-
చెలరేగిన భారత బౌలర్లు.. 100 పరుగులకే ఆలౌట్.. ఘన విజయం
ICC Under 19 World Cup 2024- India U19 won by 201 runs: ఐసీసీ అండర్ 19 ప్రపంచకప్-2024లో యువ టీమిండియా ఘన విజయం సాధించింది. ఐర్లాండ్ను ఏకంగా 201 పరుగుల తేడాతో చిత్తుగా ఓడించింది. సమిష్టి ప్రదర్శనతో ఈ మేరకు భారీ గెలుపు నమోదు చేసింది. సౌతాఫ్రికాలోని బ్లూమ్ఫౌంటేన్ వేదికగా గురువారం జరిగిన మ్యాచ్లో టాస్ ఓడిన భారత్ తొలుత బ్యాటింగ్ చేసింది. ఓపెనర్లు ఆదర్శ్ సింగ్ 17, అర్షిన్ కులకర్ణి 32 పరుగులు చేయగా.. వన్డౌన్ బ్యాటర్ ముషీర్ ఖాన్ అద్భుత సెంచరీతో ఆకట్టుకున్నాడు. ఈ రైట్ హ్యాండ్ బ్యాటర్ 106 బంతుల్లో 118 పరుగులు సాధించాడు. ఇక ముషీర్తో పాటు కెప్టెన్ ఉదయ్ సహారన్ 75 పరుగులతో రాణించాడు. మిగతా వాళ్లలో వికెట్ కీపర్ అరవెల్లి అవినాష్ రావు 22, సచిన్ ధ్యాస్ 21(నాటౌట్) చెప్పుకోదగ్గ స్కోర్లు చేశారు. భారీ లక్ష్యం విధించి ముషీర్, ఉదయ్ ఇన్నింగ్స్ కారణంగా యవ భారత జట్టు నిర్ణీత 50 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి ఏకంగా 301 పరుగులు చేసింది. ఇక లక్ష్య ఛేదనకు దిగిన ఐరిష్ జట్టును భారత బౌలర్లు ఓ ఆటాడుకున్నారు. ఓపెనర్లలో జోర్డాన్ నీల్(11)ను స్పిన్నర్ సౌమీ పాండే పెవిలియన్కు పంపి శుభారంభం అందించగా.. పేసర్ నమన్ తివారి ఐరిష్ బ్యాటర్లకు చుక్కలు చూపించాడు. నమన్ తివారి దెబ్బకు ఓపెనర్ రియాన్ హంటర్(13)ను అవుట్ చేసిన నమన్.. మిడిలార్డర్ను కకావికలం చేశాడు. అతడి దెబ్బకు ఐర్లాండ్ స్వల్ప వ్యవధిలో మూడు వికెట్లు కోల్పోగా.. సౌమీ పాండే సైతం మరోసారి విజృంభించాడు. ఈ నేపథ్యంలో 29.4 ఓవర్లలోనే ఐర్లాండ్ కథ ముగిసింది. బ్యాటర్లంతా చేతులెత్తేయడంతో వంద పరుగులకే ఆలౌట్ అయింది. దీంతో భారత్ ఏకంగా 201 రన్స్ తేడాతో జయభేరి మోగించింది. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అతడే భారత బౌలర్లలో నమన్ తివారికి అత్యధికంగా నాలుగు, సౌమీ పాండేకు మూడు వికెట్లు దక్కగా.. ధనుశ్ గౌడ, మురుగన్ అభిషేక్, ఉదయ్ సహారన్ తలా ఓ వికెట్ పడగొట్టారు. ఇక భారత్ భారీ స్కోరు చేయడంలో కీలక పాత్ర పోషించిన సెంచరీ వీరుడు ముషీర్ ఖాన్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు. కాగా ఈ ఐసీసీ ఈవెంట్ తాజా ఎడిషన్లో భారత్కు ఇది రెండో విజయం. తొలి మ్యాచ్లో బంగ్లాదేశ్ను 84 పరుగుల తేడాతో సహారన్ సేన చిత్తు చేసింది. ఇక తాజా విజయంతో గ్రూప్-ఏ టాపర్గా నిలిచింది యువ భారత జట్టు. చదవండి: INDA& U19 WC: ఒకేరోజు అటు అన్న.. ఇటు తమ్ముడు సెంచరీలతో ఇరగదీశారు! Another huge win, this time by 201 runs, has consolidated India’s position at the top of the Group A table 👏 Match Highlights 🎥 #U19WorldCup pic.twitter.com/U1LucpWNcI — ICC (@ICC) January 25, 2024 -
Ind Vs Ire: ప్రయోగానికి ఆఖరి అవకాశం .. జితేశ్, షహబాజ్లకు ఛాన్స్!
డబ్లిన్: వెస్టిండీస్తో ఐదు టి20 మ్యాచ్లు, ఆ తర్వాత ఐర్లాండ్తో మూడు టి20 మ్యాచ్లు భారత యువ ఆటగాళ్లను ఈ ఫార్మాట్లో పరీక్షించేందుకు అవకాశం ఇచ్చాయి. వన్డే ప్రపంచకప్ ఏడాది ఎక్కువ మంది సీనియర్లు విరామం తీసుకోగా, కుర్రాళ్లంతా తమకు లభించిన చాన్స్ను చక్కగా ఉపయోగించుకున్నారు. ఈ రెండు పర్యటనల్లో కలిపి ఏడు మ్యాచ్లలో ఇప్పటికే ఐదుగురు ఆటగాళ్లు అంతర్జాతీయ టి20ల్లో అరంగేట్రం చేశారు. ఇక మరో ఇద్దరు దాని కోసం ఎదురు చూస్తున్నారు. టూర్ చివరి మ్యాచ్లో ఆ చాన్స్ దక్కుతుందా అనేది చూడాలి. సిరీస్ను 2–0తో సొంతం చేసుకున్న భారత్ కోణంలో ఇది మాత్రమే ఆసక్తికర అంశం. మరోవైపు వన్డే, టి20 ఫార్మాట్లలో కలిపి భారత్తో ఆడిన 10 సార్లూ ఓడిన ఐర్లాండ్ ఈసారైనా సొంతగడ్డపై ఒక్క మ్యాచ్ గెలవాలని కోరుకుంటోంది. ఈ నేపథ్యంలో నేడు చివరి టి20కి రంగం సిద్ధమైంది. జితేశ్, షహబాజ్లకు అవకాశం! ఐర్లాండ్తో రెండు మ్యాచ్లోలనూ రాణించిన కెప్టెన్ బుమ్రా, పేసర్ ప్రసిధ్ కృష్ణ ఫామ్లోకి రావడం, ఆసియా కప్కు ఎంపిక కావడంతో ఈ సిరీస్ నుంచి భారత్కు ఆశించిన ప్రధాన ఫలితం దక్కింది. అయితే మరింత మ్యాచ్ ప్రాక్టీస్ కోసం వీరిద్దరు ఈ మ్యాచ్లోనూ బరిలోకి దిగుతారు. రవి బిష్ణోయ్ కూడా సిరీస్లో తన బౌలింగ్తో ఆకట్టుకున్నాడు. బ్యాటింగ్లో రుతురాజ్, సామ్సన్, రింకూ సింగ్ కూడా తమకు లభించిన అవకాశాలు చక్కగా ఉపయోగించుకోగా, శివమ్ దూబే కూడా తన ధాటిని ప్రదర్శించాడు. సిరీస్లో విఫలమైన తిలక్ వర్మ చివరి పోరులో సత్తా చాటాలని పట్టుదలగా ఉన్నాడు. యశస్వి కూడా మరో మెరుపు ఇన్నింగ్స్ బాకీ ఉన్నాడు. ఈ స్థితిలో తుది జట్టులో మూడు మార్పులకు అవకాశం ఉంది. ఇప్పటి వరకు అంతర్జాతీయ క్రికెట్ ఆడని వికెట్ కీపర్ జితేశ్ శర్మ, 3 వన్డేలు ఆడిన షహబాజ్ అహ్మద్ అవకాశం కోసం ఎదురు చూస్తున్నారు. వీరిని తీసుకోవాలని మేనేజ్మెంట్ భావిస్తే సంజు సామ్సన్, వాషింగ్టన్ సుందర్ స్థానాల్లో అవకాశం దక్కుతుంది. మరోవైపు కొంత విరామం తర్వాత టీమ్లోకి వచ్చిన అవేశ్ ఖాన్ కూడా టీమ్తో పాటు ఉన్నాడు. అతనికీ ఒక మ్యాచ్ ఇవ్వాలనుకుంటే అర్‡్షదీప్కు విశ్రాంతినిస్తారు. ఇదే జరిగితే కుర్రాళ్లతో భారత్ ప్రయోగం సంపూర్ణమవుతుంది. స్టిర్లింగ్ ఫామ్లోకి వచ్చేనా! రెండు టి20 మ్యాచ్లలో ఐర్లాండ్ ఆటతీరు మరీ పేలవంగా లేకున్నా భారత్లాంటి బలమైన జట్టుకు పోటీనిచ్చేందుకు సరిపోలేదు. గతంలోనూ కొన్ని చక్కటి ప్రదర్శనలు వచ్చినా టీమిండియాను ఓడించడంలో మాత్రం ఆ జట్టు సఫలం కాలేకపోయింది. ఈ నేపథ్యంలో చివరి పోరులోనైనా ఆ జట్టు గెలుపు బాట పడుతుందేమో చూడాలి. ప్రపంచవ్యాప్తంగా లీగ్లలో అద్భుతంగా బ్యాటింగ్ చేస్తూ వచ్చిన కెప్టెన్ పాల్ స్టిర్లింగ్ ఇక్కడ మాత్రం రెండింటిలోనూ విఫలమయ్యాడు. బల్బిర్నీ మినహా మిగతావారంతా ప్రభావం చూపలేకపోయారు. విజయం సాధించాలంటే జట్టు సమష్టిగా రాణించడం కీలకం. ఐర్లాండ్ కూడా గత మ్యాచ్తో పోలిస్తే మూడు మార్పులతో బరిలోకి దిగే అవకాశం ఉంది. -
ఐర్లాండ్తో మూడో టీ20.. సంజు శాంసన్పై వేటు! ఐపీఎల్ హీరో ఎంట్రీ
ఐర్లాండ్తో టీ20 సిరీస్ను ఇప్పటికే సొంతం చేసుకున్న టీమిండియా.. నామమాత్రపు మ్యాచ్ అయిన ఆఖరి టీ20లో తలపడేందుకు సిద్దమైంది. బుధవారం డబ్లిన్ వేదికగా భారత్-ఐర్లాండ్ మధ్య మూడో టీ20 జరగనుంది. ఈ మ్యాచ్లో గెలిచి సిరీస్ను క్లీన్ స్వీప్ చేయాలని బుమ్రా సేన భావిస్తోంది. అదే విధంగా గత రెండు మ్యాచ్లకు బెంచ్కే పరిమితమైన ఆటగాళ్లకు ఆఖరి టీ20లో అవకాశం ఇవ్వాలని జట్టు మెన్జ్మెంట్ యోచిస్తున్నట్లు సమాచారం. ఈ క్రమంలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్, ఆల్రౌండర్ వాషింగ్టన్ సుందర్, పేసర్ అర్ష్దీప్ సింగ్ను ఆఖరి మ్యాచ్కు పక్కన పెట్టనున్నట్లు తెలుస్తోంది. వీరి ముగ్గురి స్ధానంలో వరుసగా జితేష్ శర్మ, షాబాజ్ అహ్మద్, అవేష్ ఖాన్ తుది జట్టులోకి రానున్నట్లు తెలుస్తోంది. కాగా ఐపీఎల్లో అదరగొట్టి జట్టులోకి వచ్చిన జితేష్ శర్మ.. అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టేందుకు అతృతగా ఎదురుచూస్తున్నాడు. గత కొన్ని సిరీస్లకు జితేష్ ఎంపికవుతున్నప్పటికీ.. అరంగేట్రం చేసే అవకాశం రావడం లేదు. అయితే ఐర్లాండ్తో ఆఖరి టీ20లో జితేష్ అరంగేట్రం దాదాపు ఖాయమన్పిస్తోంది. మరోవైపు అవేష్ ఖాన్ విండీస్తో టీ20 సిరీస్ ఎంపికైనప్పటికి ఒక్క మ్యాచ్లో కూడా అవకాశం రాలేదు. ఈ క్రమంలో అతడికి ఆఖరి టీ20లో ఛాన్స్ ఇవ్వనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మరోవైపు ఐర్లాండ్ కూడా తమ జట్టులో ఒకే ఒక మార్పు చేయనున్నట్లు సమాచారం. ఆల్రౌండర్ డాక్రెల్ స్ధానంలో గ్రెత్ డెలానీకి ఛాన్స్ ఇవ్వాలని ఐరీష్ జట్టు మెనెజ్మెంట్ భావిస్తున్నట్లు పలు రిపోర్టులు పేర్కొంటున్నాయి. తుది జట్లు(అంచనా) భారత్: రుతురాజ్ గైక్వాడ్, యశస్వి జైస్వాల్, జితేష్ శర్మ (వికెట్ కీపర్), తిలక్ వర్మ, రింకూ సింగ్, శివమ్ దూబే, షాబాజ్ , ప్రసిద్ధ్ కృష్ణ, అవేష్ ఖాన్, జస్ప్రీత్ బుమ్రా (కెప్టెన్), రవి బిష్ణోయ్ ఐర్లాండ్: పాల్ స్టిర్లింగ్ (కెప్టెన్), ఆండ్రూ బల్బిర్నీ, లోర్కాన్ టక్కర్ (వికెట్ కీపర్), హ్యారీ టెక్టర్, కర్టిస్ కాంఫర్,గ్రెత్ డెలానీ, మార్క్ అడైర్, బారీ మెక్కార్తీ, క్రెయిగ్ యంగ్, జాషువా లిటిల్, బెంజమిన్ వైట్ చదవండి: IND vs IRE: అయ్యో రింకూ.. ఇంగ్లీష్ రాక ఇబ్బంది పడిన సిక్సర్ల కింగ్! బుమ్రా మంచి మనసు -
