-
చార్జింగ్ టెన్షన్ లేదిక.. ఎలక్ట్రిక్ స్కూటర్ల కంపెనీ ఒప్పందం
హైదరాబాద్: ఎలక్ట్రిక్ టూవీలర్ల కంపెనీ క్వాంటమ్ ఎనర్జీ తాజాగా బ్యాటరీ స్మార్ట్తో వ్యూహాత్మక భాగస్వామ్య ఒప్పందం కుదుర్చుకుంది. దీనితో తమ ఎలక్ట్రిక్ స్కూటర్ల బ్యాటరీల మార్పిడి (స్వాపింగ్) కోసం 25 పైచిలుకు నగరాల్లో 900 పైగా ఉన్న బ్యాటరీ స్మార్ట్ స్వాప్ స్టేషన్లు అందుబాటులోకి వస్తాయని క్వాంటమ్ ఈ–స్కూటర్స్ డైరెక్టర్ సి. చేతన తెలిపారు. చార్జింగ్ కోసం ఆందోళన చెందాల్సిన అవసరం లేకుండా యూజర్లు రెండు నిమిషాల వ్యవధిలోనే పూర్తి స్థాయిలో చార్జ్ అయిన బ్యాటరీలను పొందవచ్చని వివరించారు. ఈ తరహా బ్యాటరీ–యాజ్–ఎ–సర్వీస్ విధానం వల్ల జీవితకాలం పూర్తయిన బ్యాటరీలను రీప్లేస్ చేసుకునే వ్యయాలు తగ్గుతాయని తెలిపారు. బ్యాటరీ స్మార్ట్ స్వాపింగ్ స్టేషన్లు వ్యూహాత్మకంగా అధిక జన సాంద్రత, ట్రాఫిక్ ప్రాంతాలకు సమీపంలో ఉంటాయి. దీంతో క్వాంటం ఎనర్జీ స్కూటర్లకు అందుబాటులో ఉంటాయని, తద్వారా వాహనదారులకు నిర్వహణ ఖర్చులు కూడా తగ్గుతాయని కంపెనీ చెబుతోంది. -
లక్ష కంటే ఖరీదైన స్కూటర్.. చిల్లరతో కొనేసాడు - ఎక్కడో తెలుసా?
టెక్నాలజీ పెరుగుతున్న తరుణంలో జేబులో డబ్బు పెట్టుకునే వారే కరువయ్యారు. ఏ చిన్న వస్తువు కొనాలన్నా అంతా ఆన్లైన్ పేమెంట్ చెల్లిస్తున్నారు. అయితే ఓ వ్యక్తి మాత్రమే తనకు ఇష్టమైన స్కూటర్ కొనటానికి మొత్తం చిల్లర ఇచ్చి షోరూమ్ వారికే షాక్ ఇచ్చాడు. రాజస్థాన్లోని జైపూర్కు చెందిన వ్యక్తి ఏథర్ ఎలక్ట్రిక్ స్కూటర్ను కొనడానికి మొత్తం చిల్లర అందించాడు. దీనికి సంబంధించిన ఫోటో ప్రస్తుతం నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది. సుమారు లక్ష కంటే ఖరీదైన స్కూటర్ను చిల్లరతో కొనేసి అందరిని ఆశ్చర్యానికి గురిచేశాడు. ఏథర్ ఎనర్జీ సీఈఓ 'తరుణ్ మెహతా' స్కూటర్ డెలివరీ చేసి, స్వయంగా తన ఎక్స్ (ట్విటర్) ఖాతలో ఫోటో షేర్ చేస్తూ.. జైపూర్ వ్యక్తి 10 రూపాయల నాణేలతో స్కూటర్ కొన్నాడని ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతోంది. జైపూర్ వ్యక్తి కొనుగోలు చేసిన ఏథర్ 450 సిరీస్ ఖచ్చితమైన మోడల్ను మెహతా పేర్కొనలేదు. కాబట్టి దీని ధర ఎంత అనేది స్పష్టంగా తెలియదు. ఏథర్ 450ఎక్స్, 450ఎస్, 450అపెక్స్ అనే మూడు వేరియంట్లలో లభిస్తుందో. వీటి ధరలు రూ. 1.10 లక్షల నుంచి రూ. 1.75 లక్షల మధ్య ఉన్నాయి. ఇదీ చదవండి: 2000 ఉద్యోగాలు రెడీ..! ఎక్కడో తెలుసా? A new Ather owner just bought himself a 450 in Jaipur ... all with 10Re coins! pic.twitter.com/VWoOJiQey2 — Tarun Mehta (@tarunsmehta) February 17, 2024 -
OLA ఎలక్ట్రిక్ స్కూటర్లపై భారీ డిస్కౌంట్..
-
సబ్సిడీ ఎత్తేస్తే అంతే.. సీఈవో ఆందోళన!
ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల అమ్మకాలపై ప్రభుత్వం ఇస్తున్న సబ్సిడీని ఉపసంహరించుకోవడంపై ఎలక్ట్రిక్ టూవీలర్ తయారీ సంస్థ ఏథర్ ఎనర్జీ సీఈఓ, సహ వ్యవస్థాపకుడు తరుణ్ మెహతా ఆందోళన వ్యక్తం చేశారు. ఈ చర్య ఎలక్ట్రిక్ టూవీలర్ పరిశ్రమలో ఒకటీ రెండు సంవత్సరాల వృద్ధి స్తబ్దతకు దారితీయవచ్చని ఆయన అంటున్నారు. పరిశ్రమ మనుగడ కోసం రాయితీలపైనే పూర్తిగా ఆధారపడనప్పటికీ వచ్చే ఏప్రిల్లోనే సబ్సిడీని నిలిపివేస్తే కంపెనీలు మరింత కష్టపడి పని చేయాల్సి ఉంటుంది. ఈ దృష్టాంతం పరిశ్రమ వృద్ధి లక్ష్యాలను చేరుకోవడంలో జాప్యానికి దారి తీస్తుంది. ఈ ఏడాది మార్చిలో ముగియనున్న ఫేమ్2(FAME-II) పథకం కింద ఎలక్ట్రిక్ వాహనాల విక్రయానికి కేంద్ర ప్రభుత్వం ప్రోత్సాహకాలను అందిస్తోంది. ప్రభుత్వం ఇప్పటికే గత ఏడాది జూన్లో ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలకు సబ్సిడీ మొత్తాన్ని తగ్గించింది. ఉన్నట్టుండి సబ్సిడీని తగ్గించడం వల్ల కలిగిన ప్రతికూల ప్రభావాన్ని తరుణ్ మెహతా ఎత్తిచూపారు. దీనివల్ల ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన పరిశ్రమ 2023లో వృద్ధిని కోల్పోయిందని పేర్కొన్నారు. ఎలక్ట్రిక్ వాహనాలను స్వీకరించడంలో పేరుగాంచిన చండీగఢ్ ఫేమ్ స్కీమ్ లేకపోతే ప్రభావితం కావచ్చన్నారు. దేశం అంతటా ఎలక్ట్రిక్, హైబ్రిడ్ వాహనాల స్వీకరణను ప్రోత్సహించడంలో ఫేమ్ పథకం కీలక పాత్ర పోషిస్తోంది. ఇది కాలుష నియంత్రణ, శిలాజ ఇంధనాలపై ఆధారపడటాన్ని తగ్గించడానికి దోహదం చేస్తోంది. అయితే బ్యాటరీ ఖర్చులు అధికంగా ఉండటం, విడి భాగాలపై సరఫరా పరిమితులు ఎలక్ట్రిక్ వాహనాలను మరింత ఖరీదైనవిగా మార్చాయి. -
చైనా కంపెనీ ముక్కు పిండి వసూలు చేశాడు
గత ఏడాది ఎలక్ట్రిక్ వాహనాల బ్యాటరీ పేలిన సంఘటనలు కోకొల్లలుగా వెలుగులోకి వచ్చాయి. ఇందులో కొన్ని కంపెనీలు కస్టమర్లకు జరిగిన నష్టాన్ని రీప్లేస్ చేయగా.. మరో కొన్ని కంపెనీలు ఊరుకున్నాయి. తన ఎలక్ట్రిక్ స్కూటర్ కాలిపోవడం వల్ల నష్టపోయిన ఒక వ్యక్తి కోర్టుకెళ్లి నష్ట పరిహారంగా రూ.10 లక్షలు సొంతం చేసుకున్నాడు. తెలంగాణకు చెందిన వ్యక్తి బెన్లింగ్ అనే చైనా కంపెనీకి చెందిన ఎలక్ట్రిక్ స్కూటర్ను 2021 ఏప్రిల్ 7న సంస్థకు చెందిన డీలర్ నుంచి కొనుగోలు చేసి వినియోగిస్తుండేవాడు. అతడు రోజూ మాదిరిగానే 2023 ఫిబ్రవరి 26న కూడా ఛార్జ్ చేయడానికి ప్లగ్ చేసాడు. ఆ మరుసటి రోజు ఉదయం ఆ స్కూటర్ పేలిపోయి మొత్తం కాలిపోయింది. మంటల వల్ల పొగలు ఎక్కువగా వ్యాపించడంతో ఇంట్లోని వారు కూడా శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఎదుర్కొన్నట్లు సమాచారం. తన ఎలక్ట్రిక్ స్కూటర్ కాలిపోవడంతో వినియోగదారుడు మాత్రమే కాకుండా.. అతని కుటుంబం మొత్తం మానసిక క్షోభకు గురైందని తెలిపాడు. జరిగిన నష్టం గురించి సంబంధిత డీలర్కు వెల్లడించారు. దీంతో కంపెనీ ప్రతినిధి కస్టమర్ను సంప్రదించి, కాలిన స్కూటర్ ఫోటోలను సేకరించుకున్నారు. ఇదీ చదవండి: ఐదు బ్యాంకులకు జరిమానా విధించిన ఆర్బీఐ - ఎందుకంటే? ఎన్ని రోజులకూ కంపెనీ అధికారులు స్పందించకపోవడంతో విసుగు చెందిన కస్టమర్ తమ లాయర్ ద్వారా తయారీదారు, డీలర్తో సహా ఇరువర్గాలకు నోటీసులు అందజేసింది. అయితే వీరిద్దరూ కమిషన్ ముందు హాజరుకాలేదు. దీంతో కోర్టు డీలర్ నిర్లక్ష్యానికి, వెహికల్ తయారీలో నాసిరకమైన పరికరాలను ఉపయోగించిన కారణంగా కంపెనీకి.. రూ.10 లక్షల జరిమానా, ఖర్చుల కింద రూ.10,000 చెల్లించాలని ఆదేశించింది. అంతే కాకుండా స్కూటర్ ధరను కస్టమర్కు చెల్లించాలని లేదా స్కూటర్ను భర్తీ చేయాలని కూడా ఆదేశించింది. -
రూ.20000 తగ్గింపుతో బెస్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్ - వివరాలు
భారతీయ మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందిన బెంగళూరు బేస్డ్ ఎలక్ట్రిక్ స్కూటర్ తయారీ సంస్థ 'ఏథర్ ఎనర్జీ' 2024 ప్రారంభంలోనే తమ అమ్మకాలను పెంచుకోవడానికి, కొత్త కస్టమర్లను ఆకర్శించడానికి '450ఎస్' ఎలక్ట్రిక్ స్కూటర్ కొనుగోలు మీద అద్భుతమైన ఆఫర్స్ అందించడం ప్రారంభించింది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. ఏథర్ 450ఎస్ ఎలక్ట్రిక్ స్కూటర్ కొనుగోలు మీద కంపెనీ ఇప్పుడు రూ. 20000 తగ్గింపును ప్రకటించింది. దీంతో ప్రస్తుతం ఈ స్కూటర్ బెంగళూరులో రూ.1.09 (ఎక్స్-షోరూమ్) లక్షలకు, ఢిల్లీలో రూ.97,500 (ఎక్స్-షోరూమ్) ప్రారంభ ధరలు లభిస్తోంది. మంచి డిజైన్, లేటెస్ట్ ఫీచర్స్ కలిగిన ఈ ఏథర్ 450 ఎస్ ఎలక్ట్రిక్ స్కూటర్ 2.9 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్ కలిగి ఒక సింగిల్ చార్జితో 115 కిమీ రేంజ్ అందిస్తుంది. ఇది కేవలం 3.9 సెకన్లలో గంటకు 0 నుంచి 40 కిమీ వరకు వేగవంతం అవుతుంది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ టాప్ స్పీడ్ గంటకు 90 కిమీ వరకు ఉంటుంది. ఇదీ చదవండి: అబ్బురపరుస్తున్న గ్యాడ్జెట్స్.. ఎప్పుడైనా చూసారా! ఏథర్ 450ఎస్ ఎలక్ట్రిక్ స్కూటర్ హోమ్ ఛార్జర్ ద్వారా 0 నుంచి 80 శాతం ఛార్జ్ చేసుకోవడానికి సుమారు 6 గంటల 36 నిమిషాల సమయం పడుతుంది. సంక్రాంతి పండుగలో ఏథర్ ఎలక్ట్రిక్ స్కూటర్ కొనాలనుకునే వారు రూ. 20000 తగ్గింపుతో కొనుగోలు చేసుకోవచ్చు. ఈ ఆఫర్ కేవలం ఈ నెలలో మాత్రమే లభించే అవకాశం ఉందని తెలుస్తోంది. -
విద్యుత్ వాహనాలు.. 2023లో ఎక్కువగా అమ్మిన సంస్థలు ఇవే..
