breaking news
Systematic
-
ఎలక్ట్రానిక్ కంపెనీల హవా
గత కొంతకాలంగా ఎలక్ట్రానిక్ మాన్యుఫాక్చరింగ్ సరీ్వసెస్ (ఈఎంఎస్) రంగం దుమ్మురేపుతోంది. వ్యవస్థాగత వృద్ధికి పలు అంశాలు తోడవడంతో ఈ రంగంలోని కంపెనీలు భారీ లాభాలతో పరుగులు తీస్తున్నాయి. చైనాయేతర తయారీ తదితర అంశాలతో ఏర్పడుతున్న డిమాండ్ ఈ రంగానికి బలాన్నిస్తోంది. దీంతో ఇటీవల దేశీ స్టాక్ మార్కెట్లో హవా చూపుతున్న ఈఎంఎస్ దిగ్గజాలు మరింత స్పీడందుకోనున్నట్లు పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి. మేకిన్ ఇండియాతో తయారీకి దన్నుగా నిలుస్తున్న కేంద్ర ప్రభుత్వ విధానాలు, చైనాయేతర దేశాలలో తయారీ యూనిట్ల ఏర్పాటుపై గ్లోబల్ దిగ్గజాల దృష్టి దేశీయంగా ఈఎంఎస్ కంపెనీలకు జోష్నిస్తోంది. దీనికితోడు కన్జూమర్ డ్యూరబుల్స్, ఆటో, ఇండ్రస్టియల్, ఎనర్జీ, డిఫెన్స్, మెడికల్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ రంగాల నుంచి పటిష్ట డిమాండ్ వీటికి జత కలుస్తోంది. వెరసి ఈఎంఎస్ రంగంలోని పలు లిస్టెడ్ కంపెనీలు కొద్ది నెలలుగా ర్యాలీ బాటలో సాగుతున్నాయి. ఇటు దేశీ డిమాండుకుతోడు అటు ఎగుమతులు సైతం పుంజుకోవడం కంపెనీలకు ప్రోత్సాహాన్నిస్తోంది. నిజానికి ఈ రంగంలో మార్జిన్లు తక్కువకావడంతో అధిక అమ్మకాల పరిమాణమే కంపెనీలకు లబ్ధిని చేకూరుస్తుంది. అయినప్పటికీ కొద్ది నెలలుగా ఈ రంగం వెలుగులో నిలుస్తోంది. భారీ అంచనాలు దేశీయంగా ఈఎంఎస్ రంగం 2022–23 నుంచి 2027–28 కాలంలో వార్షికంగా 25 శాతం వృద్ధి సాధించనున్నట్లు పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి. దీంతో 2027–28కల్లా రూ. 27.7 లక్షల కోట్లను తాకగలదని అంచనా వేశాయి. ఈ రంగం విలువ 2022లో రూ. 8.4 లక్షల కోట్లుగా నమోదైంది. ఈ గణాంకాల ప్రకారం వేసిన అంచనాలివి. కాగా.. ప్రభుత్వం స్థానిక తయారీకి దన్నునిస్తూ ప్రోత్సాహకాలతో కూడిన పథకాలను ప్రవేశపెడుతోంది. తద్వారా గ్లోబల్ దిగ్గజాలను దేశీయంగా తయారీకి ఆహ్వానిస్తోంది. దేశీయంగా పటిష్టస్థాయిలో ఇంజనీరింగ్, డిజైన్ సామర్థ్యాలు అందుబాటులో ఉండటానికితోడు.. నైపుణ్యంగల మానవవనరులు చౌకగా లభిస్తాయి. అంతేకాకుండా ఈఎంఎస్ రంగానికి భారత్ భారీ మార్కెట్ కూడా. అధిక శాతం కంపెనీలు బీటూబీ కస్టమర్లపైనే దృష్టిపెడుతున్నాయి.