అయ్యో రింకూ.. ఇంగ్లీష్ రాక ఇబ్బంది పడిన సిక్సర్ల కింగ్! బుమ్రా మంచి మనసు
ఐర్లాండ్తో టీ20 సిరీస్లో టీమిండియా కెప్టెన్గా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో డబ్లిన్ వేదికగా జరిగిన రెండో టీ20 అనంతరం బుమ్రా తన చర్యతో అభిమానుల మనసులను గెలుచుకున్నాడు. ఈ మ్యాచ్లో టీమిండియా ఆటగాడు రింకూ సింగ్ అదరగొట్టాడు. తన తొలి ఇన్నింగ్స్లోనే అద్బుతమైన ప్రదర్శన కనబరిచిన ఈ యూపీ ఆటగాడు అందరిని అకట్టుకున్నాడు. ఐదో స్ధానంలో బ్యాటింగ్ వచ్చిన రింకూ.. 21 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్సర్లతో 38 పరుగులు చేసి భారత్కు మంచి స్కోర్ను అందించాడు. కీలక ఇన్నింగ్స్ ఆడిన రింకూకు మ్యాన్ ఆఫ్ది మ్యాచ్ అవార్డు లభించింది. సూపర్ బుమ్రా.. ఈ క్రమంలో పోస్ట్మ్యాచ్ ప్రెజెంటేషన్లో సమయంలో రింకూ ఇంగ్లీష్లో మాట్లాడానికి కాస్త ఇబ్బంది పడ్డాడు. హిందీలో మాట్లాడితే ఫ్రీగా ఉంటుందని రింకూ ప్రెజెంటర్ అలాన్ విల్కిన్స్కు చెప్పాడు. ఈ సమయంలో అక్కడే ఉన్న బుమ్రా ముందకు వచ్చి రింకూకు ట్రాన్స్లేటర్గా మారాడు. విల్కిన్స్ ఇంగ్లీష్లో అడుగుతుంటే బుమ్రా దాన్ని హిందీలోకి అనువాదం చేసి రింకూకు అర్దమయ్యేలా చెప్పుకొచ్చాడు. విల్కిన్స్ రింకూను నీవు కెప్టెన్ మాట వింటావా అంటూ ఇంగ్లీష్లో ప్రశ్నించాడు. దాన్ని హిందీలోకి బుమ్రా ట్రాన్సలేట్ చేశాడు. అందుకు బదులుగా రింకూ నవ్వుతూ నేను ఎప్పుడూ కెప్టెన్ మాట వింటా అంటూ సమాధానమిచ్చాడు. తన మంచిమనసు చాటుకున్న బుమ్రాపై ప్రశంసల వర్షం కురుస్తోంది. ఇక ఈ సిరీస్లో ఆఖరి టీ20 డబ్లిన్ వేదికగా ఆగస్టు 23న జరగనుంది. చదవండి: Asia Cup 2023: జట్టులో పార్ట్టైమ్ బౌలర్స్ లేరా..? అదిరిపోయే రిప్లై ఇచ్చిన రోహిత్! వీడియో వైరల్ -
ఐర్లాండ్ కెప్టెన్ అత్యంత చెత్త రికార్డు.. ప్రపంచంలోనే తొలి క్రికెటర్గా
అంతర్జాతీయ టీ20ల్లో ఐర్లాండ్ కెప్టెన్ పాల్ స్టిర్లింగ్ అత్యంత చెత్తరికార్డు నెలకొల్పాడు. టీ20 క్రికెట్లో అత్యధిక సార్లు డకౌటైన బ్యాటర్గా స్టిర్లింగ్ నిలిచాడు. ఇప్పటివరకు 13 సార్లు స్టిర్లింగ్ డకౌట్గా వెనుదిరిగాడు. ఆదివారం డబ్లిన్ వేదికగా భారత్తో జరిగిన రెండో టీ20లో ప్రసిద్ద్ కృష్ణ బౌలింగ్లో డకౌటైన స్టిర్లింగ్.. ఈ చెత్త రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. ఇప్పటివరకు ఈ చెత్త రికార్డు ఐర్లాండ్ మాజీ ఆటగాడు కెవిన్ ఓబ్రియన్ పేరిట ఉండేది. తాజా మ్యాచ్తో ఓబ్రియన్ను స్టిర్లింగ్ అధిగమించాడు. ఆ తర్వాతి స్ధానాల్లో జింబాబ్వే క్రికెటర్ చకాబ్వా(11), సౌమ్య సర్కార్(11) ఉన్నారు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. భారత్ చేతిలో 33 పరుగుల తేడాతో ఐర్లాండ్ ఓటమి పాలైంది. దీంతో మూడు మ్యాచ్ల సిరీస్ను 2-0తో ఐరీష్ కోల్పోయింది. భారత్ నిర్దేశించిన 186 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడంలో ఐర్లాండ్ చతికిలపడింది. లక్ష్యఛేదనలో ఐరీష్ 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 152 పరుగులు మాత్రమే చేయగల్గింది. ఐర్లాండ్ బ్యాటర్లలో ఓపెనర్ అండీ బల్బిర్నీ (51 బంతుల్లో 72; 5 ఫోర్లు, 4 సిక్సర్లు) ఒంటరి పోరాటం చేశాడు. భారత బౌలర్లలో కెప్టెన్ బుమ్రా, ప్రసిధ్ కృష్ణ, రవి బిష్ణోయ్ తలా 2 వికెట్లు తీశారు. ఇక ఇరు జట్ల మధ్య ఆఖరి టీ20 ఆగస్టు 23న జరగనుంది. చదవండి: IND vs IRE: జైలర్ సినిమా చూశాడు.. దుమ్ము రేపాడు! అట్లుంటది సంజూతో -
జైలర్ సినిమా చూశాడు.. దుమ్ము రేపాడు! అట్లుంటది సంజూతో
సూపర్ స్టార్ రజనీకాంత్కి టీమిండియా క్రికెటర్ సంజూ శాంసన్ వీరాభిమాని అన్న సంగతి తెలిసిందే. కేరళలో పుట్టిన సంజూకు చిన్నతనం నుంచే రజనీకాంత్ అంటే ఎంతో ఇష్టం. తలైవాను కలవాలన్న తన చిన్నప్పటి కోరికను సంజూ 28ఏళ్ల వయస్సులో నేరవేర్చుకున్నాడు. ఈ ఏడాది మార్చిలో రజినీని తన నివాసంలో కలిశాడు. ఇక తాజాగా మరోసారి సూపర్ స్టార్పై తన అభిమానాన్ని సంజూ చాటుకున్నాడు. శాంసన్ ప్రస్తుతం ఐర్లాండ్ పర్యటనలో ఉన్న విషయం విధితమే. ఈ క్రమంలో రజినీ కాంత్ నటించిన 'జైలర్' సినిమాను శనివారం ఐర్లాండ్లో స్పెషల్ స్క్రీనింగ్ వేశారు. దీనికి సంజూ ముఖ్య అతిథిగా హాజరయ్యాడు. ఈ విషయాన్ని ఐర్లాండ్-భారత్ రెండో టీ20 సందర్భంగా కామేంటేటర్ నైల్ ఓబ్రియన్ వెల్లడించాడు. ఇటీవలే సంజు తన అభిమాన నటుడి సినిమాను చూశాడాని ఓబ్రియన్ చెప్పుకొచ్చాడు. ఇక ఆగస్టు 10న ప్రపంచవ్యాప్తంగా రిలీజైన జైలర్ సినిమా.. రికార్డులు బ్రేక్ చేస్తూ దూసుకుపోతుంది. ఇప్పటి వరకు రూ.500 కోట్ల మేర గ్రాస్ సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. ఐర్లాండ్పై 33 పరుగుల తేడాతో టీమిండియా ఘనవిజయం సాధించింది. తద్వారా మరో మ్యాచ్ మ్యాచ్ మిగిలుండగానే సిరీస్ను 2–0తో కైవసం చేసుకుంది. ఈ మ్యాచ్లో సంజూ కూడా కీలక ఇన్నింగ్స్ ఆడాడు. 26 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్స్ సాయంతో 40 పరుగులు చేశాడు. అయితే వెస్టిండీస్తో టీ20 సిరీస్లో విఫలమైన సంజూ.. ఐర్లాండ్పై అదరగొట్టడంతో ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. జైలర్ సినిమా చూసిన తర్వాత సంజూ రెచ్చిపోయాడని సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు. మరోవైపు నేడు ఆసియాకప్ జట్టు ప్రకటన నేపథ్యంలో సంజూకు చోటు దక్కాలని కోరుకుంటున్నారు. చదవండి: #Rinku Singh: టీమిండియాకు నయా ఫినిషర్.. వారెవ్వా రింకూ! వీడియో వైరల్ Just IN : Indian Cricketer #SanjuSamson WATCHED superstar #Rajinikanth's #Jailer movie. ||#JailerHits500cr | #ShivaRajkumar |#Mohanlal ||pic.twitter.com/M59u7eizgu — Manobala Vijayabalan (@ManobalaV) August 20, 2023 -
చాలా సంతోషంగా ఉంది..10 ఏళ్లగా కష్టపడుతున్నా! నా తొలి మ్యాచ్లోనే: రింకూ