దేశవ్యాప్తంగా కర్బన ఉద్గారాలపై ఆందోళన ఎక్కువవుతోన్న నేపథ్యంలో విద్యుత్ వాహనాలు (ఈవీ)లకు ఆదరణ పెరుగుతోంది. ఏటా 10 లక్షలకు పైగా ఈవీలను వాహనదారులు కొనుగోలు చేస్తున్నారు. 2022లో 10.4 లక్షల వాహన విక్రయాలు జరగ్గా.. 2023లో అది 13.8 లక్షలకు, 2030 నాటికి 30 మిలియన్లకు(3 కోట్లు) చేరుకుంటుందని అంచనా. 2023లో అమ్ముడైన మొత్తం ద్విచక్ర వాహనాల్లో 4.5% ఎలక్ట్రిక్ వాహనాలే ఉండటం విశేషం. అందులో ఓలా కంపెనీ వాహనాలను అధికంగా కొనుగోలు చేస్తున్నట్లు సర్వేలు చెబుతున్నాయి. 2022లో 1.1 లక్షల మేరకు అమ్ముడైన ఓలా వాహనాలు 2023లో మాత్రం 140శాతం పెరిగి ఏకంగా 2.62 లక్షల యూనిట్లు అమ్ముడైనట్లు సర్వేల ద్వారా తెలుస్తోంది. తర్వాతి స్థానంలో టీవీఎస్, ఏథర్, బజాజ్ కంపెనీలకు చెందిన వాహనాలు ఉన్నాయి. రానున్న రోజుల్లో మరిన్ని ఎలక్ట్రిక్ వాహనాలకు గిరాకీ పెరుగనున్న నేపథ్యంలో ఈ సంస్థలకు భారీగా లాభాలు రాబోతున్నాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. కంపెనీలో వారీగా 2023లో రిజిస్టర్ అయిన విద్యుత్ వాహనాల వివరాలు ఈ కింది విధంగా ఉన్నాయి. ఇదీ చదవండి: రెనో కార్లలో కొత్త వేరియంట్లు వచ్చాయి.. చూశారా? ఓలా ఎలక్ట్రిక్: 2,62,020 టీవీఎస్: 1,65,190 ఏథర్: 1,03,804 బజాజ్: 70,274 యాంపెర్: 42,909 ఒవినావా: 31,519 హిరో ఎలక్ట్రిక్: 29,925 హిరో: 10,967 ప్యూర్: 7,141 రెవోల్ట్: 6,922 లెక్ట్రిక్స్: 6,185 జితేంద్ర ఎలక్ట్రిక్: 2,597 -
ఓలా ఎలక్ట్రిక్ నష్టాలు ఇన్ని కోట్లా.. కారణం ఏంటంటే?
దేశీయ మార్కెట్లో అడుగుపెట్టినప్పటి నుంచి ఎన్నో సమస్యలను ఎదుర్కొంటూ ఉత్తమ అమ్మకాలు పొందుతున్న 'ఓలా ఎలక్ట్రిక్' (Ola Electric), ఈ ఏడాది ఏకంగా రూ. 1472.08 కోట్ల నష్టాన్ని పొందినట్లు సమాచారం. ఈ ఏడాది ఎక్కువ ఎలక్ట్రిక్ స్కూటర్లను విక్రయించిన కంపెనీల జాబితాలో ఒకటిగా ఉన్నప్పటికీ.. నష్టాలను ఎందుకో పొందాల్సి వచ్చింది, అసలైన కారణాలు ఏంటనేది ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం. ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ ఉత్పత్తి, విక్రయాల విస్తరణ కారణంగా.. నిర్వహణ ఖర్చులు పెరగడం వల్ల నష్టాలు వచ్చినట్లు తెలుస్తోంది. గత ఆర్థిక సంవత్సరంలో రూ. 784.15 కోట్ల నష్టాన్ని చవి చూసిన కంపెనీ, ఈ ఆర్థిక సంవత్సరంలో సుమారు రూ. 1472.08 కోట్లు నష్టపోయినట్లు సమాచారం. ఓలా ఎలక్ట్రిక్ గత ఆర్ధిక సంవత్సరం కంటే, ఈ ఆర్ధిక సంవత్సరంలో రెట్టింపు నష్టాన్ని చవి చూసినప్పటికీ.. అమ్మకాల పరంగా ఈ ఏడాది 2.5 లక్షల యూనిట్లను విక్రయించినట్లు ఇటీవలే వెల్లడించింది. ఈ అమ్మకాలు 2023 జనవరి 1 నుంచి 2023 డిసెంబర్ మధ్య జరిగినట్లు సమాచారం. ఇదీ చదవండి: ఒకప్పుడు పాములు, తేళ్లు తిరిగే కంపెనీ.. టాటా చేతిలో పడ్డాక.. అమ్మకాల పరంగా కొత్త రికార్డ్ క్రియేట్ చేసిన ఓలా ఎలక్ట్రిక్.. ఇప్పటి వరకు ఎలక్ట్రిక్ స్కూటర్ లైనప్లో ఎస్1, ఎస్1 ప్రో, ఎస్1 ఎక్స్ వంటి మోడళ్లను విక్రయిస్తోంది. వచ్చే ఏడాది చివరి నాటికి కంపెనీ ఎలక్ట్రిక్ కారుని లాంచ్ చేయనున్నట్లు వెల్లడించింది. అంతే కాకుండా.. ఓలా ఎలక్ట్రిక్ దాని అనుబంధ సంస్థ ఓలా సెల్ టెక్నాలజీస్ ద్వారా తమిళనాడులో గిగాఫ్యాక్టరీని ఏర్పాటు చేస్తోంది. ఫ్యాక్టరీ మార్చి 2024 నాటికి 1.4 GWh సామర్థ్యంతో సెల్ ఉత్పత్తిని ప్రారంభించాలని భావిస్తున్నారు. -
భారత్లో లాంచ్ అయిన బెస్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్లు - వివరాలు
భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాలకు డిమాండ్ 2022 కంటే 2023లో విపరీతంగా పెరిగింది. దీంతో ఈ ఏడాది దేశీయ విఫణిలో లాంచ్ అయిన వాహనాల సంఖ్య కూడా ఎక్కువైంది. ఈ కథనంలో ఈ సంవత్సరం మార్కెట్లో విడుదలైన టాప్ 5 ఎలక్ట్రిక్ స్కూటర్లను గురించి వివరంగా తెలుసుకుందాం. ఓలా ఎస్1 ఎక్స్ ఈ ఏడాది దేశీయ మార్కెట్లో విడుదలై ఉత్తమ అమ్మకాలు పొందిన ఎలక్ట్రిక్ స్కూటర్లలో ఒకటి 'ఓలా ఎస్1 ఎక్స్'. రూ.89999 ప్రారంభ ధర వద్ద విడుదలైన ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ మూడు వేరియంట్లలో లభిస్తుంది. ఇవి డ్యూయెల్ టోన్ డిజైన్, సింగిల్ పీస్ సీటుతో, ట్యూబ్యులర్ గ్రాబ్ రెయిల్, డ్యూయెల్ పాడ్ ఎల్ఈడీ హెడ్లైట్ వంటి వాటిని పొందుతుంది. ఇందులో 2 కిలోవాట్, 3 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్ ఆప్షన్స్ ఉంటాయి. ఇవి 91 కిమీ, 151 కిమీ రేంజ్ అందిస్తాయి. ఏథర్ 450ఎస్ బెంగళూరు బేస్డ్ కంపెనీ ఏథర్ ఈ ఏడాది '450ఎస్' ఎలక్ట్రిక్ స్కూటర్ను లాంచ్ చేసింది. మంచి స్పోర్టివ్ డిజైన్ కలిగిన ఈ స్కూటర్ 7 ఇంచెస్ టచ్స్క్రీన్, స్లీక్ ఎల్ఈడీ టెయిల్ల్యాంప్, 12 ఇంచెస్ వీల్స్ పొందుతుంది. 2.9 కిలోవాట్ బ్యాటరీ కలిగిన ఈ స్కూటర్ ఒక సింగిల్ చార్జితో 115 కిమీ రేంజ్ అందిస్తుంది. దీని ధర రూ.1.29 లక్షలు (ఎక్స్ షోరూమ్). రివర్ ఇండీ ( River Indie) దేశీయ విఫణిలో లాంచ్ అయిన ఎలక్ట్రిక్ స్కూటర్ 'రివర్ ఇండీ'లో డ్యూయెల్ పాడ్ హెడ్లైట్ సెటప్, సింగిల్ పీస్ సీటు, 42 లీటర్ల అండర్ సీట్ స్టోరేజ్, 14 ఇంచెస్ అల్లాయ్ వీల్స్ ఉంటాయి. ఇందులోని 4 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్ 120 కిమీ రేంజ్ అందిస్తుంది. దీని ధర రూ.1.25 లక్షలు. సింపుల్ డాట్ 1 బెంగళూరుకు చెందిన ఈవీ స్టార్టప్ 'సింపుల్ ఎనర్జీ' (Simple Energy) దేశీయ మార్కెట్లో డిసెంబర్ 15న 'డాట్ వన్' (Dot One) ఎలక్ట్రిక్ స్కూటర్ను రూ. 99,999 (ఎక్స్ షోరూమ్) ధర వద్ద లాంచ్ చేసింది. మంచి డిజైన్, ఆధునిక ఫీచర్స్ కలిగిన ఈ స్కూటర్ 3.7 కిలోవాట్ బ్యాటరీతో 151 కిమీ రేంజ్(సింగిల్ ఛార్జ్) అందిస్తుంది. టీవీఎస్ ఎక్స్ రూ. 2.50 లక్షల ధర వద్ద ఈ ఏడాది విడుదలైన టీవీఎస్ ఎక్స్.. మార్కెట్లో లాంచ్ అయిన ఖరీదైన ఎలక్ట్రిక్ స్కూటర్లలో ఒకటి. ఇందులో వర్టికల్లీ స్టేక్డ్ ఎల్ఈడీ హెడ్ల్యాంప్ క్లస్టర్, వైడ్ హ్యాండిల్ బార్, స్లిమ్ ఎల్ఈడీ టెయిల్ లాంప్, 10.25 ఇంచెస్ టీఎఫ్టీ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ వంటివి ఉన్నాయి. ఇందులోని 3.8 కిలోవాట్ బ్యాటరీ ఒక సింగిల్ చార్జితో 140 కిమీ రేంజ్ అందిస్తుంది. -
