్రాణుల జనాభా సగానికి సగం నశించింది. ఇది పర్యావరణ ప్రళయమని శాస్త్రవేత్తలు అంటున్నారు. ప్రపంచం ఎదుర్కొంటున్న అతిపెద్ద సవాళ్లు వాతావరణ సంక్షోభం, జీవవైవిధ్య వినాశనం అని ‘డబ్ల్యూడబ్ల్యూఎఫ్’ నివేదిక చెబుతోంది. ఇవి మరింత ముదరడానికి ప్రపంచ ఆహార వ్యవస్థే కారణమని కూడా సూచిస్తోంది. దీన్ని బలపరిచే సాక్ష్యం, కుబేరుల జాబితాలోకి ఆహార రంగ వ్యాపారవేత్తలు చేరడం! విరోధాబాస ఏమిటంటే, ఈ సంక్షోభాలకు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞాన ఆధారిత పరిష్కారాలను బడా కంపెనీలు సూచిస్తుండటం! ఆహార భద్రత రైతుల చేతుల్లోంచి ఆహార కంపెనీల బోర్డు రూముల్లో కూర్చునేవారి చేతుల్లోకి మారిపోతోంది. ఈ విపరిణామాలు సంభవించకూడదంటే ఆహార వ్యవస్థ సమూలంగా మారాలి. కొన్నేళ్ల క్రితం నాటి మాట. జర్మనీలోని ఓ నేచర్ రిజర్వ్పై ససెక్స్ యూనివర్శిటీ (యూకే) ఓ అధ్యయనం నిర్వ హించింది. దాని ప్రకారం, ఆ ప్రాంతంలోని క్రిమికీటక సంతతి గణనీయంగా పడిపోయింది. ఎంతగా అంటే... పాతికేళ్ల కాలంలో ఎగిరే కీటకాలు 75 శాతం వరకూ లేకుండా పోయాయి. ఈ పరిణామం ‘పర్యావరణ ప్రళయం’ లాంటిదని శాస్త్రవేత్తలు అభివర్ణించారు. ఈ ఫలితాలకు ఆశ్చర్యపోయిన కొందరు శాస్త్రవేత్తలు కొంచెం ఎక్కువ చేసి చెప్పి ఉంటారని వ్యాఖ్యానించడమే కాకుండా... ఒకవేళ అదే నిజమైతే జీవవైవిధ్యాన్ని పరిరక్షించాల్సిన అవసరాన్ని గుర్తు చేసే మేలుకొలుపు అవుతుందని కూడా వ్యాఖ్యా నించారు. ఐదేళ్ల తరువాత... ‘వరల్డ్ వైడ్ ఫండ్ ఫర్ నేచర్’ (డబ్ల్యూడబ్ల్యూఎఫ్) విడుదల చేసిన ‘లివింగ్ ప్లానెట్ రిపోర్ట్–2022’ కూడా ఇలాంటి బాంబే వేసింది. యాభై ఏళ్ల కాలంలో (1970–2018) వన్యప్రాణుల జనాభాలో దాదాపు సగం నశించిపోయిందని 32 వేల జీవజాతులను విశ్లేషించిన లివింగ్ ప్లానెట్ ఇండెక్స్ తెలిపింది. లాటిన్ అమెరికా ప్రాంతంలో అత్య ధికంగా 94 శాతం జనాభా నశించి పోయింది. మంచినీటిలో బతికే వాటిల్లో 80 శాతం వాటికి నష్టం జరిగింది. ఈ నివేదికలోని ఇతర ఆందోళనకరమైన అంశాలను కాసేపు పక్కనబెడితే భూమి ‘ఆరవ మహా వినాశనం’ ముంగిట్లో ఉందన్న విషయం చాలాకాలంగా తెలుసు. అందుకే ఇది జీవజాతి వినాశనమనీ, మానవ నాగరకతల పునాదులపై జరుగుతున్న దాడి అనీ యూఎస్ నేషనల్ అకాడమి ఆఫ్ సైన్సెస్ పేర్కొనడం అతిశయోక్తి ఏమీ కాదు. నిజానికి డబ్ల్యూడబ్ల్యూఎఫ్ నివేదిక సమాజానికి ఒక షాక్ లాంటిది. కానీ చదువుకున్నవారి చాలామంది మనఃస్థితిని బట్టి చూస్తే, ఈ నివేదిక వారిని ఇసుమంత కూడా కదిలించినట్లు కనపడదు. వీరు చెట్లను అభివృద్ధి నిరోధకాలుగా చూస్తూంటారు. రహదారులు, గనులు, పరిశ్రమల కోసం పర్యావరణ నిబంధనలను ఉల్లంఘించడం, లేదా కావాల్సినట్టుగా మార్చుకోవడం ఇందుకు ప్రత్యక్ష సాక్ష్యాలు. పామాయిల్ పంటల కోసం విశాలమైన అటవీ భూములను చదును చూస్తూండటం ఈ ధోరణినే సూచిస్తుంది. అలాగే పచ్చటి అడవులను పప్పుబెల్లాల మాదిరిగా పరాయివారికి పంచేస్తూండటం చూస్తూంటేనే తెలుస్తుంది పర్యావరణానికి మనం ఏమాత్రం మర్యాద ఇస్తున్నామో! ఏటా కోటి హెక్టార్ల నష్టం... ప్రతి ఏడాది ప్రపంచవ్యాప్తంగా మనం సుమారు కోటి హెక్టార్ల అటవీ భూమిని కోల్పోతున్నాం. కానీ ‘సీఓపీ’ చర్చల్లో దీనికి హద్దులు వేయాలన్న అంశంపై ఒక్క తీర్మానమూ జరగదు. ప్రపంచం ఎదు ర్కొంటున్న రెండు అతిపెద్ద సవాళ్లు వాతావరణ సంక్షోభం, జీవ వైవిధ్య వినాశనం అని డబ్ల్యూడబ్ల్యూఎఫ్ నివేదిక స్పష్టం చేస్తోంది. ఒకదానితో ఒకటి సంబంధం ఉన్న ఈ రెండు అంశాలు మరింత ముదిరేందుకు ప్రపంచ ఆహార వ్యవస్థ కారణమని కూడా సూచి స్తోంది. ఈ హెచ్చరిక ఉన్నా, వ్యవసాయ రంగంలో మార్పులన్నీ వ్యవసాయం పెద్ద ఎత్తున సాగాలన్న వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ సూచించిన విధంగా మాత్రమే మారుతున్నాయి. ‘ద యాక్షన్ గ్రూప్ ఆన్ ఎరోషన్, టెక్నాలజీ అండ్ కాన్సంట్రేషన్ (ఈటీసీ) వంటి అంతర్జాతీయ సంస్థ తయారు చేసిన ఇంకో నివేదిక కూడా ఆహార వ్యవస్థ బిగ్ ఫుడ్, బిగ్ టెక్, బిగ్ ఫైనాన్స్లకు చెందిన కంపెనీల చేతుల్లోకి జారిపోతోందని విస్పష్టంగా తెలిపింది. దీనివల్ల రైతులు, జాలర్ల హక్కులకు భంగం కలిగే ప్రమాదం ఉంది. నేలను విషతుల్యం చేయడం, నీళ్లను విపరీతంగా వాడేయడం, పర్యా వరణాన్ని కలుషితం చేయడం, జీవవైవిధ్యాన్ని నాశనం చేయడం... ఈ క్రమంలో లాభాలు ఆర్జించడమే ఈ బడా కంపెనీల లక్ష్యంగా కనిపిస్తోంది. కరోనా మహమ్మారి కబళించిన రెండేళ్లలోనే అత్యంత కుబేరుల జాబితాలోకి 62 మంది ‘ఆహార కోటీశ్వరులు’ చేరారు. ఈ కాలావధిలోనే ప్రపంచంలోనే అతిపెద్ద ట్రేడింగ్ కంపెనీ ‘కార్గిల్’ లాభాల వాటాలో 64 శాతం వృద్ధి నమోదైంది. కొన్ని ఇతర ఫుడ్ కంపెనీలు కూడా విపరీతంగా లాభపడ్డాయి. ఈ రెండు నివేదికలూ మన వ్యవసాయ విశ్వవిద్యాలయాల్లో బోధనాంశాలుగా ఉంచాలి. డబ్ల్యూడబ్ల్యూఎఫ్ నివేదిక చెప్పే విషయానికి వ్యవయాయ రంగంలో జరుగుతున్న వ్యవహారాలు పూర్తిగా వ్యతిరేకంగా ఉన్నాయి. పలు ఉదాహరణలతో ఇచ్చిన ఈటీసీ నివేదిక... వ్యవసాయం డిజిటలైజ్ అయితే బోలెడంత సమాచారం సేకరించవచ్చుననీ, ఈ సమాచారం కాస్తా మైక్రోసాఫ్ట్, అమెజాన్ వంటి పెద్ద కంపెనీల క్లౌడ్ సర్వర్లలోకి చేరిపోయి కొత్తకొత్త బిజినెస్ వ్యూహాల రూప కల్పనకు సిద్ధంగా ఉంటుందనీ చెబుతుంది. ఈ నివేదికను కొంచెం నిశితంగా పరిశీలిస్తే ఇదెలా జరుగుతోందో అర్థమవుతుంది. వాతావరణ మార్పులు, జీవవైవిధ్యంలో తరుగుదల అంశాలను చూపి బడా కంపెనీలు వాటికి అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞాన ఆధా రిత పరిష్కారాలు సూచిస్తాయి. జన్యుమార్పిడి పంటలు, హైటెక్ విత్తనాల్లాంటివన్నమాట. డిజిటల్ వ్యవసాయం వల్ల లాభాలంటూ ఊదరగొడతాయి. ఇదే క్రమంలో జీవ వైవిధ్య వనరుల పరిరక్షణ పేరు చెప్పి, కృత్రిమ ఆహారాన్ని మన ముందుంచుతాయి. రైతులు, రైతు కూలీలు కనుమరుగు... డిజిటల్ టెక్నాలజీల వల్ల వ్యవసాయ సామర్థ్యం పెరుగుతుందను కునేరు! డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ పేరుతో ఇప్పుడున్న ఆహార వ్యవస్థ విధ్వంసం మాత్రమే జరుగ నుంది. బడా కంపెనీలవన్నీ తప్పుడు పరిష్కారాలని ఈ నివేదిక ద్వారానే స్పష్టమవుతుంది. డ్రోన్లు, సెన్సర్లు, ఉపగ్రహ సమాచారం, కృత్రిమ మేధల వల్ల... రైతులు, రైతు కూలీలు క్రమేపీ మరుగున పడిపోతారు. డ్రైవర్ల అవసరం లేని ట్రాక్టర్లు, యంత్రీకరణకు అనువైన పొలాలతో బడా టెక్ కంపెనీలు బడా ఆర్థిక సంస్థల సాయంతో రైతులకు అవసరమే లేని కొత్త ప్రపంచాన్ని సృష్టించే ప్రయత్నం చేస్తున్నాయి. భవిష్యత్తులో ఆహార భద్రత అనేది రైతుల చేతుల్లోంచి ఆహార కంపెనీల బోర్డు రూముల్లో కూర్చునే కొందరి చేతుల్లోకి మారిపోతోంది. ప్రపంచవ్యాప్తంగా విత్తనాల విక్రయాల్లో 40 శాతాన్ని కేవలం రెండు కంపెనీలు నియంత్రి స్తున్నాయంటే పరిస్థితిని అర్థం చేసుకోవవచ్చు. ఈ కంపెనీలు పరోక్షంగా ఆహార సరఫరా వ్యవస్థ మొత్తాన్ని నియంత్రిస్తున్నట్లే లెక్క. ఏం పండించాలి, ఎప్పుడు పండించాలి వంటి అంశాలనూ బడా కంపెనీలే నిర్ణయించే పరిస్థితి వస్తుంది. అంతేకాదు... ఆహార కంపెనీల సహకారంతో చివరకు పంటల కోతలు ఎలా జరగాలి, మనం ఏం తినాలన్నది కూడా నిర్ణయిస్తాయి. ఈ విపరిణామాలన్నీ సంభవించకుండా ఉండాలంటే ప్రపంచ స్థాయిలో ఆహార వ్యవస్థ సమూలంగా మారాల్సి ఉంటుంది. సరికొత్త ఆహార వ్యవస్థకు మారడం కూడా వైవిధ్యత, ఆహార సార్వ భౌమత్వం అంశాల ఆధారంగా సాగాలి. అంతేకాదు... ఇది 360 కోట్ల రైతులు, రైతుకూలీలు, మత్స్యకారుల ఆధ్వర్యంలో జరగాల్సిన మార్పు. జీవ వైవిధ్య పరిరక్షణ, కనీస ఆదాయానికి భరోసా, వాతావ రణ పరంగా వీరికి న్యాయం జరగడం అప్పుడే సాధ్యమవుతుంది. దేవీందర్ శర్మ వ్యాసకర్త ఆహార, వ్యవసాయ రంగ నిపుణులు ఈ–మెయిల్: hunger55@gmail.com (‘ది ట్రిబ్యూన్’ సౌజన్యంతో) -