ఐపీఎల్లో అదరగొట్టి భారత జట్టులోకి ఎంట్రీ ఇచ్చిన యూపీ క్రికెటర్ రింకూ సింగ్.. తన తొలి ఇన్నింగ్స్లోనే అదరగొట్టాడు. డబ్లిన్ వేదికగా ఐర్లాండ్తో జరిగిన రెండో టీ20లో రింకూ అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడు. ఐదో స్ధానంలో బ్యాటింగ్ వచ్చిన రింకూ.. 21 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్సర్లతో 38 పరుగులు చేసి సత్తాచాటాడు. శివబ్ దుబేతో కలిసి టీమిండియా భారీ స్కోర్ సాధించడంలో రింకూ కీలక పాత్రపోషించాడు. ఆఖరి రెండు ఓవర్లలో ఐరీష్ బౌలర్లకు రింకూ చుక్కలు చూపించాడు. కాగా ఐర్లాండ్తో జరిగిన తొలి టీ20తో రింకూ సింగ్ అరంగేట్రం చేసినప్పటికీ.. బ్యాటింగ్ చేసే అవకాశం రాలేదు. కానీ రెండో టీ20లో మాత్రం ఈ కేకేఆర్ సంచలనానికి ఛాన్స్ దక్కింది. అతడు తనకు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగపరుచుకున్నాడు. తన అద్భుత ప్రదర్శనకు గాను రింకూకు మ్యాన్ఆఫ్ది మ్యాచ్ అవార్డు లభించింది. ఇక తన ప్రదర్శన పట్ల మ్యాచ్ అనంతరం రింకూ సింగ్ స్పందించాడు. "నేను చాలా సంతోషంగా ఉన్నాను. ఐపీఎల్లో ఏమి చేశానో ఇక్కడ కూడా అదే అదే చేయడానికి ప్రయత్నించాను. నేను చాలా కాన్పడెన్స్తో ఈ మ్యాచ్లో బ్యాటింగ్కు దిగా. ఎటువంటి ఒత్తిడికి గురవ్వకుండా ఉండటానికి ప్రయత్నించాను. నేను గత 10 ఏళ్లగా క్రికెట్ ఆడుతున్నాను. నా కష్టానికి తగ్గ ప్రతిఫలం ఈ రోజు దక్కింది. నా తొలి ఇన్నింగ్స్లో లోనే మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు రావడం ఆనందంగా ఉందంటూ" రింకూ పోస్ట్మ్యాచ్ ప్రేజేంటేషన్లో పేర్కొన్నాడు. చదవండి: వాటిని పట్టించుకోకూడదు.. అది మాకు పెద్ద తలనొప్పి! ప్రతీ ఒక్కరూ: టీమిండియా కెప్టెన్ Achi finish ki chinta kyu jab crease par barkaraar ho Rinku 🤩! 🔥#IREvIND #JioCinema #Sports18 #RinkuSingh #TeamIndia pic.twitter.com/QPwvmPPPxK — JioCinema (@JioCinema) August 20, 2023 -
చరిత్ర సృష్టించిన టీమిండియా స్పీడ్ స్టార్.. తొలి భారత పేసర్గా
టీమిండియా ఫాస్ట్బౌలర్ అర్ష్దీప్ సింగ్ అరుదైన ఘనత సాధించాడు. టీ20ల్లో అత్యంతవేగంగా 50 వికెట్ల మైలురాయిని అందుకున్న భారత పేసర్గా అర్ష్దీప్ సింగ్ రికార్డులకెక్కాడు. డబ్లిన్ వేదికగా ఐర్లాండ్తో జరిగిన రెండో టీ20లో ఆండ్రూ బల్బిర్నీని ఔట్ చేసిన అర్ష్దీప్ ఈ అరుదైన రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. అర్ష్దీప్ తన 33వ టీ20 మ్యాచ్లోనే ఈ ఫీట్ను అందుకున్నాడు. అంతకుముందు ఈ రికార్డు భారత పేస్ గుర్రం జస్ప్రీత్ బుమ్రా పేరిట ఉండేది. బుమ్రా 41 మ్యాచ్ల్లో ఈ రికార్డు సాధించాడు. తాజా మ్యాచ్తో బుమ్రా రికార్డును అర్ష్దీప్ బద్దలు కొట్టాడు. అదే విధంగా ఓవరాల్గా ఈ ఘనత సాధించిన రెండో భారత బౌలర్ కూడా అర్ష్దీప్ కావడం గమానార్హం. అంతకుముందు వెటరన్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ 30 మ్యాచ్ల్లోనే 50 వికెట్ల మైలు రాయిని అందుకున్నాడు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. ఐర్లాండ్పై 33 పరుగుల తేడాతో టీమిండియా విజయం సాధించింది. దీంతో మరో మ్యాచ్ మ్యాచ్ మిగిలుండగానే సిరీస్ను 2–0తో కైవసం చేసుకుంది. ఈ మ్యాచ్లో యువ భారత్ ఆల్రౌండ్ షోతో అదరగొట్టింది. సిరీస్లోని చివరిదైన మూడో మ్యాచ్ ఈనెల 23న ఇదే వేదికపై జరుగుతుంది. చదవండి: #Rinku Singh: టీమిండియాకు నయా ఫినిషర్.. వారెవ్వా రింకూ! వీడియో వైరల్ -
టీమిండియాకు నయా ఫినిషర్.. వారెవ్వా రింకూ! వీడియో వైరల్
యూపీ క్రికెటర్, ఐపీఎల్ స్టార్ రింకూ సింగ్ తన అంతర్జాతీయ కెరీర్ను అద్భుతంగా ప్రారంభించాడు. ఐర్లాండ్తో జరిగిన తొలి టీ20తో రింకూ సింగ్ అరంగేట్రం చేసినప్పటికీ.. బ్యాటింగ్ చేసే అవకాశం రాలేదు. కానీ రెండో టీ20లో మాత్రం ఈ సిక్సర్ల కింగ్కు ఛాన్స్ లభించింది. తనకు వచ్చిన అవకాశాన్ని రింకూ అందిపుచ్చుకున్నాడు. ఈ మ్యాచ్లో రింకూ సంచలన ప్రదర్శన చేశాడు. ఐదో స్ధానంలో బ్యాటింగ్ వచ్చిన రింకూ.. 21 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్సర్లతో 38 పరుగులు చేసి భారత్కు మంచి స్కోర్ను అందించాడు. ఆఖరిలో శివమ్ దుబేతో కలిసి ఐర్లాండ్ బౌలర్లను ఆట ఆడుకున్నాడు. ఇక అద్బుత ఇన్నింగ్స్ ఆడిన రింకూ సింగ్పై సర్వాత్ర ప్రశంసల వర్షం కురుస్తోంది. టీమిండియాకు నయా ఫినిషర్ దొరికాడని సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు. కాగా ఐపీఎల్లో దుమ్మరేపడంతో సెలక్టర్లు నుంచి రింకూకు పిలుపు వచ్చింది. ఈ ఏడాది సీజన్లో 14 మ్యాచ్లు ఆడిన రింకూ 149.9 స్ట్రైక్రేట్తో 474 పరుగులు చేశాడు. ఈ క్రమంలో చైనా వేదికగా జరగనున్న ఆసియాక్రీడలకు కూడా రింకూను సెలక్టర్లు ఎంపిక చేశారు. ఇక రెండో టీ20లో 33 పరుగుల తేడాతో టీమిండియా ఘనవిజయం సాధించింది. ద్వారా మరో మ్యాచ్ మ్యాచ్ మిగిలుండగానే సిరీస్ను 2–0తో కైవసం చేసుకుంది. సిరీస్లోని చివరిదైన మూడో మ్యాచ్ ఈనెల 23న ఇదే వేదికపై జరుగుతుంది. చదవండి: వాటిని పట్టించుకోకూడదు.. అది మాకు పెద్ద తలనొప్పి! ప్రతీ ఒక్కరూ: టీమిండియా కెప్టెన్ Achi finish ki chinta kyu jab crease par barkaraar ho Rinku 🤩! 🔥#IREvIND #JioCinema #Sports18 #RinkuSingh #TeamIndia pic.twitter.com/QPwvmPPPxK — JioCinema (@JioCinema) August 20, 2023 -
వాటిని పట్టించుకోకూడదు.. అది మాకు పెద్ద తలనొప్పి! ప్రతీ ఒక్కరూ
ఐర్లాండ్ గడ్డపై యువ భారత జట్టు సత్తాచాటింది. డబ్లిన్ వేదికగా ఐర్లాండ్తో జరిగన రెండో టీ20లో 33 పరుగుల తేడాతో టీమిండియా ఘనవిజయం సాధించింది. తద్వారా మరో మ్యాచ్ మ్యాచ్ మిగిలుండగానే సిరీస్ను 2–0తో కైవసం చేసుకుంది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్కు దిగిన టీమిండియా భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 185 పరుగులు చేసింది. భారత బ్యాటర్లలో ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ (43 బంతుల్లో 58; 6 ఫోర్లు, 1 సిక్స్), సంజూ సామ్సన్ (26 బంతుల్లో 40; 5 ఫోర్లు, 1 సిక్స్), ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ రింకూ సింగ్ (21 బంతుల్లో 38; 2 ఫోర్లు, 3 సిక్స్లు) మెరిపించారు. ఐరీష్ బౌలర్లలో మెకార్తీ రెండు వికెట్లు, అడైర్, యంగ్, వైట్ తలా వికెట్ సాధించారు. అనంతరం 186 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఐరీష్ 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 152 పరుగులు మాత్రమే చేయగల్గింది. ఓపెనర్ అండీ బల్బిర్నీ (51 బంతుల్లో 72; 5 ఫోర్లు, 4 సిక్సర్లు) ఒంటరి పోరాటం చేశాడు. భారత బౌలర్లలో కెప్టెన్ బుమ్రా, ప్రసిధ్ కృష్ణ, రవి బిష్ణోయ్ తలా 2 వికెట్లు తీశారు. మెరుపు ఇన్నింగ్స్ ఆడిన రింకూ సింగ్కు ప్లేయర్ ఆఫ్ది మ్యాచ్ అవార్డు లభించింది. ఇక ఈ విజయంపై మ్యాచ్ అనంతరం టీమిండియా కెప్టెన్ జస్ప్రీత్ బుమ్రా స్పందించాడు. "సిరీస్ సొంతం చేసుకున్నందుకు చాలా ఆనందంగా ఉంది. ఈ రోజు పిచ్ కొంచెం డ్రైగా ఉంది. మిడిల్ ఓవర్లలో వికెట్ కాస్త నెమ్మదించి బ్యాటింగ్కు ఇబ్బంది అవుతందని నేను భావించాను. కానీ మా బ్యాటర్లు అదరగొట్టారు. ఈ మ్యాచ్లో మా బాయ్స్ ప్రదర్శన పట్ల చాలా సంతోషంగా ఉన్నాను. అయితే ప్లేయింగ్ ఎలెవన్ను ఎంచుకోవడం కెప్టెన్గా చాలా కష్టంగా ఉంది. మాకు అది పెద్ద తలనొప్పిగా మారింది. ప్రతీ ఒక్కరూ జట్టులో చోటు కోసం అతృతగా ఎదురుచూస్తున్నారు. మేమంతా భారత్ తరఫున ఆడాలని అనుకున్నాం. అయితే మనం నిరంతరం కష్టపడతూ ఉండాలి. ఎదో ఒక రోజు మన శ్రమకు తగ్గ ఫలితం దక్కుతోంది. ఒక ఆటగాడిగా మనపై ఉండే అంచనాలను అస్సలు పట్టించుకోకూడదు. వాటి వల్ల మనం ఒత్తిడికి గురి అవుతాం. వాటిన్నటిని పక్కన పెట్టి జట్టుకు 100 శాతం న్యాయం చేసేందుకు ప్రయత్నించాలని" పోస్ట్మ్యాచ్ ప్రేజేంటేషన్లో బుమ్రా పేర్కొన్నాడు. చదవండి: Asia Cup 2023: ఆసియా కప్కు నేడు భారత జట్టు ఎంపిక.. వారిద్దరిలో ఎవరికీ ఛాన్స్? Jasprit Bumrah's 💥 spell is 𝘔𝘖𝘖𝘖𝘖𝘋 😍#IREvIND #JioCinema #Sports18 #TeamIndia pic.twitter.com/dixBumib36 — JioCinema (@JioCinema) August 20, 2023 -
ఐర్లాండ్తో రెండో టీ20.. టీమిండియా అభిమానులకు బ్యాడ్ న్యూస్!