TS: విద్యార్థినులకు ఎలక్ట్రిక్ స్కూటీలు
హైదరాబాద్: కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరగానే మహాలక్ష్మి పథకం కింద ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం వెసులుబాటు కల్పించింది. కళాశాలల్లో చదువుతున్న విద్యార్థునులకు సైతం బస్సు చార్జీల నుంచి ఆర్థిక వెసులుబాటు లభించింది. మరోవైపు 18 సంవత్సరాలు నిండిన విద్యార్థినులకు ఎలక్ట్రిక్ స్కూటీ పథకం వర్తించనుండటంతో వారికి మరింత పెద్దపీట వేస్తునట్లవుతుంది. దీంతో కాలేజీ విద్యార్థినులకు ‘ఎలక్ట్రిక్ స్కూటీ’లపై ఆశలు రేకెతిస్తున్నాయి. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లోఇచ్చిన హామీల అమలుకు ఒక్కో అడుగు పడుతుండటంతో ఎలక్ట్రిక్ స్కూటీల పథకానికి కూడా అంకురార్పణ జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. రాబోయే పార్లమెంట్ ఎన్నికలలోపు పథకాన్ని ప్రారంభించి కొత్త యువ ఓటర్లను ఆకర్షించే వ్యూహంతో కాంగ్రెస్ అడుగులు వేస్తుండటంతో ఎలక్ట్రిక్ స్కూటీ పథకం కోసం అధికార యంత్రాంగం ముందస్తు ప్రయత్నాలు ముమ్మరం చేసినట్లు తెలుస్తోంది. దీంతో పథకం కోసం మార్గదర్శకాలు రూపకల్పనకు కసరత్తు సాగుతోంది. రెగ్యులర్ విద్యార్థునులకే.. పేద కుటుంబాలకు చెందిన 18 ఏళ్లు నిండి చదువుకునే అమ్మాయిలకు ఎలక్ట్రిక్ స్కూటీలు పథకం కింద వాహనాలు పంపిణీ జరగనుంది. రెగ్యులర్గా కాలేజీలకు వెళ్లే వారికి మాత్రమే పథకం వర్తించేలా కార్యాచరణకు రంగం సిద్ధమవుతోంది. విద్యార్థిని కుటుంబం బీపీఎల్గా గుర్తింపునకు కుటుంబ రేషన్ కార్డు పరిగణనలోకి తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. రెండు లక్షల మందికిపైనే... 18 ఏళ్లు నిండిన అమ్మాయిలు ఎంతమంది ఉంటారనే దానిపై అధికార యంత్రాంగం గణాంకాలు సిద్ధం చేస్తోంది. రాష్ట్రం మొత్తం మీద వివిధ విశ్వవిద్యాలయాల పరిధిలో సుమారు 5,279 డిగ్రీ, పీజీ, ఇంజినీరింగ్, మెడికల్, వృత్తి, వివిధ మేనేజ్మెంట్ కాలేజీలు ఉండగా అందులో గ్రేటర్ పరిధిలోని హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లో సుమారు 1,784 కాలేజీలు ఉన్నాయి. మొత్తమ్మీద ఇంటర్మీడియట్ పూర్తి చేసి డిగ్రీ, ఇతరత్రా కోర్సులు చదువుతున్న పేదల విద్యార్థినులు సుమారు 5 లక్షల మంది వరకు ఉండగా.. వీరిలో 2 లక్షల మంది మహానగర పరిధిలో ఉన్నట్లు ప్రాథమిక గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. వీరిలో సైతం ప్రభుత్వ కాలేజీల్లో చదువుతున్న వారు 70 వేల మంది వరకు ఉండవచ్చని అంచనా. తొలి విడతలో సర్కారు కాలేజీలో చదువుతున్న విద్యార్థినులకు మాత్రమే ప్రాధాన్యమిచ్చేలా నిబంధనల రూపకల్పన జరుగుతున్నట్లు సమాచారం. ˘ పెద్ద మొత్తంలోనే ఖర్చు.. ఎలక్ట్రిక్ స్కూటీల పథకం పెద్ద ఖర్చుతో కూడుకున్నదే. బహిరంగ మార్కెట్లో ఎలక్ట్రిక్ స్కూటీ సామర్థ్యం బట్టి రూ.40 వేల నుంచి రూ. 1.5 లక్షకు పైగా పలుకుతోంది. వాస్తవంగా కేంద్ర ప్రభుత్వం ఉత్పత్తి సంస్థలకు ఎలక్ట్రిక్ టు వీలర్లపై ఫేమ్ (ఫాస్టర్ అడాప్షన్ ఆఫ్ మాన్యుఫ్యాక్చరింగ్ ఆఫ్ ఎలక్ట్రిక్ వెహికిల్స్ ఇన్ ఇండియా)–2 పథకం కింద రాయితీ అందిస్తోంది. ఈ పథకం కింద ఒక్కో ఈవీ టు వీలర్కు దాని ఎక్స్–ఫ్యాక్టరీ ధరలో గరిష్టంగా 40 శాతానికి సమానంగా సబ్సిడీ అందిస్తోంది. కేంద్ర ప్రభుత్వం రాయితీలకు అనుగుణంగా ఈ పథకం అమలు కోసం అధికారులు విధివిధానాలు రూపొందిస్తున్నారు. తొలి విడతలో సర్కారు కాలేజీలో చదువుతున్న విద్యార్థినులకు ప్రాధాన్యమిస్తే సుమారు 70 వేల మంది వరకు లబ్ధి చేకూర్చే అవకాశాలు ఉన్నాయి. కనీసం ఒక్క స్కూటీకి సగటున రూ. 50 వేల చొప్పున ధర లెక్కిస్తే సుమారు రూ. 350 కోట్ల ఖర్చు అయ్యే అవకాశాలు ఉన్నాయి. సబ్సిడీ లేకుండా మాత్రం లెక్కిస్తే «ఖర్చు రెట్టింపు కావచ్చని అధికారులు అంచనా వెస్తున్నారు. లైసెన్సులు కత్తిమీద సామే.. ఎలక్ట్రిక్ స్కూటీలకు డ్రైవింగ్ లైసెన్స్లు తప్పనిసరి కానుంది. లైసెన్స్ తీయడం విద్యార్థునులకు కత్తిమీద సామే. చాలా మందికి వాహనం నడపడం వచ్చినప్పటికీ.. డ్రైవింగ్ లైసె¯న్సులు లేవు. డ్రైవింగ్ లైసెన్స్ లేకుండానే వాహనాలతో రోడ్లు ఎక్కుతున్నారు. వారికి రహదారి భద్రత గురించి అవగాహన తక్కువగా ఉండటంతో.. రోడ్డు ప్రమాదాల బారిన పడే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. ఇన్సూరెన్స్ వర్తించే అవకాశం సైతం ఉండదు. వాహనాలు నడిపే వారికి ట్రాఫిక్ సిగ్నళ్లు, డ్రైవింగ్ నిబంధనలు, రోడ్డు భద్రతా చర్యల గురించి అవగాహన అవసరం. డ్రైవింగ్ లైసెన్స్ కోసం ఆధార్, ఓటర్ ఐడీ, బ్యాంక్ పాస్ బుక్ లేదా పాస్పోర్ట్, అడ్రస్ ప్రూఫ్, టెన్త్ మెమో, పాన్ కార్డు అవసరం ఉంటుంది. డ్రైవింగ్ పరీక్షలో నెగ్గితే ముందుగా లెర్నింగ్ లైసెన్స్..ఆ తర్వాత పర్మనెంట్ లైసెన్స్ ఇస్తారు. ట్రాఫిక్జాం సమస్య మరింత.. మహా నగరంలో కోటిన్నర జనాభా ఉండగా.. నిత్యం 70 లక్షల వాహనాలు రోడ్డెక్కుతుంటాయి. అందులో ద్విచక్ర వాహనాలు 40 లక్షల వరకు ఉన్నాయి. ప్రధాన రోడ్లన్నీ ట్రాఫిక్తో కిటకిటలాడుతున్నాయి. ఇక స్కూల్స్, కాలేజీ సమయంలో వాహనాలు ముందుకు కదలని పరిస్థితి. ఇక విద్యార్థినులకు ఎల్రక్టానిక్ స్కూటర్లు అందుబాటులో వస్తే మరింత ట్రాఫిక్ పెరిగే అవకాశముంది. ఇంజినీరింగ్ విద్యార్థులే అధికం.. 