విదేశీ వాణిజ్య విధానం ఆరు నెలలు పొడిగింపు
న్యూఢిల్లీ: ప్రస్తుతమున్న విదేశీ వాణిజ్య విధానాన్ని (2015–20) మరో ఆరు నెలల పాటు, 2023 మార్చి వరకు పొడిగిస్తున్నట్టు కేంద్రం ప్రకటించింది. ఈ నెల 30తో వాస్తవానికి దీని గడువు ముగియాల్సి ఉంది. పరిశ్రమల సంఘాలు, ఎగుమతి ప్రోత్సాహకాల మండళ్ల నుంచి ప్రస్తుత విధానం కొనసాగింపుపై డిమాండ్లు వస్తున్నట్టు కేంద్ర వాణిజ్య శాఖ అదనపు సెక్రటరీ అమిత్ యాదవ్ తెలిపారు. ప్రస్తుత తరుణంలో కొత్త విధానాన్ని అమల్లోకి తీసుకురావద్దన్న డిమాండ్లు ఉన్నట్టు చెప్పారు. చదవండి: Ration Card New Rules: కేంద్రం కొత్త నిబంధనలు.. ఇకపై వాళ్ల రేషన్ కార్డు కట్! -
ఇదేం బాలేదు.. కొందరి కోసమే గూగుల్ పాలసీ: విన్జో
న్యూఢిల్లీ: ప్లేస్టోర్లో ఎంపిక చేసిన కొన్ని ఫ్యాంటసీ, రమ్మీ గేమింగ్ యాప్స్ను ప్రయోగాత్మకంగా అనుమతించాలన్న గూగుల్ నిర్ణయాన్ని దేశీ గేమింగ్ ప్లాట్ఫాం విన్జో తప్పు పట్టింది. ఇది పూర్తిగా పక్షపాతపూరితమైన, అనుచితమైన, ఆంక్షాపూర్వక విధానమని వ్యాఖ్యానించింది. ప్లాట్ఫాంను తటస్థంగా ఉంచుతూ ఒక మధ్యవర్తిగానే వ్యవహరిస్తామనే గూగుల్ ధోరణిపై అనుమానాలు రేకెత్తుతున్నాయని విన్జో పేర్కొంది. దశాబ్దకాలంపైగా గుత్తాధిపత్యం సాగిస్తున్న కొన్ని సంస్థలకే లబ్ధి చేకూర్చేలా గూగుల్ విధానం ఉందని తెలిపింది. ఇది పోటీని దెబ్బతీయడమే కాకుండా నవకల్పనలకు చావుదెబ్బలాంటిదని విన్జో వ్యాఖ్యానించింది. గతంలో ఫ్యాంటసీ గేమింగ్ యాప్లను ప్లే స్టోర్ నుంచి తొలగించినప్పటికీ సెప్టెంబర్ 28 నుంచి ఎంపిక చేసిన కొన్నింటిని పైలట్ ప్రాజెక్ట్ ప్రాతిపదికన ఏడాది పాటు తిరిగి ప్రవేశపెట్టనున్నట్లు గూగుల్ ప్రకటించింది. ఈ నేపథ్యంలోనే విన్జో అభ్యంతరాలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. చదవండి: అన్నింటికీ ఒక్కటే కేవైసీ -
సామాన్యులకు షాక్, రెపో రేట్లు పెంచనున్న ఆర్బీఐ?
Repo Rate Hike In September Policy: త్వరలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) తీసుకోనున్న నిర్ణయం సామాన్యులకు మరింత భారంగా మారనున్నట్లు తెలుస్తోంది. పెరిగిపోతున్న ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేసేందుకు రెపో రేట్లను పెంచనున్నట్లు సమాచారం. రిటైల్ కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ (సీపీఐ)ఆధారంగా ద్రవ్యోల్బణం ఈ ఏడాది జూలై లో 6.71 శాతం నుండి ఆగస్టు నాటికి 7.0 శాతం నమోదు చేసింది. పెరిగిన ద్రవ్యోల్భణానికి కారణం ఆహారం, ఇంధర పెరుగుదలే కారణమని మంత్రిత్వ శాఖ ట్వీట్ చేసింది. ఈ నేపథ్యంలో సెప్టెంబర్ 30న ఆర్బీఐ మానిటరీ పాలసీ కమిటీ (ఎంపీసీ) జరగనుంది. ఎంపీసీ సమావేశంలో ఐదు నెలల పాటు ద్రవ్యోల్బణాన్ని అదుపు చేసేందుకు ఆర్బీఐ రెపొ రేట్లు 35 - 50 బేసిస్ పాయింట్ల వరకు పెంచనున్నట్లు పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. రెపో రేటు అంటే ఏమిటి? ఆర్బీఐ..కమర్షియల్ బ్యాంకులకు వడ్డీకి రుణాలు ఇస్తుంది. ఆ రుణాల్ని రెపో రేటు అని పిలుస్తారు. ఆ రెపో రేట్లు పెరగడం వల్ల బ్యాంకులు కస్టమర్లకు ఇచ్చే పర్సనల్, హోం లోన్, వెహికల్ లోన్ల వడ్డీ రేట్లను పెంచుతుంది. దీంతో కస్టమర్లు బ్యాంకులకు చెల్లించే ఈఎంఐ భారం పెరగుతుంది. -
ఖనిజాల అన్వేషణ: ఏఐ, ఆటోమేషన్ను ప్రోత్సహించాలి