కీలక రంగాల దన్ను అధిక మార్జిన్లకు వీలున్న ఏరోస్పేస్, ఇండ్రస్టియల్స్, ఆటోమోటివ్, క్రిటికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్పై ఆర్డర్లు లభిస్తుండటంతో లిస్టెడ్ కంపెనీల లాభదాయకత మెరుగుపడుతోంది. ఇందుకు దేశీ కంపెనీలు సంక్లిష్ట ప్రొడక్టుల అభివృద్ధిలో పోటీ పడుతున్నాయి. దేశీయంగా కన్జూమర్ ఎల్రక్టానిక్స్ విస్తృతి తక్కువగా ఉండటం, వినియోగంపై వెచి్చంచగల ఆదాయాలు పుంజుకోవడం వంటి అంశాలు కంపెనీలకు అండగా నిలుస్తున్నాయి. తయారీలో స్థానికతకు ప్రాధాన్యత, అధిక విలువగల ప్రొడక్టుల తయారీలో నైపుణ్యం వంటి అంశాలతో లిస్టెడ్ దిగ్గజాలు దేశీయంగా ఈఎంఎస్ వ్యవస్థను ఏర్పాటు చేశాయి. ఫలితంగా ప్రపంచస్థాయిలో పోటీపడే తయారీ కేంద్రంగా భారత్కు ప్రాధాన్యత ఏర్పడింది. ఈ నేపథ్యంలో బలపడుతున్న ఆర్డర్ల బుక్ లిస్టెడ్ దిగ్గజాలకు బూస్ట్నిస్తోంది. దిగ్గజాల దూకుడు దేశీ లిస్టెడ్ దిగ్గజాలలో డిక్సన్ టెక్నాలజీస్, కేన్స్ టెక్నాలజీస్, అంబర్ ఎంటర్ప్రైజెస్, అవలాన్ టెక్నాలజీస్, సిర్మా ఎస్జీఎస్, సైయెంట్ డీఎల్ఎం, డేటా ప్యాటర్న్స్ ఇండియా తదితరాలున్నాయి. వీటిలో డిక్సన్, అంబర్ను మినహాయిస్తే మొత్తం ఆర్డర్ బుక్ విలువ గతేడాదికల్లా(2024–25) వార్షికంగా 23 శాతం పురోభివృద్ధిని సాధించింది. రూ. 16,300 కోట్లకు చేరింది. ఇక గతేడాది లిస్టెడ్ దిగ్గజాల మొత్తం ఆదాయం వార్షికంగా 84 శాతం జంప్చేసి రూ. 58,600 కోట్లను తాకింది. ఆదాయంలో డిక్సన్ 2 రెట్లు దూసుకెళ్లగా.. కేన్స్ 51 శాతం, అంబర్ 48 శాతం చొప్పున జంప్చేశాయి. ఇతర సంస్థల ఆదాయం సగటున 20 శాతానికిపైగా ఎగసింది. మొత్తం నిర్వహణ లాభం 73 శాతం పురోగమించి రూ. 3,500 కోట్లను తాకింది.– సాక్షి, బిజినెస్ డెస్క్ -
‘ప్రచారం’ చేస్తున్నా పడని ఓట్లు
సాక్షి, కాకినాడ :నూరు శాతం పోలింగ్ కోసం కేంద్ర ఎన్నికల సంఘం కోట్లు ఖర్చు చేస్తోంది. ఇందుకోసం సిస్టమేటిక్ ఓటర్ ఎడ్యుకేషన్ అండ్ ఎలక్ట్రోరల్ పార్టిసిపేషన్ (ఎస్వీఈఈపీ) అనే కార్యక్రమం చేపట్టింది. ఉన్నత విద్యాలయాల్లో ఓటు హక్కుపై సదస్సులు, సమావేశాలు నిర్వహించింది. ఓటు హక్కు ప్రాధాన్యాన్ని చాటుతూ ఊరూరా ర్యాలీలు, ఫ్లెక్సీలతో ప్రచారం చేసింది. అయినా ఇంకా లక్షలాది మంది పోలింగ్ బూత్ల వైపు తొంగి చూడడం లేదు. ఇటీవల జరిగిన మున్సిపల్, ప్రాదేశిక ఎన్నికల్లో ఈ విషయం స్పష్టమైంది. గత ఎన్నికలతో పోలిస్తే పోలింగ్ శాతం పెరిగిన మాట వాస్తవమే అయినా ఇంకా ఓటు వేయడంపై లక్షలాదిమందిలో నిరాసక్తత ఉండడం ఆందోళన కలిగిస్తోంది. గ్రామీణ ఓటర్ల కంటే పట్టణ ఓటర్లే తమ హక్కు వినియోగంపై అలసత్వం వహిస్తున్నారని గణాంకాలు చెబుతున్నాయి. రెండు విడతలుగా జరిగిన జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో ఈసారి 81.05 శాతం పోలింగ్ నమోదైంది. తొలివిడతలో 12,81,692 మంది ఓటర్లకు 