-
కేఎల్ రాహుల్ అవుటైనా సరే.. సంజీవ్ గోయెంక రియాక్షన్ వైరల్!
రెండేళ్ల క్రితం ఐపీఎల్లో అడుగుపెట్టిన లక్నో సూపర్ జెయింట్స్ వరుసగా రెండుసార్లు ప్లే ఆఫ్స్ చేరింది. కేఎల్ రాహుల్ కెప్టెన్సీలో టాప్-4కు అర్హత సాధించి సత్తా చాటింది. కానీ ఐపీఎల్-2024లో మాత్రం ఈ ఫీట్ పునరావృతం చేసే అవకాశాలు కనిపించడం లేదు.ఢిల్లీ క్యాపిటల్స్తో మంగళవారం నాటి మ్యాచ్లో లక్నో 19 పరుగుల తేడాతో ఓడిపోయింది. తద్వారా ప్లే ఆఫ్స్ రేసు అవకాశాలను సంక్లిష్టం చేసుకున్న లక్నో.. మిగిలిన మ్యాచ్లో గెలిచినా.. ఇతర జట్ల ఫలితాలపై ఆధారపడాల్సిన దుస్థితి.ఈ నేపథ్యంలో ఢిల్లీతో మ్యాచ్ సందర్భంగా లక్నో యజమాని సంజీవ్ గోయెంక ఇచ్చిన రియాక్షన్స్ వైరల్గా మారాయి. కాగా గత మ్యాచ్లో సన్రైజర్స్ హైదరాబాద్తో లక్నో చిత్తుగా ఓడిపోయిన విషయం తెలిసిందే.ఈ మ్యాచ్లో కెప్టెన్గా, వికెట్ కీపర్ బ్యాటర్గా కేఎల్ రాహుల్ విఫలమయ్యాడు. ఈ నేపథ్యంలో సంజీవ్ గోయెంక మైదానంలోనే అతడిపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. రాహుల్ వివరణ ఇస్తున్నా పట్టించుకోకుండా కోపంతో ఊగిపోయాడు.ఇందుకు సంబంధించిన దృశ్యాలు నెట్టింట విరివిగా చక్కర్లు కొట్టగా సంజీవ్ గోయెంక తీరుపై విమర్శలు వెల్లువెత్తాయి. టీమిండియా స్టార్ పట్ల ఇలా వ్యవహరించడం సరికాదంటూ మాజీ క్రికెటర్లు హితవు పలికారు.ఈ క్రమంలో పొరపాటు గ్రహించిన సంజీవ్ గోయెంక ఢిల్లీతో మ్యాచ్కు ముందు రాహుల్ను తన ఇంటికి డిన్నర్కు పిలిచాడు. ఈ నేపథ్యంలో అతడిని ప్రేమగా హత్తుకున్న ఫొటోను బయటకు వదిలారు. తమ మధ్య అంతా బాగానే ఉందనే సంకేతాలు ఇచ్చారు. Goenka smiling after KL Rahul's wicket pic.twitter.com/R0K4BVteSN— Div🦁 (@div_yumm) May 14, 2024 ఈ క్రమంలో ఢిల్లీ క్యాపిటల్స్తో మ్యాచ్ సందర్భంగా కెమెరాలన్నీ సంజీవ్ గోయెంక వైపే దృష్టి సారించాయి. కేఎల్ రాహుల్ ఐదు పరుగులకే అవుటైనా గోయెంక చిన్నగా నవ్వులు చిందించాడే తప్ప కోపం తెచ్చుకోలేదు. Sanjeev Goenka appreciating KL Rahul's catch. pic.twitter.com/pAeTqjcnTB— Mufaddal Vohra (@mufaddal_vohra) May 14, 2024 అదే విధంగా.. షాయీ హోప్ ఇచ్చిన క్యాచ్ను రాహుల్ పట్టగానే లేచి నిలబడి మరీ చప్పట్లు కొడుతూ అతడిని అభినందించాడు. ఇక మ్యాచ్ ఓడిపోయిన తర్వాత మైదానంలో కేఎల్ రాహుల్తో నవ్వుతూ మాట్లాడాడు. ఇందుకు సంబంధించిన ఫొటోలు బయటకురాగా నెటిజన్లు తమదైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు. ‘‘ఇంతలో ఎంత మార్పు సార్.. మీరు సూపర్’’ అంటూ సెటైర్లు వేస్తున్నారు.చదవండి: సీజన్ మొత్తం మాకు అదే సమస్య.. అందుకే ఈ దుస్థితి: కేఎల్ రాహుల్ Ishant Sharma x Mukesh Kumar ⚡️⚡️The duo combine to dismiss the #LSG openers 👏👏Watch the match LIVE on @StarSportsIndia and @JioCinema 💻📱#TATAIPL | #DCvLSG pic.twitter.com/nuFD7AlK28— IndianPremierLeague (@IPL) May 14, 2024A clinical win at home to finish off their home season 🙌 @DelhiCapitals with a lap of honour for their roaring home fans to extend their gratitude for their love and support 🥳#TATAIPL | #DCvLSG pic.twitter.com/DroMjvb9bU— IndianPremierLeague (@IPL) May 15, 2024KL Rahul with Sanjiv Goenka at the special Dinner in Sanjiv Goenka's home last night in Delhi. [LSG] - All is well at LSG Camp. 🌟 pic.twitter.com/W5BtE0Qmff— Johns. (@CricCrazyJohns) May 14, 2024 -
సీజన్ మొత్తం మాకు అదే సమస్య.. అందుకే ఈ దుస్థితి: కేఎల్ రాహుల్
ఐపీఎల్-2024 ప్లే ఆఫ్స్ రేసులో నిలవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్లో లక్నో సూపర్ జెయింట్స్ ఓటమి పాలైంది. ఢిల్లీ క్యాపిటల్స్ చేతిలో 19 పరుగుల తేడాతో ఓడిపోయింది. ఢిల్లీ వేదికగా మంగళవారం జరిగిన ఈ మ్యాచ్ ఫలితంతో రాజస్తాన్ రాయల్స్ ప్లే ఆఫ్స్లో అడుగుపెట్టింది.ఇక సమిష్టి ప్రదర్శనతో లక్నోపై గెలుపుతో లీగ్ దశను ముగించిన ఢిల్లీ క్యాపిటల్స్.. ఓవరాల్గా ఈ సీజన్లో ఏడు విజయాలు సాధించింది. వెళ్తూ వెళ్తూ లక్నో సూపర్ జెయింట్స్ ప్లే ఆఫ్స్ ఆశలను దాదాపుగా గల్లంతు చేసింది.వాళ్లిద్దరు పట్టుదలగా నిలబడ్డారుఈ నేపథ్యంలో లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్ కేఎల్ రాహుల్ ఢిల్లీ చేతిలో ఓటమిపై స్పందించాడు. ‘‘40 ఓవర్ల పాటు వికెట్ ఒకే విధంగా ఉంది. తొలి ఓవర్లోనే మేము జేక్ ఫ్రేజర్ మెగర్క్ను అవుట్ చేసి శుభారంభం అందుకున్నాం.అయితే, దానిని మేము నిలబెట్టుకోలేకపోయాం. షాయీ హోప్, అభిషేక్ పోరెల్ పట్టుదలగా నిలబడ్డారు. ఇక్కడ 200 పెద్ద స్కోరేమీ కాదు. అయినా, లక్ష్య ఛేదనలో మేము తడబడ్డాం.సీజన్ మొత్తం మాకు అదే సమస్యనిజానికి ఇది పూర్తి చేయదగిన టార్గెట్. ఈ సీజన్ ఆసాంతం పవర్ ప్లేలో త్వరగా వికెట్లు కోల్పోవడం మాకు ఇబ్బందికరంగా మారింది. బ్యాటింగ్ పరంగా మాకు ఎప్పుడూ శుభారంభం లభించలేదు.స్టొయినిస్, పూరన్లకు మేము సహకారం అందించలేకపోయాం. అందుకే మేము ఇప్పుడిలా విపత్కర పరిస్థితిలో కూరుకుపోయాం’’ అని కేఎల్ రాహుల్ విచారం వ్యక్తం చేశాడు. కాగా ఈ మ్యాచ్లో రాహుల్ పూర్తిగా విఫలమయ్యాడు. 3 బంతులు ఎదుర్కొన్న ఈ ఓపెనింగ్ బ్యాటర్ కేవలం ఐదు పరుగులు మాత్రమే చేశాడు.ఢిల్లీ వర్సెస్ లక్నో స్కోర్లు👉వేదిక: అరుణ్జైట్లీ స్టేడియం.. ఢిల్లీ👉టాస్: లక్నో.. బౌలింగ్👉ఢిల్లీ స్కోరు: 208/4 (20)👉లక్నో స్కోరు: 189/9 (20)👉ఫలితం: 19 పరుగుల తేడాతో లక్నోపై ఢిల్లీ గెలుపు👉ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్:ఇషాంత్ శర్మ(3/34).చదవండి: Virat Kohli: అదే జరిగితే.. ఆర్సీబీ కెప్టెన్గా మళ్లీ కోహ్లినే!A clinical win at home to finish off their season 🙌 @DelhiCapitals with a lap of honour for their roaring home fans to extend their gratitude for their love and support 🥳#TATAIPL | #DCvLSG pic.twitter.com/kekvx9uuZK— IndianPremierLeague (@IPL) May 15, 2024 -
కేఎల్ రాహుల్ మాస్టర్ ప్లాన్.. మెక్ గర్క్ సిల్వర్ డక్! వీడియో
ఐపీఎల్-2024లో ఢిల్లీ క్యాపిటల్స్ యువ సంచలనం జేక్ ఫ్రేజర్-మెక్గుర్క్ తొలిసారి నిరాశపరిచాడు. అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా లక్నో సూపర్ జెయింట్స్తో మ్యాచ్లో మెక్గుర్క్ ఖాతా తెరవకుండానే ఔటయ్యాడు. రెండు బంతులు ఎదుర్కొన్న జేక్ ఫ్రేజర్.. డైమండ్ డక్గా వెనుదిరిగాడు. లక్నో కెప్టెన్ కేఎల్ రాహుల్ మాస్టర్ ప్లాన్తో మెక్గుర్క్ను ఆదిలోనే పెవిలియన్కు పంపాడు. ఢిల్లీ ఇన్నింగ్స్ తొలి ఓవర్ వేసిన ఆర్షద్ ఖాన్ రెండో బంతిని లెంగ్త్ డెలివరీగా సంధించాడు. ఈ క్రమంలో జేక్ ఫ్రేజర్-మెక్గుర్క్ లాంగ్-ఆన్ దిశగా భారీ షాట్ ఆడాడు. అయితే మెక్గుర్క్ లాంగ్-ఆన్ దిశగా ఆడుతాడని ముందు గానే పసిగట్టిన రాహుల్.. లాంగ్ ఆన్ ఫీల్డర్లో సెట్ చేశాడు. ఈ క్రమంలో లాంగ్ ఆన్లో ఉన్న నవీన్ ఉల్-హాక్ ఈజీ క్యాచ్ను అందుకున్నాడు.ఇది చూసిన రాహుల్ వెంటనే నేను చెప్పా కదా అన్నట్లు నవ్వుతూ రియాక్షన్ ఇచ్చాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది. కాగా మెక్గర్క్ అద్భుతమైన ఫామ్లో ఉన్నాడు. ఈ ఏడాది సీజన్లో 8 మ్యాచ్లు ఆడిన మెక్ గుర్క్.. 330 పరుగులు చేశాడు. -
కేఎల్ రాహుల్ను ఇంటికి పిలిచిన గోయెంక: అతియా శెట్టి పోస్ట్ వైరల్