న్యూఢిల్లీ: దేశీయంగా వివిధ లోహాలు, ఖనిజాల అన్వేషణ, ఉత్పత్తికి సంబంధించిన విధానాలను సరళీకరించాల్సిన అవసరం ఉందని పారిశ్రామిక దిగ్గజం వేదాంత చైర్మన్ అనిల్ అగర్వాల్ అభిప్రాయపడ్డారు. మన దగ్గర లోహాలు, ఖనిజాల నిల్వలు పుష్కలంగా ఉన్నప్పటికీ ప్రస్తుతం వాటిని దిగుమతి చేసుకునేందుకు భారీగా వెచ్చించాల్సి వస్తోందని ఆయన పేర్కొన్నారు. స్థానికంగా ఉత్పత్తి పెరిగితే అంతర్జాతీయ సంక్షోభాల ప్రభావం మనపై అంతగా ఉండదని, దేశీయంగా ఔత్సాహిక వ్యాపారవేత్తలను ప్రోత్సహించేందుకు.. గణనీయంగా ఉద్యోగాలు కల్పించేందుకు ఇది తోడ్పడగలదని అగర్వాల్ చెప్పారు. దిగుమతి చేసుకునే ధరలో పావు వంతుకే భారత్లో ముడిచమురును ఉత్పత్తి చేయొచ్చని ఆయన పేర్కొన్నారు. అంతర్జాతీయంగా కమోడిటీల రేట్లు పెరగడం, రూపాయి మారకం విలువ పతనమవడం వంటి కారణాలతో క్రూడాయిల్ తదితర దిగుమతుల భారం పెరిగిన నేపథ్యంలో అగర్వాల్ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ఇంధనాలు, ఖనిజాల అన్వేషణలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఆటోమేషన్ వంటి కొత్త టెక్నాలజీల వినియోగాన్ని ప్రోత్సహించాలని ఆయన సూచించారు. -
విధాన నిర్ణయాల్లో డేటాదే కీలక పాత్ర
ముంబై: విధాన నిర్ణయాల పటిష్టతలో గణాంకాల (డేటా) పాత్ర చాలా కీలకమని రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ శక్తికాంతదాస్ స్పష్టం చేశారు. తగిన సమాచారంతో విధాన నిర్ణయాలు తీసుకోవడం వల్ల ఫలితాలు మెరుగ్గా ఉంటాయని సూచించారు. ఇందుకు స్పష్టమైన, పారదర్శకమైన డేటా అందుబాటులో ఉండడం అవసరమని అన్నారు. తద్వారా నిర్ణయాధికారుల నుండి తగిన నిర్ణయాలు వెలువడతాయని, మార్కెట్ భాగస్వాములు హేతుబద్ధమైన అంచనాలకు రాగలుగుతారని అన్నారు. సెంట్రల్ బ్యాంక్ వార్షిక ‘స్టాటిస్టిక్స్ డే’ సదస్సులో ఈ మేరకు గవర్నర్ చేసిన ప్రసంగంలో కొన్ని ముఖ్యాంశాలను పరిశీలిస్తే.. ► పబ్లిక్ పాలసీలో గణాంకాల ప్రాముఖ్యత ఎంతో ఉంది. కోవిడ్–19 మహమ్మారి కారణంగా ఏర్పడిన తీవ్ర అనిశ్చితి నేపథ్యంలో పారదర్శక, పటిష్ట గణాంకాల పాత్ర మరింత పెరిగింది. ► మునుపెన్నడూలేని విధంగా ఏర్పడిన ప్రస్తుత ప్రపంచ పరిస్థితులు మానవాళి లక్ష్యాలు, దృక్పధాన్ని పరిశోధిస్తోంది. భారత్సహా వివిధ దేశాలలో విధించిన లాక్డౌన్లు... మహమ్మారి వ్యాప్తి, ఆర్థిక వ్యవస్థలపై దాని ప్రభావాలకు సంబంధించిన డేటా లభ్యత విషయంలో క్లిష్టమైన స్థితిని సృష్టించింది. మునుపెన్నడూ చూడని ఈ సమస్యకు అత్యవసరంగా పరిష్కారాలు కనుగొనడం అవసరం. ► డేటా లభ్యత విషయంలో 2020లో మహమ్మారి మొదటి వేవ్ సమయంలో దేశంలో అనేక వస్తువుల ధరల సేకరణలో అపారమైన ఇబ్బందులు నెలకొన్నాయి. గణాంకాలు, కార్యక్రమాల అమలు మంత్రిత్వశాఖ క్లిష్టమైన పరిస్థితులను ఎదుర్కొంది. ► అయితే ఈ పరిస్థితి డేటా సేకరణలో నూతన సాంకేతిక విధానాలను అవలంభించే అవకాశాలనూ మహమ్మారి సృష్టించింది. ఈ నూతన విధానాలు దీర్ఘకాలిక ప్రయోజనాలను కలిగి ఉంటాయనడంలో సందేహం లేదు. అయితే కొత్త డేటా వనరులు అధికారిక గణాంకాల కోసం తాజా అవకాశాలను సృష్టిస్తుండగా, ఇది ఈ విషయంలో డేటా విశ్వసనీయత, క్రమశిక్షణకు సంబంధించిన సమస్యలను కూడా లేవనెత్తుతుండడం మరో ప్రతికూలాంశం. ఈ సవాళ్లను సమర్థవంతంగా పరిష్కరించాల్సి ఉంటుంది. ► సరైన డేటా నాణ్యతకు తగిన ఫ్రేమ్వర్క్ను అభివృద్ధి చేయడం, డేటా గోప్యత, భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరాన్ని 2022 ఏప్రిల్లో జరిగిన ‘ఇంటర్నేషనల్ అసోసియేషన్ ఫర్ అఫీషియల్ స్టాటిస్టిక్స్ కాన్ఫరెన్స్’ ఉద్ఘాటించింది. ► విధాన నిర్ణయాలు తీసుకోవడంలో, వాటి ఫలితాలను అంచనా, మదింపు వేయడంలో సెంట్రల్ బ్యాంకులకు గణాంకాలు ఎంతో కీలకం. ఇక్కడ గణాంకాలు సేకరించడం, వాటిని వినియోగించుకోవడం రెండు బాధ్యతలూ సెంట్రల్ బ్యాంకులకు