10,63,697 మంది, రెండో విడతలో 13,44,001 మంది ఓటర్లకు 10,63,356 మంది ఓటేశారు. తొలి విడతలో 2,17,995 మంది, రెండో విడతలో 2,80,645 మంది ఓటు హక్కు వినియోగించుకోలేదు. ఎన్నికల సంఘం ఎంత ప్రచారం చేసినా గ్రామీణ ఓటర్లలో 4,98,640 మంది పోలింగ్కు దూరంగా ఉన్నారు. ఇక మున్సిపల్ ఎన్నికలను పరిశీలిస్తే ఈసారి 74.38 శాతం పోలింగ్ నమోదైంది. 2005లో ఇది 65 శాతానికి మించలేదు. అయితే ఈసారి 25.62 శాతం మంది ఓటర్లు ఓటేయలేదు. రాజమండ్రి కార్పొరేషన్తో పాటు ఏడు మున్సిపాల్టీలు, మూడు నగర పంచాయతీల పరిధిలో 5,38,548 మంది ఓటర్లుంటే 4,00,558 మంది మాత్రమే ఓటేశారు. 1,37,990 మంది ఎన్నికలపై ఆసక్తిని కనబరచలేదు. మొత్తమ్మీద రెండు ఎన్నికలను పరిశీలిస్తే గ్రామాల్లో కంటే పట్టణాల్లో అదనంగా 7.67 శాతం మంది ఓటింగ్కు దూరంగా ఉన్నారు. రెండు ఎన్నికల్లో 31,64,241 మంది ఓటర్లుండగా 25,27,611 మంది ఓటేశారు. 6,36,630 మంది ఓటేయడానికి ఆసక్తి చూపలేదు. నిర్లిప్తతను వీడాలి.. ఐదేళ్లకోసారి ఒక్క గంట కేటాయిస్తే చాలు.. తమ తలరాతలు మార్చే ప్రతినిధిని ఎన్నుకోవచ్చన్న వాస్తవాన్ని ఓటర్లు గుర్తించాలి. ఓటేసినప్పుడే ప్రజాప్రతినిధిని, ప్రభుత్వాన్ని నిలదీసే హక్కు ఉంటుందని తెలుసుకోవాలి. ఒకవేళ బరిలో నిలిచిన అభ్యర్థుల్లో ఎవరూ నచ్చకపోతే.. ఇప్పుడు ప్రవేశపెడుతున్న ‘నోటా’ బటన్ నొక్కినా ఓటు హక్కు వినియోగించుకున్నట్టే. ‘నేను ఒక్కడినే ఓటేయకపోతే మన తలరాతలు మారవు కదా!’ అన్న నిర్లిప్తతను వీడాలి. ఓటర్లను తరలించే బాధ్యత ఎన్నికల కమిషన్ తీసుకోవాలి ఓటు హక్కు ప్రాధాన్యాన్ని చెబుతూ ఎన్ని కార్యక్రమాలు నిర్వహించినా ఓటర్ను పోలింగ్ కేంద్రానికి రప్పించడమే అసలైన పని. వాహన సదుపాయం కల్పించి బూత్లకు రప్పించడంలో రాజకీయ పార్టీలే ఇప్పటికీ క్రియాశీలక పాత్ర పోషిస్తున్నాయి. ఇలా వాహనాలు ఏర్పాటు చేయడంపై ఆంక్షలు విధించిన ఎన్నికల కమిషన్ వృద్ధులు, మహిళలు, అస్వస్థులను పోలింగ్ కేంద్రాలకు రప్పించే ఏర్పాట్లపై దృష్టి పెట్టలేదు. జిల్లాలో ఏజెన్సీతో పాటు లంక గ్రామాల్లో వాగులు, వంకలు, కాలువలు దాటి బూత్లకు వెళ్లాల్సి ఉంది. ఇలాంటి చోట సరైన వాహన సౌకర్యాన్ని ఏర్పాటు చేయాలి. పోలింగ్ రోజుతో పాటు ముందు రోజు, మర్నాడు కూడా ప్రభుత్వపరంగా సెలవు ప్రకటిస్తే దూరప్రాంతాల్లో ఉండే ఓటర్లు స్వస్థలాలకు వచ్చి ఓటేసే అవకాశం ఉంటుంది. కొత్తగా ఓటు నమోదు చేసుకున్న వారిలో యువతే అధికం. వారు ఓటు హక్కు వినియోగించుకునేలా ప్రోత్సహించాలి. పోల్ స్లిప్లను కూడా రెండు రోజులు ముందే పంపిణీ చేయాలి.