లక్నో సూపర్ జెయింట్స్ యజమాని, బడా వ్యాపారవేత్త సంజీవ్ గోయెంక నష్ట నివారణ చర్యలు చేపట్టారు. లక్నో కెప్టెన్ కేఎల్ రాహుల్ను తన ఇంటికి ఆహ్వానించి.. తనపై వస్తున్న విమర్శలకు చెక్ పెట్టే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో రాహుల్ను ఆయన ఆత్మీయంగా హత్తుకున్న ఫొటో నెట్టింట వైరల్గా మారింది.ఐపీఎల్-2022లో ఇండియన్ ప్రీమియర్ లీగ్లో అడుగుపెట్టిన లక్నో ఫ్రాంఛైజీ తమ సారథిగా టీమిండియా స్టార్ కేఎల్ రాహుల్ను నియమించింది. ఈ వికెట్ కీపర్ బ్యాటర్ కెప్టెన్సీలో లక్నో అరంగేట్రంలోనే ప్లే ఆఫ్స్ చేరింది. గతేడాది సైతం టాప్-4తో ముగించింది.ఈ క్రమంలో పదిహేడో ఎడిషన్లోనూ సత్తా చాటాలని పట్టుదలగా ఉంది. అయితే, ప్లే ఆఫ్స్ రేసులో ఆటంకాలు లేకుండా ముందుకు సాగాలంటే సన్రైజర్స్ హైదరాబాద్తో తప్పక గెలవాల్సిన మ్యాచ్లో లక్నో ఓడిపోయింది.అందరూ చూస్తుండగానే చీవాట్లుఈ మ్యాచ్లో ప్యాట్ కమిన్స్ టీమ్ కేఎల్ రాహుల్ సేనను 10 వికెట్ల తేడాతో చిత్తుగా ఓడించి.. బ్యాటింగ్ విధ్వంసంతో పలు రికార్డులు ఖాతాలో వేసుకుంది. ఈ నేపథ్యంలో లక్నో యజమాని సంజీవ్ గోయెంక కెప్టెన్ రాహుల్పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు.మైదానంలో అందరూ చూస్తుండగానే చీవాట్లు పెట్టాడు. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు వైరల్ కావడంతో సంజీవ్ గోయెంక తీరుపై విమర్శలు వెల్లువెత్తాయి. కెప్టెన్ పట్ల ఇంత దారుణంగా ప్రవర్తిస్తారా అంటూ మాజీ క్రికెటర్లు వీరేంద్ర సెహ్వాగ్ వంటి వాళ్లు గోయెంక వ్యవహారశైలిని తప్పుబట్టారు.డిన్నర్ కోసం తన ఇంటికి ఆహ్వానించిఇక ఫ్యాన్స్ అయితే, రాహుల్ ఆత్మగౌరవం నిలబడాలంటే వెంటనే లక్నోకు గుడ్బై చెప్పాలంటూ సోషల్ మీడియా వేదికగా డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో తాజా ఫొటో తెర మీదకు వచ్చింది. కేఎల్ రాహుల్ను డిన్నర్ కోసం తన ఇంటికి ఆహ్వానించిన సంజీవ్ గోయెంక అతడిని ఆలింగనం చేసుకున్నాడు. Sanjiv Goenka invited KL Rahul for dinner at his home last night and both hugged each other.- Everything is okay now in LSG. ❤️ pic.twitter.com/RY9KsiNre3— Tanuj Singh (@ImTanujSingh) May 14, 2024తుపాన్ వెలిసిన తర్వాతఈ నేపథ్యంలో గోయెంక- రాహుల్ మధ్య సఖ్యత కుదిరిందని.. జట్టులో ప్రస్తుతం అంతా బాగానే ఉందనే కామెంట్లు వినిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే.. కేఎల్ రాహుల్ భార్య, నటి అతియా శెట్టి చేసిన పోస్ట్ ఇందుకు బలాన్ని చేకూరుస్తోంది. తుపాన్ వెలిసిన తర్వాత ప్రశాంతంగా ఇలా అంటూ ఆమె మబ్బులు వీడిన సూర్యుడి ఫొటో పంచుకుంది.కాగా ఐపీఎల్-2024లో భాగంగా లక్నో మంగళవారం ఢిల్లీతో తలపడనుంది. ఈ మ్యాచ్లో గెలిస్తే లక్నో ప్లే ఆఫ్స్ ఆశలు సజీవంగా ఉంటాయి. అయితే, మిగిలి ఉన్న మరో మ్యాచ్ గెలవడంతో పాటు ఇందుకోసం ఇతర జట్ల ఫలితాలపై కూడా ఆధారపడాల్సి ఉంటుంది. Athiya Shetty Instagram story.Cryptic post 🤔🤔 pic.twitter.com/HTKdJ95G9d— DREAM11s STATS (@fantasy1Cricket) May 14, 2024 -
రూ. 400 కోట్ల లాభం వస్తోంది.. చాలదా?: సెహ్వాగ్ కామెంట్స్ వైరల్
ఐపీఎల్ ఫ్రాంఛైజీ యజమానులను ఉద్దేశించి టీమిండియా మాజీ బ్యాటర్ వీరేంద్ర సెహ్వాగ్ కీలక వ్యాఖ్యలు చేశాడు. ఆటగాళ్లు, కోచ్లే జట్టును ముందుకు నడిపిస్తారని.. ఈ విషయంలో ఓనర్ల జోక్యం అనవసమా అంటూ ఘాటుగా విమర్శించాడు.వ్యాపారవేత్తలు కేవలం లాభనష్టాల గురించే ఆలోచిస్తారని.. అయితే, మైదానంలోనే ఆటగాళ్లను కించపరిచేలా వ్యవహరించడం సరికాదని హితవు పలికాడు. లక్నో సూపర్ జెయింట్స్ యజమాని సంజీవ్ గోయెంకా ఆ జట్టు కెప్టెన్ కేఎల్ రాహుల్ పట్ల అనుచితంగా ప్రవర్తించిన నేపథ్యంలో సెహ్వాగ్ ఈ మేరకు వ్యాఖ్యలు చేశాడు.కాగా ఐపీఎల్-2024లో సన్రైజర్స్ హైదరాబాద్తో మ్యాచ్లో కేఎల రాహుల్ కెప్టెన్గా, బ్యాటర్గా విఫలమయ్యాడు. ఫలితంగా రైజర్స్ చేతిలో లక్నో చిత్తుగా ఓడిపోయింది. ఈ క్రమంలో సంజీవ్ గోయెంకా మైదానంలోనే రాహుల్తో వాదనకు దిగాడు.అతడు సర్దిచెప్తున్నా వినిపించుకోకుండా ఆగ్రహం ప్రదర్శించాడు. అదే విధంగా కోచ్ జస్టిన్ లాంగర్ పట్ల కూడా ఇదే తరహాలో వ్యవహరించాడు గోయెంకా. ఈ విషయంపై స్పందించిన సెహ్వాగ్ క్రిక్బజ్ షోలో తన అభిప్రాయాలు పంచుకున్నాడు.‘‘డ్రెస్సింగ్ రూం లేదంటే ప్రెస్ మీట్ సమయంలోనే ఓనర్లు ఆటగాళ్లతో మాట్లాడాలి. అది కూడా వాళ్లలో స్ఫూర్తి నింపేలా వ్యవహరించాలి గానీ.. ‘‘సమస్య ఏంటి? ఏం జరుగుతోంది?’’ అంటూ మైదానంలోనే ఇలా వ్యవహరించకూడదు.కోచ్లు, కెప్టెన్ జట్టును నడిపిస్తారు. కాబట్టి ఓనర్లు ఆటగాళ్ల విషయాల్లో జోక్యం చేసుకోకపోవడమే బెటర్. వాళ్లంతా వ్యాపారవేత్తలు. వాళ్లకు కేవలం లాభం, నష్టం గురించి మాత్రమే తెలుసు.అయినా ఇక్కడ వారికి ఎలాంటి లాస్ లేదు. 400 కోట్ల రూపాయల వరకు లాభం ఆర్జిస్తున్నారు. అంటే.. ఇక్కడ వాళ్లకు నష్టమేమీ ఉండదు కదా అని అంటున్నా! లాభాలు తీసుకోవడం తప్ప జట్టులో ఏం జరిగినా పట్టించుకునే అవసరం పెద్దగా లేదనే అనుకుంటున్నా. మీరేమైనా చెప్పాలనుకుంటే ఆటగాళ్లను మోటివేట్ చేసేలా ఉండాలి.ఐపీఎల్లో చాలా ఫ్రాంఛైజీలు ఉన్నాయి. ఆటగాడు ఓ జట్టును వీడితే మరో జట్టు అతడిని తీసుకుంటుంది. కీలకమైన ఆటగాడిని కోల్పోతే మీ విజయాల శాతం సున్నా అవుతుంది. నేను పంజాబ్ జట్టును వీడినపుడు వాళ్లు ఐదో స్థానంలో ఉన్నారు. ఆ తర్వాత ఎప్పుడూ కనీసం ఐదో స్థానంతో ముగించలేకపోయారు’’ అని సెహ్వాగ్ ఘాటు వ్యాఖ్యలు చేశాడు. -
కేఎల్ రాహుల్కు సారీ.. లక్నోతోనే టీమిండియా స్టార్?!
భారత స్టార్ క్రికెటర్ కెప్టెన్ కేఎల్ రాహుల్ లక్నో సూపర్ జెయింట్స్ను వీడనున్నాడనే వార్తల నేపథ్యంలో ఆ జట్టు సన్నిహిత వర్గాలు కీలక అప్డేట్ అందించాయి. కెప్టెన్- యాజమాన్యం మధ్య అంతాబాగానే ఉందని స్పష్టం చేశాయి. కాగా ఐపీఎల్-2024లో హైదరాబాద్లో సన్రైజర్స్తో ఘోర ఓటమి నేపథ్యంలో కేఎల్ రాహుల్కు ఘోర అవమానం జరిగిన విషయం తెలిసిందే. లక్నో ఫ్రాంచైజీ యజమాని సంజీవ్ గోయెంకా మైదానంలోకి వచ్చి రాహుల్పై తీవ్ర అసహనాన్ని ప్రదర్శించారు. రాహుల్పై గోయెంకా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్లుగా ఉన్న వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఫలితంగా.. ఫ్రాంచైజీ అసంతృప్తి నేపథ్యంలో రాహుల్ మిగిలిన రెండు మ్యాచ్ల్లో పగ్గాలు వదిలేసి పూర్తిగా బ్యాటింగ్పై శ్రద్ధ పెడతాడా లేదా ఫ్రాంఛైజీకి గుడ్బై చెబుతాడా? అనేవి చర్చనీయాంశంగా మారాయి. ఈ క్రమంలో.. ‘లక్నో ఈ నెల 14న ఢిల్లీ క్యాపిటల్స్తో తలపడుతుంది. ఇందుకు ఇంకా గడువు ఉండటంతో ఏ నిర్ణయం తీసుకోలేదు. మేనేజ్మెంట్ తప్పిస్తుందా లేదంటే కెప్టెన్ రాహులే వైదొలగుతాడా అనే దానిపై త్వరలోనే స్పష్టత వస్తుంది’ అని ఐపీఎల్ వర్గాలు తెలిపాయి.తాజాగా ఈ విషయం గురించి లక్నో వర్గాలు స్పందిస్తూ.. ‘‘కేఎల్ రాహుల్ను కెప్టెన్సీ నుంచి తప్పించడమే గాక... వచ్చే వేలంలో కూడా అతడిని లక్నో తీసుకోదు అని వస్తున్నవి కేవలం వదంతులు మాత్రమే.గత మ్యాచ్ ఫలితం మాకు అనుకూలంగా లేదనే బాధ ఉంది. అయితే, జట్టు, ఓనర్ల మధ్య అంతా బాగానే ఉంది. రాహుల్ కూడా బాగున్నాడు. ఢిల్లీతో మ్యాచ్కు ముందు అతడు విశ్రాంతి తీసుకుంటున్నాడంతే!’’ అని వార్తా సంస్థ IANSకు తెలిపాయి. కాగా సంజీవ్ గోయెంకా తీరుతో రాహుల్ తీవ్ర మనస్తాపం చెందడం, సోషల్ మీడియాలో తనపై పెద్ద ఎత్తున నెగటివిటీ రావడంతో ఆయన అతడిని క్షమాపణ కోరినట్లు వదంతులు వినిపిస్తున్నాయి.చదవండి: ప్లే ఆఫ్స్ రేసులో ఉండాలంటే.. సన్రైజర్స్ చేయాల్సిందిదే! ఆ రెండు జట్లు కన్ఫామ్!? -
అత్యుత్తమ ఓనర్ అతడే.. ఓ ఎమోషన్: గంభీర్ వ్యాఖ్యలు వైరల్
ఇండియన్ ప్రీమియర్ లీగ్లో విజయవంతమైన కెప్టెన్లలో టీమిండియా మాజీ ఓపెనర్ గౌతం గంభీర్ ఒకడు. రోహిత్ శర్మ(ముంబై ఇండియన్స్), మహేంద్ర సింగ్ ధోని(చెన్నై సూపర్ కింగ్స్) చెరో ఐదుసార్లు టైటిల్ గెలవగా.. గంభీర్ రెండుసార్లు ట్రోఫీ అందుకున్నాడు.కోల్కతా నైట్ రైడర్స్ను 2012, 2014 సీజన్లలో చాంపియన్గా నిలిపాడు. ఆ తర్వాత ఢిల్లీ ఫ్రాంఛైజీకి మారినా స్థాయికి తగ్గట్లు రాణించలేక క్యాష్ రిచ్ లీగ్కు గంభీర్ గుడ్బై చెప్పాడు. మళ్లీ ఐపీఎల్-2023లో లక్నో సూపర్ జెయింట్స్ మెంటార్గా రీఎంట్రీ ఇచ్చాడు గౌతీ.అయితే, తాజా ఎడిషన్ నేపథ్యంలో మెంటార్గా సొంతగూటికి చేరుకున్నాడు గంభీర్. అతడి మార్గదర్శనంలో కేకేఆర్ మరోసారి టైటిల్ దిశగా అడుగులు వేస్తోంది. ఇప్పటికే ప్లే ఆఫ్స్ రేసులో ముందున్న కోల్కతా ట్రోఫీ గెలవడమే లక్ష్యంగా ముందుకు సాగుతోంది.ఇదిలా ఉంటే.. కేకేఆర్ సహ యజమాని షారుఖ్ ఖాన్తో తనకున్న అనుబంధం గురించి గౌతం గంభీర్ తాజాగా చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. స్పోర్ట్స్కీడాతో మాట్లాడుతూ.. ‘‘అతడితో నా బంధం ఎంతో అద్భుతమైనది. నాతో కలిసి పనిచేసిన ఫ్రాంఛైజీ ఓనర్లలో అత్యుత్తమ వ్యక్తి అతడు.కేవలం నిరాడంబరంగా ఉంటాడని మాత్రమే నేను ఈ మాట చెప్పడం లేదు. ఎంత ఎదిగినా ఒదిగే ఉండే తత్వం అతడిది. క్రికెటింగ్ విషయాల్లో అస్సలు జోక్యం చేసుకోడు.స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకునే వాతావరణం కల్పిస్తాడు. అలాంటి ఓనర్ ఉండటం నిజంగా అదృష్టం. నా ప్రతీ నిర్ణయంపై నమ్మకం ఉంచి.. నాకు మద్దతుగా నిలిచాడు.అందుకే ఫలితాలతో సంబంధం లేకుండా మా అనుబంధం ఇన్నేళ్లుగా కొనసాగుతోంది. 2011 నుంచి అతడితో నా బంధం ఇలాగే ఉంది. ఎస్ఆర్కే ఓ ఎమోషన్ అని అందరూ చెప్తారు. అయితే, అతడితో పాటు నాకు కేకేఆర్ కూడా ఓ ఎమోషనే! పరస్పరం నమ్మకం ఉంటేనే ముందుకు వెళ్లగలుగుతాం’’ అని గంభీర్ చెప్పుకొచ్చాడు.కాగా లక్నో సూపర్ జెయింట్స్ సంజీవ్ గోయెంకా ఆ జట్టు కెప్టెన్ కేఎల్ రాహుల్ను బహిరంగంగానే తిట్టిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో లక్నో యాజమాన్యంతో కలిసి పనిచేసిన గంభీర్ ఈ మేరకు వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. -
KL Rahul: జట్టు గెలవాలన్న తపనే అది: ఆసీస్ దిగ్గజం.