సంబంధించినవే. మహమ్మారి వంటి కల్లోల సమయాల్లో సెంట్రల్ బ్యాంకులు తమ విధానాలు, చర్యల మదింపునకు సంబంధించిన డేటా సమీకరణలో పటిష్టమైన కమ్యూనికేషన్ వ్యవస్థలను ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఆయా అంశాలకు సంబంధించి ఎదురయిన సవాళ్లనూ సెంట్రల్ బ్యాంకులు మహమ్మారి సమయాల్లో పరిష్కరించుకోవాల్సి వచ్చింది. మహమ్మారి సమయంలో ప్రత్యామ్నాయ సూచీలు, డేటా సమీకరణ వనరులపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఏర్పడింది. భారత్లో అంతర్జాతీయ ప్రమాణాలు ఆర్బీఐ విషయానికి వస్తే, పటిష్ట గణాంకాల సేకరణ, వినియోగ వ్యవస్థలపై పూర్తి స్థాయిలో దృష్టి సారించింది. డేటా ప్రవాహాన్ని క్రమబద్ధీకరించడంలో ఆర్బీఐ ప్రయత్నాలు, సాంకేతికతపై పెట్టుబడులు, నియంత్రిత సంస్థలతో నిరంతర సంప్రతింపులు మంచి ఫలితాలను అందించాయి. డేటా సర్వే, సేకరణ రీతుల్లో కొంత మార్పుతో పాటు, ఆయా అంశాల్లో మరింత స్థిరత్వం నెలకొల్పడానికి చర్యలు తీసుకోవడం జరిగింది. డేటా నాణ్యతను నిర్ధారించడానికి పునఃపరిశీలన విధానాలను అవలంభించడం జరుగుతోంది. డేటా సేకరణ, ధ్రువీకరణ, నిర్ణయాల్లో వాటి అనుసంధానం వంటి అంశాల్లో వినూత్న విధానాలకు శ్రీకారం చుట్టాం. ఆయా అంశాల్లో అంతర్జాతీయ ప్రమాణాలను సెంట్రల్ బ్యాంక్ అనుసరిస్తోంది. అంతర్జాతీయంగా మరిన్ని సూచీలు, ఉప సూచీలు, ఇతర గణాంకాలు కూడా ప్రస్తుతం తెరపైకి వచ్చాయి. దేశాలు ఉన్నత జీవన ప్రమాణాలను సాధించడానికి ఆయా సూచీలో ప్రయత్నిస్తున్నాయి. బహుళ కోణాలలో దేశాల పురోగతిని పర్యవేక్షించడానికి ప్రయత్నిస్తున్నాయి. మానవాభివృద్ధి సూచికలు, హ్యాపీ ఇండెక్స్లు, అసమానత సూచికల వంటివి వాటిని ఈ సందర్భంలో ప్రస్తావించుకోవాల్సి ఉంటుంది. ఆయా సూచీలను ప్రస్తుతం వివిధ జాతీయ– అంతర్జాతీయ సంస్థలు నిర్వహిస్తున్నాయి. వైశాల్యం, భౌగోళిక వైవిధ్యం దృష్ట్యా భారతదేశానికి ప్రాంతీయ అంశాలను సూచించే జాతీయ సూచికల అవసరం ఉంది. రిజర్వ్ బ్యాంక్లో మేము సమాచారాన్ని ’ప్రజా ప్రయోజనకరమైన అంశం’గా పరిగణిస్తాము. వివిధ వాటాదారుల అవసరాలు, అంచనాలకు అనుగుణంగా మన సమాచార నిర్వహణ వ్యవస్థలను క్రమబద్ధం చేయాలని భావిస్తున్నాము. ఆర్బీఐ మరింతగా ప్రత్యామ్నాయ డేటా వనరులపై దృష్టి సారించాలి. ఇప్పటికే ఉన్న డేటా విశ్లేషణాత్మక ఫ్రేమ్వర్క్ విధానాలతో వాటిని అనుసంధించడానికి ప్రయత్నం జరగాలి. -
పీబీ ఫిన్టెక్ ఐపీవో నవంబర్ 1న ప్రారంభం
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఆన్లైన్ బీమా ప్లాట్ఫాం పాలసీబజార్, రుణాలకు సంబంధించిన పోర్టల్ పైసాబజార్ల మాతృ సంస్థ పీబీ ఫిన్టెక్ తాజాగా తమ పబ్లిక్ ఇష్యూ వివరాలను ప్రకటించింది. ప్రతిపాదిత ఐపీవో నవంబర్ 1న ప్రారంభమై 3న ముగుస్తుంది. షేరు ధర శ్రేణి రూ. 940–980గా ఉంటుందని కంపెనీ సహ వ్యవస్థాపకుడు, చైర్మన్ యశీష్ దహియా వర్చువల్ విలేకరుల సమావేశంలో వెల్లడించారు. ఈ ఇష్యూ ద్వారా సుమారు రూ. 5,710 కోట్లు సమీకరించనున్నట్లు తెలిపారు. ఇన్వెస్టర్లు కనీసం 15 షేర్ల కోసం బిడ్ చేయాల్సి ఉంటుంది. ఐపీవో ద్వారా సమీకరించిన నిధులను తమ బ్రాండ్లకు మరింత ప్రాచుర్యం కల్పించడానికి, వ్యాపార వృద్ధి అవకాశాలు మెరుగుపర్చుకోవడానికి, ఆఫ్లైన్లో కూడా విస్తరించడానికి వినియోగించుకోనున్నట్లు దహియా పేర్కొన్నారు. అలాగే వ్యూహాత్మక పెట్టుబడులు .. కొనుగోళ్లకు, విదేశాల్లోనూ విస్తరణ ప్రణాళికల కోసం కూడా కొంత మేర నిధులు ఉపయోగించుకోనున్నట్లు ఆయన వివరించారు. ఇష్యూలో భాగంగా కొత్తగా రూ. 3,750 కోట్ల విలువ చేసే షేర్లను జారీ చేయనుండగా, ప్రస్తుత షేర్హోల్డర్లు దాదాపు రూ. 1,960 కోట్ల షేర్లను ఆఫర్ ఫర్ సేల్ మార్గంలో విక్రయించనున్నారు. ఇష్యూలో భాగంగా 75 శాతం భాగాన్ని అర్హత గల సంస్థాగత ఇన్వెస్టర్లకు, 15 శాతాన్ని సంస్థాగతయేతర ఇన్వెస్టర్లకు, 10 శాతాన్ని రిటైల్ ఇన్వెస్టర్లకు కేటాయించనున్నారు. -