ఐర్లాండ్తో తొలి టీ20లో విజయం సాధించిన టీమిండియా.. ఇప్పుడు మరో ఆసక్తికరపోరుకు సిద్దమైంది. డబ్లిన్ వేదికగా ఆదివారం జరగనున్న రెండో టీ20లో ఐర్లాండ్తో భారత్ తలపడనుంది. ఈ మ్యాచ్లో విజయం సాధించి సిరీస్ను సొంతం చేసుకోవాలని భారత జట్టు భావిస్తోంది. కాగా ఈ సిరీస్లో యువ భారత జట్టుకు పేస్ గుర్రం జస్ప్రీత్ బుమ్రా సారథ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే. బుమ్రా తన రీఎంట్రీ మ్యాచ్లోనే అదరగొట్టాడు. తన నాలుగు ఓవర్ల కోటాలో 24 పరుగులిచ్చి 2 వికెట్లు పడగొట్టి సత్తాచాటాడు అతడితో పాటు ప్రసిద్ద్ కృష్ణ కూడా అద్బుతమైన ప్రదర్శన కనబరిచాడు. ఇక తొలి టీ20కు అంతరాయం కలిగించిన వరుణుడు.. ఇప్పుడు రెండో టీ20కు కూడా అడ్డు తగిలే అవకాశం ఉంది. ఆదివారం మ్యాచ్ జరిగే సమయంలో 30-50 శాతం వర్షం పడే అవకాశం ఉందని అక్కడి వాతావారణ శాఖ ఓ ప్రకటనలో పేర్కొంది. కాగా వర్షం కారణంగా తొలి టీ20లో కేవలం 40 ఓవర్లకు 26.5 ఓవర్ల ఆట మాత్రమే సాధ్యమైంది. డక్వర్త్ లూయిస్ పద్దతి ప్రకారం భారత్ను విజేతగా నిర్ణయించారు. తుది జట్లు(అంచనా) పాల్ స్టిర్లింగ్ (కెప్టెన్), ఆండ్రూ బల్బిర్నీ, లోర్కాన్ టక్కర్ (వికెట్ కీపర్), హ్యారీ టెక్టర్, కర్టిస్ కాంఫర్,గ్రెత్ డెలానీ, మార్క్ అడైర్, బారీ మెక్కార్తీ, క్రెయిగ్ యంగ్, జాషువా లిటిల్, బెంజమిన్ వైట్ భారత్: రుతురాజ్ గైక్వాడ్, యశస్వి జైస్వాల్, సంజు శాంసన్ (వికెట్ కీపర్), తిలక్ వర్మ, రింకూ సింగ్, శివమ్ దూబే, వాషింగ్టన్ సుందర్, ప్రసిద్ధ్ కృష్ణ, అవేష్ ఖాన్, జస్ప్రీత్ బుమ్రా (కెప్టెన్), రవి బిష్ణోయ్ చదవండి: Asia Cup 2023: ఆసియాకప్కు భారత జట్టు ఇదే.. శాంసన్, అశ్విన్కు నో ఛాన్స్! తెలుగోడికి చోటు -
తిలక్ గోల్డెన్ డక్! ఎందుకు అతడిని ప్రమోట్ చేశారు?: మాజీ క్రికెటర్ ఫైర్
Tilak Varma would be disappointed for sure: ‘‘టీమిండియా మేనేజ్మెంట్ నిర్ణయాలు నన్ను ఆశ్చర్యపరిచాయి. బ్యాటింగ్ ఆర్డర్లో నాలుగో స్థానంలో తిలక్ వర్మ తనను తాను నిరూపించుకున్నాడు. ఇక సంజూ శాంసన్ వన్డౌన్లో సరిగ్గా సరిపోతాడు. వీళ్లు లెఫ్టాండర్లా, రైట్హ్యాండర్లా అన్న అంశంతో అసలు సంబంధమే లేదు. నిజానికి జట్టులో ఏకంగా ఐదుగురు లెఫ్టాండ్ బ్యాటర్లు ఉన్నారు. తిలక్ను ఎందుకు ప్రమోట్ చేశారు? ప్రత్యర్థి జట్టులో లెఫ్టార్మ్ స్పిన్నర్ ఉన్నాడు. పాల్ స్టిర్లింగ్ ఆఫ్ స్పిన్ బౌలింగ్ చేయగలడు. అయితే, ఇలాంటి పిచ్పై బాల్ టర్న్ అవ్వదు కాబట్టి పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. కాబట్టి కాంబినేషన్ల పేరిట తిలక్ను బ్యాటింగ్ ఆర్డర్లో ముందుకు పంపాల్సిన అవసరం లేదు. నాలుగో స్థానంలో అతడి ప్రదర్శన మెరుగ్గా ఉంది’’ అని టీమిండియా మాజీ క్రికెటర్ అభిషేక్ నాయర్ అన్నాడు. మిడిలార్డర్లో కీలకమైన నాలుగో స్థానంలో తిలక్ వర్మ చక్కగా సరిపోతాడని సహచర హైదరాబాదీకి అండగా నిలిచాడు. ఐపీఎల్లో ముంబై ఇండియన్స్ తరఫున సత్తా చాటుతున్న తెలుగు తేజం తిలక్ వర్మ.. వెస్టిండీస్ పర్యటన సందర్భంగా అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టిన విషయం తెలిసిందే. అరంగేట్రంలో సత్తా చాటిన హైదరాబాదీ కరేబియన్ జట్టుతో టీ20 సిరీస్ సందర్భంగా ఎంట్రీ ఇచ్చిన ఈ లెఫ్టాండర్.. ఐదు మ్యాచ్లలో కలిపి 173 పరుగులు చేశాడు. 140.65 స్ట్రైక్రేటుతో సగటున 57.67 పరుగులు సాధించి సత్తా చాటాడు. దీంతో అతడిపై అంచనాలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. ఈ క్రమంలో ఐర్లాండ్తో తొలి టీ20లో తిలక్ అవుటైన తీరు అభిమానులను తీవ్రంగా నిరాశపరిచింది. పాపం.. గోల్డెన్ డకౌట్ లక్ష్య ఛేదనలో భాగంగా వన్డౌన్లో బ్యాటింగ్కు వచ్చిన ఈ హైదరాబాదీ బ్యాటర్ గోల్డెన్ డకౌట్గా వెనుదిరిగాడు. రైటార్మ్ పేసర్ క్రెయిగ్ యంగ్ బౌలింగ్లో టకర్కు క్యాచ్ ఇచ్చి పరుగుల ఖాతా తెరవకుండానే పెవిలియన్ చేరాడు. ఈ నేపథ్యంలో అభిషేక్ నాయర్ జియో సినిమా షోలో తన అభిప్రాయాలు పంచుకున్నాడు. తిలక్ కూడా నిరాశకు లోనై ఉంటాడు తిలక్ నాలుగో స్థానంలో బ్యాటింగ్ చేస్తేనే మంచి ఫలితాలు రాబట్టవచ్చని చెప్పుకొచ్చాడు. ఇక తాను అవుటైన తీరుకు తిలక్ వర్మ కూడా తీవ్ర నిరాశకు లోనై ఉంటాడని నాయర్ అభిప్రాయపడ్డాడు. యంగ్ బౌలింగ్లో భారీ షాట్కు యత్నించి ఉంటే పరిస్థితి వేరేలా ఉండేదని పేర్కొన్నాడు. ఇదిలా ఉంటే.. ఐర్లాండ్తో తొలి టీ20లో టీమిండియా డక్వర్త్ లూయీస్ పద్ధతి ప్రకారం 2 పరుగుల స్వల్ప తేడాతో గెలుపొందింది. చదవండి: ధోని, యువరాజ్ తర్వాత అలాంటి వాళ్లు రాలేదు.. ఇప్పుడు ఇతడు! ఐర్లాండ్తో రెండో టీ20.. కీలక ఆటగాడిపై వేటు! అతడికి ఛాన్స్ Yashasvi Jaiswal and Tilak Varma departed on back-to-back deliveries of Craig Young! Golden duck for Tilak Varma 👀#IREvsIND #TilakVarma #CricketTwitter pic.twitter.com/cvA3TSNWMC — OneCricket (@OneCricketApp) August 18, 2023 -
ధోని, యువరాజ్ తర్వాత అలాంటి వాళ్లు రాలేదు.. ఇప్పుడు ఇతడు!