రెండేళ్ల క్రితం ఇండియన్ ప్రీమియర్ లీగ్లో అడుగుపెట్టింది లక్నో సూపర్ జెయింట్స్. కేఎల్ రాహుల్ కెప్టెన్సీలో వరుసగా రెండుసార్లు ప్లే ఆఫ్స్ చేరింది. తద్వారా క్యాష్ రిచ్ లీగ్ ఆరంభం నుంచి ఉన్న కొన్ని జట్లకు సాధ్యం కాని ఘనతను లక్నో సాధించింది.ఐపీఎల్-2024లోనూ ప్లే ఆఫ్స్ రేసులో ముందుకు వెళ్లాలని పట్టుదలగా ఉంది. కేఎల్ రాహుల్ వికెట్ కీపర్ బ్యాటర్గా, కెప్టెన్గా రాణిస్తూ జట్టును టాప్-4లో నిలిపేందుకు తన వంతు కృషి చేస్తున్నాడు.అయితే, టాప్-4లో అడుగుపెట్టాలంటే కీలకమైన మ్యాచ్లో లక్నో చిత్తుగా ఓడిపోయింది. సన్రైజర్స్ హైదాబాద్తో బుధవారం నాటి మ్యాచ్లో పది వికెట్ల తేడాతో పరాజయం పాలైంది. ఈ మ్యాచ్లో కేఎల్ రాహుల్ బ్యాటర్గా, సారథిగా విఫలమయ్యాడు.ఈ నేపథ్యంలో లక్నో సూపర్ జెయింట్స్ యజమాని సంజీవ్ గోయెంకా అందరి ముందే కేఎల్ రాహుల్, కోచ్ జస్టిన్ లాంగర్కు గట్టిగా చీవాట్లు పెట్టాడు. దీంతో సంజీవ్ గోయెంకా తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రెండుసార్లు జట్టును ప్లే ఆఫ్స్ వరకు తీసుకువచ్చిన కెప్టెన్కు మీరిచ్చే గౌరవం ఇదేనా అంటూ మహ్మద్ షమీ వంటి ప్రముఖులు ఫైర్ అవుతున్నారు.ఈ క్రమంలో ఆస్ట్రేలియా దిగ్గజ పేసర్ బ్రెట్ లీ భిన్నంగా స్పందించాడు. ‘‘అందరి ముందు అలా మాట్లాడేకంటే.. లోపలికి వెళ్లిన తర్వాత చర్చించాల్సింది. ఒకవేళ అదే జరిగితే ఈ విషయం గురించి స్పందించమనే ప్రశ్న నాకు ఎదురయ్యేదే కాదు.అయితే, నాణేనికి మరోవైపు కూడా ఆలోచించాలి. ఆట పట్ల జట్ల యజమానులు, కోచ్లకు ఉన్న ప్యాషన్ను మనం అర్థం చేసుకోవాలి. వాళ్ల జట్టు అత్యుత్తమంగా రాణించాలని కోరుకోవడంలో తప్పు లేదు. బహుశా అందుకే ఈ ఘటన జరిగి ఉంటుంది’’ అని బ్రెట్ లీ ఢిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో వ్యాఖ్యానించాడు. చదవండి: ద్రవిడ్ గుడ్ బై!.. టీమిండియా కొత్త కోచ్గా ఫారినర్?.. జై షా కామెంట్స్ వైరల్ -
సిగ్గు పడండి.. కెమెరాల ముందు ఇలా చేస్తారా?: మహ్మద్ షమీ ఫైర్
లక్నో సూపర్ జెయింట్స్ యజమాని సంజీవ్ గోయెంకాపై టీమిండియా స్టార్ పేసర్ మహ్మద్ షమీ ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఆటగాళ్లను కించపరిచేలా వ్యవహరించడం సరికాదని విమర్శించాడు. కెప్టెన్ పట్ల బహిరంగంగా అసహనం వ్యక్తం చేయడం సిగ్గు చేటంటూ ఘాటు వ్యాఖ్యలు చేశాడు.కాగా సన్రైజర్స్ హైదరాబాద్ చేతిలో లక్నో సూపర్ జెయింట్స్ ఘోర పరాజయం పాలైన విషయం తెలిసిందే. ఉప్పల్లో బుధవారం జరిగిన ఈ మ్యాచ్లో కేఎల్ రాహుల్ సేన నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 165 పరుగులు చేయగలిగింది.టాపార్డర్ పూర్తిగా విఫలం కాగా ఐదు, ఆరు స్థానాల్లో వచ్చిన నికోలస్ పూరన్(48), ఆరో నంబర్ బ్యాటర్ ఆయుశ్ బదోని(55) అద్భుత ఇన్నింగ్స్ చేయడంతో ఈ మాత్రం పరుగులు రాబట్టింది.ఇక ఈ మ్యాచ్లో రాహుల్ 33 బంతులు ఎదుర్కొని కేవలం 29 పరుగులు మాత్రమే చేశాడు. ఇక లక్ష్య ఛేదనకు దిగిన సన్రైజర్స్ ఓపెనర్లు అభిషేక్ శర్మ(28 బంతుల్లో 75), ట్రావిస్ హెడ్(30 బంతుల్లో 89) విధ్వంసకర ఇన్నింగ్స్ కారణంగా 9.4 ఓవర్లలోనే పని పూర్తి చేసింది.ఫలితంగా లక్నో 10 వికెట్ల తేడాతో చిత్తుగా ఓడింది. ఈ నేపథ్యంలో లక్నో యజమాని కెప్టెన్ కేఎల్ రాహుల్పై అందరి ముందే సీరియస్ అయ్యాడు. రాహుల్ వివరణ ఇచ్చేందుకు ప్రయత్నించినా అస్సలు వినిపించుకోలేదు.ఇందుకు సంబంధించిన వీడియోలు వైరల్ కాగా.. సంజీవ్ గోయెంకా తీరుపై విమర్శలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో మహ్మద్ షమీ స్పందిస్తూ.. గోయెంకా తీరును తప్పుబట్టాడు.‘‘ఆటగాళ్లకు ఆత్మ గౌరవం ఉంటుంది. యజమానిగా మీరు కూడా ఒక గౌరవప్రదమైన స్థాయిలో ఉన్న వ్యక్తి. చాలా మంది మిమ్మల్ని చూసి చాలా విషయాలు నేర్చుకుంటారు.కెమెరాల ముందు మీరిలా చేయడం నిజంగా సిగ్గు చేటు. ఇది కచ్చితంగా సిగ్గుపడాల్సిన విషయమే. ఒకవేళ మీరు కెప్టెన్తో మాట్లాడాలనుకుంటే అందుకు ఎన్నో మార్గాలు ఉన్నాయి.డ్రెసింగ్రూం లేదంటే హోటల్ రూంలో కెప్టెన్తో మాట్లాడవచ్చు. కానీ ఇలా అందరి ముందే మైదానంలో ఇలా అరిచేయడం సరికాదు. ఇలా చేయడం ద్వారా ఎర్రకోట మీద జెండా ఎగురవేసినంత గొప్ప ఏమైనా వచ్చిందేంటి?అతడు కేవలం ఆటగాడే కాదు కెప్టెన్ కూడా! ప్రతిసారి ప్రణాళికలు పక్కాగా అమలు చేయలేకపోవచ్చు. ఆటలో గెలుపోటములు సహజం. అంత మాత్రాన కెప్టెన్ కించపరిచేలా వ్యవహరిస్తారా? ఇలా చేసి తప్పుడు సందేశం ప్రజల్లోకి వెళ్లేలా చేశారు’’ అంటూ మహ్మద్ షమీ సంజీవ్ గోయెంకా వ్యవహార శైలిపై విరుచుకుపడ్డాడు. కాగా చీలమండ సర్జరీ కారణంగా షమీ(గుజరాత్ టైటాన్స్) ఐపీఎల్-2024 సీజన్ మొత్తానికి దూరమయ్యాడు. -
IPL 2024: కెప్టెన్సీ నుంచి తప్పుకోనున్న కేఎల్ రాహుల్..?
కేఎల్ రాహుల్ లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్సీ నుంచి తప్పుకోనున్నాడని తెలుస్తుంది. ఈ నిర్ణయం తక్షణమే అమల్లోకి వస్తుందని సమాచారం. ఈ సీజన్లో లక్నో ఆడబోయే తదుపరి రెండు మ్యాచ్ల్లో రాహుల్ సాధారణ ఆటగాడిగా కొనసాగుతాడని ప్రముఖ వార్తా సంస్ధ వెల్లడించిన నివేదిక ద్వారా తెలుస్తుంది.సన్రైజర్స్తో నిన్నటి మ్యాచ్ తదనంతర పరిణామాల్లో రాహుల్ ఈ కఠినమైన నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. సన్రైజర్స్ చేతిలో దారుణ పరాభవాన్ని ఎదుర్కొన్న అనంతరం లక్నో ఫ్రాంచైజీ యజమాని సంజీవ్ గోయంకా రాహుల్ పట్ల చాలా అసభ్యంగా ప్రవర్తించాడు. అందరూ చూస్తుండగానే రాహుల్పై మాటల దాడికి దిగాడు.గొయెంకా నుంచి ఈ తరహా ప్రవర్తనను ఊహించని రాహుల్ తీవ్ర మనస్థాపానికి గురై కెప్టెన్సీ నుంచి వైదొలగాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తుంది. రాహుల్ కెప్టెన్సీ నుంచి తప్పుకోవడానికి మరో కారణం కూడా ఉందని తెలుస్తుంది.గొయెంకా తదుపరి సీజన్లో రాహుల్ను వదించుకోవాలని సన్నిహితుల వద్ద ప్రస్తావించాడని సమాచారం. గొయెంకాకు ఆ అవకాశం ఇవ్వడమెందుకని రాహులే స్వయంగా కెప్టెన్సీ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రచారం జరగుతుంది. 2022 సీజన్లో లక్నో టీమ్ లాంచ్ అయినప్పుడు రాహుల్ను గొయెంకా 17 కోట్ల రికార్డు ధరకు సొంతం చేసుకున్నాడు.ఈ సీజన్లో లక్నో ఆడబోయే తదుపరి మ్యాచ్కు ఐదు రోజుల సమయం ఉండటంతో రాహుల్ నిర్ణయం ఏ క్షణానైనా వెలువడవచ్చని సమాచారం. గొయెంకా గతంలో పూణే వారియర్స్ అధినేతగా ఉన్నప్పుడు ధోని విషయంలోనూ ఇలాగే వ్యవహరించాడు. ఓ సీజన్ తర్వాత ధోనిని తప్పించి స్టీవ్ స్మిత్ను కెప్టెన్గా నియమించాడు.ఇదిలా ఉంటే, నిన్నటి మ్యాచ్లో సన్రైజర్స్ చేతిలో ఓడినప్పటికీ లక్నో ప్లే ఆఫ్స్ అవకాశాలు ఇంకా సజీవంగానే ఉన్నాయి. లక్నో తదుపరి ఆడబోయే రెండు మ్యాచ్ల్లో భారీ తేడాతో గెలిస్తే 16 పాయింట్లతో ప్లే ఆఫ్స్ రేసులో ఉంటుంది. అయితే ఈ జట్టు ప్లే ఆఫ్స్ బెర్త్ మిగిలిన జట్ల జయాపజయాలపై అధారపడి ఉంటుంది. -
కొడితే ఫోర్లు, సిక్సర్లే!.. ఓడిపోతే అందరూ అనేవాళ్లే!