త్వరలో కొత్త సహకార విధానం
న్యూఢిల్లీ: దేశం 5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా ఎదగాలన్న లక్ష్య సాధనలో సహకార సంఘాలు కూడా కీలకపాత్ర పోషించనున్నాయని కేంద్ర హోం, సహకార శాఖల మంత్రి అమిత్ షా తెలిపారు. కేంద్రం త్వరలో కొత్త సహకార విధానాన్ని ప్రకటిస్తుందనీ, సహకార వ్యవస్థను బలోపేతం చేసేందుకు రాష్ట్రాలతో చర్చలు జరుపుతున్నామని వెల్లడించారు. వచ్చే అయిదేళ్లలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘా(పీఏసీ)ల సంఖ్య 65 వేల నుంచి 3 లక్షలకు పెరగనుందన్నారు. దేశంలో ప్రస్తుతం ప్రతి 10 గ్రామాలకు ఒక పీఏసీ ఉండగా రానున్న అయిదేళ్లలో ప్రతి రెండు గ్రామాలకు ఒకటి చొప్పున ఏర్పాటు చేస్తామన్నారు. జాతీయ సహకార యూనివర్సిటీ ఏర్పాటుతోపాటు ప్రభుత్వం సహకార ఉమ్మడి సేవా కేంద్రాల(కోఆపరేటివ్ కామన్ సర్వీస్ సెంటర్లు)ను, జాతీయ డేటాబేస్ను ఏర్పాటు చేసేందుకు ప్రయత్నాలు ప్రారంభించినట్లు చెప్పారు. సహకార వ్యవస్థలు రాష్ట్రాల పరిధిలోనే కొనసాగుతాయని, ఈ విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఎటువంటి ఘర్షణకు తావులేదని ఆయన స్పష్టం చేశారు. మల్టీ స్టేట్ కోఆపరేటివ్స్ చట్టాన్ని సవరించడంతోపాటు పీఏసీలను ఆధునీకరించి, డిజిటలైజ్ చేస్తామన్నారు. పీఏసీల అకౌంట్ల కంప్యూటరీకరణలో స్థానిక భాషలను వినియోగించుకోవడతోపాటు జిల్లా సహకార బ్యాంకులతో, నాబార్డుతో అనుసంధానం చేస్తామన్నారు. పీఏసీలు రైతు ఉత్పత్తి సంస్థ(ఎఫ్పీవో)లుగా, సభ్యుల నైపుణ్యాభివృద్ధిపై దృష్టి సారిస్తాయని తెలిపారు. జాతీయ సహకార సమ్మేళనం మొట్ట మొదటి సమావేశంలో అమిత్ షా శనివారం ప్రసంగించారు. ఈ కార్యక్రమానికి వివిధ సహకార సంఘాలకు చెందిన 2,100 మంది ప్రతినిధులు హాజరు కాగా, సుమారు మరో 6 కోట్ల మంది ఆన్లైన్ ద్వారా పాల్గొన్నారు. చదవండి: న్యాయమూర్తులకు నైతికతే కీలకం -
ఎలక్ట్రిక్ వెహికల్స్ కొనేవారికి తెలంగాణ ప్రభుత్వం బంపర్ ఆఫర్!
హైదరాబాద్: ఏటా లక్షల్లో పెరుగుతున్న వాహనాలు.. పరిమిత సంఖ్యలో పెట్రోల్, డీజిల్ వనరులు.. దీనికి తోడు విజృంభిస్తున్న వాహన కాలుష్యం.. వీటన్నింటికీ చెక్ పెట్టేందుకు కనిపిస్తున్న ప్రత్యామ్నాయం.. విద్యుత్ వాహనాలు. అందుకే ప్రపంచం మొత్తం ప్రస్తుతం విద్యుత్ వాహన(ఎలక్ట్రిక్ వెహికల్స్-ఈవీ) తయారీ రంగంపై దృష్టి సారిస్తోంది. (చదవండి: ఐటీ ‘రిటర్న్స్’ విషయంలో జర జాగ్రత్త..!) తెలంగాణ రాష్ట్రాన్ని విద్యుత్ వాహనాలు, ఎనర్జీ స్టోరేజీ వ్యవస్థకు కేంద్ర బిందువుగా మార్చేందుకు ప్రభుత్వం ‘తెలంగాణ ఎలక్ట్రిక్ వెహికల్, ఎనర్జీ స్టోరేజీ పాలసీ 2020–2030’ని రూపొందించింది. గత ఏడాది ఈ పాలసీని తెలంగాణ ప్రభుత్వం ఆమోదించింది. ఈవీ రంగంలో పెట్టుబడుల ఆకర్షణ, పరిశోధన, అభివృద్ధి, తయారీకి ప్రోత్సాహం, వ్యక్తిగత, వాణిజ్య రంగాల్లో రవాణా ఖర్చు తగ్గింపు, ప్రపంచ స్థాయి మౌలిక వసతుల కల్పనే లక్ష్యంగా పదేళ్ల పాటు కొత్త పాలసీ పనిచేస్తుంది. అయితే, ఎలక్ట్రిక్ వాహనాలను కొన్న వారికి ప్రత్యేక ప్రయోజనాలను అందిస్తుంది. పర్యావరణ పరిరక్షణే లక్ష్యంగా ఎలక్ట్రిక్ అండ్ ఎనర్జీ స్టోరేజీ పాలసీ 2020-2030 కింద రాష్ట్రంలో ఎలక్ట్రిక్, బ్యాటరీ (ఈవీ) వాహనాలను ప్రోత్సహించడానికి రిజిస్ట్రేషన్ ఫీజు, రోడ్ ట్యాక్స్ పూర్తిగా మాఫీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం. రాష్ట్రంలో జోరందుకున్న ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోళ్లు. pic.twitter.com/StgeBHEUd6 — TRS