18 సంవత్సరాలకు పైబడిన వారు అంటే ఇంటర్మీడియట్ పూర్తి చేసుకొని డిగ్రీ, పీజీ, ఇతర మేనేజ్మెంట్ కోర్సులు, ఇంజినీరింగ్ విద్యార్థులే ఉంటారు. మహానగర పరిధిలో డిగ్రీ, పీజీ, వివిధ మేనేజ్మెంట్, వృత్తి కోర్సులు అభ్యసిస్తున్న వారికంటే ఇంజినీరింగ్ విద్య అభ్యసిస్తున్న విద్యారి్థనులే అధికం. అందులో సైతం ప్రైవేటు ఇంజినీరింగ్ కళాశాలల్లో చదువుతున్న పేద విద్యార్థినులు అధికంగా ఉన్నారు. ఎలక్ట్రిక్ స్కూటీ పథకం కింద కేవలం సర్కారు కాలేజీ విద్యార్థినులకు ప్రాధాన్యమిస్తే ప్రైవేటు ఇంజినీరింగ్ విద్యారి్థనులు అర్హత కోల్పోయే అవకాశాలు ఉన్నాయి. కొత్త ఓటర్లు 4.5 లక్షలపైనే.. గ్రేటర్ పరిధిలో సుమారు 1.08 కోట్ల వరకు ఓటర్లు ఉండగా అందులో 18 సంవత్సరాలు నిండిన నమోదైన కొత్త ఓటర్లు 4.5 లక్షల మంది ఉన్నారు. వీరిలో మహిళలు 3 లక్షల మంది వరకు ఉండగా.. అందులో కాలేజీ చదువుతున్న విద్యార్థినులు 2 లక్షల వరకు ఉండవచ్చని అంచనా. కాంగ్రెస్ ఎన్నికల హామీలో ఎలక్ట్రిక్ స్కూటీ పథకం ప్రకటించడంతో కొత్తగా ఓటు హక్కు వినియోగించుకున్న విద్యార్థులనుల్లో ఆశలు రేకెత్తిస్తున్నాయి. విద్యార్థునులకు ఎంతో ఉపయోగం ఉచిత ఎలక్ట్రికల్ వెహికల్ విద్యారి్థనులకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. పేద విద్యార్థులకు రోజువారీ రవాణా ఖర్చు ఇబ్బందులు తప్పుతాయి. పెట్రోల్ ఖర్చు ఉండనందున ఇంటి అవసరాలకు సైతం బైక్ను వాడుకోవచ్చు. – టి.శ్వేత–హబ్సిగూడ సంక్రాంతి వరకు అందజేయాలి ఎన్నికల మేనిఫెస్టోలో కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన విధంగా ఎలక్ట్రికల్ స్కూటీలు అందించాలి. విద్యార్థినుల సమయం ఆదా అవుతుంది. ఎలాంటి ఖర్చు లేకుండా అనుకున్న గమ్యానికి త్వరగా చేరుకోవచ్చు. సంక్రాంతి వరకు బైకులను పంపిణీ చేయాలి – పుష్ప–ఓయూ పీజీ విద్యార్థాని కాంగ్రెస్ మాట నిలబెట్టుకోవాలి.. అమ్మాయిలకు స్కూటీ రక్షణగా ఉంటుంది. ఏ సమయంలోనైనా బయటికి వెళ్లి రావచ్చు. ఎలక్ట్రికల్ స్కూటీలు పంపిణీ చేసి కాంగ్రెస్ మాట దనిలబెట్టుకోవాలి. – షేక్ తబ్సుమ్ -
FAME-3: ఎలక్ట్రిక్ టూవీలర్లకు సబ్సిడీ పూర్తిగా ఎత్తేస్తారా?
దేశవ్యాప్తంగా ప్రస్తుతం ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల వినియోగం బాగా పెరిగింది. కొత్తగా టూ వీలర్లు కొనేవారు ఎలక్ట్రిక్ వాహనాల వైపు చూస్తున్నారు. పెరుగుతున్న పెట్రోల్ ధరలు, ప్రభుత్వం అందిస్తున్న రాయితీలు దీనికి ప్రధాన కారణం. ఈ నేపథ్యంలో ఎలక్ట్రిక్ టూవీలర్ తయారీ కంపెనీలు అనేకం పుట్టుకొచ్చాయి. కానీ ఈ పరిస్థితి మారబోతోంది.. ఎందుకు.. ఏం జరగబోతోందో ఇప్పుడు తెలుసుకుందాం.. దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల ఉత్పత్తిని, వినియోగాన్ని ప్రోత్సహించడానికి కేంద్ర ప్రభుత్వం ‘ఫేమ్’ (ఫాస్టర్ అడాప్షన్ అండ్ మ్యాన్యుఫ్యాక్చరింగ్ ఆఫ్ ఎలక్ట్రిక్ వెహికల్స్ - FAME) పథకాన్ని అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇది స్కీమ్ మొదటి విడత ఇప్పటికే పూర్తి కాగా రెండో విడత కూడా ప్రస్తుతం ముగింపు దశ వచ్చేసింది. దీని కింద ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలపై ఇచ్చే సబ్సిడీని ప్రభుత్వం మరికొన్ని వారాల్లో మొత్తానికే ఎత్తేయబోతున్నట్లుగా తెలుస్తోంది. ఎందుకంటే స్కీమ్ మూడో విడత (ఫేమ్-3)ని తీసుకొచ్చే యోచనలో ప్రభుత్వం లేనట్లు సమాచారం. ఇదీ చదవండి: ‘ఆ కార్లు భారత్లోకి ఎప్పటికీ రావు.. రానీయను’ ఆర్థిక శాఖ వ్యతిరేకత దేశంలోని ఎలక్ట్రిక్ వాహన తయారీదారుల నుంచి వస్తున్న డిమాండ్ దృష్ట్యా సబ్సిడీని కొనసాగించాలని కేంద్ర భారీ పరిశ్రమల శాఖ ఒత్తిడి చేస్తున్నప్పటికీ ఫేమ్-3 అమలును కేంద్ర ఆర్థిక శాఖ వ్యతిరేకిస్తోంది. దీంతో ప్రభుత్వంలోని ఇతర శాఖలు సైతం దీనిపై అయిష్టతను కనబరుస్తున్నాయి. ఇప్పటికే సబ్సిడీలో కోత ఫేమ్-2 స్కీములో సబ్సిడీని ప్రభుత్వం ఈ సంవత్సరం ప్రారంభంలో తగ్గించింది. దీంతో అప్పట్లో ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలకు డిమాండ్ తగ్గింది, కానీ ఇప్పుడు స్థిరంగా కనిపిస్తోంది. దీన్నిబట్టి వాహనదారులు సబ్సిడీ కోసం కాకుండా క్లీనర్ ఎనర్జీ వాహనాలపై ఆసక్తితో క్రమంగా అటువైపు మళ్లుతున్నారని ప్రభుత్వ వర్గాలు వాదిస్తున్నాయి. దీంతోపాటు ఫేమ్-2 స్కీములో ఎలక్ట్రిక్ వాహన సంస్థలు అక్రమాలకు పాల్పడటం కూడా ఈ స్కీము ముగింపునకు కారణంగా భావిస్తున్నారు. -
సింగిల్ ఛార్జ్తో 160 కిమీ రేంజ్ అందించే కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్
బెంగళూరుకు చెందిన ఈవీ స్టార్టప్ 'సింపుల్ ఎనర్జీ' (Simple Energy) దేశీయ మార్కెట్లో సర్వ్ కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ 'డాట్ వన్' (Dot One) లాంచ్ చేసింది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ధరలు, ఆఫర్ వివరాలు వంటి వాటితో పాటు రేంజ్ గురించి కూడా ఈ కథనంలో తెలుసుకుందాం. దేశీయ విఫణిలో విడుదలైన కొత్త 'డాట్ వన్' ఎలక్ట్రిక్ స్కూటర్ ధర రూ. 99,999 (ఎక్స్ షోరూమ్, బెంగళూరు). ముందుగా బుక్ చేసుకున్న వారికి ముందస్తు డెలివరీలు ఉంటాయని కంపెనీ స్పష్టం చేసింది. పరిచయ ధరలు ఈ నెల చివరి వరకు మాత్రమే అందుబాటులో ఉండే అవకాశం ఉంటుంది. ఆ తరువాత ధరల పెరుగుదల జరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. కంపెనీ ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ కోసం బుకింగ్స్ స్వీకరించడం ప్రారంభించింది. డెలివరీలు త్వరలోనే ప్రారంభమవుతాయి. నాలుగు కలర్ఆప్షన్లలో లభించే ఈ స్కూటర్ సింగిల్ ఛార్జ్తో గరిష్టంగా 160 కిమీ రేంజ్ అందిస్తుందని కంపెనీ ధ్రువీకరించింది. వాస్తవ ప్రపంచంలో వివిధ వాతావరణ పరిస్థితుల్లో ఈ స్కూటర్ రేంజ్ 151 కిమీ వరకు ఉంటుందని సమాచారం. ఇదీ చదవండి: అనిల్ అంబానీ ఆస్తులు అమ్మకానికి గ్రీన్ సిగ్నల్.. జాబితాలో ఉన్నవేంటో తెలుసా? 3.7 కిలోవాట్ బ్యాటరీ కలిగిన సింపుల్ ఎనర్జీ కొత్త స్కూటర్ కేవలం 2.77 సెకన్లలో గంటకు 0 నుంచి 40 కిమీ వరకు వేగవంతం అవుతుంది. ఇందులోని 8.5 కిలోవాట్ ఎలక్ట్రిక్ మోటార్ 72 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది. మొత్తం మీదే పనితీరు పరంగా ఇచ్చి చాలా ఉత్తమంగా ఉంటుంది. డాట్ వన్ ఎలక్ట్రిక్ స్కూటర్ 35 లీటర్ల అండర్ సీట్ స్టోరేజ్ కలిగి.. మంచి డిజైన్, అంతకు మించిన ఫీచర్స్ పొందుతుంది. ఈ కొత్త స్కూటర్ భారతీయ మార్కెట్లో ఇప్పటికే విక్రయానికి ఉన్న ఓలా ఎస్1 ఎక్స్ ఎలక్ట్రిక్ స్కూటర్కు ప్రధాన ప్రత్యర్థిగా ఉంటుంది. -
సింగిల్ ఛార్జ్తో 104 కిమీ రేంజ్ - ధర ఎంతంటే?