‘‘నాకసలు ఏం మాట్లాడాలో అర్థం కావడం లేదు. టీవీలోనే ఇలాంటి బ్యాటింగ్ చూశాం. కానీ ఇప్పుడిలా.. అస్సలు నమ్మలేకపోతున్నాం. ప్రతి బంతి బౌండరీ లేదంటే సిక్సర్.వారి నైపుణ్యాలకు హ్యాట్సాఫ్. సిక్స్లు కొట్టేందుకు వాళ్లు పడిన శ్రమ ఇక్కడ కనిపిస్తోంది. సెకండ్ ఇన్నింగ్స్లో అసలు పిచ్ ఎలా ఉంటుందో అంచనా వేసే ఛాన్స్ కూడా వాళ్లు మాకివ్వలేదు.మొదటి బంతి నుంచే వారి దూకుడు కొనసాగగా.. మేము ఏ దశలోనూ అడ్డుకట్ట వేయలేకపోయాం. జట్టు ఓడిపోయినట్లయితే.. మనం తీసుకున్న ప్రతీ నిర్ణయాన్ని ప్రశ్నిస్తూనే ఉంటారు.మేము కనీసం ఇంకో 40- 50 పరుగులు చేయాల్సింది. పవర్ ప్లేలో వికెట్లు కోల్పోయిన తర్వాత అస్సలు కోలుకోలేకపోయాం. ఆయుశ్, నిక్కీ అద్భుతంగా బ్యాటింగ్ చేసినందు వల్లే 166 టార్గెట్ విధించగలిగాం’’ అని లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్ కేఎల్ రాహుల్ అన్నాడు.ఒకవేళ తాము 240 పరుగులు చేసినా సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు ఆ లక్ష్యాన్ని ఛేదించేదేనేమో అంటూ ప్రశంసలు కురిపించాడు. కాగా ఐపీఎల్-2024 తాజా మ్యాచ్లో లక్నో సన్రైజర్స్తో తలపడింది.టాపార్డర్ పూర్తిగా విఫలం ఉప్పల్లో బుధవారం జరిగిన ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన లక్నో తొలుత బ్యాటింగ్ చేసి.. పరుగులు రాబట్టేందుకు ఆపసోపాలు పడింది. ఓపెనర్, కెప్టెన్ కేఎల్ రాహుల్(29) సహా టాపార్డర్లో క్వింటన్ డికాక్(2), మార్కస్ స్టొయినిస్(3) పూర్తిగా విఫలమయ్యారు.నాలుగో నంబర్ బ్యాటర్ కృనాల్ పాండ్యా(21 బంతుల్లో 24) నిలదొక్కునే ప్రయత్నం చేసినా రైజర్స్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ అతడి పప్పులు ఉడకనివ్వలేదు. దీంతో కష్టాల్లో పడిన లక్నోను నికోలస్ పూరన్(26 బంతుల్లో 48), ఆయుశ్ బదోని(30 బంతుల్లో 55) ఆదుకున్నారు.పరుగుల సునామీవీరిద్దరి భాగస్వామ్యం కారణంగానే లక్నో నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 165 పరుగులు చేయగలిగింది. అయితే, లక్ష్య ఛేదనలో ఊహించని విధంగా పరుగుల సునామీ సృష్టించారు సన్రైజర్స్ ఓపెనర్లు అభిషేక్ శర్మ(28 బంతుల్లో 8 ఫోర్లు, 6 సిక్స్లు- 75 పరుగులు), ట్రావిస్ హెడ్(30 బంతుల్లో 8 ఫోర్లు, 8 సిక్స్లు- 89 రన్స్).కొడితే బౌండరీ లేదంటే సిక్స్ అన్నట్లుగా సాగింది వీళ్లిద్దరి విధ్వంసం. అభిషేక్ 267.86, హెడ్ 296.67 స్ట్రైక్రేటుతో బ్యాటింగ్ చేయడంతో.. దెబ్బకు 9.4 ఓవర్లలోనే టార్గెట్ పూర్తి చేసింది సన్రైజర్స్.పాపం రాహుల్లక్నోను 10 వికెట్ల తేడాతో చిత్తు చేసింది. ఇక ఈ పరుగుల విధ్వంసానికి సాక్షిగా నిలిచిన వికెట్ కీపర్ బ్యాటర్, కెప్టెన్ కేఎల్ రాహుల్ ఓటమి అనంతరం పైవిధంగా స్పందించాడు. కాగా ఓటమి నేపథ్యంలో లక్నో యజమాని సంజీవ్ గోయెంకా రాహుల్పై సీరియస్ అయ్యాడు. చదవండి: SRH: కాస్త ఓపిక పట్టు.. నీకూ టైమ్ వస్తుంది: యువీ పోస్ట్ వైరల్WHAT. A. CHASE 🧡A 🔟-wicket win for @SunRisers with more than 🔟 overs to spare! Scorecard ▶️ https://t.co/46Rn0QwHfi#TATAIPL | #SRHvLSG pic.twitter.com/kOxzoKUpXK— IndianPremierLeague (@IPL) May 8, 2024 -
కేఎల్ రాహుల్పై లక్నో ఓనర్ ఫైర్.. చెప్పేది విను! వీడియో
లక్నో సూపర్ జెయింట్స్ ఫ్రాంఛైజీ యజమాని సంజీవ్ గోయెంకాపై కేఎల్ రాహుల్ అభిమానులు మండిపడుతున్నారు. కెప్టెన్ పట్ల మరీ ఇంత దారుణంగా వ్యవహరిస్తారా? అంటూ ఫైర్ అవుతున్నారు. ఇంతకు ముందు ఏ జట్టు ఓనర్ కూడా ఇలా ప్రవర్తించినట్లు చూడలేదని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ట్రోల్ చేస్తున్నారు.ఐపీఎల్-2024లో భాగంగా లక్నో జట్టు బుధవారం సన్రైజర్స్ హైదరాబాద్తో తలపడింది. టాస్ గెలిచిన లక్నో సారథి కేఎల్ రాహుల్ తొలుత బ్యాటింగ్ ఎంచుకున్నాడు. అయితే, సొంత మైదానం ఉప్పల్లో ప్యాట్ కమిన్స్ బృందం సమిష్టి ప్రదర్శనతో ఆకట్టుకుంది.సన్రైజర్స్ బౌలర్లు, ఫీల్డర్ల అద్భుత ప్రదర్శన కారణంగా లక్నో నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 165 పరుగులకు పరిమితమైంది. కేఎల్ రాహుల్(29), కృనాల్ పాండ్యా(24) ఓ మోస్తరు స్కోర్లు చేయగా.. నికోలస్ పూరన్(26 బంతుల్లో 48*), ఆయుశ్ బదోని(30 బంతుల్లో 55*) అద్భుతంగా రాణించారు.అయితే, లక్నో విధించిన నామమాత్రపు లక్ష్యాన్ని సన్రైజర్స్ హైదరాబాద్ ఉఫ్మని ఊదేసింది. ఓపెనర్లు అభిషేక్ శర్మ(28 బంతుల్లో 75), ట్రావిస్ హెడ్(30 బంతుల్లో 89) పరుగుల వరద పారించి.. 10 వికెట్ల తేడాతో సన్రైజర్స్ను గెలిపించారు. వీరిని కట్టడి చేసేందుకు లక్నో కెప్టెన్ కేఎల్ రాహుల్ అమలు చేసిన వ్యూహాలలో ఒక్కటీ ఫలితాన్నివ్వలేదు.ఈ నేపథ్యంలో ఘోర ఓటమి అనంతరం లక్నో ఓనర్ సంజీవ్ గోయెంకా కేఎల్ రాహుల్తో వాదనకు దిగాడు. అందరూ చూస్తుండగానే సీరియస్గా రాహుల్కు క్లాస్ తీసుకున్నాడు.కెప్టెన్ వివరణ ఇచ్చినా పట్టించుకోకుండా.. ‘‘సాకులు చెప్పొద్దు.. నేను సహించను.. ఆ రెండు పాయింట్లు ఎంత ముఖ్యమో తెలుసు కదా’’ అన్నట్లుగా కోపంతో ఊగిపోయాడు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.Mr Goenka is a pathetic owner.I support KL Rahul 100%Repost and show your support towards #KLRahul #SRHvLSG #PBKSvRCB #PBKSvsRCBpic.twitter.com/JUYv9AgVdd— Samira (@Logical_Girll) May 9, 2024 ఈ నేపథ్యంలో సంజీవ్ గోయెంకా ప్రవర్తనను రాహుల్ ఫ్యాన్స్ తప్పుబడుతున్నారు. కాగా ప్లే ఆఫ్స్ రేసులో సాఫీగా ముందుకు వెళ్లాలంటే గెలవాల్సిన మ్యాచ్లో లక్నో చిత్తుగా ఓడిపోయింది. పాయింట్ల పట్టికలో ప్రస్తుతానికి ఆరో స్థానంలోనే నిలిచిపోయింది. మరోవైపు సన్రైజర్స్ మూడో స్థానానికి దూసుకువచ్చింది.చదవండి: SRH: వాళ్లిద్దరు పిచ్ను మార్చేశారు.. అతడొక అద్భుతం.. నమ్మలేకపోతున్నా! WHAT. A. CHASE 🧡A 🔟-wicket win for @SunRisers with more than 🔟 overs to spare! Scorecard ▶️ https://t.co/46Rn0QwHfi#TATAIPL | #SRHvLSG pic.twitter.com/kOxzoKUpXK— IndianPremierLeague (@IPL) May 8, 2024 -
IPL 2024: సన్రైజర్స్, లక్నో మ్యాచ్.. లంక యువ స్పిన్నర్ అరంగేట్రం
ఐపీఎల్ 2024 సీజన్లో భాగంగా సన్రైజర్స్ హైదరాబాద్తో ఇవాళ (మే 8) జరుగుతున్న మ్యాచ్లో లక్నో సూపర్ జెయింట్స్ టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. హైదరాబాద్లోని ఉప్పల్ స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్ ప్లే ఆఫ్స్ రేసులో ఉన్న ఇరు జట్లకు అత్యంత కీలకంగా మారింది. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో సన్రైజర్స్ నాలుగులో.. లక్నో ఆరో స్థానంలో ఉన్నాయి. నగరంలో నిన్న రాత్రి అతి భారీ వర్షం కురిసిన నేపథ్యంలో నేటి మ్యాచ్ సాధ్యాసాధ్యాలపై అనుమానాలు ఉండేవి. అయితే ప్రస్తుత పరిస్థితిని బట్టి చూస్తే వరుణుడి నుంచి మ్యాచ్కు ఎలాంటి ముప్పు లేదని తెలుస్తుంది. తుది జట్ల విషయానికొస్తే.. ఇరు జట్లు పలు మార్పులతో బరిలోకి దిగుతున్నాయి. లక్నో జట్టుకు సంబంధించి డికాక్ తిరిగి జట్టులోకి రాగా.. మొహిసిన్ ఖాన్ ఔటయ్యాడు. సన్రైజర్స్ తరఫున లంక యువ స్పిన్నర్ విజయ్కాంత్ వియాస్కాంత్ అరంగేట్రం చేయనుండగా.. మయాంక్ అగర్వాల్ స్థానంలో సన్వీర్ సింగ్ జట్టులోకి వచ్చాడు.హెడ్ టు హెడ్ రికార్డ్స్ విషయానికొస్తే.. ఐపీఎల్లో ఇరు జట్లు ఇప్పటివరకు మూడు సార్లు తలపడగా.. అన్ని సందర్భాల్లో లక్నోనే విజయం సాధించింది.తుది జట్లు..లక్నో సూపర్ జెయింట్స్ (ప్లేయింగ్ XI): క్వింటన్ డికాక్, కేఎల్ రాహుల్ (కెప్టెన్/వికెట్కీపర్), మార్కస్ స్టోయినిస్, నికోలస్ పూరన్, ఆయుష్ బదోని, దీపక్ హుడా, కృనాల్ పాండ్యా, కృష్ణప్ప గౌతమ్, యశ్ ఠాకూర్, రవి బిష్ణోయ్, నవీన్-ఉల్-హక్సన్రైజర్స్ హైదరాబాద్ (ప్లేయింగ్ XI): ట్రవిస్ హెడ్, నితీష్ రెడ్డి, హెన్రిచ్ క్లాసెన్ (వికెట్కీపర్), అబ్దుల్ సమద్, షాబాజ్ అహ్మద్, సన్వీర్ సింగ్, పాట్ కమిన్స్ (కెప్టెన్), భువనేశ్వర్ కుమార్, జయదేవ్ ఉనద్కత్, విజయకాంత్ వియాస్కాంత్, టి నటరాజన్ -
టీ20 వరల్డ్కప్ 2024 కోసం భారత బి టీమ్.. కెప్టెన్గా కేఎల్ రాహుల్..!