Party (@trspartyonline) September 3, 2021 నూతన విధానంలోని ముఖ్యాంశాల్లో కొన్ని.. తొలి విడతలో తయారయ్యే రెండు లక్షల ద్విచక్ర వాహనాలు, 30 వేల ఆటో రిక్షాలు, 5వేల కార్లు (టాక్సీలు, క్యాబ్లు తదితరాలు), 500 ఎలక్ట్రిక్ బస్సులకు రోడ్డు పన్ను, రిజిస్ట్రేషన్ చార్జీ వంద శాతం ఉచితం. వాణిజ్య అవసరాల కోసం ఉపయోగించే విద్యుత్ వాహనాల కొనుగోలుకు స్వయం ఉపాధి పథకాల కింద ఆర్థిక సాయం. విద్యుత్ ట్రాక్టర్లకు రవాణా శాఖ నిబంధనలకు లోబడి వంద శాతం రోడ్ టాక్స్, రిజిస్ట్రేషన్ ఫీజు నుంచి మినహాయింపు. నగరం నలుమూలల నుంచి హైదరాబాద్ మెట్రో స్టేషన్లకు బ్యాటరీ ఆధారిత వాహనాలు నడపడం. ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల భాగస్వామ్యంతో హైదరాబాద్తో పాటు ఇతర నగరాల్లో దశల వారీ చార్జింగ్ స్టేషన్ల ఏర్పాటు. వీటికి విద్యుత్ నియంత్రణ కమిషన్ ప్రత్యేక టారిఫ్ వసూలు చేస్తుంది. చార్జింగ్ స్టేషన్లు ఎక్కడ ఏర్పాటు చేయాలనే విషయాన్ని టీఎస్ రెడ్కో మదింపు చేస్తుంది. అవసరమైన విద్యుత్ సరఫరాపై డిస్కమ్లతో సమన్వయం చేస్తుంది. వేయికి పైగా కుటుంబాలు కలిగిన టౌన్షిప్లు చార్జింగ్ స్టేషన్ లాట్లు ఏర్పాటుకు ప్రోత్సాహం. ప్రతీ 50 కిలోమీటర్లకు ఒక చార్జింగ్ స్టేషన్, పార్కింగ్ జోన్ ఏర్పాటు. ప్రజా రవాణా రంగంలో ఎలక్ట్రిక్ వాహన వినియోగానికి ప్రోత్సహించడం. విద్యుత్ వాహనాలు, సంబంధిత పరికరాలు తయారు చేసే కంపెనీలకు ప్రోత్సాహకాలు. రూ.200 కోట్ల పెట్టుబడి, వేయి మందికి ఉపాధి కల్పించే మెగా కంపెనీలకు 20శాతం పెట్టుబడి రాయితీ. ఏడేళ్ల పాటు ఏడాదికి రూ.5 కోట్ల చొప్పున ఎస్జీఎస్టీ రీయింబర్స్మెంట్, ఐదేళ్ల పాటు గరిష్ఠ పరిమితి రూ.5 కోట్లు మించకుండా 25శాతం విద్యుత్ రాయితీ, ఐదేళ్ల పాటు విద్యుత్ సుంకం, స్టాంప్ డ్యూటీపై వంద శాతం రాయితీ. ప్రత్యేక మాన్యుఫాక్చరింగ్ క్లస్టర్లు, ఈవీ తయారీ పారిశ్రామికవాడల్లో మౌలిక వసతులు కల్పిస్తారు. ప్రభుత్వ శాఖల ద్వారా ఈవీల కొనుగోలు, పరిశోధన, అభివృద్ధి కేంద్రాలు, టీ వర్క్స్లో ప్రత్యేక ప్రోటోటైపింగ్ విభాగం ఏర్పాటు వంటివి నూతన పాలసీలో ఉన్నాయి. -
ముగ్గురు బిడ్డల విధానానికి చైనా ఆమోదం
బీజింగ్: చైనాలో ముగ్గురు బిడ్డల విధానానికి చైనా జాతీయ అసెంబ్లీ సూత్రప్రాయ ఆమోదం తెలిపింది. దేశ జనాభాలో వస్తున్న మార్పులను గుర్తించిన చైనా కమ్యూనిస్టు పార్టీ ఈ ముగ్గురు బిడ్డల విధానానికి పచ్చజండా ఊపింది. దేశంలో జనన రేటు విపరీతంగా క్షీణిస్తూ వస్తోన్న తరుణంలో రివైజ్డ్ పాపులేషన్ అండ్ ఫామిలీ ప్లానింగ్ లాకు ఎన్పీసీ(నేషనల్ పీపుల్స్ కాంగ్రెస్)కు చెందిన స్టాండింగ్ కమిటీ ఆమోద ముద్ర వేసింది. త్వరలో దీన్ని ఎన్పీసీలో చర్చకు పెట్టి అధికారికంగా అమలు చేస్తారు. ఈ చట్టం ప్రకారం చైనా దంపతులు ఎక్కువ మంది పిల్లలను కంటే వారికి ప్రభుత్వం ఆర్థిక, సామాజిక సాయం అందింస్తుంది. పెరిగిపోతున్న ఖర్చులను దృష్టిలో ఉంచుకొని చైనా యువత పిల్లలపై ఆసక్తి చూపడం లేదు. దీంతో జననాల రేటు బాగా తగ్గింది. ఈ పరిస్థితి చక్కదిద్దేందుకే కొత్త చట్టం తెచ్చారు. పిల్లల పెంపకం వల్ల అయ్యే అదనపు ఖర్చును భరించడంలో, వారి విద్యాభ్యాస వ్యయంలో ప్రభుత్వం తల్లిదండ్రులకు మద్దతునిస్తుంది. అలాగే వారి పన్నులు, బీమా పథకాలు, ఇల్లు, ఉపాధి అంశాల్లో కూడా అండగా నిలుస్తుంది. మేలో పాలక కమ్యూనిస్టు పార్టీ రెండు బిడ్డల విధానం నుంచి మూడు బిడ్డల విధానానికి ఆమోదం పలికింది. అనంతరం ఈ నిర్ణయంపై స్టాండింగ్ కమిటీ చర్చించింది. వికటించిన వన్ ఛైల్డ్ విధానం గతంలో చైనాలో విపరీతంగా జనాభా పెరగడంతో కచ్ఛితమైన జనాభా నియంత్రణను అవలంబించారు. వన్ ఛైల్డ్ విధానంతో క్రమంగా చైనా జనన రేటు