దేశీయ విఫణిలో ఎలక్ట్రిక్ స్కూటర్ల వినియోగం పెరుతున్న తరుణంలో 'కైనెటిక్ గ్రీన్' ఓ కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్ చేసింది. 'కైనెటిక్ జులు' పేరుతో విడుదలైన ఈ స్కూటర్ ధర రూ. 94,990 (ఎక్స్ షోరూమ్). ఈ కొత్త మోడల్ కోసం కంపెనీ బుకింగ్స్ స్వీకరిస్తుంది. డెలివరీలు 2024 ప్రారంభంలో మొదలయ్యే అవకాశం ఉంది. సుమారు 93 కేజీల బరువున్న కైనెటిక్ జులు ఎలక్ట్రిక్ స్కూటర్ 2.1 కిలోవాట్ హబ్ మోటార్ కలిగి గంటకు 60 కిమీ వరకు వేగవంతం అవుతుంది. ఇందులో ఉన్న 2.27 కిలోవాట్ బ్యాటరీ ఒక ఫుల్ ఛార్జ్తో గరిష్టంగా 104 కిమీ రేంజ్ అందిస్తుంది. ఇది 15 ఏఎంపీ స్టాండర్డ్ ఛార్జర్ ద్వారా కేవలం 30 నిమిషాల్లో 80 శాతం ఛార్జ్ చేసుకుంటుంది. మంది డిజైన్ కలిగిన ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ టెలిస్కోపిక్ ఫోర్క్, ట్విన్ షాక్ అబ్జార్బర్లు, రెండు చివర్లలో డిస్క్ బ్రేక్లు, 10 ఇంచెస్ వీల్స్ పొందుతుంది. అంతే కాకుండా ఇందులో ఆప్రాన్-మౌంటెడ్ హెడ్ల్యాంప్, ఎల్ఈడీ డీఆర్ఎల్, డిజిటల్ స్పీడోమీటర్, సైడ్ స్టాండ్ సెన్సార్, బూట్ లైట్ వంటి ఫీచర్స్ ఉన్నాయి. ఇదీ చదవండి: పతనమవుతున్న పసిడి.. మరింత తగ్గిన వెండి - నేటి కొత్త ధరలు ఇవే ఒక ఫుల్ చార్జితో 104 కిమీ రేంజ్ అందించే ఈ జులు ఎలక్ట్రిక్ స్కూటర్ ఇండియన్ మార్కెట్లో ఒకినావా ప్రైజ్ ప్రో, ఓలా ఎస్1 ఎక్స్+, ఏథర్ 450ఎస్ వంటి వాటికి ప్రత్యర్థిగా ఉంటుంది. కాబట్టి ఈ స్కూటర్ అమ్మకాల పరంగా గట్టి పోటీ ఎదుర్కోవాల్సి ఉంటుందని తెలుస్తోంది. -
సింగిల్ ఛార్జ్ 200 కిమీ రేంజ్! ధర కూడా తక్కువే..
Komaki LY Electric Scooter: ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం పెరుగుతున్న తరుణంలో దాదాపు అన్ని సంస్థలు ఈ రంగం వైపే జోరుగా అడుగులు వేస్తున్నాయి. ఇందులో భాగంగానే దేశీయ మార్కెట్లో విడుదలైన 'కొమాకి ఎల్వై' (Komaki LY) ఎలక్ట్రిక్ స్కూటర్ మీద కంపెనీ ఇప్పుడు అద్భుతమైన ఆఫర్ అందిస్తోంది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. లాంచ్ సమయంలో రూ. 96,968 వద్ద అమ్ముడైన ఈ స్కూటర్ ఇప్పుడు రూ. 78,000 వద్ద లభిస్తోంది. అంటే కంపెనీ ఈ స్కూటర్ మీద రూ. 18,968 డిస్కౌంట్ అందిస్తోంది. ఈ డిస్కౌంట్ కేవలం పరిమిత సమయం వరకు మాత్రమే అందుబాటులో ఉంటుందని కంపెనీ వెల్లడించింది. నగర ప్రయాణికులను దృష్టిలో ఉంచుకుని తయారైన ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ సింగిల్, డ్యూయల్ బ్యాటరీ ఎంపికలలో అందుబాటులో ఉంది. సింగిల్ బ్యాటరీతో కూడిన స్కూటర్ 85 కిలోమీటర్ల రేంజ్ అందిస్తే, డ్యూయల్ బ్యాటరీ స్కూటర్ 200 కిమీ రేంజ్ అందిస్తుంది. అయితే వాస్తవ ప్రపంచంలో రేంజ్ కొంత తక్కువగా ఉండే అవకాశం ఉంటుందని భావిస్తున్నాము. ఇదీ చదవండి: కలిసొచ్చిన చంద్రయాన్ 3 సక్సెస్ - బిలియనీర్ల జాబితాలోకి కొత్త వ్యక్తి రిమూవబుల్ బ్యాటరీ కలిగిన 'కొమాకి ఎల్వై' (Komaki LY) ఎలక్ట్రిక్ స్కూటర్ TFT ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ పొందుతుంది. ఇది బ్యాటరీ స్టేటస్, న్యావిగేషన్ వంటి మరిన్ని వివరాలను రైడర్కు తెలియజేస్తుంది. ఆన్బోర్డ్లో సౌండ్ సిస్టమ్ ఉండటం వల్ల, బ్లూటూత్ కనెక్టివిటీ ద్వారా ప్లే చేయవచ్చు. డిజైన్ కూడా చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. -
మంటల్లో చిక్కుకున్న మరో ఎలక్ట్రిక్ స్కూటర్.. వీడియో వైరల్!
పెరుగుతున్న కాలుష్యాన్ని తగ్గించడానికి.. అభివృద్ధి చెందుతున్న టెక్నాలజీని ఉపయోగించుకోవడానికి ఎలక్ట్రిక్ వాహనాలను వినియోగించాలని అటు కేంద్ర ప్రభుత్వం, ఇటు రాష్ట్ర ప్రభుత్వాలు చెబుతూనే ఉన్నాయి. అయితే అప్పుడప్పుడు వెలుగులోకి వచ్చే సంఘటనలు మాత్రం ఎలక్ట్రిక్ వాహనాలను కొనాలనుకునే వారి గుండెల్లో గుబులు పుట్టిస్తున్నాయి. అనుకోకుండా ఎలక్ట్రిక్ వాహనాల్లో చెలరేగే మంటలు వినియోగదారుల్లో భయాన్ని కలిగిస్తున్నాయి. గత కొన్ని రోజులకు ముందు ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ నడిరోడ్డుపై కాలిపోయిన సంఘటన మరిచిపోక ముందే.. ఆంపియర్ మాగ్నస్ ఈఎక్స్ ఎలక్ట్రిక్ స్కూటర్ మంటల్లో చిక్కుకున్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. నాగిన నేషనల్ గ్రీన్ ఆటోమొబైల్ వినియోగదారు తన ట్విటర్ ఖాతా ద్వారా షేర్ చేసిన వీడియోలో.. ఆంపియర్ మాగ్నస్ ఈఎక్స్ ఎలక్ట్రిక్ స్కూటర్లో పెద్దగా మంటలు రావడం చూడవచ్చు. నడిరోడ్డులో కాలుతున్న స్కూటర్లో మంటలు అదుపుచేయడానికి ప్రయత్నించినప్పటికీ.. ఫలితం లేకుండా పోయింది. ఈ ఘటన పూణేలో జరిగినట్లు తెలుస్తోంది. ఎలక్ట్రిక్ స్కూటర్లో మంటలు చెలరేగటానికి సంబంధించిన వార్తలు రావడం ఇదే మొదటిసారి కాదు, గత రెండు సంవత్సరాల్లో, ఓలా ఎలక్ట్రిక్, ఆంపియర్ ఎలక్ట్రిక్, ఒకినావా, ప్యూర్ ఈవీ, జితేంద్ర ఈవీ వంటి అనేక బ్రాండ్ వాహనాలు మంటల్లో చిక్కుకున్న సంఘటనలు చాలానే వెలుగులోకి వచ్చాయి. ఈ ఘటనల్లో కొంతమంది ప్రాణాలు కూడా కోల్పోయారు. ఇదీ చదవండి: గేర్బాక్స్ రిపేర్కు రూ.5.8 లక్షలు - బిల్ చూసి అవాక్కయిన కారు ఓనర్.. ఈ సంఘటనల మీద కేంద్ర ప్రభుత్వం స్పందించి కంపెనీ అధికారులతో చర్చలు జరిగి.. ఇలాంటి సంఘటనలు మళ్ళీ జరగకూడదని, నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని హెచ్చరించింది. కానీ ఇప్పటికి కూడా అక్కడక్కడా ఇలాంటి సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి. ప్రస్తుతం జరిగిన ఈ సంఘటన మీద కంపెనీ స్పందించకపోవడం గమనార్హం. స్కూటర్ కాలిపోవడానికి ప్రధాన కారణాలు తెలియాల్సి ఉంది. @futureiselectr2 @GreavesCottonIN @airnewsalerts @ABPNews @aajtak @ampere_ev @EVehiclesindia @NITIAayog @rushlane @NetflixIndia @OlaElectric Ampere Battery Blast in Ampere magnus ex, Why companies playing with the life of innocent customers, GOI must take strict action against . pic.twitter.com/FsVMTlGYET — Nagina National Green Automobile (@SanjayChou89866) November 20, 2023 -
ఎలక్ట్రిక్ స్కూటర్లో మంటలు - క్లారిటీ ఇచ్చిన సంస్థ!