టీ20 ప్రపంచకప్ కోసం భారత క్రికెట్ జట్టును ఏప్రిల్ 30న ప్రకటించారు. ఈ జట్టులో 15 మంది రెగ్యులర్ ఆటగాళ్లు, నలుగురు ట్రావెలింగ్ రిజర్వ్స్ ఉన్నారు. రోహిత్ శర్మ ఈ జట్టుకు సారధిగా వ్యవహరించనుండగా.. హార్దిక్ అతనికి డిప్యూటీగా ఎంపికయ్యాడు. రెగ్యులర్ జట్టులో విరాట్ కోహ్లి, సూర్య కుమార్ యాదవ్, రవీంద్ర జడేజా, రిషబ్ పంత్, బుమ్రా లాంటి స్టార్ ప్లేయర్లు ఉండగా.. శుభ్మన్ గిల్, రింకూ సింగ్, ఆవేశ్ ఖాన్, ఖలీల్ అహ్మద్ రిజర్వ్ ప్లేయర్లుగా ఎంపికయ్యారు. అందరూ ఊహించిన విధంగానే ఐపీఎల్లో సూపర్ ఫామ్లో ఉన్న సంజూ శాంసన్, శివమ్ దూబేలకు చోటు దక్కింది. యశస్వి జైస్వాల్, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, చహల్, అర్షదీప్ సింగ్, సిరాజ్ మిగతా సభ్యులుగా ఎంపికయ్యారు.ఈ జట్టును ప్రకటించిన అనంతరం పలువురు ఆటగాళ్లకు అన్యాయం (19 మంది సభ్యుల జట్టులో చోటు దక్కక పోవడంపై) జరిగిందని సోషల్మీడియా గగ్గోలు పెట్టింది. మాజీలు, విశ్లేషకులు రింకూ సింగ్, కేఎల్ రాహుల్, రుతురాజ్, రియాన్ పరాగ్, నటరాజన్, రవి భిష్ణోయ్ లాంటి ఆటగాళ్లను పక్కకు పెట్టడంతో అసంతృప్తి వ్యక్తం చేశారు. రింకూ సింగ్ విషయంలో కొందరు మాజీలు ఏకంగా సెలక్టర్లనే తప్పుబట్టారు. ఈ నేపథ్యంలో ప్రముఖ క్రికెట్ గైడ్ విజ్డన్ ప్రపంచకప్కు ఎంపిక కాని అర్హులైన ఆటగాళ్లతో ఓ జట్టును ఎంపిక చేసింది.ఈ జట్టుకు కేఎల్ రాహుల్ సారధిగా ఎంపికయ్యాడు. ప్రస్తుత ఐపీఎల్ సీజన్లో ఆయా ఆటగాళ్ల ఫామ్ ఆధారంగా మిగతా జట్టు సభ్యుల ఎంపిక జరిగింది. ఓపెనర్లుగా కేఎల్ రాహుల్, అభిషేక్ శర్మ, వన్డౌన్లో రుతురాజ్ గైక్వాడ్, నాలుగో స్థానంలో రియాన్ పరాగ్, ఐదో ప్లేస్లో తిలక్ వర్మ, ఆరో స్థానంలో శశాంక్ సింగ్, ఆల్రౌండర్ కోటాలో విశాఖ చిన్నోడు నితీశ్ కుమార్ రెడ్డి, స్పెషలిస్ట్ స్పిన్నర్లుగా రవి బిష్ణోయ్, వరుణ్ చక్రవర్తి.. పేసర్లుగా హర్షిత్ రాణా, నటరాజన్ ఎంపికయ్యాడు. ఈ జట్టుకు విజ్డన్ భారత-బి జట్టుగా నామకరణం చేసింది. -
అందుకే రాహుల్ను సెలక్ట్ చేయలేదు.. పంత్, సంజూకు: అగార్కర్
టీ20 వరల్డ్కప్-2024కు 15 మంది సభ్యులతో కూడిన భారత జట్టును బీసీసీఐ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ జట్టు ఎంపికపై భిన్నభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా స్టార్ బ్యాటర్ కేఎల్ రాహుల్ను వరల్డ్కప్కు ఎంపిక చేయకపోవడం క్రీడా వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది. అయితే ఈ మెగా టోర్నీకి రాహుల్ను సెలక్ట్ చేయకపోవడానికి గల కారణాన్ని తాజాగా బీసీసీఐ సెలక్షన్ కమిటీ చైర్మెన్ అజిత్ అగార్కర్ వెల్లడించాడు.మిడిలార్డర్లో బ్యాటింగ్ చేసే వికెట్ కీపర్ బ్యాటర్ తమకు కావాలనుకున్నామని, అందుకే రాహుల్ను ఎంపిక చేయలేదని అగార్కర్ చెప్పుకొచ్చాడు."రాహుల్ టీ20ల్లో ఎక్కువగా టాప్ ఆర్డర్లో బ్యాటింగ్ చేస్తున్నాడు. మేము మిడిల్ ఆర్డర్లో బ్యాటింగ్ చేసే వికెట్ కీపర్ బ్యాటర్ను ఎంపిక చేయాలనకున్నాం. అందుకే రాహుల్ను పక్కన పెట్టి సంజూ శాంసన్, రిషబ్ పంత్లకు స్పెషలిస్టు వికెట్ కీపర్ బ్యాటర్లగా ఎంపిక చేశాము. వీరిద్దరికి మిడిలార్డర్లో బ్యాటింగ్ చేసే సత్తా ఉందని" ప్రెస్కాన్ఫరెన్స్లో అగార్కర్ పేర్కొన్నాడు. ఈ ప్రెస్కాన్ఫరెన్స్లో భారత కెప్టెన్ రోహిత్ శర్మ కూడా పాల్గోన్నాడు.భారత టీ20 ప్రపంచకప్ జట్టు:రోహిత్ శర్మ(కెప్టెన్), యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, సంజూ శాంసన్, రిషభ్ పంత్(కీపర్), హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, యుజ్వేంద్ర చాహల్, జస్ప్రీత్ బుమ్రా, అర్ష్దీప్ సింగ్, మహ్మద్ సిరాజ్. -
T20 WC: డీకే అవసరమా?.. వాళ్లిద్దరు బెస్ట్!
టీ20 ప్రపంచకప్-2024 నేపథ్యంలో జట్ల ప్రకటనకు అంతర్జాతీయ క్రికెట్ మండలి మే 1ని డెడ్లైన్గా విధించింది. ఆలోపు మెగా ఈవెంట్లో పాల్గొనే ఆటగాళ్ల ఎంపికను పూర్తి చేయాలని స్పష్టం చేసింది.ఈ నేపథ్యంలో భారత క్రికెట్ నియంత్రణ మండలి ఇప్పటికే జట్టు ఎంపికపై చర్చలు ముమ్మరం చేసినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో టీమిండియా మాజీ ఆల్రౌండర్, ప్రపంచకప్ విజేత యువరాజ్ సింగ్.. మెగా టోర్నీలో ఆడాల్సిన భారత వికెట్ కీపర్ గురించి కీలక వ్యాఖ్యలు చేశాడు.పోటీలో ఆ నలుగురు!కాగా ప్రపంచకప్ జట్టులో బెర్తు కోసం రిషభ్ పంత్, సంజూ శాంసన్, కేఎల్ రాహుల్, దినేశ్ కార్తిక్ మధ్య పోటీ నెలకొంది. ఈ నలుగురిలో డీకే ఐపీఎల్-2024లో ఆర్సీబీకి ఆడుతూ ఫినిషర్గా రాణిస్తున్నాడు.ఇప్పటి వరకు తొమ్మిది మ్యాచ్లలో కలిపి 195.52 స్ట్రైక్రేటుతో 262 పరుగులు చేశాడు. మరోవైపు.. ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ రిషభ్ పంత్ దాదాపు 14 నెలల విరామం తర్వాత కాంపిటేటివ్ క్రికెట్లో అడుగుపెట్టినా.. ఫుల్ ఫామ్లోకి వచ్చేశాడు.ఆడిన తొమ్మిది మ్యాచ్లలో మూడు హాఫ్ సెంచరీల సాయంతో 342 పరుగులు చేశాడు. ఇక సంజూ శాంసన్ రాజస్తాన్ రాయల్స్ కెప్టెన్గా రాణిస్తూ.. వికెట్ కీపర్ బ్యాటర్గానూ రాణిస్తున్నాడు. ఇప్పటి దాకా 385 రన్స్తో అత్యధిక పరుగుల వీరుల జాబితాలో రెండో స్థానంలో కొనసాగుతున్నాడు.డీకే అవసరమా?ఈ లిస్టులో సంజూ తర్వాత కేఎల్ రాహుల్ 378 పరుగులతో మూడో స్థానంలో ఉన్నాడు. ఈ నేపథ్యంలో యువీ ఐసీసీతో మాట్లాడుతూ.. ‘‘డీకే ప్రస్తుతం బాగానే బ్యాటింగ్ చేస్తున్నాడు. కానీ గతసారి(2022) టీ20 వరల్డ్కప్లో అతడు రాణించలేకపోయాడు.కాబట్టి ఈసారి జట్టుకు ఎంపిక చేసినా అతడికి తుదిజట్టులో చోటు దక్కకపోవచ్చు. నిజానికి రిషభ్ పంత్, సంజూ శాంసన్ రూపంలో ఇద్దరు యువ ప్లేయర్లు అందుబాటులో ఉన్నారు. -
వరల్డ్కప్ బెర్త్ పక్కా చేసుకున్న పంత్.. సంజూకు మరోసారి మొండిచెయ్యేనా..?
సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం మేరకు ఢిల్లీ క్యాపిటల్స్ సారధి రిషబ్ పంత్ టీ20 వరల్డ్కప్ బెర్త్ పక్కా చేసుకున్నట్లు తెలుస్తుంది. ప్రముఖ వార్తా సంస్థ ఓ కథనంలో ఈ విషయాన్ని ప్రస్తావించింది. పంత్ టీ20 వరల్డ్కప్లో టీమిండియా ఫస్ట్ చాయిస్ వికెట్కీపర్ బ్యాటర్గా ఉంటాడని సమాచారం. ఐపీఎల్ ప్రదర్శనల ఆధారంగా పంత్ వరల్డ్కప్ బెర్త్ను ఖరారు చేశారని తెలుస్తుంది. కారు ప్రమాదం తాలూకా గాయాల నుంచి ఇటీవలే బయటపడ్డ పంత్.. ఈ ఐపీఎల్ సీజన్లో ఇరగదీస్తున్నాడు. ఢిల్లీ తరఫున అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్గా కొనసాగుతున్నాడు.అలాగే అత్యధిక పరుగులు చేసిన వికెట్కీపర్ బ్యాటర్గా..మూడో అత్యధిక రన్ స్కోరర్గా..అత్యధిక సిక్సర్లు సాధించిన కెప్టెన్గా..అత్యధిక స్ట్రయిక్రేట్ కలిగిన కెప్టెన్గా..రెండు ప్లేయర్ ఆఫ్ మ్యాచ్ అవార్డులు గెలుచుకున్న ఏకైక కెప్టెన్గా..రెండు ప్లేయర్ ఆఫ్ మ్యాచ్ అవార్డులు గెలుచుకున్న ఏకైక వికెట్కీపర్ బ్యాటర్గా..అత్యధిక ప్లేయర్ ఆఫ్ మ్యాచ్ అవార్డులు గెలుచుకున్న ఆటగాడిగా పలు ఘనతలు సొంతం చేసుకున్నాడు. నిన్న గుజరాత్తో జరిగిన మ్యాచ్లో పంత్ పాత రోజులు గుర్తు చేశాడు. ఎడాపెడా బౌండరీలు, సిక్సర్లు బాది గుజరాత్ బౌలర్లకు చుక్కలు చూపించాడు. ఈ మ్యాచ్లో 43 బంతులు ఎదుర్కొన్న పంత్.. 5 ఫోర్లు, 8 సిక్సర్ల సాయంతో 88 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. ఈ మ్యాచ్లో పంత్ అద్భుతమైన కెప్టెన్సీ నైపుణ్యాన్ని ప్రదర్శించడంతో పాటు 2 క్యాచ్లు కూడా పట్టాడు. వరల్డ్కప్కు ఎంపిక కావాలంటే ఇంతకంటే ఏం కావాలని పంత్ అభిమానులు అంటున్నారు. పంత్ వరల్డ్కప్ బెర్త్ ఖరారైందనుకుంటే సెకెండ్ ఛాయిస్ వికెట్కీపర్ ఎవరనే ప్రశ్న ఉత్పన్నమవుతుంది. ఈ స్థానంలో కోసం కేఎల్ రాహుల్, సంజూ శాంసన్ తీవ్రంగా పోటీపడుతున్నారు. ప్రస్తుతమున్న సమాచారం మేరకు ఈ రేసులో రాహుల్ ముందున్నట్లు తెలుస్తుంది. రాహుల్ మిడిలార్డర్లో బాధ్యతాయుతమైన ఇన్నింగ్స్లు ఆడగలడని సెలెక్టర్లు భావిస్తున్నట్లు సమాచారం. ఇదే నిజమైతే సంజూ శాంసన్కు మరోసారి మొండిచెయ్యి ఖాయం.శాంసన్ను తృణీకరించేందుకు సెలెక్టర్ల వద్ద పెద్ద కారణాలు లేకపోయినా సమీకరణల పేరుతో అతన్ని పక్కన పెట్టడం పరిపాటిగా మారింది. సంజూ సంబంధించిన ఈ విషయాన్ని ఇటీవలే మాజీ కేంద్ర మంత్రి శశిథరూర్ కూడా ప్రస్తావించారు. జస్టిస్ ఫర్ సంజూ అని ఓ ట్వీట్ చేశారు. సంజూ విషయంలో సెలెక్టర్లు ఏ నిర్ణయం తీసుకుంటారో మరికొద్ది రోజుల్లో తేలిపోతుంది. ఈ నెలఖరులోగా టీ20 వరల్డ్కప్ 2024 కోసం భారత జట్టును ఎంపిక చేయాల్సి ఉంది. -
వారెవ్వా జడేజా.. క్రికెట్ చరిత్రలోనే సంచలన క్యాచ్! వీడియో వైరల్