Rinku Singh can emulate Yuvraj Singh & MS Dhoni as finisher: టీమిండియా యువ క్రికెటర్ రింకూ సింగ్పై మాజీ వికెట్ కీపర్ కిరణ్ మోరే ప్రశంసలు కురిపించాడు. మిడిలార్డర్లో రాణించగల సత్తా అతడికి ఉందని.. బెస్ట్ ఫినిషర్గా ఎదుగుతాడని అంచనా వేశాడు. కేవలం బ్యాటింగ్ మాత్రమే కాకుండా ఫీల్డింగ్లోనూ రింకూ అద్భుతమని కొనియాడాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్లో కోల్కతా నైట్రైడర్స్కు ప్రాతినిథ్యం వహిస్తున్న రింకూ సింగ్ తాజా ఎడిషన్లో అదరగొట్టిన విషయం తెలిసిందే. జట్టు కష్టాల్లో కూరుకుపోయిన సందర్భాల్లో తానున్నానంటూ ఆదుకున్నాడు. ఫినిషర్గా అత్యుత్తమ ప్రదర్శన కనబరిచాడు. సిక్సర్ల రింకూగా.. ముఖ్యంగా గుజరాత్ టైటాన్స్తో మ్యాచ్లో రింకూ ఆఖరి ఓవర్లో ఐదు సిక్సర్లు కొట్టడం పదహారో ఎడిషన్ హైలైట్లలో ఒకటిగా నిలిచింది. ఈ క్రమంలో టీమిండియా సెలక్టర్ల దృష్టిలో పడిన రింకూ సింగ్.. ఐర్లాండ్లో పర్యటించే భారత టీ20 జట్టులో స్థానం దక్కించుకున్నాడు. డబ్లిన్లో ది విలేజ్ మైదానం వేదికగా శుక్రవారం జరిగిన తొలి టీ20 సందర్భంగా టీమిండియా తరఫున అరంగేట్రం చేశాడు. తాత్కాలిక కెప్టెన్ జస్ప్రీత్ బుమ్రా చేతుల మీదుగా క్యాప్ అందుకున్నాడు. ధోని, యువీ తర్వాత రింకూనే! ఈ నేపథ్యంలో భారత మాజీ క్రికెటర్ కిరణ్ మోరే స్పందిస్తూ.. మహేంద్ర సింగ్ ధోని, యువరాజ్ సింగ్ తర్వాత మళ్లీ రింకూ వాళ్లంతటి వాడు కాగలడని ఆశాభావం వ్యక్తం చేశాడు. జియో సినిమా షోలో మాట్లాడుతూ.. ‘‘ రింకూ ఎప్పుడెప్పుడు టీమిండియాలో అరంగేట్రం చేస్తాడా అని ఎదురుచూశాను. బ్యాటింగ్ ఆర్డర్లో ఐదు లేదంటే ఆరో స్థానంలో రింకూ రాణించగలడు. అద్భుతమైన ఫినిషర్గా పేరు తెచ్చుకోగలడు. మనం ఎంఎస్ ధోని, యువరాజ్ సింగ్లను చూశాం. వాళ్లిద్దరి తర్వాత మళ్లీ అలాంటి ప్లేయర్ రాలేదు. అద్భుతమైన ఫీల్డర్ ఇప్పుడు రింకూ రూపంలో మంచి ఆప్షన్ దొరికింది. అతడు అద్భుతమైన ఫీల్డర్ కూడా! దేశవాళీ క్రికెట్లో ఆడేటపుడు తనని దగ్గరగా గమనించాను. ప్రస్తుతం తన ఆట మరింత మెరుగైంది’’ అని కిరణ్ మోరే చెప్పుకొచ్చాడు. కాగా ఉత్తరప్రదేశ్కి చెందిన లెఫ్టాండ్ బ్యాటర్ రింకూ. ఐరిష్ జట్టుపై అరంగేట్రం చేసిన అతడికి.. వర్షం ఆటంకం కలిగించిన కారణంగా తొలి మ్యాచ్లో బ్యాటింగ్ చేసే అవకాశం రాలేదు. ఇక డబ్లిన్ టీ20లో డక్వర్త్ లూయీస్ పద్ధతి ప్రకారం.. టీమిండియా ఐర్లాండ్పై 2 పరుగుల తేడాతో గెలుపొంది 1-0తో సిరీస్లో ఆధిక్యంలో నిలిచింది. చదవండి: కోహ్లిపై షోయబ్ అక్తర్ వ్యాఖ్యలు.. కొట్టిపారేసిన గంగూలీ! ఏమన్నాడంటే? ఐర్లాండ్తో రెండో టీ20.. కీలక ఆటగాడిపై వేటు! అతడికి ఛాన్స్ -
ఐర్లాండ్తో రెండో టీ20.. కీలక ఆటగాడిపై వేటు! అతడికి ఛాన్స్
వెస్టిండీస్తో టీ20 సిరీస్ కోల్పోయిన టీమిండియా.. ఇప్పుడు ఐర్లాండ్ సిరీస్పై కన్నేసింది. ఆదివారం డబ్లిన్ వేదికగా ఐర్లాండ్తో జరగనున్న రెండో టీ20లో విజయం సాధించి సిరీస్ను కైవసం చేసుకోవాలని భారత జట్టు భావిస్తోంది. ఇప్పటికే తొలి టీ20లో గెలుపొందిన టీమిండియా.. మూడు మ్యాచ్ల సిరీస్లో 1-0 ఆధిక్యంలో ఉంది. ఇక రెండో టీ20లో టీమిండియా ఒకే ఒక మార్పుతో బరిలోకి దిగనున్నట్లు తెలుస్తోంది. తొలి టీ20లో విఫలమైన అర్ష్దీప్ సింగ్పై వేటు వేయాలని జట్టు మెనెజ్మెంట్ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. అతడి స్ధానంలో మరో పేసర్ అవేష్ ఖాన్కు అవకాశం ఇవ్వనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. కాగా తొలి మ్యాచ్లో అర్ష్దీప్ తన నాలుగు ఓవర్ల కోటాలో 35 పరుగులిచ్చి ఒక్క వికెట్ పడగొట్టాడు. ఇక బ్యాటింగ్లో టీమిండియా ఎటువంటి మార్పులు చేయకపోవచ్చు. ఒకవేళ జితీష్ శర్మకు అవకాశం ఇవ్వాలనకుంటే శాంసన్ను పక్కన పెట్టే ఛాన్స్ ఉంది. మరోవైపు ఐర్లాండ్ కూడా తమ జట్టులో ఒకే ఒక మార్పు చేయనున్నట్లు సమాచారం. ఆల్రౌండర్ డాక్రెల్ స్ధానంలో గ్రెత్ డెలానీకి ఛాన్స్ ఇవ్వాలని ఐరీష్ జట్టు మెనెజ్మెంట్ భావిస్తున్నట్లు పలు రిపోర్టులు పేర్కొంటున్నాయి. ఇక ఈ మ్యాచ్కు కూడా వర్షం అంతరాయం కలిగించే ఛాన్స్ ఉంది. తుది జట్లు(అంచనా) పాల్ స్టిర్లింగ్ (కెప్టెన్), ఆండ్రూ బల్బిర్నీ, లోర్కాన్ టక్కర్ (వికెట్ కీపర్), హ్యారీ టెక్టర్, కర్టిస్ కాంఫర్,గ్రెత్ డెలానీ, మార్క్ అడైర్, బారీ మెక్కార్తీ, క్రెయిగ్ యంగ్, జాషువా లిటిల్, బెంజమిన్ వైట్ భారత్: రుతురాజ్ గైక్వాడ్, యశస్వి జైస్వాల్, సంజు శాంసన్ (వికెట్ కీపర్), తిలక్ వర్మ, రింకూ సింగ్, శివమ్ దూబే, వాషింగ్టన్ సుందర్, ప్రసిద్ధ్ కృష్ణ, అవేష్ ఖాన్, జస్ప్రీత్ బుమ్రా (కెప్టెన్), రవి బిష్ణోయ్ చదవండి: World Cup 2023: వన్డే ప్రపంచకప్కు భారత జట్టు.. ఎవరూ ఊహించని ఆటగాడు ఎంట్రీ! -
చరిత్ర సృష్టించిన జస్ప్రీత్ బుమ్రా.. తొలి భారత క్రికెటర్గా!
టీమిండియా స్పీడ్ స్టార్ జస్ప్రీత్ బుమ్రా తన రీ ఎంట్రీ మ్యాచ్లోనే వికెట్ల వేట మొదలు పెట్టాడు. డబ్లిన్ వేదికగా ఐర్లాండ్తో జరిగిన తొలి టీ20లో తను వేసిన మొదటి ఓవర్లోనే రెండు వికెట్లు పడగొట్టి ప్రత్యర్ధి బ్యాటర్లకు చుక్కలు చూపించాడు. తన నాలుగు ఓవర్ల కోటాలో 24 పరుగులిచ్చి 2 వికెట్లు పడగొట్టిన బుమ్రా.. ప్లేయర్ ఆఫ్ది మ్యాచ్గా నిలిచాడు. తద్వారా బుమ్రా ఓ అరుదైన రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. టీ20 కెప్టెన్గా అరంగేట్రంలోనే ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డును అందుకున్న తొలి భారత క్రికెటర్గా బుమ్రా రికార్డులకెక్కాడు. ఇప్పటివరకు ఈ ఘనత ఎవరికీ సాధ్యం కాలేదు. కాగా ఈ సిరీస్కు సీనియర్లందరూ దూరం కావడంతో బుమ్రానే యువ భారత జట్టును ముందుండి నడిపిస్తున్నాడు. టీ20ల్లో భారత జట్టుకు కెప్టెన్గా ఎంపికైన తొలి ఫాస్ట్బౌలర్ కూడా బుమ్రానే కావడం గమానర్హం. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. ఐర్లాండ్పై డక్వర్త్ లూయిస్ పద్ధతిలో 2 పరుగుల తేడాతో భారత్ విజయం సాధించింది. మొదట బ్యాటింగ్కు దిగిన ఐర్లాండ్ 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 139 పరుగులు చేసింది. బారీ మెకార్తీ (33 బంతుల్లో 51 నాటౌట్; 4 ఫోర్లు, 4 సిక్సర్లు) మెరిపించాడు. భారత బౌలర్లలో బుమ్రా, ప్రసిధ్ కృష్ణ, రవి బిష్ణోయ్ తలా 2 వికెట్లు పడగొట్టగా.. అర్ష్దీప్ సింగ్ ఒక్క వికెట్ పడగొట్టాడు. . తర్వాత లక్ష్యఛేదనకు దిగిన భారత్ వర్షంతో ఆట నిలిచే సమయానికి 6.5 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 47 పరుగులు చేసింది. వర్షం కారణంగా మ్యాచ్ నిలిచిపోయే సమయానికి భారత విజయ సమీకరణం 45 పరుగులుగా ఉంది. రెండు పరుగుల అధిక్యంలో ఉండటంతో డీఎల్ఎస్ ప్రకారం భారత్ను విజేతగా నిర్ణయించారు. చదవండి: World Cup 2023: వన్డే ప్రపంచకప్కు భారత జట్టు.. ఎవరూ ఊహించని ఆటగాడు ఎంట్రీ! What a start from the #TeamIndia captain 🤩 Bumrah back to what he does best 💥#IREvIND #JioCinema #Sports18 pic.twitter.com/IryoviTKGo — JioCinema (@JioCinema) August 18, 2023 -
వన్డే ప్రపంచకప్కు భారత జట్టు.. ఎవరూ ఊహించని ఆటగాడు ఎంట్రీ!
టీమిండియా స్పీడ్ స్టార్ ప్రసిద్ధ్ కృష్ణ అంతర్జాతీయ టీ20ల్లో కూడా తన అరంగేట్రాన్ని ఘనంగా చాటుకున్నాడు. ఇప్పటికే వన్డేల్లో ఎంట్రీ ఇచ్చిన ఈ కర్ణాటక పేసర్... ఐర్లాండ్తో తొలి టీ20తో పొట్టి క్రికెట్లో డెబ్యూ చేశాడు. తన తొలి మ్యాచ్లో రెండు వికెట్లు పడగొట్టి అందరని ప్రసిద్ధ్ అకట్టుకున్నాడు. ఓవరాల్గా ఈ మ్యాచ్లో నాలుగు ఓవర్లు వేసిన ప్రసిద్ధ్.. 32 పరుగులిచ్చి 2 వికెట్లు సాధించాడు. తన తొలి ఓవర్లో టెక్టర్ను ఔట్ చేసిన ప్రసిద్ద్, రెండో ఓవర్లో డాక్రెల్ను పెవిలియన్కు పంపాడు. కాగా గత కాలంగా వెన్ను గాయంతో ప్రసిద్ధ్ కృష్ణ జట్టుకు దూరంగా ఉంటున్నాడు. గాయం కారణంగా ఈ ఏడాది ఐపీఎల్కు కూడా దూరమయ్యాడు. అతడు ఈ మ్యాచ్కు దాదాపు ఏడాది పాటు జాతీయ జట్టుకు కూడా దూరంగా ఉన్నాడు. ఇక గాయం నుంచి కోలుకుని వచ్చిన వెంటనే అద్భుతమైన ప్రదర్శన కనబరిచిన ప్రసిద్ధ్ కృష్ణపై మాజీలు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఈ ఏడాది జరగనున్న ఆసియాకప్, వన్డే ప్రపంచకప్లకు బుమ్రా, సిరాజ్, షమీలతో పాటు అదనపు పేసర్గా ప్రసిద్ధ్ కృష్ణను కూడా ఎంపిక చేయాలని చాలా మంది సూచిస్తున్నారు. కాగా 27 ఏళ్ల ప్రసిద్ద్కు వన్డేల్లో మంచి రికార్డు ఉంది. ఇప్పటివరకు భారత తరపున 14 మ్యాచ్లు ఆడిన కృష్ణ.. 5.32 ఏకానమీతో 25 వికెట్టు పడగొట్టాడు. ఈ క్రమంలోనే అతడిని ఈ మెగా టోర్నీలకు ఎంపిక చేయాలని అభిప్రాయపడుతున్నారు. అదే విధంగా మరోస్టార్ పేసర్ సిరాజ్ ప్రస్తుతం కాలి మడమ గాయంతో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. విండీస్ పర్యటనకు వెళ్లిన సిరాజ్ మధ్యలోనే అక్కడ నుంచి స్వదేశానికి వచ్చాడు. అతడి ఫిట్నెస్పై ఇప్పటివరకు అయితే ఎటువంటి అప్డేట్ లేదు. సిరాజ్కు ప్రత్నమ్నాయంగా ప్రసిద్ధ్ను తీసుకునే ఛాన్స్ ఉంది. చదవండి: చాలా సంతోషంగా ఉంది.. క్రెడిట్ మొత్తం వాళ్లకే! ఇంకా మెరుగవ్వాలి: భారత కెప్టెన్ -