Ola Electric: రెండు రోజులకు ముందు (అక్టోబర్ 28) ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్లో మంటలు చెలరేగిన సంఘటన మీద కంపెనీ (ఓలా ఎలక్ట్రిక్) స్పందిస్తూ, ప్రమాదానికి కారణాలను వెల్లడించింది. దీని సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. పూణేలోని పింప్రి - చించ్వాడ్ ప్రాంతంలో గత శనివారం ఈ ఘటన చోటుచేసుకుంది. ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ కాలిపోతుండగా.. స్థానికులు వీడియోలు తీసి సోషల్ మీడియాలో అప్లోడ్ చేశారు. ఇందులో స్కూటర్ నుంచి పొగలు రావడం, అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆపడానికి చేసిన ప్రయత్నాలు వంటి దృశ్యాలను చూడవచ్చు. ఇదీ చదవండి: మెటాలో జాబ్.. రూ.6.5 కోట్ల వేతనం - ఎందుకు వదిలేసాడో తెలుసా? ఈ విషయంపై ఓలా కంపెనీ స్పందిస్తూ.. కంపెనీకి చెందినవి కాకుండా ఇతర పరికరాలను స్కూటర్లో ఉపయోగించడం వల్ల షార్ట్ సర్క్యూట్ జరిగి, ఈ ప్రమాదం సంభవించినట్లు తెలిపింది. ఈ సంఘటనలో ఎవరికీ ఎలాంటి హానీ జరగలేదు, బ్యాటరీ కూడా చెక్కుచెదరకుండా ఉపయోగించడానికి అనువుగానే ఉందని స్పష్టం చేసింది. Important update pic.twitter.com/K7pw71Xoxo — Ola Electric (@OlaElectric) October 29, 2023 -
నడిరోడ్డుపై ఎలక్ట్రిక్ స్కూటర్లో మంటలు - వైరల్ వీడియో
ఎలక్ట్రిక్ వెహికల్స్లో అకారణంగా మంటలు చెలరేగడం, తద్వారా అనుకోని ప్రమాదాలు సంభవించడం గతంలో కోకొల్లలుగా వెలుగులోకి వచ్చాయి. ఇప్పుడు కూడా అలాంటి సంఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. పూణెలో ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్లో మంటలు చెలరేగాయి. దీనికి సంబంధించిన వీడియో పూణే మిర్రర్ ఎక్స్ (ట్విటర్) ఖాతాలో వైరల్ అవుతోంది. ఇందులో ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ నుంచి పొగలు రావడం గమనించవచ్చు. అగ్నిమాపక సిబ్బంది సంఘటన స్థలంలో తగిన చర్యలు తీసుకుంటున్నారు. పూణే మిర్రర్ వెల్లడించిన సమాచారం ప్రకారం, ఉదయం 8:30 గంటల ప్రాంతంలో స్కూటర్లో మంటలు చెలరేగినట్లు తెలుస్తోంది. ఈ సంఘటనలో ఎవరికీ గాయాలు కాలేదు, కానీ ఈ ప్రమాదానికి కారణం ఏంటనేది తెలియాల్సి ఉంది. దీనిపై ఓలా ఎలక్ట్రిక్ విచారణ చేపట్టనుంది. బాధితునికి కొత్త స్కూటర్ ఇవ్వనున్నట్లు సమాచారం. ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్లలో మంటలు చెలరేగడం ఇదే మొదటి సారి కాదు. గతంలో కూడా ఇలాంటి సంఘటనలు చాలానే వెలుగులోకి వచ్చాయి. ఈ ప్రమాదాల్లో కొందరు ప్రాణాలు కూడా కోల్పోయారు. ఇదీ చదవండి: ముఖేష్ అంబానీకి మరో మెయిల్! అడిగింది ఇవ్వకుంటే చంపేస్తామంటూ.. ఎలక్ట్రిక్ వాహనాల్లో చెలరేగే మంటలపై సంబంధిత కంపెనీలు సమగ్ర వివరణ ఇవ్వాలని గతంలోనే ఆదేశించింది. ఇలాంటి సంఘటనలు మళ్ళీ పునరావృతం కాకూడదని డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ (DRDO) ఆధ్వర్యంలోని సెంటర్ ఫర్ ఫైర్, ఎక్స్ప్లోజివ్ అండ్ ఎన్విరాన్మెంట్ సేఫ్టీ ఈ పరిశోధన చేపట్టి కొన్ని బ్యాటరీ ప్యాక్లు, మాడ్యూల్స్ డిజైన్లతో సహా బ్యాటరీలలో కొన్ని లోపాలను నివేదించింది. One more incident of an Ola electric scooter catching fire has been reported near the parking lot of D.Y Patil College in Pimpri Chinchwad. This alarming event occurred near the Institute's parking area, igniting at approximately 8:30 in the morning. Upon receiving the report,… pic.twitter.com/tr0K3yn9pp — Pune Mirror (@ThePuneMirror) October 28, 2023 -
ఎలక్ట్రిక్ వెహికల్ కొనుగోలు దారులకు బంపరాఫర్!
ప్రముఖ ఎలక్ట్రిక్ బైక్ తయారీ సంస్థ ఏథర్ ఎనర్జీ కొనుగోలు దారులకు బంపరాఫర్ ప్రకటించింది. ఎథేర్ స్కూటర్ కొనుగోలు దారులకు ఎక్స్చేంజ్, కార్పొరేట్, ఫెస్టివల్ ఆఫర్లతో పాటు పలు స్కీమ్లను అందిస్తున్నట్లు వెల్లడించింది. ఈ ప్రత్యేక ఎక్ఛేంజ్ ఆఫర్లో భాగంగా కొనుగోలుదారులు ఏథర్ ఎలక్ట్రిక్ స్కూటర్ ఏథేర్ ప్రో వెర్షన్ మోడల్ 450 ఎక్స్ (2.9 కిలోవాట్ అండ్ 3.7 కిలోవాట్), 450ఎస్ (2.9 కిలోవాట్). మోడళ్లపై రూ .40,000 వరకు తగ్గింపు పొందవచ్చు. అయితే, ఈ ఎక్ఛేంజ్ ఆఫర్లో వాహనదారుల పాత పెట్రోల్ వేరియంట్ టూ వీలర్, కొనుగోలు చేసి ఎన్ని సంవత్సరాలైంది. బండి కండీషన్, కొనుగోలు చేసే సమయంలో దాని ఒరిజనల్ ప్రైస్ ఎంత ఉందనే దానిని పరిగణలోకి తీసుకుని ఈ భారీ డిస్కౌంట్ ఇస్తున్నట్లు ఎథేర్ ప్రతినిధులు తెలిపారు. ఏథర్ 450 ఎస్ ప్రో వెర్షన్పై రూ .5,000 ఫెస్టివల్ బెన్ఫిట్స్, రూ .1,500 కార్పొరేట్ బెన్ఫిట్స్ను అందిస్తుంది. మరోవైపు, 450 ఎక్స్ వేరియంట్లు కూడా అదే కార్పొరేట్ స్కీమ్ను అందిస్తుంది. చివరగా, ఏథర్ 5.99శాతం వడ్డీ 24 నెలల ఈఎంఐని అందిస్తుంది. ఈ ఫెస్టివల్ ఆఫర్లన్నీ నవంబర్ 15 వరకు అందుబాటులో ఉంటాయి. ఎక్స్చేంజ్ ఆఫర్లో గరిష్టంగా రూ.40,000 డిస్కౌంట్, ఇతర స్కీమ్స్ కలిపి ఏథర్ 450 ధరలు గణనీయంగా తగ్గాయి. ఏథర్ 450ఎస్ అసలు ధర రూ.1,32,550 నుంచి రూ.86,050కు తగ్గింది. ఏథర్ 450 ఎక్స్ 2.9 కిలోవాట్ అండ్ 450 ఎక్స్ 3.7 కిలోవాట్ల ధరలు వరుసగా రూ.1,01,050, రూ.1,10,249 (ఢిల్లీలో అన్నీ ఎక్స్-షోరూమ్ ధరలు) గా ఉన్నాయి. -
ఈవీ రంగంలోకి ప్రముఖ ల్యాప్టాప్ కంపెనీ.. తొలి ఈ-స్కూటర్ విడుదల
తైవాన్కు చెందిన ప్రముఖ హార్డ్వేర్, ఎలక్ట్రానిక్స్ బ్రాండ్ ఏసర్ (Acer) ఎలక్ట్రిక్ వాహనాల రంగంలోకి అడుగు పెట్టింది. భారతీయ మార్కెట్లో తన మొదటి ఈ-స్కూటర్ను విడుదల చేసింది. MUVI 125 4G పేరుతో తీసుకొచ్చిన ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ధర రూ. 99,999 (ఎక్స్-షోరూమ్). ఈ MUVI 125 4G ఎలక్ట్రిక్ స్కూటర్ను రూపొందించింది, తయారు చేసింది ముంబైకి చెందిన ఈవీ స్టార్టప్ థింక్ ఈబైక్గో. ఎలక్ట్రిక్ వాహన రంగంలోకి ఏసర్ అడుగుపెట్టడంతో ఇప్పటికే ఆ రంగంలో ఉన్న ఓలా, ఏథర్ వంటి కంపెనీలకు గట్టిపోటీ ఎదురుకానుంది. MUVI 125 4G ప్రత్యేకతలు ఎలక్ట్రిక్ స్కూటర్ రేంజ్ 80 కిలోమీటర్లు గరిష్ట వేగం 75 kmph. ఛార్జింగ్ కోసం స్వాప్ చేయగల బ్యాటరీ తేలికపాటి ఛాసిస్ 16-అంగుళాల చక్రాలు, కాంపాక్ట్ డిజైన్ డబుల్ డిస్క్ బ్రేక్స్ MUVI 125 4G సాంకేతిక వివరాలను మాత్రం ఏసర్ వెల్లడించలేదు. అయితే, ఇది మార్చుకోదగిన (స్వాపింగ్) బ్యాటరీలతో వస్తుందని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ సబ్సిడీలకు అర్హత పొందుతుందని కంపెనీ ధ్రువీకరించింది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్కు ప్రీ-బుకింగ్లు త్వరలో ప్రారంభం కానున్నాయి. ప్రీ-బుకింగ్లు, డీలర్షిప్పై ఆసక్తి ఉన్నవారు కంపెనీ అధికారిక వెబ్సైట్ను సందర్శించవచ్చు. 🚨 Taiwanese laptop maker 'Acer' has entered into the electric scooter market in India by launching its e scooter at ₹99,999/- pic.twitter.com/Fa3sqEjOVr — Indian Tech & Infra (@IndianTechGuide) October 16, 2023 -
విడుదలకు సిద్దమవుతున్న కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్.. పూర్తి వివరాలు
భారతీయ మార్కెట్లో ఎప్పటికప్పుడు కొత్త కొత్త వాహనాలు విడుదలవుతూనే ఉన్నాయి. ఇందులో ఎక్కువగా ఎలక్ట్రిక్ కార్లు లేదా బైకులు ఉన్నాయి. అయితే ఇప్పుడు దేశీయ విఫణిలో అడుగుపెట్టడానికి ఒకాయా (Okaya) నుంచి మరో ఎలక్ట్రిక్ స్కూటర్ సిద్ధమైంది. ఈ లేటెస్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్ గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. ఒకాయ మోటో ఫాస్ట్ పేరుతో విడుదలకానున్న ఈ కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ ఒక్కసారి ఛార్జ్ చేస్తే 120 కిమీ నుంచి 135 కిమీ రేంజ్ అందిస్తుందని తెలుస్తోంది. దీని టాప్ స్పీడ్ గంటకు 60 కిమీ నుంచి 70 కిమీ కావడం గమనార్హం. ఇది అక్టోబర్ 17న అధికారికంగా లాంఛ్ అయ్యే అవకాశం ఉంది. లేటెస్ట్ ఒకాయ మోటో ఫాస్ట్ స్కూటర్ ధర రూ. 1.50 లక్షల వరకు ఉండవచ్చు. రోజు వారీ వినియోగానికి అనుకూలంగా ఉండే ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ LFP బ్యాటరీ ప్యాక్ పొందుతుంది. సింపుల్ డిజైన్ కలిగిన ఈ స్కూటర్ సియాన్, బ్లాక్, గ్రీన్, రెడ్ అండ్ గ్రే కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. ఇదీ చదవండి: మామకు తగ్గ మేనల్లుడు.. అర్జున్ కొఠారి ఆస్తులు ఇన్ని కోట్లా? ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ అల్లాయ్ వీల్స్తో వస్తుంది కాబట్టి ఆఫర్లో ట్యూబ్లెస్ టైర్లు కూడా ఉంటాయని భావిస్తున్నారు. 7 ఇంచెస్ టచ్స్క్రీన్ ద్వారా స్పీడ్, ఓడోమీటర్, ట్రిప్ మీటర్, రైడింగ్ మోడ్, టైమ్ మరియు బ్యాటరీ శాతం వంటి వాటిని చూపిస్తుంది. బ్రేకింగ్ సిస్టం, సస్పెన్షవ్ వంటివి కూడా చాలా అద్భుతంగా ఉండనున్నట్లు సమాచారం. ఈ స్కూటర్కి సంబంధించిన మరిన్ని వివరాలు లాంచ్ సమయంలో వెల్లడవుతాయి. -
200 కి.మీ రేంజ్లో కొత్త ఈ-స్కూటర్ : బుకింగ్స్ షురూ! ధర మాత్రం!