ఐపీఎల్-2024లో భాగంగా ఏక్నా స్టేడియం వేదికగా లక్నో సూపర్ జెయింట్స్తో మ్యాచ్లో చెన్నై స్టార్ ఆల్రౌండర్ రవీంద్ర జడేజా స్టన్నింగ్ క్యాచ్ను అందుకున్నాడు. జడ్డూ అద్బుతమైన క్యాచ్తో లక్నో కెప్టెన్ కేఎల్ రాహుల్ను పెవిలియన్కు పంపాడు. లక్నో ఇన్నింగ్స్ 17వ ఓవర్ వేసిన మతీషా పతిరానా బౌలింగ్లో తొలి బంతిని రాహుల్ పాయింట్ దిశగా కట్ షాట్ ఆడాడు. షాట్ సరిగ్గా కనక్ట్ అయినప్పటికి పాయింట్లో ఫీల్డింగ్ చేస్తున్న జడేజా.. ఎడమవైపున్కు జంప్ చేస్తూ సింగిల్ హ్యాండ్తో స్టన్నింగ్ క్యాచ్ను అందుకున్నాడు. ఇది చూసిన రాహుల్తో పాటు స్టేడియంలో ఉన్న ప్రేక్షకులు మొత్తం ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది. వారెవ్వా జడ్డూ సూపర్ మ్యాన్ అంటూ కామెంట్లు చేస్తున్నారు. కాగా ఈ మ్యాచ్లో 8 వికెట్ల తేడాతో సీఎస్కే ఘోర పరాజయాన్ని చవిచూసింది. తొలుత బ్యాటింగ్ చేసిన సీఎస్కే.. జడేజా(57), ధోని(28 నాటౌట్) రాణించడంతో నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 176 పరుగులు చేసింది. అనంతరం 177 పరుగుల లక్ష్యాన్ని లక్నో 19 ఓవర్లలో కేవలం రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి చేధించింది. లక్నో బ్యాటర్లలో కెప్టెన్ కేఎల్ రాహుల్(53 బంతుల్లో 9 ఫోర్లు, 3 సిక్స్లు) కీలక ఇన్నింగ్స్ ఆడగా.. డికాక్(54) హాఫ్ సెంచరీతో రాణించాడు. సీఎస్కే బౌలర్లలో ముస్తఫిజుర్ రెహ్మన్, పతిరానా తలా వికెట్ సాధించారు. Ravi Shastri - "What a Catch, is that the Catch of IPL, WOW, that was Flying like a Trace of Bullet" Ravindra Jadeja took "One of the Greatest Catch of IPL 2024" 👏#CSKvLSG #CSKvsLSGpic.twitter.com/SQDFOz9Lmo — Richard Kettleborough (@RichKettle07) April 19, 2024 -
‘సూపర్’ పోరులో జెయింట్స్ పైచేయి
ఐపీఎల్ సీజన్లో వరుసగా రెండు ఓటముల తర్వాత లక్నో సూపర్ జెయింట్స్ కోలుకుంది. కట్టుదిట్టమైన బౌలింగ్తో చెన్నై సూపర్ కింగ్స్ను నిలువరించిన లక్నో ఆ తర్వాత ఎలాంటి తడబాటు లేకుండా లక్ష్యం చేరింది. ఛేదనలో కేఎల్ రాహుల్, డికాక్ కీలక పాత్ర పోషించగా... రెండు వరుస విజయాల తర్వాత చెన్నై తలవంచింది. లక్నో: సొంతగడ్డపై సమష్టి ప్రదర్శనతో లక్నో కీలక విజయాన్ని అందుకుంది. శుక్రవారం జరిగిన మ్యాచ్లో లక్నో 8 వికెట్ల తేడాతో ఐదుసార్లు చాంపియన్ చెన్నైపై ఘన విజయం సాధించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్కు దిగిన చెన్నై 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 176 పరుగులు చేసింది. రవీంద్ర జడేజా (40 బంతుల్లో 57 నాటౌట్; 5 ఫోర్లు, 1 సిక్స్) అర్ధ సెంచరీ చేయగా... రహానే (24 బంతుల్లో 36; 5 ఫోర్లు, 1 సిక్స్), మొయిన్ అలీ (20 బంతుల్లో 30; 3 సిక్స్లు), ధోని (9 బంతుల్లో 28 నాటౌట్; 3 ఫోర్లు, 2 సిక్స్లు) రాణించారు. అనంతరం లక్నో 19 ఓవర్లలో 2 వికెట్లకు 180 పరుగులు సాధించి గెలిచింది. కెప్టెన్ కేఎల్ రాహుల్ (53 బంతుల్లో 82; 9 ఫోర్లు, 3 సిక్స్లు), క్వింటన్ డికాక్ (43 బంతుల్లో 54; 5 ఫోర్లు, 1 సిక్స్) తొలి వికెట్కు 90 బంతుల్లోనే 134 పరుగులు జోడించి విజయాన్ని సులువు చేశారు. ధోని మెరుపులు... ఓపెనర్ రచిన్ రవీంద్ర (0) టోర్నీలో తన వరుస వైఫల్యాలను కొనసాగించగా... మరో ఎండ్లో రహానే కొన్ని చక్కటి షాట్లు ఆడాడు. పవర్ప్లే ముగిసేసరికి చెన్నై 51 పరుగులు చేసింది. కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ (17) ప్రభావం చూపలేకపోగా, నాలుగో స్థానంలో వచ్చిన జడేజా పరిస్థితిని చక్కదిద్దాడు. అయితే రహానేతో పాటు ఫామ్లో ఉన్న శివమ్ దూబే (3), సమీర్ రిజ్వీ (1)లను తక్కువ వ్యవధిలో అవుట్ చేసి లక్నో ఆధిక్యం ప్రదర్శించింది. ఈ సమయంలో కట్టుదిట్టమైన బౌలింగ్ కారణంగా చెన్నై బ్యాటర్లు పరుగులు చేయడంలో ఇబ్బంది పడ్డారు. ఒకదశలో వరుసగా 34 బంతుల పాటు బౌండరీనే రాలేదు! 16 ఓవర్లు ముగిసేసరికి స్కోరు 113/5. అయితే చివరి 4 ఓవర్లలో సూపర్ కింగ్స్ చెలరేగి 63 పరుగులు రాబట్టింది. మొహసిన్ ఓవర్లో సిక్సర్తో 34 బంతుల్లో జడేజా అర్ధ సెంచరీ పూర్తి చేసుకోగా... బిష్ణోయ్ వేసిన తర్వాతి ఓవర్లో అలీ వరుసగా 6, 6, 6 బాదడం విశేషం. అనంతరం 19వ ఓవర్లో 4, 6 కొట్టిన ధోని... ఆఖరి ఓవర్లో మరో 2 ఫోర్లు, సిక్స్తో చెలరేగాడు. ఏడో వికెట్కు ధోని, జడేజా 13 బంతుల్లో 35 పరుగులు జోడించారు. శతక భాగస్వామ్యం... ఛేదనను రాహుల్, డికాక్ ఘనంగా ఆరంభించారు. వీరిద్దరిని ఇబ్బంది పెట్టడంలో చెన్నై బౌలర్లంతా విఫలమయ్యారు. ఇద్దరూ ధాటిగా ఆడటంతో పవర్ప్లేలో 54 పరుగులు రాగా... 10.5 ఓవర్లు ముగిసేసరికి స్కోరు 9 ఫోర్లు, 4 సిక్సర్లతో 100 పరుగులు దాటింది. 31 పరుగుల స్కోరు వద్ద డికాక్ ఇచ్చిన క్యాచ్ను పతిరణ వదిలేయగా, 31 బంతుల్లో రాహుల్ అర్ధసెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఆ తర్వాత 41 బంతుల్లో డికాక్ కూడా హాఫ్ సెంచరీ మార్క్ను అందుకున్నాడు. విజయానికి చేరువైన దశలో తక్కువ వ్యవధిలో వీరిద్దరు అవుటైనా... లక్ష్యం చేరేందుకు లక్నోకు ఇబ్బంది ఎదురు కాలేదు. స్కోరు వివరాలు చెన్నై సూపర్ కింగ్స్ ఇన్నింగ్స్: రహానే (బి) కృనాల్ 36; రచిన్ (బి) మొహసిన్ 0; రుతురాజ్ (సి) రాహుల్ (బి) యశ్ 17; జడేజా (నాటౌట్) 57; దూబే (సి) రాహుల్ (బి) స్టొయినిస్ 3; రిజ్వీ (స్టంప్డ్) రాహుల్ (బి) కృనాల్ 1; అలీ (సి) బదోని (బి) బిష్ణోయ్ 30; ధోని (నాటౌట్) 28; ఎక్స్ట్రాలు 4; మొత్తం (20 ఓవర్లలో 6 వికెట్లకు 176. వికెట్ల పతనం: 1–4, 2–33, 3–68, 4–87, 5–90, 6–141. బౌలింగ్: హెన్రీ 3–0–26–0, మొహసిన్ 4–0–37–1, యశ్ ఠాకూర్ 4–0–45–1, కృనాల్ పాండ్యా 3–0–16–2, రవి బిష్ణోయ్ 4–0–44–1, స్టొయినిస్ 2–0–7–1. లక్నో సూపర్ జెయింట్స్ ఇన్నింగ్స్: డికాక్ (సి) ధోని (బి) ముస్తఫిజుర్ 54; రాహుల్ (సి) జడేజా (బి) పతిరణ 82; పూరన్ (నాటౌట్) 23; స్టొయినిస్ (నాటౌట్) 8; ఎక్స్ట్రాలు 13; మొత్తం (19 ఓవర్లలో 2 వికెట్లకు) 180. వికెట్ల పతనం: 1–134, 2–161. బౌలింగ్: దీపక్ చహర్ 3–0–26–0, తుషార్ 4–0–42–0, ముస్తఫిజుర్ 4–0–43–1, జడేజా 3–0–32–0, పతిరణ 4–0–29–1, అలీ 1–0–5–0. ఐపీఎల్లో నేడు ఢిల్లీ X హైదరాబాద్ వేదిక: న్యూఢిల్లీ రాత్రి 7: 30 గంటల నుంచి స్టార్ స్పోర్ట్స్, జియో సినిమా యాప్లో ప్రత్యక్ష ప్రసారం -
RCB: అక్కడే మొదలు.. అక్కడే ముగిస్తా: కేఎల్ రాహుల్
‘‘ఆ రోజు విరాట్ అక్కడే ఉన్నాడు. కోచ్ రే జెన్సింగ్స్.. ఇంకా మిగతా సహాయక సిబ్బంది కూడా ఉన్నారు. అప్పుడు విరాట్ వచ్చి.. ‘నీకు ఈ కాంట్రాక్ట్ మీద సంతకం పెట్టడం ఇష్టమేనా? ఆర్సీబీకి ఆడతావా? అని అడిగాడు. అందుకు బదులుగా.. ‘ఏంటీ జోక్ చేస్తున్నావా?.. నా చిరకాల కల అది’ అని అన్నాన్నేను. అప్పుడు విరాట్.. ‘అవును.. జోక్ చేశానులే.. అయినా.. ఇది నీకు ఆప్షన్ కాదు.. ముందు ఈ కాంట్రాక్టు మీద సంతకం పెట్టు’ అన్నాడు. నేను అలాగే చేశాను. అప్పుడు వెంటనే విరాట్ స్పందిస్తూ.. ‘ఇక నుంచి నీ ప్రయాణం క్రేజీగా ఉండబోతోంది. వచ్చే రెండు నెలలు నీకు ఫుల్ మజా’ అంటూ నన్ను ఆటపట్టించాడు’’ అని టీమిండియా స్టార్, ఐపీఎల్ ఫ్రాంఛైజీ లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్ కేఎల్ రాహుల్ అన్నాడు. క్యాష్ రిచ్ లీగ్లో అడుగుపెట్టిన నాటి జ్ఞాపకాలను తాజాగా గుర్తు చేసుకున్నాడు. కాగా కర్ణాటకకు చెందిన కన్ననూర్ లోకేశ్ రాహుల్ 2013లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు తరఫున అరంగేట్రం చేశాడు. ఆ ఏడాది దేశవాళీ టీ20 టోర్నీ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో అదరగొట్టి ఐపీఎల్లోనూ ఎంట్రీ ఇచ్చాడు. కేకేఆర్తో మ్యాచ్తో ఎంట్రీ సొంతమైదానం బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో కోల్కతా నైట్ రైడర్స్తో ఆర్సీబీ తరఫున అరంగేట్రం చేశాడు. ఇక ఆ తర్వాత సన్రైజర్స్ హైదరాబాద్, పంజాబ్ కింగ్స్(కెప్టెన్)కు ఆడిన రాహుల్.. 2022లో ఎంట్రీ ఇచ్చిన లక్నో సూపర్ జెయింట్స్ సారథిగా బాధ్యతలు చేపట్టాడు. తమ తొలి సీజన్లోనే లక్నోను ప్లే ఆఫ్స్ చేర్చి సత్తా చాటాడు. ఇక ఐపీఎల్-2024లోనూ ప్రస్తుతం లక్నో పరిస్థితి మెరుగ్గానే ఉంది. ఆడిన ఆరు మ్యాచ్లలో మూడు గెలిచి ఐదో స్థానంలో ఉంది. శుక్రవారం నాటి మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్తో లక్నో వేదికగా సూపర్ జెయింట్స్ తలపడనుంది. ఇదిలా ఉంటే.. లక్నోకు సారథిగా ఉన్నా కేఎల్ రాహుల్ మనసులో ఆర్సీబీకి మాత్రం ప్రత్యేక స్థానం ఉంది. తన సొంత రాష్ట్రానికి చెందిన ఫ్రాంఛైజీ కావడంతో పాటు.. తనకు లైఫ్ కూడా ఇచ్చిన ఆర్సీబీ అంటే అతడికి గౌరవం. ఈ విషయాన్ని తాజాగా రవిచంద్రన్ అశ్విన్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పంచుకున్నాడు రాహుల్. అక్కడే మొదలు.. అక్కడే ముగిస్తా ‘‘ఆ రెండు నెలలు ఆర్సీబీలో నేను చాలా నేర్చుకున్నాను. మంచి అనుభవం గడించాను. అంతా త్వరత్వరగా జరిగిపోయింది. బెంగళూరుకు ఆడటం నాకెల్లప్పుడూ ఇష్టమే. నా కెరీర్ మొదలైందే అక్కడ! అక్కడే కెరీర్ ముగిస్తే బాగుంటుందని కూడా అనుకుంటున్నా. ఏదేమైనా భిన్న జట్లతో.. భిన్న ప్లేయర్లతో కలిపే ఐపీఎల్ ఓ అద్భుతమైన టోర్నీ’’ అని కేఎల్ రాహుల్ చెప్పుకొచ్చాడు. చదవండి: హార్దిక్ను పట్టించుకోని ఆకాశ్.. రోహిత్ మాట విని అలా! వైరల్ వీడియో var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4381453179.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
T20 WC: సంజూ బాగా ఆడుతున్నాడు.. అయినా పంత్కే చోటివ్వాలి!