చాలా సంతోషంగా ఉంది.. క్రెడిట్ మొత్తం వాళ్లకే! ఇంకా మెరుగవ్వాలి: బుమ్రా
ఐర్లాండ్తో మూడు టీ20ల సిరీస్ను టీమిండియా గెలుపుతో ఆరంభించింది. ఈ సిరీస్లో భాగంగా శుక్రవారం డబ్లిన్ వేదికగా ఐరీష్తో జరిగిన తొలి టీ20లో డక్వర్త్ లూయిస్ పద్ధతిలో 2 పరుగుల తేడాతో భారత్ విజయం సాధించింది. తద్వారా టీ20ల్లో భారత కెప్టెన్గా జస్ప్రీత్ బుమ్రా తొలి విజయాన్ని అందుకున్నాడు. ఐర్లాండ్ సిరీస్లో టీమిండియా కెప్టెన్గా బుమ్రా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. కెప్టెన్గానే కాకుండా బౌలర్గా కూడా బుమ్రా అదరగొట్టాడు. దాదాపు 11 నెలల తర్వాత మైదానంలో అడుగుపెట్టిన బుమ్రా.. రీఎంట్రీలోనే ప్లేయర్ ఆఫ్ది మ్యాచ్గా నిలిచాడు. రెండు వికెట్లు పడగొట్టి తన పునరాగమాన్ని ఘనంగా చాటుకున్నాడు. ఇక ఈ మ్యాచ్లో టింగ్కు దిగిన ఐర్లాండ్ 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 139 పరుగులు చేసింది. బారీ మెకార్తీ (33 బంతుల్లో 51 నాటౌట్; 4 ఫోర్లు, 4 సిక్సర్లు) మెరిపించాడు. భారత బౌలర్లలో బుమ్రా, ప్రసిధ్ కృష్ణ, రవి బిష్ణోయ్ తలా 2 వికెట్లు పడగొట్టగా.. అర్ష్దీప్ సింగ్ ఒక్క వికెట్ పడగొట్టాడు. తర్వాత లక్ష్యఛేదనకు దిగిన భారత్ వర్షంతో ఆట నిలిచే సమయానికి 6.5 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 47 పరుగులు చేసింది. ఇక ఈ విజయంపై మ్యాచ్ అనంతరం భారత కెప్టెన్ జస్ప్రీత్ బుమ్రా స్పందించాడు. "ఈ మ్యాచ్లో నా ప్రదర్శన పట్ల కూడా చాలా సంతోషంగా ఉన్నాను. నేను ఏన్సీలో చాలా కష్టపడ్డాను. ప్రాక్టీస్ సమయంలో నేను నా రిథమ్ను కోల్పోయానని లేదా ఏదైనా కొత్తగా ప్రయత్నిస్తున్నాని నాకు అనిపించలేదు. ఏన్సీఏ సపోర్ట్ స్టాప్ వల్లే మళ్లీ అదే క్వాలిటీతో నేను బౌలింగ్ చేయగల్గాను. కాబట్టి వారికి ఈ క్రెడిట్ ఇవ్వాలనుకుంటున్నాను. మళ్లీ రీఎంట్రీ ఇచ్చినప్పుడు నాకేం కొత్తగా అన్పించలేదు. కానీ తొలి మ్యాచ్లోనే విజయం సాధించడం చాలా సంతోషంగా ఉంది. పిచ్పై కొంత స్వింగ్ ఉంది. దాన్ని మేము ఉపయెగించుకోవాలని అనుకున్నాం. అదృష్టవశాత్తూ మేమే టాస్ గెలిచాం. అందుకే బౌలింగ్ను ఎంచుకున్నాను. మంచు ఎక్కువగా ఉండటం వల్ల కూడా కొంత సహకారం లభించింది. ప్రతీ మ్యాచ్ మనకు కొత్త పాఠాలు నేర్పిస్తోంది. ఐర్లాండ్ కూడా బాగా ఆడింది. ఈ మ్యాచ్లో మేము గెలిచినప్పటికీ.. కొన్ని విషయాల్లో ఇంకా మెరుగవ్వాల్సి ఉంది. మా బాయ్స్ ప్రతీ ఒక్కరూ చాలా కాన్ఫిడెన్స్తో ఉన్నారు. ఈ సిరీస్కు వారు బాగా సిద్దమయ్యారు కూడా. ఐపీఎల్ కూడా వాళ్లకు బాగా ఉపయోగపడిందని" పోస్ట్మ్యాచ్ ప్రేజేంటేషన్లో బుమ్రా పేర్కొన్నాడు. చదవండి: IND vs IRE: ఎనిమిదో స్ధానంలో బ్యాటింగ్కు వచ్చి ఊచకోత.. సిక్సర్ల వర్షం! ప్రపంచంలోనే తొలి క్రికెటర్గా -
ఎనిమిదో నంబర్లో బ్యాటింగ్కు వచ్చి ఊచకోత..సిక్సర్ల వర్షం!
ఐర్లాండ్తో మూడో టీ20ల సిరీస్లో టీమిండియా శుభారంభం చేసింది. డబ్లిన్ వేదికగా ఐర్లాండ్తో జరిగిన తొలి టీ20లో డక్వర్త్ లూయిస్ పద్ధతిలో 2 పరుగుల తేడాతో భారత్ విజయం సాధించింది. ఈ మ్యాచ్తో రీ ఎంట్రీ ఇచ్చిన భారత పేస్ గుర్రం జస్ప్రీత్ బుమ్రా అదరగొట్టాడు. తన నాలుగు ఓవర్ల కోటాలో 24 పరుగులిచ్చి 2 వికెట్లు పడగొట్టిన బుమ్రా.. ప్లేయర్ ఆఫ్ది మ్యాచ్గా నిలిచాడు. ఇక మొదట బ్యాటింగ్కు దిగిన ఐర్లాండ్ 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 139 పరుగులు చేసింది. బారీ మెకార్తీ (33 బంతుల్లో 51 నాటౌట్; 4 ఫోర్లు, 4 సిక్సర్లు) మెరిపించాడు. భారత బౌలర్లలో బుమ్రా, ప్రసిధ్ కృష్ణ, రవి బిష్ణోయ్ తలా 2 వికెట్లు పడగొట్టగా.. అర్ష్దీప్ సింగ్ ఒక్క వికెట్ పడగొట్టాడు. . తర్వాత లక్ష్యఛేదనకు దిగిన భారత్ వర్షంతో ఆట నిలిచే సమయానికి 6.5 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 47 పరుగులు చేసింది. వర్షంతో ఆట నిలిచే సమయానికి డక్వర్త్ లూయిస్ పద్ధతిలో భారత విజయ సమీకరణం 45 పరుగులుగా ఉంది. ఎప్పటికి వర్షం తగ్గుముఖం పట్టకపోవడంతో డీఎల్ఎస్ ప్రకారం టీమిండియాను విజేతగా ప్రకటించారు. బారీ మెకార్తీ అరుదైన రికార్డు.. ఐర్లాండ్ ఆటగాడు బారీ మెకార్తీ అరుదైన ఘనత సాధించాడు. టీ20ల్లో టీమిండియాపై ఎనిమిది లేదా అంతకంటే తక్కువ స్ధానాల్లో బ్యాటింగ్ వచ్చి అత్యధిక వ్యక్తిగత స్కోర్ సాధించిన క్రికెటర్గా మెకార్తీ రికార్డులెక్కాడు. భారత్తో జరిగిన తొలి టీ20లో ఎనిమిది స్ధానంలో బ్యాటింగ్ వచ్చి 51 పరుగులు చేసిన మెకార్తీ.. ఈ అరుదైన ఫీట్ను తన పేరిట లిఖించకున్నాడు. అంతకుముందు ఈ రికార్డు సౌతాఫ్రికా కేశవ్ మహారాజ్ పేరిట ఉండేది. గతేడాది తిరువనంతపురం వేదికగా జరిగిన టీ20లో మహారాజ్(41) పరుగులు చేశాడు. తాజా మ్యాచ్తో ఈ రికార్డును మెకార్తీ బ్రేక్ చేశాడు. చదవండి: Ind Vs Ire: ఐర్లాండ్తో తొలి టీ20.. అరుదైన దృశ్యం! ఆ ఐదుగురు భారత ఆటగాళ్లు ఒకేసారి.. -
ఐర్లాండ్తో తొలి టీ20.. అరుదైన దృశ్యం! ఆ ఐదుగురు ఒకేసారి..
Ireland vs India, 1st T20I- Rare Thing: ఐర్లాండ్తో తొలి టీ20 సందర్భంగా ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. టీమిండియా తరఫున ఏకంగా ఐదుగురు లెఫ్టాండ్ బ్యాటర్లు మైదానంలో దిగారు. కాగా మూడు మ్యాచ్ల సిరీస్లో భాగంగా జస్ప్రీత్ బుమ్రా సారథ్యంలోని యువ జట్టు ఐర్లాండ్ పర్యటనకు వెళ్లిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఇరు జట్ల మధ్య శుక్రవారం(ఆగష్టు 18) డబ్లిన్లోని ది విలేజ్ వేదికగా తొలి టీ20 మొదలైంది. టాస్ గెలిచిన భారత కెప్టెన్ బుమ్రా తొలుత బౌలింగ్ ఎంచుకున్నాడు. అందుకు తగ్గట్లుగానే పేస్ దళ నాయకుడు బుమ్రా(2 వికెట్లు)తో పాటు అరంగేట్ర(టీ20) ఫాస్ట్బౌలర్ ప్రసిద్ కృష్ణ(2), అర్ష్దీప్ సింగ్(1) చెలరేగారు. స్కోరెంతంటే! స్పిన్నర్ రవి బిష్ణోయి(2) కూడా వీరికి తోడయ్యాడు. అయితే, ఆరంభంలో తడబడ్డా.. తర్వాత కుదురుకున్న ఐరిష్ జట్టు మెరుగైన స్కోరే చేయగలిగింది. నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 139 పరుగులు సాధించింది. ఇదిలా ఉంటే.. ఆతిథ్య ఐర్లాండ్ను తొలుత బ్యాటింగ్కు ఆహ్వానించిన పర్యాటక టీమిండియా ఫీల్డింగ్ చేస్తున్న సమయంలో అత్యంత అరుదైన దృశ్యం ఆవిష్కృతమైంది. ఐదుగురు లెఫ్టాండ్ బ్యాటర్లు ఫీల్డింగ్ చేయడం అభిమానుల్లో ఆసక్తిని రేకెత్తించింది. ఆ ఐదుగురు ఎవరంటే! ఈ మ్యాచ్తో అరంగేట్రం చేసిన రింకూ సింగ్తో పాటు తుది జట్టులో చోటు దక్కించుకున్న ఓపెనర్ యశస్వి జైశ్వాల్, తిలక్ వర్మ, శివం దూబే, వాషింగ్టన్ సుందర్.. ఇలా వీళ్లంతా ఎడమచేతి వాటం కలిగిన బ్యాటర్లే కావడం విశేషంగా నిలిచింది. ఐర్లాండ్తో తొలి టీ20లో భారత తుది జట్టు: జస్ప్రీత్ బుమ్రా (కెప్టెన్), రుతురాజ్ గైక్వాడ్ (వైస్ కెప్టెన్), యశస్వి జైశ్వాల్, తిలక్ వర్మ, రింకూ సింగ్, సంజు శాంసన్ (వికెట్ కీపర్), శివమ్ దూబే, వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్ , ప్రసిద్ కృష్ణ, అర్ష్దీప్ సింగ్. చదవండి: Ind vs Ire: అయ్యో బుమ్రా.. అసలే ఏడాది తర్వాత రీఎంట్రీ! What a start from the #TeamIndia captain 🤩 Bumrah back to what he does best 💥#IREvIND #JioCinema #Sports18 pic.twitter.com/IryoviTKGo — JioCinema (@JioCinema) August 18, 2023 -
Ind Vs Ire: వాళ్లిద్దరి అరంగేట్రం.. జితేశ్ శర్మకు మొండిచేయి..