Pure EV ePluto 7G Max electric scooter: ప్యూర్ ఈవీ భారతదేశంలో కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ను లాంచ్ చేసింది. 201 కిమీ పరిధితో ePluto 7G మాక్స్ ఎలక్ట్రిక్ స్కూటర్ను విడుదల చేసింది. దేశంలో 200 కిమీ కంటే ఎక్కువ పరిధిని అందిస్తున్న 2-వీలర్ EVలలో ePluto 7G మాక్స్ ఒకటిగా నిలిచింది. ఈ వింటేజ్ ఎలక్ట్రిక్ స్కూటర్ కోసం బుకింగ్లు ఇప్పుడు దేశవ్యాప్తంగా అందుబాటులో ఉన్నాయని కంపెనీ వెల్లడించింది. ePluto 7G MAX ఫీచర్లు : AIS-156 సర్టిఫికేట్, స్మార్ట్ BMS , బ్లూటూత్ కనెక్టివిటీతో 3.5 KWH బ్యాటరీని అమర్చింది. స్కూటర్ హిల్ స్టార్ట్ అసిస్ట్, డౌన్హిల్ అసిస్ట్, కోస్టింగ్ రీజెన్, రివర్స్ మోడ్ ,స్మార్ట్ AI వంటి ఫీచర్లతో వస్తుంది. ఇవి బ్యాటరీ ఆరోగ్యాన్ని కాపాడతాయని కంపెనీ పేర్కొంది. దీని ధర రూ. 1,14,999 (ఎక్స్-షోరూమ్). రాష్ట్ర స్థాయి సబ్సిడీలు , RTO రుసుములను బట్టి ఆన్-రోడ్ ధర మారుతుంది. వచ్చే పండుగ సీజన్ నుండి డెలివరీలు ప్రారంభం కానున్నాయి. ఈ స్కూటర్ మ్యాట్ బ్లాక్, రెడ్, గ్రే , వైట్ నాలుగు రంగులలో లభించనుంది. (ODI WC 2023 Revenue Prediction: ఆదాయంపై బీవోబీ సంచలన అంచనాలు) అత్యధికంగా అమ్ముడవుతున్న 7G మోడల్ అప్గ్రేడ్ వెర్షన్ రోజుకు 100 కి.మీ డ్రైవ్ చేసే వినియోగదారులను లక్ష్యంగా చేసుకున్నట్లు ప్యూర్ EV సహ వ్యవస్థాపకుడు, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ రోహిత్ వదేరా తెలిసారు. మరోవైపు కంపెనీ దాదాపు అన్ని ప్రముఖ నగరాలు, పట్టణాలలో తన డీలర్ నెట్వర్క్ను దూకుడుగా విస్తరిస్తోంది, FY24 చివరి నాటికి 300 కంటే ఎక్కువ టచ్పాయింట్లను లక్ష్యంగా చేసుకుంది. -
ఈ స్కూటర్ కొనే డబ్బుతో 'హిమాలయన్' బైక్ కొనేయొచ్చు! ధర ఎంతో తెలుసా?
TVS X Electric Scooter: చాలా రోజుల తరువాత టీవీఎస్ కంపెనీ ఎట్టకేలకు తన లేటెస్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్ 'ఎక్స్' లాంచ్ చేసింది. దీని ధర రూ. 2.50 లక్షలు కావడం గమనార్హం. ప్రస్తుతం మన దేశంలో అత్యంత ఖరీదైన ఎలక్ట్రిక్ స్కూటర్ ఇదే. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. టీవీఎస్ ఎక్స్ ఎలక్ట్రిక్ స్కూటర్ 4.4 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్ కలిగి ఒక సింగిల్ ఛార్జ్తో 140 కిమీ పరిధిని అందిస్తుందని కంపెనీ తెలిపింది. ఇది కేవలం 50 నిమిషాల్లో 0 నుంచి 50 శాతం (హోమ్ ర్యాపిడ్ ఛార్జర్), 4 గంటల 30 నిమిషాల్లో 950 వాల్స్ పోరాటబుల్ ఛార్జర్ సాయంతో 80 శాతం వరకు ఛార్జ్ చేసుకోగలదు. పోర్టబుల్ ఛార్జర్ ధర రూ. 16,275. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్లోని పర్మనెంట్ మాగ్నెట్ సింక్రోనస్ మోటార్ (PMSM) 11 kW పీక్ పవర్, 40 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది. బ్రేకింగ్ విషయానికి వస్తే ఈ స్కూటర్ ముందువైపు 220 మిమీ డిస్క్, వెనుకవైపు 195 మిమీ డిస్క్ ఉంటుంది. 12 ఇంచెస్ చక్రాలమీద 100 సెక్షన్ టైర్స్ ఉంటాయి. కావున మంచి రైడింగ్ అనుభూతిని అందించడంలో ఇది ఉపయోగపడుతుంది. ఫీచర్స్.. టీవీఎస్ ఎక్స్ ఎలక్ట్రిక్ స్కూటర్ XLETON ప్లాట్ఫారమ్పై తయారై 770 మిమీ ఎత్తుగల సీట్ పొందుతుంది. ఇది కేవలం 2.6 సెకన్లలో 40 కిమీ/గంట వరకు వేగవంతం అవుతుంది. దీని గరిష్ట వేగం గంటాకు 105 కిమీ కావడం గమనార్హం. ఇందులో Xtealth, Xtride, Xonic అనే మూడు రైడింగ్ మోడ్స్ ఉంటాయి. అంతే కాకుండా రీజనరేటివ్ బ్రేకింగ్ సిస్టం ఇందులో లభిస్తుంది. ఇదీ చదవండి: ప్రజ్ఞానందపై ఆనంద్ మహీంద్రా ట్వీట్.. నువ్వు 'రన్నరప్' కాదు.. ఈ లేటెస్ట్ బైక్ 10.25 ఇంచెస్ TFT డ్యాష్ కలిగి బ్లూటూత్ కనెక్టివిటీతో మ్యూజిక్ ప్లేబ్యాక్ అండ్ నావిగేషన్ అలర్ట్లను ఎనేబుల్ చేసే ఫీచర్లను పొందుతుంది. వీటితో పాటు రివర్స్ అసిస్ట్, క్రూయిజ్ కంట్రోల్, హిల్-హోల్డ్ ఫంక్షన్ వంటివి ఉంటాయి. అండర్ సీట్ స్టోరేజ్19 లీటర్ల కెపాసిటీ కలిగి ఉంటుంది. ఇదీ చదవండి: ఎవరీ మాయా టాటా? లక్షల కోట్ల 'టాటా' సామ్రాజ్యానికి వారసురాలు ఈమేనా? ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ కొనుగోలు చేయాలనుకునే వారు ఈ రోజు రాత్రి నుంచి బుక్ చేసుకోవచ్చు. అయితే దీనిపైన ఎలాంటి ఫేమ్ 2 సబ్సిడీ లభించదు.డెలివరీలు నవంబర్ నెలలో (బెంగళూరులో) ప్రారంభమవుతాయి. 2024 మార్చి తరువాత దేశవ్యాప్తంగా ప్రారంభమవుటాయి. కాగా మొదటి 2000 మంది కస్టమర్లకు స్మార్ట్వాచ్ అండ్ రూ. 18,000 విలువైన 'క్యూరేటెడ్ కన్సైర్జ్' ప్యాకేజీ ఉచితంగా లభిస్తుంది. -
Electric Scooter: బైక్ లాంటి స్కూటర్ భలే ఉందే.. లాంచ్ చేస్తున్న టీవీఎస్
భారత్కు చెందిన మల్టీ నేషనల్ ఆటోమొబైల్ సంస్థ టీవీఎస్ (TVS) తన సరికొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ (Electric Scooter) టీవీఎస్ క్రియాన్ (TVS Creon)ను దుబాయ్లో లాంచ్ చేస్తోంది. 2018 ఆటో ఎక్స్పోలో ప్రదర్శించిన టీవీఎస్ క్రియాన్ కాన్సెప్ట్ ఆధారంగా రూపొందించినట్లుగా చెబుతున్న ఈ ఈ-స్కూటర్కు సంబంధించిన టీజర్ తాజాగా విడులైంది. తాజా టీజర్లో స్కూటర్పై 'Xonic' అనే పదం రాసి ఉన్న క్లోజప్ కనిపిస్తోంది. ఈ టీజర్లో స్పీడోమీటర్ క్లైంబింగ్ను కూడా చూపించారు. గరిష్టంగా గంటకు 105 కి.మీ వేగం ఉంటుందని, పూర్తి ఛార్జ్తో 100 కి.