తగ్గుతూ వచ్చింది. ఈ తరుగుదల ప్రమాదకర స్థాయికి చేరడంతో 2016లో ఇద్దరు పిల్లల విధానం తీసుకువచ్చారు. అయినా జనన రేటు తరుగుదల ఆశించినంతగా మెరుగుపడకపోవడం, మరోవైపు 60ఏళ్ల పైబడిన జనాభాలో వృద్ధి వేగమవడంతో తాజాగా ముగ్గురు పిల్లల విధానం తెచ్చారు. చైనాలో పిల్లల పెంపకం చాలా ఖర్చుతో కూడిన వ్యవహారం. అందువల్ల ఎక్కువమంది ఒకరికి మించి పిల్లల కోసం యత్నించడం లేదు. దీన్ని చక్కదిద్దాలంటే దంపతులకు పుట్టే ప్రతి కొత్త బిడ్డకు ఏడాదికి దాదాపు పది లక్షల యువాన్లు ఇవ్వాలని ఆర్థికవేత్తలు ప్రభుత్వానికి సూచించారు. కొత్తగా తెచ్చిన ముగ్గురు పిల్లల విధానంతో కొంత మెరుగుదల ఉండొచ్చని, కానీ ప్రత్యక్ష నగదు సాయం లేకుండా ఆశించిన ఫలితాలు ఉండకపోవచ్చని భావిస్తున్నారు. చైనాలో జనాభా తరుగుదల కారణంగా 2027 నాటికి జనాభా పరంగా చైనాను భారత్ దాటేస్తుందని ఐరాస అంచనా వేసింది. చైనా నిపుణులు సైతం 2027నుంచి చైనా జనాభాలో తరుగుదల ఉంటుందని అంచనా వేస్తున్నారు. చైనా మహిళా జనాభాలో ఫెర్టిలిటీ రేటు సైతం వరుసగా పడిపోతూ వస్తోంది. 2025కు చైనా జనాభా వృద్ధిలో నెగిటివ్ గ్రోత్ ఉంటుందని చైనా పీపుల్స్ బ్యాంక్ సైతం అభిప్రాయపడింది. దీనివల్ల వినియోగ డిమాండ్ తగ్గిపోతుందని, ఇందుకునుణంగా విధాన నిర్ణయాలుండాలని సూచించింది. ప్రభుత్వం తన విధానాలు సమీక్షించుకోకపోతే 2050 నాటికి దేశంలో వృద్ధుల పరిరక్షణకు అమెరికా కన్నా ఎక్కువ వ్యయం చేయాల్సివస్తుందని హెచ్చరించింది. ప్రభుత్వ జోక్యం లేకపోతే జనాభా తరుగుదల తాలుకు ఆర్థిక విపరిణామాలను వెనక్కు తిప్పలేమని ఆందోళన వ్యక్తం చేసింది. ఈ హెచ్చరికల ఫలితంగా ప్రభుత్వం క్రమంగా జనాభా విధానాలను సడలిస్తూ వస్తోంది. -
అవి చట్టాలు కాదు.. ఉరుములు లేని పిడుగులు
సాక్షి,సూర్యాపేట(నల్లగొండ): కేంద్రం తీసుకొచ్చిన రైతు చట్టాలు ఉరుములు లేని పిడుగుల లాంటివని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు. రైతాంగాన్ని కూలీలుగా మార్చేందుకు కేంద్రం కుట్ర చేస్తోందని ఆరోపించారు. రైతన్న సినిమాకు దర్శకత్వం వహించడంతో పాటు నిర్మించి నటించిన ఆర్.నారాయణమూర్తి గురువారం సూర్యాపేట జిల్లా కేంద్రంలో మంత్రి జగదీష్రెడ్డితో భేటీ అయ్యారు. రైతన్న సినిమాను థియేటర్కు వెళ్లి చూడడంపై మంత్రికి ఆయన ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి జగదీశ్రెడ్డి మాట్లాడుతూ.. రైతు చట్టాలతో పాటు విద్యుత్ చట్టంలో సవరణలను ఉటంకిస్తూ కళ్లకు కట్టినట్లుగా రైతన్న సినిమా ఉందని అన్నారు. అనంతరం ఆర్.నారాయణమూర్తి మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వ చట్టాలు రైతుల పాలిట శాపాలుగా మారబోతున్నాయన్నారు. విద్యుత్ సవరణ చట్టం కూడా కార్పొరేట్ వ్యవస్థకు లబ్ధి్ద చేకూర్చేందుకేనన్నారు. సవరణ అంటూ జరిగితే ఉచిత విద్యుత్కు మంగళం పాడినట్లేనని ఆయన చెప్పారు.
Pagination
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
తప్పక చదవండి
- తెలంగాణ లోక్సభ ఎన్నికల ఫైనల్ పోలింగ్ 65.67 శాతం
- మోదీకి సొంత ఇళ్లు, కారు కూడా లేదట!.. ప్రధాని ఆస్తులివే..
- మాజీ భర్త గే అన్న సుచిత్ర.. స్పందించిన నటుడు
- Royal Challengers Bengaluru: తిరుమల శ్రీవారి సేవలో ఆర్సీబీ క్రికెటర్లు (ఫొటోలు)
- MS Dhoni: అందుకే వాళ్లంటే నాకు, జడ్డూకు చిరాకు!
- ప్రోటీన్ సప్లిమెంట్లను వాడుతున్నారా? హెచ్చరిస్తున్న మెడికల్ రీసెర్చ్
- స్వాతిమలివాల్పై దాడి.. ఆందోళనకు దిగిన బీజేపీ కార్పొరేటర్లు
- ఢిల్లి లిక్కర్ కేసులో కవిత జ్యుడీషియల్ రిమాండ్ పొడిగింపు
- Tandur: పసికందు ప్రాణం తీసిన పెంపుడు కుక్క
- టీడీపీ కార్యకర్తల్లా పోలీసులు: అనిల్కుమార్ ఆగ్రహం
Advertisement