టీ20 ప్రపంచకప్-2024 భారత జట్టులో రిషభ్ పంత్కు చోటు ఇవ్వాలని ఆస్ట్రేలియా దిగ్గజం, ఢిల్లీ క్యాపిటల్స్ హెడ్ కోచ్ రిక్కీ పాంటింగ్ అన్నాడు. మెగా టోర్నీ ఆడే అర్హత పంత్కు ఉందని.. తన దృష్టిలో అతడే టీమిండియాకు మొదటి వికెట్ కీపర్ ఆప్షన్ అని పేర్కొన్నాడు. ఐపీఎల్-2024లో సత్తా చాటి కచ్చితంగా వరల్డ్కప్ ఆడే జట్టులో పంత్ చోటు దక్కించుకుంటాడని రిక్కీ పాంటింగ్ ధీమా వ్యక్తం చేశాడు. కాగా 2022, డిసెంబరులో కారు ప్రమాదానికి గురై.. అదృష్టవశాత్తూ ప్రాణాలతో బయటపడ్డ పంత్ కోలుకోవడానికి దాదాపు ఏడాదిన్నర కాలం పట్టింది. బెంగళూరులోని జాతీయ క్రికెట్ అకాడమీలో సుదీర్ఘకాలం పాటు పునరావాసం పొందిన పంత్.. క్రమక్రమంగా కోలుకుని మ్యాచ్ ఫిట్నెస్ సాధించాడు. ఈ క్రమంలో ఐపీఎల్ పదిహేడో ఎడిషన్లో ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్గా తిరిగి పగ్గాలు చేపట్టిన పంత్.. వికెట్ కీపర్ బ్యాటర్గానూ సేవలు అందిస్తున్నాడు. ఇప్పటి వరకు ఆరు ఇన్నింగ్స్ ఆడి 194 పరుగులు చేసిన పంత్ ఖాతాలో రెండు హాఫ్ సెంచరీలు ఉన్నాయి. అయితే.. కెప్టెన్గా మాత్రం పంత్ విఫలమవుతూనే ఉన్నాడు. అతడి సారథ్యంలో ఢిల్లీ ఇప్పటిదాకా ఆరు మ్యాచ్లు ఆడి కేవలం రెండే గెలిచింది. ఇదిలా ఉంటే.. మే 27న ఐపీఎల్-2024 ముగియనుండగా.. జూన్ 1 నుంచి వెస్టిండీస్- అమెరికా వేదికగా పొట్టి ప్రపంచకప్ సమరం మొదలుకానుంది. ఈ నేపథ్యంలో భారత జట్టు వికెట్ కీపర్ ఎంపిక గురించి రిక్కీ పాంటింగ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. సంజూ బాగా ఆడుతున్నాడు.. అయినా పంత్కే చోటివ్వాలి! ‘‘వరల్డ్కప్ జట్టులో రిషభ్ పంత్కు చోటు ఇవ్వాలా? అంటే కచ్చితంగా ఇవ్వాలనే చెబుతా. ఐపీఎల్ ముగిసేలోపు అతడు అందుకు అర్హత సాధిస్తాడు. గత ఆరు సీజన్లలో పంత్ మెరుగ్గా ఆడాడు. టీమిండియా తరఫున కూడా మంచి ప్రదర్శన ఇచ్చాడు. భారత జట్టులో ప్రతిభావంతులైన ఆటగాళ్లకు కొదవలేదని తెలుసు. ముఖ్యంగా వికెట్ కీపర్ బ్యాటర్లలో ఇషాన్ కిషన్, సంజూ శాంసన్, కేఎల్ రాహుల్ బాగా ఆడుతున్నారు. చాలా ఆప్షన్లు కనిపిస్తున్నాయి. అయితే.. నేను గనుక జట్టును ఎంపిక చేయాల్సి వస్తే రిషభ్ పంత్కే మొదటి ప్రాధాన్యం ఇస్తాను. నన్నెపుడు ఈ ప్రశ్న అడిగినా ఇదే సమాధానం ఇస్తాను’’ అని రిక్కీ పాంటింగ్ చెప్పుకొచ్చాడు. కాగా వరల్డ్కప్-2024 టీమిండియా వికెట్ కీపర్ల రేసులో ప్రస్తుతం సంజూ శాంసన్ ముందుకు దూసుకుపోతున్నాడు. రాజస్తాన్ రాయల్స్ కెప్టెన్గా వ్యవహరిస్తున్న అతడు ఇప్పటి వరకు ఆరు ఇన్నింగ్స్లో కలిపి 264 పరుగులు సాధించాడు. చదవండి: #Pat Cummins: శెభాష్.. ఇది సరైన నిర్ణయం! కమిన్స్ అన్నతో అట్లుంటది మరి.. var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_7552012696.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
అతడొక సర్ప్రైజ్.. వాళ్లిద్దరి వల్లే మా ఓటమి: కేఎల్ రాహుల్
ఢిల్లీ క్యాపిటల్స్ చేతిలో ఓటమితో లక్నో సూపర్ జెయింట్స్ జైత్రయాత్రకు అడ్డుకట్ట పడింది. ఐపీఎల్-2024లో హ్యాట్రిక్ విజయాల తర్వాత సొంత మైదానంలో తొలి పరాజయాన్ని మూటగట్టుకుంది. తద్వారా 160కి పైగా పరుగుల స్కోరు చేస్తే.. లక్ష్య ఛేదనలో లక్నో కచ్చితంగా గెలుస్తుందనే రికార్డు చెరిగిపోయింది. ఈ నేపథ్యంలో లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్ కేఎల్ రాహుల్ ఓటమిపై విచారం వ్యక్తం చేశాడు. తాము కనీసం ఇంకో 15- 20 పరుగులు సాధిస్తే ఫలితం వేరేలా ఉండేదని అభిప్రాయపడ్డాడు. శుభారంభం లభించినా దానిని భారీ స్కోరుగా మలచడంలో విఫలమయ్యామని పేర్కొన్నాడు. పిచ్ పరిస్థితులను సద్వినియోగం చేసుకున్న ఢిల్లీ చైనామన్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ తమను దెబ్బకొట్టాడని కేఎల్ రాహుల్ అన్నాడు. ఇక కొత్త బ్యాటర్ జేక్ ఫ్రేజర్- మెక్గర్క్ ఎలా ఆడతాడన్న విషయంపై తమకు అవగాహన లేదని.. అయితే.. అతడు అద్భుత బ్యాటింగ్తో ఆకట్టుకున్నాడని ప్రశంసించాడు. Maiden IPL FIFTY for Jake Fraser-McGurk on DEBUT! Hat-trick of sixes in this thoroughly entertaining knock 💥💥💥 Watch the match LIVE on @StarSportsIndia and @JioCinema 💻📱#TATAIPL | #LSGvDC pic.twitter.com/0hXuBkiBr3 — IndianPremierLeague (@IPL) April 12, 2024 ఢిల్లీ విజయంలో అతడికే ఎక్కువ క్రెడిట్ దక్కుతుందని కేఎల్ రాహుల్ ఈ సందర్భంగా పేర్కొన్నాడు. ఢిల్లీ ఓపెనర్ డేవిడ్ వార్నర్ను పవర్ ప్లేలోనే అవుట్ చేయాలన్న తమ వ్యూహం ఫలించినా.. క్రీజులో పాతుకుపోయిన రిషభ్ పంత్, మెక్గర్క్ కలిసి మ్యాచ్ను తమ నుంచి లాగేసుకున్నారని రాహుల్ అన్నాడు. Victory in Lucknow for the @DelhiCapitals 🙌 A successful chase power them to their second win of the season as they win by 6⃣ wickets! Scorecard ▶️ https://t.co/0W0hHHG2sq#TATAIPL | #LSGvDC pic.twitter.com/6R7an9Cy8g — IndianPremierLeague (@IPL) April 12, 2024 ఒకవేళ నికోలస్ పూరన్(0) గనుక కాసేపు నిలబడగలిగితే కచ్చితంగా ప్రమాదకారిగా మారేవాడని.. అయితే, అతడిని పెవిలియన్కు పంపడంలో కుల్దీప్ యాదవ్ సఫలమయ్యాడని రాహుల్ పేర్కొన్నాడు. ఏదేమైనా లోపాలు సరిచేసుకుని తదుపరి మ్యాచ్కు సిద్ధమవుతామని తెలిపాడు. ఇక ఢిల్లీతో మ్యాచ్లో లక్నో సారథి, వికెట్ కీపర్ బ్యాటర్ కేఎల్ రాహుల్ 22 బంతుల్లో 5 ఫోర్లు, ఒక సిక్సర్ సాయంతో 39 పరుగులు చేశాడు. 177.27 స్ట్రైక్రేటు నమోదు చేసి ఎలక్ట్రిక్ స్ట్రైకర్ అవార్డు అందుకున్నాడు. కాగా లక్నో తదుపరి ఆదివారం కోల్కతా నైట్ రైడర్స్తో మ్యాచ్లో తలపడనుంది. లక్నో వర్సెస్ ఢిల్లీ స్కోర్లు: ►టాస్: లక్నో.. బ్యాటింగ్ ►లక్నో స్కోరు: 167/7 (20) ►ఢిల్లీ స్కోరు: 170/4 (18.1) ►ఫలితం: లక్నోపై ఆరు వికెట్ల తేడాతో ఢిల్లీ విజయం ►ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్: కుల్దీప్ యాదవ్(3/20) ►రిషభ్ పంత్ స్కోరు: 41 రన్స్ ►ఓవరాల్ టాప్ స్కోరర్లు: జేక్ ఫ్రేజర్- మెక్గర్క్(ఢిల్లీ- 35 బంతుల్లో 55), ఆయుశ్ బదోని (లక్నో- 35 బంతుల్లో 55 నాటౌట్). చదవండి: అరంగేట్రంలోనే అదరగొట్టాడు.. ఎవరీ జేక్ ఫ్రేజర్-మెక్గుర్క్? var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_7552012696.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
IPL LSG Vs DC Photos: కుల్దీప్ మాయాజాలం, 6 వికెట్ల తేడాతో ఢిల్లీ గెలుపు (ఫొటోలు)
-
IPL 2024 LSG vs DC: లక్నోపై ఢిల్లీ క్యాపిటల్స్ ఘన విజయం
IPL 2024 LSG vs DC Live Updates : ఐపీఎల్-2024లో ఢిల్లీ క్యాపిటల్స్ రెండో విజయాన్ని నమోదు చేసింది. ఏక్నా స్టేడియం వేదికగా లక్నో సూపర్ జెయింట్స్తో జరిగిన మ్యాచ్లో 6 వికెట్ల తేడాతో ఢిల్లీ ఘన విజయం సాధించింది. 168 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ.. 18.1 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి చేధించింది. ఢిల్లీ బ్యాటర్లలో అరంగేట్ర ఆటగాడు జేక్ ఫ్రేజర్-మెక్గుర్క్(55) పరుగులతో టాప్ స్కోరర్గా నిలవగా.. రిషబ్ పంత్(41) మరోసారి కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడాడు. లక్నో బౌలర్లలో రవి బిష్ణోయ్ రెండు వికెట్లు పడగొట్టగా.. యష్ ఠాకూర్, నవీన్ తలా వికెట్ సాధించారు. అంతకుముందు బ్యాటింగ్ చేసిన లక్నో నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 167 పరుగులు చేసింది. లక్నో బ్యాటర్లలో బదోని(55 నాటౌట్) టాప్ స్కోరర్గా నిలవగా.. కేఎల్ రాహుల్(39) పరుగులతో రాణించాడు. ఢిల్లీ బౌలర్లలో కుల్దీప్ యాదవ్ మూడు వికెట్లు పడగొట్టగా.. ఖాలీల్ ఆహ్మద్ రెండు, ఇషాంత్ శర్మ, ముఖేష్ కుమార్ తలా వికెట్ పడగొట్టారు. ఢిల్లీ నాలుగో వికెట్ డౌన్.. పంత్ ఔట్ రిషబ్ పంత్ రూపంలో ఢిల్లీ నాలుగో వికెట్ కోల్పోయింది. 41 పరుగులు చేసిన పంత్.. బిష్ణోయ్ బౌలింగ్లో ఔటయ్యాడు. ఢిల్లీ విజయానికి 24 బంతుల్లో 18 పరుగులు కావాలి. ఢిల్లీ మూడో వికెట్ డౌన్.. 140 పరుగుల వద్ద ఢిల్లీ మూడో వికెట్ కోల్పోయింది. 55 పరుగులు చేసిన ఫ్రెజర్ ముక్గర్క్.. నవీన్ ఉల్హక్ బౌలింగ్లో ఔటయ్యాడు. ఢిల్లీ విజయానికి 32 బంతుల్లో 28 పరుగులు కావాలి. క్రీజులో రిషబ్ పంత్(37) పరుగులతో ఉన్నాడు. దంచి కొడుతున్న పంత్.. 12 ఓవర్లకు ఢిల్లీ స్కోర్: 100/2 12 ఓవర్లు ముగిసే సరికి ఢిల్లీ క్యాపిటల్స్ రెండు వికెట్ల నష్టానికి 100 పరుగులు చేసింది. ఢిల్లీ కెప్టెన్ రిషబ్ పంత్ దూకుడుగా ఆడుతున్నాడు. క్రీజులో పంత్(29), ముక్గర్క్(25) పరుగులతో ఉన్నారు. 10 ఓవర్లు ఢిల్లీ స్కోర్ : 75/2 10 ఓవర్లకు ఢిల్లీ క్యాపిటల్స్ రెండు వికెట్ల నష్టానికి 75 పరుగులు చేసింది. క్రీజులో జాక్ ఫ్రెజర్ ముగ్గార్క్(21), రిషబ్ పంత్(8) పరుగులతో ఉన్నారు. రెండో వికెట్ కోల్పోయిన ఢిల్లీ.. పృథ్వీ షా ఔట్ 63 పరుగుల వద్ద ఢిల్లీ క్యాపిటల్స్ రెండో వికెట్ కోల్పోయింది. 32 పరుగులు చేసిన పృథ్వీ షా.. రవి బిష్ణోయ్ బౌలింగ్లో ఔటయ్యాడు. 