Ireland vs India, 1st T20I: అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టాలన్న భారత యువ బ్యాటర్ రింకూ సింగ్ కల ఎట్టకేలకు నెరవేరింది. ఐర్లాండ్తో తొలి టీ20 సందర్భంగా అతడు టీమిండియా తరఫున అరంగేట్రం చేశాడు. ఐరిష్ జట్టుతో టీ20 సిరీస్లో కెప్టెన్గా వ్యవహరిస్తున్న భారత ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రా చేతుల మీదుగా క్యాప్ అందుకున్నాడు. పేద కుటుంబం నుంచి వచ్చి కాగా ఉత్తరప్రదేశ్కు చెందిన రింకూ సింగ్ది పేద కుటుంబం. అయితే, చిన్ననాటి నుంచే క్రికెట్పై మక్కువ పెంచుకున్న అతడు.. ఇంటింటికి గ్యాస్ బండలు మోస్తూనే ఆటపై దృష్టి సారించాడు. దేశవాళీ క్రికెట్లో తన ప్రతిభను నిరూపించుకుని ఐపీఎల్లో ఎంట్రీ ఇచ్చాడు. కోల్కతా నైట్ రైడర్స్ రింకూను కొనడంతో అతడి రాత మారింది. ఆరంభంలో బెంచ్కే పరిమితమవ్వాల్సి వచ్చినా.. రింకూ ఓపికగా ఎదురుచూశాడు. ఈ క్రమంలో 25 ఏళ్ల లెఫ్టాండ్ బ్యాటర్ ఐపీఎల్-2023లో వచ్చిన అవకాశాలను పూర్తిగా సద్వినియోగం చేసుకున్నాడు. ఐపీఎల్-2023లో సత్తా చాటి మొత్తంగా 14 ఇన్నింగ్స్లో 149.53 స్ట్రైక్రేటుతో 474 పరుగులు చేశాడు. ఈ క్రమంలో టీమిండియా సెలక్టర్ల దృష్టిలో పడిన రింకూ సింగ్ తొలుత ఆసియా క్రీడలు-2023 జట్టుకు ఎంపికయ్యాడు. ఆ తర్వాత టీ20 సిరీస్ నిమిత్తం ఐర్లాండ్లో పర్యటించే భారత జట్టులో చోటు దక్కడంతో శుక్రవారం అరంగేట్రం చేశాడు. జితేశ్కు మొండిచేయి ఇక రింకూ సంగతి ఇలా ఉంటే.. ఈ మ్యాచ్తో కచ్చితంగా టీమిండియా క్యాప్ అందుకుంటాడనుకున్న మరో బ్యాటర్ జితేశ్ శర్మకు నిరాశే మిగిలింది. వెస్టిండీస్ పర్యటనలో మెరుగ్గా రాణించకపోయినప్పటికీ సీనియర్ వికెట్ కీపర్గా సంజూ శాంసన్కు తుది జట్టులో చోటు దక్కింది. దీంతో వికెట్ కీపర్ బ్యాటర్ జితేశ్ ఇంకొన్నాళ్లు వేచిచూడకతప్పదు. డబ్లిన్లో మూడు మ్యాచ్లు ఇదిలా ఉంటే.. ఐర్లాండ్తో తొలి టీ20 సందర్భంగా కర్ణాటక బౌలర్ ప్రసిద్ కృష్ణ అంతర్జాతీయ టీ20లలో ఎంట్రీ ఇచ్చాడు. ప్రసిద్కు కూడా బుమ్రా టీమిండియా క్యాప్ అందించాడు. రింకూ, ప్రసిద్ల అరంగేట్రానికి సంబంధించిన ఫొటోలను బీసీసీఐ షేర్ చేయగా.. నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఇక డబ్లిన్ వేదికగా టీమిండియా- ఐర్లాండ్ల మధ్య ఆగష్టు 18, 20, 23 తేదీల్లో మూడు టీ20లు జరుగనున్నాయి. మొదటి మ్యాచ్లో టాస్ గెలిచిన భారత్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. టీమిండియా: జస్ప్రీత్ బుమ్రా (కెప్టెన్), రుతురాజ్ గైక్వాడ్ (వైస్ కెప్టెన్), యశస్వి జైశ్వాల్, తిలక్ వర్మ, రింకూ సింగ్, సంజు శాంసన్ (వికెట్ కీపర్), శివమ్ దూబే, వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్ , ప్రసిద్ కృష్ణ, అర్ష్దీప్ సింగ్. చదవండి: బౌలింగ్లోనూ 'కింగే'.. చెక్కుచెదరని బౌలింగ్ రికార్డు విరాట్ సొంతం Moments like these! ☺️ All set for their debuts in international cricket and T20I cricket respectively 👍 👍 Congratulations Rinku Singh and Prasidh Krishna as they receive their caps from captain Jasprit Bumrah 👏 👏#TeamIndia | #IREvIND pic.twitter.com/JjZIoo8B8H — BCCI (@BCCI) August 18, 2023 -
Ind vs Ire: అయ్యో బుమ్రా.. అసలే ఏడాది తర్వాత రీఎంట్రీ! ఇప్పుడిలా!
India tour of Ireland, 2023: దాదాపు ఏడాది తర్వాత పునరాగమనం చేస్తున్న టీమిండియా స్టార్ జస్ప్రీత్ బుమ్రాకు వరణుడు స్వాగతం పలకబోతున్నాడా? ఐర్లాండ్ పర్యటనలో టీ20 సిరీస్ నేపథ్యంలో తొలిసారి పొట్టి ఫార్మాట్ కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టిన ఈ పేసు గుర్రం రీఎంట్రీకి వర్షం ఆటంకిగా మారనుందా? అంటే స్థానిక వాతావరణ శాఖ అవుననే అంటోంది! ఐర్లాండ్- టీమిండియా మధ్య మూడు మ్యాచ్ల సిరీస్లో భాగంగా శుక్రవారం తొలి టీ20 నిర్వహణకు షెడ్యూల్ ఖరారైంది. డబ్లిన్లోని ది విలేజ్ వేదికగా ఇరు జట్లు పోటీపడనున్నాయి. స్థానిక కాలమానం ప్రకారం మధ్యాహ్నం మూడు గంటల(భారత కాలమానం ప్రకారం రాత్రి 7. 30 గంటలకు)కు ఈ మ్యాచ్ ఆరంభం కానుంది. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం! అయితే, డబ్లిన్లో ఆకాశం మేఘావృతమై ఉన్న నేపథ్యంలో సాయంత్రం ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురవనున్నట్లు వాతావరణ శాఖ హెచ్చరించింది. సాయంత్రానికి పరిస్థితి మరింత దిగజారవచ్చని హెచ్చరిస్తూ యెల్లో వార్నింగ్ జారీ చేసింది. దీంతో అసలు మ్యాచ్ జరుగుతుందా లేదా అంటూ అభిమానులు ఉసూరుమంటున్నారు. మ్యాచ్ రద్దైతే.. అంతే సంగతి! బుమ్రా ఎక్స్ప్రెస్ పట్టాలెక్కితే చూడాలని ఆశ పడుతుంటే ఈ వర్షం గోల ఏమిటని సోషల్ మీడియా వేదికగా కామెంట్లు చేస్తున్నారు. కాగా ఆసియా వన్డే కప్-2023, వన్డే వరల్డ్కప్-2023 వంటి మెగా ఈవెంట్ల నేపథ్యంలో బుమ్రా ఫిట్నెస్ పరీక్షకు ఐర్లాండ్ పర్యటన మంచి ప్లాట్ఫామ్లా ఉపయోగపడనుందని టీమిండియా మేనేజ్మెంట్ భావించింది. దీంతో రీఎంట్రీలో ఏకంగా కెప్టెన్సీ పగ్గాలు అప్పగించింది. తర్వాత ఆసియా కప్! బుమ్రా సారథ్యంలో యువ ఆటగాళ్లతో కూడిన జట్టును ఐర్లాండ్కు పంపింది. అయితే, వర్షం కారణంగా తొలి మ్యాచ్ రద్దైపోతే బుమ్రాతో పాటు యాజమాన్యానికి చేదు అనుభవం తప్పదు. మిగతా రెండు మ్యాచ్లకు కూడా ది విలేజ్ వేదిక కావడం విశేషం. ఇక ఐర్లాండ్ పర్యటన ముగిసిన తర్వాత ప్రధాన ఆటగాళ్లతో కూడిన టీమిండియా ఆసియా కప్ ఆడేందుకు శ్రీలంకకు వెళ్లనుంది. ఐర్లాండ్తో సిరీస్కు భారత జట్టు: జస్ప్రీత్ బుమ్రా (కెప్టెన్), రుతురాజ్ గైక్వాడ్, యశస్వి జైస్వాల్, తిలక్ వర్మ, రింకూ సింగ్, సంజూ శాంసన్ (వికెట్ కీపర్), జితేశ్ శర్మ (వికెట్ కీపర్), శివమ్ దూబే, వాషింగ్టన్ సుందర్, షాబాజ్ అహ్మద్, రవి బిష్ణోయ్, ప్రసిద్ధ్ కృష్ణ, అర్ష్దీప్ సింగ్, ముకేష్ కుమార్, ఆవేశ్ ఖాన్. చదవండి: ఎల్లప్పుడూ రుణపడి ఉంటా: విరాట్ కోహ్లి భావోద్వేగ పోస్ట్.. వైరల్ -
టీమిండియా క్యాప్ అందుకోవడం ఈజీ అయిపోయింది.. అదే జరిగితే బుమ్రా అవుట్!