మీ రేంజ్ ఉంటుందని అంచనా వేస్తున్నారు. స్కూటర్ స్పెసిఫికేషన్లు, ధర, డిజైన్, ఫీచర్లు (అంచనా) కంపెనీ ఇప్పటివరకు స్పెసిఫికేషన్లు, రేంజ్, ఇతర సాంకేతిక వివరాల గురించి ఎలాంటి సూచనలు ఇవ్వలేదు. కొత్త టీవీఎస్ మోడల్ కొన్ని ప్రత్యేక ఫీచర్లతో వస్తుందని, ఐక్యూబ్ (iQube) కంటే ఎక్కువ పనితీరు ఉంటుందని భావిస్తున్నారు. హెడ్లైట్ కన్సోల్గా పనిచేసే నాలుగు ఎల్ఈడీ ల్యాంప్లను కలిగి ఉన్న ఫ్యూచరిస్టిక్ డిజైన్తో పాటు స్కూటర్ పూర్తి టీఎఫ్టీ స్క్రీన్తో వస్తుంది. ఈ-స్కూటర్లో బ్లూటూత్, స్మార్ట్ఫోన్ కనెక్టివిటీ ఫీచర్లు కూడా ఉండవచ్చు. ఈ స్కూటర్ స్మార్ట్వాచ్-కనెక్ట్ కంట్రోల్లను కలిగి ఉంటుందని కూడా టీజర్ సూచించింది. వెనుక భాగంలో ఉన్న సొగసైన ఎల్ఈడీ ఇండికేటర్లు ఉన్నట్లు తెలుస్తోంది. టీవీఎస్ ఐక్యూబ్తో పోలిస్తే కొత్త స్కూటర్ ప్రీమియం ధరలో ఉండవచ్చు. టీవీఎస్ కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ ఏథర్ 450ఎక్స్ (Ather 450X), ఓలా ఎస్1 ప్రో (Ola S1 Pro)తో పోటీపడనుంది. -
ఒడిస్సీకి భారీ ఆర్డర్.. 10వేల ఎలక్ట్రిక్ కొనుగోలు చేయనున్న బడ్–ఈ
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సంస్థ ఒడిస్సీ నుంచి విద్యుత్ వాహనాల రెంటల్ సంస్థ బడ్–ఈ 10,000 వాహనాలను కొనుగోలు చేయనుంది. ఈ ఆర్డరు విలువ రూ. 100 కోట్లుగా ఉండనుంది. ఇందుకు సంబంధించి అవగాహన ఒప్పందం కుదుర్చుకున్న సందర్భంగా ఒడిస్సీ సీఈవో నెమిన్ వోరా, బడ్–ఈ సహ వ్యవస్థాపకులు ఆదిత్య టేకుమళ్ల, విజయ్ మద్దూరి ఈ విషయాలు తెలిపారు. 18–24 నెలల వ్యవధిలో ఈ వాహనాలను అందుకోనున్నట్లు ఆదిత్య తెలిపారు. వ్యాపార సంస్థలతో పాటు వినియోగదారులకు లీజింగ్, రెంటల్ ప్రాతిపదికన వాహనాలను అందిస్తున్నట్లు, త్వరలో ఇతర నగరాలకు విస్తరించనున్నట్లు వివరించారు. మరోవైపు, ప్రస్తుతం నెలకు గరిష్టంగా 5,000 వాహనాలుగా ఉన్న ఉత్పత్తి సామర్ధ్యం కొత్త ప్లాంటు అందుబాటులోకి వస్తే 10,000కు పెరగనున్నట్లు నెమిన్ వోరా తెలిపారు. 68పైగా ఉన్న డీలర్ షిప్లను వచ్చే ఏడాది ఆఖరు నాటికి 150కి పెంచుకోనున్నట్లు పేర్కొన్నారు. -
ఎలక్ట్రిక్ స్కూటర్లు కొన్న వారికి షాక్! డిస్కౌంట్ డబ్బు వెనక్కి కట్టాలి?
సబ్సిడీల దుర్వినియోగం ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రముఖ ఎలక్ట్రిక్ టూవీలర్ (Electric Two wheeler) కంపెనీల నుంచి ఎలక్ట్రిక్ స్కూటర్లు కొన్నవారు ఆ వాహనాలపై తాము పొందిన డిస్కౌంట్ను ఆయా కంపెనీలకు వెనక్కి కట్టాల్సి రావచ్చు. ఫేమ్2 పథకం నిబంధనలు ఉల్లంఘించినందుకు గానూ హీరో ఎలక్ట్రిక్, ఒకినావా ఆటోటెక్, ఆంపియర్ ఈవీ, రివోల్ట్ మోటార్స్, బెన్లింగ్ ఇండియా, అమో మొబిలిటీ, లోహియా ఆటో సంస్థలపై కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకున్న సంగతి తెలిసిందే. ఆయా సంస్థలు పొందిన సబ్సిడీ మొత్తం రూ. 469 కోట్లు తిరిగి కట్టాలని భారీ పరిశ్రమల శాఖ ఇటీవల ఆదేశాలు జారీ చేసింది. కాగా తమకు సబ్సిడీలు రద్దు చేసిన నేపథ్యంలో తాము కస్టమర్లకు ఇచ్చిన డిస్కౌంట్లను వారి నుంచి వెనక్కి కోరే అవకాశాన్ని పరిశీలించాలని ఆ ఏడు ఎలక్ట్రిక్ టూవీలర్ కంపెనీలు కేంద్ర ప్రభుత్వాన్ని కోరాయి. ఈ ప్రతిపాదనను తెలియజేస్తూ ఎలక్ట్రిక్ వాహనాల తయారీదారుల సొసైటీ కేంద్ర భారీ పరిశ్రమల శాఖకు తాజాగా ఓ లేఖ రాసింది. ఇదీ చదవండి ➤ GST on EV Charging: ఎలక్ట్రిక్ వెహికల్ చార్జింగ్పై జీఎస్టీ! పబ్లిక్ చార్జింగ్ స్టేషన్లలో వర్తింపు హీరో ఎలక్ట్రిక్, ఒకినావా ఆటోటెక్ , ఆంపియర్ ఈవీ, రివోల్ట్ మోటార్స్, బెన్లింగ్ ఇండియా, అమో మొబిలిటీ, లోహియా ఆటో కంపెనీలు నిబంధనలను ఉల్లంఘించి ఆర్థిక ప్రోత్సాహకాలను పొందినట్లు కేంద్ర భారీ పరిశ్రమల శాఖ జరిపిన విచారణలో వెల్లడైంది. దీంతో ఆయా కంపెనీలు పొందిన సబ్సిడీలను రద్దు చేస్తూ కేంద్రం ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఇంపోర్టెడ్ పార్ట్స్ వినియోగం ఫేమ్2 పథకం నిబంధనల ప్రకారం.. మేడ్ ఇన్ ఇండియా కాంపోనెంట్లను ఉపయోగించి ఎలక్ట్రిక్ వాహనాలను ఉత్పత్తి చేస్తే ప్రోత్సాహకాలు వర్తిస్తాయి. కానీ ఈ ఏడు సంస్థలు విదేశాల దిగుమతి చేసుకున్న విడి భాగాలను ఉపయోగించినట్లు దర్యాప్తులో తేలింది. చాలా ఈవీ కంపెనీలు ఈ ఎలక్ట్రిక్ వాహనాల దేశీయ తయారీని పెంచడానికి ఉద్దేశించిన దశల తయారీ ప్రణాళిక (PMP) నిబంధనలను పాటించకుండా సబ్సిడీలను క్లెయిమ్ చేస్తున్నారని ఆరోపిస్తూ అనామక ఈ-మెయిల్లు అందడంతో మంత్రిత్వ శాఖ విచారణ చేపట్టింది. ఎలక్ట్రిక్, హైబ్రిడ్ వాహనాలను ప్రోత్సహించడానికి 2019లో రూ. 10,000 కోట్లతో ఫేమ్2 ((ఫాస్టర్ అడాప్షన్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ ఎలక్ట్రిక్ వెహికల్స్) పథకాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఇది 2015లో రూ. 895 కోట్లతో ప్రారంభించిన ఫేమ్ పథకానికి కొనసాగింపు.
Pagination
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
తప్పక చదవండి
- చంద్రగిరిలో టీడీపీ దౌర్జన్యకాండ
- తెలంగాణ లోక్సభ ఎన్నికల ఫైనల్ పోలింగ్ 65.67 శాతం
- మోదీకి సొంత ఇళ్లు, కారు కూడా లేదట!.. ప్రధాని ఆస్తులివే..
- మాజీ భర్త గే అన్న సుచిత్ర.. స్పందించిన నటుడు
- Royal Challengers Bengaluru: తిరుమల శ్రీవారి సేవలో ఆర్సీబీ క్రికెటర్లు (ఫొటోలు)
- MS Dhoni: అందుకే వాళ్లంటే నాకు, జడ్డూకు చిరాకు!
- స్వాతిమలివాల్పై దాడి.. ఆందోళనకు దిగిన బీజేపీ కార్పొరేటర్లు
- ఢిల్లి లిక్కర్ కేసులో కవిత జ్యుడీషియల్ రిమాండ్ పొడిగింపు
- Tandur: పసికందు ప్రాణం తీసిన పెంపుడు కుక్క
- టీడీపీ కార్యకర్తల్లా పోలీసులు: అనిల్కుమార్ ఆగ్రహం
Advertisement