7 ఓవర్లకు ఢిల్లీ స్కోర్: 63/2 తొలి వికెట్ కోల్పోయిన ఢిల్లీ.. వార్నర్ ఔట్ 168 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ తొలి వికెట్ కోల్పోయింది. 8 పరుగులు చేసిన డేవిడ్ వార్నర్.. యష్ ఠాకూర్ బౌలింగ్లో ఔటయ్యాడు. 4 ఓవర్లకు ఢిల్లీ స్కోర్: 30/1 బదోని సూపర్ ఇన్నింగ్స్.. ఢిల్లీ టార్గెట్ 168 పరుగులు ఢిల్లీ క్యాపిటల్స్తో మ్యాచ్లో టాస్ గెలిచి బ్యాటింగ్కు దిగిన లక్నో సూపర్ జెయింట్స్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 167 పరుగులు చేసింది. 94 పరుగులకే 7 వికెట్లు కోల్పోయిన లక్నోను యువ ఆటగాడు ఆయుష్ బదోని ఆదుకున్నాడు. టెయిలాండర్ ఆర్షద్ ఖాన్(20)తో కలిసి తన జట్టుకు మెరుగైన స్కోర్ను అందించాడు. బదోని(55 నాటౌట్) టాప్ స్కోరర్గా నిలవగా.. కేఎల్ రాహుల్(39) పరుగులతో రాణించాడు. ఢిల్లీ బౌలర్లలో కుల్దీప్ యాదవ్ మూడు వికెట్లు పడగొట్టగా.. ఖాలీల్ ఆహ్మద్ రెండు, ఇషాంత్ శర్మ, ముఖేష్ కుమార్ తలా వికెట్ పడగొట్టారు. 17 ఓవర్లకు లక్నో స్కోర్: 128/7 17 ఓవర్లు ముగిసే సరికి లక్నో 7 వికెట్ల నష్టానికి 128 పరుగులు చేసింది. క్రీజులో ఆయూష్ బదోని(30), ఆర్షద్ ఖాన్(9) పరుగులతో ఉన్నారు. లక్నో ఏడో వికెట్ డౌన్.. 94 పరుగుల వద్ద లక్నో ఏడో వికెట్ కోల్పోయింది. 3 పరుగులు చేసిన కృనాల్ పాండ్యా.. ముఖేష్ కుమార్ బౌలింగ్లో ఔటయ్యాడు. 13 ఓవర్లకు లక్నో స్కోర్ : 94/7 90 పరుగులకే 6 వికెట్లు.. కష్టాల్లో లక్నో 89 పరుగుల వద్ద లక్నో ఆరో వికెట్ కోల్పోయింది. 10 పరుగులు చేసిన దీపక్ హుడా.. వార్నర్ బౌలింగ్లో ఔటయ్యాడు. 12 ఓవర్లకు లక్నో స్కోర్ : 90/6 కుల్దీప్ మాయ.. లక్నో ఐదో వికెట్ డౌన్ 80 పరుగుల వద్ద లక్నో ఐదో వికెట్ కోల్పోయింది. 39 పరుగులు చేసిన కేఎల్ రాహుల్.. కుల్దీప్ యాదవ్ బౌలింగ్లో ఔటయ్యాడు. 11 ఓవర్లకు లక్నో స్కోర్ : 84/5 కుల్దీప్ మాయ.. ఒకే ఓవర్లో రెండు వికెట్లు కుల్దీప్ యాదవ్ దెబ్బకు లక్నో సూపర్ జెయింట్స్ ఒకే ఓవర్లో వరుసగా రెండు వికెట్లు కోల్పోయింది. తొలుత మార్కస్ స్టోయినిష్ ఔట్ కాగా.. తర్వాత నికోలస్ పూరన్ క్లీన్ బౌల్డయ్యాడు. క్రీజులోకి దీపక్ హుడా ఇంపాక్ట్ ప్లేయర్గా వచ్చాడు. 9 ఓవర్లకు లక్నో స్కోర్ : 75/4. క్రీజులో రాహుల్(39), హుడా (3) పరుగులతో ఉన్నారు. లక్నో రెండో వికెట్ డౌన్.. పడిక్కల్ రూపంలో లక్నో సూపర్ జెయింట్స్ రెండో వికెట్ కోల్పోయింది. 3 పరుగులు చేసిన దేవ్దత్త్ పడిక్కల్.. ఖాలీల్ ఆహ్మద్ బౌలింగ్లో పెవిలియన్కు చేరాడు. 5 ఓవర్లు ముగిసే సరికి లక్నో రెండు వికెట్ల నష్టానికి 47 పరుగులు చేసింది. క్రీజులో రాహుల్(21), స్టోయినిష్(1) పరుగులతో ఉన్నారు. తొలి వికెట్ కోల్పోయిన లక్నో.. 28 పరుగుల వద్ద లక్నో సూపర్ జెయింట్స్ తొలి వికెట్ కోల్పోయింది. 19 పరుగులు చేసిన క్వింటన్ డికాక్.. ఖాలీల్ ఆహ్మద్ బౌలింగ్లో ఔటయ్యాడు. క్రీజులోకి దేవ్దత్త్ పడిక్కల్ వచ్చాడు. ఐపీఎల్-2024లో భాగంగా ఏక్నా స్టేడియం వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్, లక్నో సూపర్ జెయింట్స్ జట్లు తలపడతున్నాయి. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన లక్నో సూపర్ జెయింట్స్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్ రెండు మార్పులతో బరిలోకి దిగగా.. లక్నో మాత్రం ఒకే మార్పు చేసింది. ఢిల్లీ జట్టులోకి ముఖేష్ కుమార్, కుల్దీప్ యాదవ్ వచ్చారు. అదేవిధంగా ఈ మ్యాచ్కు లక్నో సంచలన పేసర్ మయాంక్ యాదవ్ దూరమయ్యాడు. తుది జట్లు ఢిల్లీ క్యాపిటల్స్: పృథ్వీ షా, డేవిడ్ వార్నర్, షాయ్ హోప్, రిషబ్ పంత్ (కెప్టెన్), ట్రిస్టన్ స్టబ్స్, అక్షర్ పటేల్, జేక్ ఫ్రేజర్-మెక్గర్క్, కుల్దీప్ యాదవ్, ముఖేష్ కుమార్, ఇషాంత్ శర్మ, ఖలీల్ అహ్మద్ లక్నో సూపర్ జెయింట్స్: క్వింటన్ డి కాక్, కేఎల్ రాహుల్ (కెప్టెన్), దేవదత్ పడిక్కల్, మార్కస్ స్టోయినిస్, నికోలస్ పూరన్, ఆయుష్ బడోని, కృనాల్ పాండ్యా, అర్షద్ ఖాన్, రవి బిష్ణోయ్, నవీన్-ఉల్-హక్, యశ్ ఠాకూర్ -
T20 WC: హార్దిక్, రాహుల్కు నో ఛాన్స్.. ఆ ముగ్గురూ ఫిక్స్!
టీ20 ప్రపంచకప్-2024 ఆడే భారత జట్టులో చోటు కోసం ఆటగాళ్ల మధ్య పోటీ పెరుగుతోంది. ఐపీఎల్-2024లో ప్రదర్శన ఆధారంగా ప్రధాన జట్టులో స్థానం సంపాదించే ప్లేయర్ల పేర్లు ఖరారు కానున్నాయి. ఇక కెప్టెన్గా రోహిత్ శర్మ పేరును బీసీసీఐ ఇప్పటికే ఖరారు చేయగా.. హార్దిక్ పాండ్యా అతడికి డిప్యూటీగా మాత్రమే వ్యవహరించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు.. సుదీర్ఘ విరామం తర్వాత టీ20లలో బ్యాట్ ఝులిపిస్తున్న విరాట్ కోహ్లి తన బెర్తును ఖరారు చేసుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. తాజా ఎడిషన్లో ఇప్పటి వరకు ఆర్సీబీ తరఫున కోహ్లి ఇప్పటి వరకు ఐదు మ్యాచ్లు ఆడి 316 పరుగులతో టాప్ స్కోరర్గా ఉన్నాడు. ఇదిలా ఉంటే.. చెన్నై సూపర్ కింగ్స్ తరఫున పేస్ ఆల్రౌండర్ శివం దూబే(ఇప్పటి వరకు 5 మ్యాచ్లు- 176 రన్స్) సైతం దంచికొడుతున్నాడు. మెరుపు ఇన్నింగ్స్ ఆడుతూ చెన్నై విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నాడు. మరోవైపు.. కోల్కతా నైట్ రైడర్స్ స్టార్, టీమిండియా నయా ఫినిషర్ రింకూ సింగ్ సైతం ఆడే అవకాశం వచ్చినప్పుడల్లా మెరుపులు మెరిపిస్తున్నాడు. ఇక సూర్యకుమార్ యాదవ్ గాయం తర్వాత కోలుకుని ముంబై ఇండియన్స్ తరఫున బరిలోకి దిగాడు. తొలి మ్యాచ్లో డకౌట్గా వెనుదిరిగినా ఈ వరల్డ్ నంబర్ వన్ టీ20 బ్యాటర్ తిరిగి పుంజుకోగలడు. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ క్రికెటర్ వెంకటేశ్ ప్రసాద్ టీ20 ప్రపంచకప్ జట్టులో భారత బ్యాటింగ్ ఆర్డర్ కూర్పు గురించి ఆసక్తికర ట్వీట్ చేశాడు. విరాట్, రోహిత్తో పాటు ఆ ముగ్గురూ ‘‘స్పిన్నర్ల బౌలింగ్లో దూకుడుగా ఆడుతూ శివం దూబే మెరుపులు మెరిపిస్తున్నాడు. సూర్య అంతర్జాతీయ స్థాయిలో టీ20 నంబర్ వన్ బ్యాటర్. ఇక ఫినిషర్గా రింకూ సింగ్ అసాధారణ నైపుణ్యాల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ ముగ్గురిని టీ20 ప్రపంచకప్ భారత తుదిజట్టులో ఆడిస్తే గొప్పగా ఉంటుంది. ఇక విరాట్, రోహిత్ను కూడా కలుపుకోగా.. కేవలం వికెట్ కీపర్ బ్యాటర్కు మాత్రమే చోటు ఉంటుంది. ఇలా చేస్తే ఎలా ఉంటుందో చూడాలి’’ అని వెంకటేశ్ ప్రసాద్ పేర్కొన్నాడు. పాండ్యా, రాహుల్, అయ్యర్కు మొండిచేయి తన జట్టులో బ్యాటింగ్ ఆర్డర్లో పేస్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా, వికెట్ కీపర్ కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్ పేర్లను వెంకటేశ్ ప్రసాద్ ప్రస్తావించకపోవడం గమనార్హం. కాగా ఐపీఎల్-2024లో పాండ్యా, రాహుల్ ఇప్పటి వరకు తమ స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేదు. మరోవైపు.. వికెట్ కీపర్ బ్యాటర్ల కోటాలో రాహుల్కు రిషభ్ పంత్, సంజూ శాంసన్ నుంచి పోటీ ఎదురవుతోంది. అయితే, అందకి కంటే సంజూ ఓ అడుగు ముందే ఉన్నాడు. ఇప్పటి వరకు 4 మ్యాచ్లు ఆడిన ఈ రాజస్తాన్ రాయల్స్ కెప్టెన్ 178 పరుగులు చేశాడు. చదవండి: #SRHvsPBKS: నరాలు తెగే ఉత్కంఠ: ఆఖరి బంతి వరకు ‘భయపెట్టిన’ ఉనాద్కట్! Shivam Dube for his striking ability against spinners, Surya for being the best T20 international batter and Rinku Singh for his exceptional finishing ability. It will be great if India finds a way to have these 3 in the 11 in the T20 WC. With Virat and Rohit , this will leave… — Venkatesh Prasad (@venkateshprasad) April 8, 2024
Pagination
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
పోలీస్ ఫెయిల్యూర్.. బాబు, పురందేశ్వరి మేనేజ్..
'ఇడియట్ సిండ్రోమ్' అంటే ఏంటీ..? ప్రమాదకరమా..?
సోషల్ మీడియాలో వైరల్గా మారిన టీడీపీ, జనసేన వీడియో
తెలంగాణలో బీజేపీకి బ్రహ్మాండమైన ఫలితాలు: కిషన్ రెడ్డి
రోహిత్ శర్మతో పాటు షకీబ్!.. ఎవరికీ సాధ్యం కాని రికార్డు!
టీడీపీతో కుమ్మక్కు.. ఏపీ పోలీస్ అబ్జర్వర్ దీపక్ మిశ్రాపై వైఎస్సార్సీపీ ఫిర్యాదు
ఈసీ బదిలీ చేసిన చోటే ఈ దారుణాలు
రాజశ్యామల సహస్ర చండీయాగం వేద ఆశీర్వచనం ఇచ్చిన వేద పండితులు
కొంతమంది పోలీసులు టీడీపీ వాళ్ళతో కుమ్మక్కై: అంబటి
Best Pictures Of The Day : ఈ రోజు ఉత్తమ చిత్రాలు (15-05-2024)
తప్పక చదవండి
- పంచాయత్ సీజన్ 3 ట్రైలర్ విడుదల
- సచిన్ టెండూల్కర్ సెక్యూరిటీ గార్డు ఆత్మహత్య!
- అమ్ముడుపోని లక్షలాది ఇళ్లు.. చైనా కీలక ప్రతిపాదన!
- నాన్స్టిక్ పాత్రలు వినియోగిస్తున్నారా? ఐసీఎంఆర్ స్ట్రాంగ్ వార్నింగ్!
- ఆంధ్రాలో చిన్న ఆలయానికి జూ.ఎన్టీఆర్ భారీ విరాళం
- ‘ఆ దేవాలయాలు నిర్మించాలంటే 400కుపైగా సీట్లు కావాల్సిందే’
- అతడి కంటే చెత్త కెప్టెన్ ఎవరూ లేరు.. పైగా హార్దిక్ను అంటారా?
- పల్నాడు ప్రమాదంపై సీఎం జగన్ దిగ్భ్రాంతి
- BCCI: టీమిండియా హెడ్కోచ్గా వాళ్లిద్దరిలో ఒకరు?
- NewsClick Row: ప్రబీర్ తక్షణ రిలీజ్కు సుప్రీం కోర్టు ఆదేశం
Advertisement