Ireland vs India T20Is 2023: ఇటీవలి కాలంలో యువ క్రికెటర్లలో చాలా మందికి టీమిండియా క్యాప్ తేలికగానే లభిస్తోందని మాజీ పేసర్ అతుల్ వాసన్ కీలక వ్యాఖ్యలు చేశాడు. అయితే, ఈ ట్రెండ్ ఇలాగే కొనసాగడం మంచిది కాదని.. ప్రతిభావంతులైన ఆటగాళ్లకు మాత్రమే అవకాశాలు ఇవ్వాలని మేనేజ్మెంట్కు సూచించాడు. కొత్త వాళ్లను ఆడించే క్రమంలో అర్హులైన ప్లేయర్లను బెంచ్కు పరిమితం చేయవద్దని బీసీసీఐకి విజ్ఞప్తి చేశాడు. ఐపీఎల్ స్టార్లకు అవకాశాలు కాగా దేశవాళీ క్రికెట్తో పాటు ఐపీఎల్లో నిరూపించుకున్న చాలా మంది యువ క్రికెటర్లు అనతికాలంలో భారత జట్టుకు ఆడే అదృష్టం దక్కించుకుంటున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా టీమిండియా టీ20 జట్టు ఎంపిక సమయంలో వీరికి ప్రాధాన్యం ఉంటోంది. ఇటీవల ముగిసిన వెస్టిండీస్ పర్యటనలో భాగంగా యశస్వి జైశ్వాల్(టెస్టు ద్వారా), ముకేశ్ కమార్, తిలక్ వర్మ అరంగేట్రం చేశారు. ఇక ప్రస్తుతం ఐర్లాండ్లో పర్యటిస్తున్న భారత జట్టులో పంజాబ్ కింగ్స్ ప్లేయర్ జితేశ్ శర్మతో పాటు కోల్కతా నైట్ రైడర్స్ స్టార్ రింకూ సింగ్ తొలిసారి చోటు దక్కించుకున్నాడు. ఈజీ అయిపోయింది.. ఇలాగే కొనసాగితే డబ్లిన్ వేదికగా శుక్రవారం మొదలుకానున్న మూడు మ్యాచ్ల సిరీస్ నేపథ్యంలో ఐరిష్ జట్టుపై వీరిద్దరి అరంగేట్రం ఖాయంగా కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో అతుల్ వాసన్ మాట్లాడుతూ.. ‘‘ఇటీవలి కాలంలో ఇండియన్ క్యాప్ అందుకోవడం ఈజీ అయిపోయింది. మనందరం ఇలాంటి పరిణామాలు చూస్తూనే ఉన్నాం. ఈ ట్రెండ్ ఇలాగే కొనసాగితే కష్టం. నా అభిప్రాయం ప్రకారం... ఎంత మందికి అవకాశమిచ్చినా.. ఒక మంచి ఆటగాడిని మాత్రం మిస్ చేయకూడదు. ప్రపంచవ్యాప్తంగా టీ10, టీ20, 50- ఓవర్ పేరిట ఎన్నో జట్లు ఉన్నాయి. కాబట్టి ప్రతిభ ఉన్న ప్రతి ఒక్క ఆటగాడికి ఏదో ఒక రూపంలో కచ్చితంగా ఆడే అవకాశం వస్తోంది’’ అని అతుల్ ఇండియా.కామ్తో చెప్పుకొచ్చాడు. అదే జరిగితే బుమ్రా అవుట్! ఇక ఈ సిరీస్తో రీఎంట్రీ ఇస్తున్న భారత ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రా గురించి ప్రస్తావిస్తూ.. ‘‘తీవ్రమైన వెన్ను నొప్పి నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుని బుమ్రా తిరిగి వస్తున్నాడు. ఫిట్నెస్ నిరూపించుకుంటే అతడి కెరీర్ మరికొంత కాలం పొడిగించుకోవచ్చు. ఒకవేళ గాయం గనుక తిరగబెడితే మాత్రం కష్టం. తనదైన బౌలింగ్ యాక్షన్తో బుమ్రా సాధించిన విజయాలు కొనసాగించాలంటే తప్పక పూర్తిస్థాయి ఫిట్నెస్ సాధించాల్సిందే’’ అని అతుల్ వాసన్ అభిప్రాయపడ్డాడు. కాగా 55 ఏళ్ల అతుల్ వాసన్ టీమిండియా తరఫున 4 టెస్టుల్లో 10, 9 వన్డేల్లో 11 వికెట్లు తీశాడు. ఇదిలా ఉంటే.. ఆగష్టు 18-23 వరకు బుమ్రా సారథ్యంలోని భారత యువ జట్టు ఐర్లాండ్తో మూడు మ్యాచ్ల టీ20 సిరీస్లో పోటీ పడనుంది. చదవండి: అరంగేట్రంలో విఫలం.. కట్ చేస్తే.. ప్రపంచ క్రికెట్లో రారాజుగా! From emotions of an India call-up to the first flight ✈️ & Training session with #TeamIndia 😃 𝗪𝗵𝗲𝗻 𝗱𝗿𝗲𝗮𝗺𝘀 𝘁𝗮𝗸𝗲 𝗳𝗹𝗶𝗴𝗵𝘁 ft. @rinkusingh235 & @jiteshsharma_ 👌👌 - By @RajalArora Full Interview 🎥🔽 #IREvINDhttps://t.co/m4VsRCAwLk pic.twitter.com/ukLnAOFBWO — BCCI (@BCCI) August 17, 2023 -
తొలిసారి బిజినెస్ క్లాస్లో ప్రయాణం.. మా అమ్మ కల నెరవేరింది!
ఐర్లాండ్తో మూడు టీ20ల సిరీస్లో తలపడేందుకు టీమిండియా సిద్దమైంది. ఈ సిరీస్లో భాగంగా తొలి టీ20 ఇరు జట్ల మధ్య డబ్లిన్ వేదికగా శుక్రవారం జరగనుంది. ఈ సిరీస్తో టీమిండియా పేస్గుర్రం జస్ప్రీత్ బుమ్రా రీఎంట్రీ ఇవ్వనున్నాడు. దాదాపు 11 నెలల తర్వాత బుమ్రా తిరిగి మైదానంలో అడుగుపెట్టనున్నాడు. అంతేకాకుండా ఐరీష్ టూర్లో బుమ్రానే భారత జట్టు సారథిగా వ్యవహరించనున్నాడు. ఈ పర్యటనకు సీనియర్లందరికీ విశ్రాంతినిచ్చిన సెలక్టర్లు.. ఐపీఎల్-2023లో అదరగొట్టిన రింకూ సింగ్, జితేశ్ శర్మ, తిలక్ వర్మ, జైశ్వాల్ వంటి యువ ఆటగాళ్లకు చోటుకల్పించారు. అయితే తిలక్ వర్మ, జైశ్వాల్ ఇప్పటికే విండీస్ టూర్తో అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టగా.. రింకూ సింగ్, జితేశ్ శర్మ తమ అరంగేట్రం కోసం అతృతగా ఎదురుచూస్తున్నారు. ఇక ఈ సిరీస్ కోసం బుమ్రా సారథ్యంలోని భారత జట్టు బుధవారం ఐర్లాండ్కు చేరుకుంది. తొలిసారి.. భారత జట్టుకు ఎంపికైన రింకూ సింగ్, జితేశ్ శర్మలు తొలిసారి బిజినెస్ క్లాస్ విమానంలో ప్రయాణించారు. ఈ క్రమంలో వీరిద్దరూ తమ తొలి అంతర్జాతీయ పర్యటనకు సంబంధించిన అనుభవాలను పంచుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియోను బీసీసీఐ సోషల్ మీడియాలో షేర్చేసింది. "నాకు చాలా సంతోషంగా ఉంది. టీమిండియాకు ఆడాలనేది ప్రతీ ఒక్క ఆటగాడి కల. నేను నా గదిలోకి వెళ్లి.. నా పేరు, 35 నంబర్ ముద్రించిన జెర్సీని చూడగానే భావోద్వేగానికి లోనయ్యా. ఈ రోజు కోసమే నేను కష్టపడ్డాను. నేను భారత జట్టు ఎంపికైనప్పుడు నా స్నేహితులతో నోయిడాలో ప్రాక్టీస్ చేస్తున్నాను. వెంటనే మా అమ్మకు ఫోన్ చేశాను. నేను ఈ స్ధాయిలో ఉన్నానంటే అందుకు ఒక కారణం మా అమ్మ కూడా. ఆమెకు నాకు ఎంతో సపోర్ట్గా ఉంటుంది. భారత్ తరపున ఆడాలన్నది నా ఒక్కడి కలే కాదు మా అమ్మది కూడా. ఇప్పడు మా ఇద్దరి కల నిజమైందని" బీసీసీఐ షేర్ చేసిన వీడియోలో రింకూ చెప్పుకొచ్చాడు. అదే విధంగా జితేష్ శర్మ మాట్లాడుతూ.. నిజం చెప్పాలంటే ఈ సంతోషంలో నాకు మాటలు కూడా రావడం లేదు. భారత క్రికెట్ జట్టుతో కలిపి విదేశాల్లో పర్యటించడం గొప్ప అనుభవం. జాతీయ జట్టుకు ప్రాతినిథ్యం అనేది మనకు లభించిన గౌరవం. అంతేకాకుండా బాధ్యత కూడా మన సత్తా చూపించుకునేందుకు ఇదొక మంచి అవకాశం. నాకు ఆడేందుకు అవకాశం లభిస్తే 100 శాతం ఎఫక్ట్ భారత్ను గెలిపించేందుకు పెడతాను "అని పేర్కొన్నాడు. చదవండి: BAN vs NZ: బంగ్లాదేశ్ పర్యటనకు న్యూజిలాండ్ క్రికెట్ జట్టు.. 10 ఏళ్ల తర్వాత -
చాలా సంతోషంగా ఉంది.. నేను ఎప్పుడూ అలా ఫీలవ్వలేదు: బుమ్రా
టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా 11 నెలల తర్వాత తిరిగి మైదానంలో అడుగుపెట్టేందుకు సిద్దమయ్యాడు. డబ్లిన్ వేదికగా శుక్రవారం ఐర్లాండ్తో జరగనున్న తొలి టీ20లో భారత కెప్టెన్ హోదాలో బుమ్రా బరిలోకి దిగనున్నాడు. ఈ సిరీస్కు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి, హార్దిక్ పాండ్యా వంటి సీనియర్ ఆటగాళ్లకు విశ్రాంతినివ్వడంతో.. యువ భారత జట్టును బుమ్రా ముందుండి నడిపించనున్నాడు. వెన్ను గాయం, శస్త్ర చికిత్స, పునరావస శిబిరం ఇలా చాన్నాళ్ల తర్వాత ఆడుతున్న టీమిండియా పేస్ గుర్రం బుమ్రా ఎలా రాణిస్తాడని అందరూ వెయ్యి కళ్లుతో ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో తొలి టీ20కు విలేకరుల సమావేశంలో పాల్గొన్న జస్ప్రీత్ బుమ్రా తన ఫిట్నెస్పై కీలక వాఖ్యలు చేశాడు. గాయం నుంచి కోలుకున్నాక తొలి మ్యాచ్ ఆడేందుకు అతృతగా ఎదురుచూస్తున్నాని బుమ్రా తెలిపాడు. నా టార్గెట్ వరల్డ్కప్.. మళ్లీ భారత జట్టులోకి తిరిగి వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. ప్రస్తుతం నేను 100 శాతం ఫిట్నెస్తో ఉన్నాను. నేషనల్ క్రికెట్ అకాడమీలో చాలా కష్టపడ్డాను. ఏన్సీఏలో సుదీర్ఘ కాలం పాటు గడిపాను. ప్రస్తుతం అంతమంచిగానే ఉంది. మైదానంలో అడుగుపెట్టేందుకు అతృతగా ఎదురుచూస్తున్నాను. నెట్స్లో బౌలింగ్ చేసేటప్పుడు నా శరీరం మీద పెద్దగా ఒత్తడి లేకుండా చూసుకున్నాను. అంతమాత్రాన నేను వెనక్కు తగ్గినట్లు కాదు. ఏన్సీఏ నుంచి బయటకు వచ్చాక గుజరాత్ జట్టుతో కలిసి ప్రాక్టీస్ చేశాను. అనంతరం చాలా చోట్ల నెట్ప్రాక్టీస్ సెషన్స్లో కూడా పాల్గొన్నాను. నేను ఇప్పటికే చాలా ప్రాక్టీస్ మ్యాచ్లు కూడా ఆడాను. నా రిహాబిటేషన్ ఎప్పుడూ కూడా టీ20లు ఆడేందుకు ప్రాక్టీస్ చేయలేదు. నా లక్ష్యం ప్రపంచకప్లో రాణించడమే. ప్రస్తుతం వరల్డ్కప్కు సిద్దమవుతున్నాను. నెట్ ప్రాక్టీస్లో 10 నుంచి 15 ఓవర్ల వరకు బౌలింగ్ చేస్తున్నాను. అలా ఎక్కువ బౌలర్లు చేయడం నాకు చాలా ఉపయోగపడుతోంది. కొన్ని సార్లు గాయం నుంచి పూర్తిగా కోలుకోవడానికి మనకు కొంచెం ఎక్కవ సమయం పడుతోంది. అటువంటి సమయంలో మనం కాస్త నిరాశ చెందుతాం. కానీ నేను ఎప్పుడూ అలా ఫీల్ అవ్వలేదు. త్వరగా కోలుకుని ఫీల్డ్లోకి రావడం గురించి మాత్రమే ఆలోచించాను అని బుమ్రా ప్రీ మ్యాచ్ కాన్ఫరెన్స్ లో పేర్కొన్నాడు. చదవండి: NZ vs UAE: 5 వికెట్లతో చెలరేగిన న్యూజిలాండ్ కెప్టెన్.. యూఏఈపై ఘన విజయం The moment we have all been waiting for. @Jaspritbumrah93 like we have always known him. 🔥🔥 #TeamIndia pic.twitter.com/uyIzm2lcI9 — BCCI (@BCCI) August 16, 2023 -
Ind vs Ire: ఐర్లాండ్తో మ్యాచ్ అంటే ఎవరు చూస్తారు? హౌజ్ఫుల్..
India tour of Ireland, 2023: టీమిండియా- పాకిస్తాన్ హై వోల్టేజీ మ్యాచ్.. అదే విధంగా భారత జట్టు ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, న్యూజిలాండ్, సౌతాఫ్రికా వంటి మేటి జట్లతో పోటీ పడుతుందంటే స్టేడియాలు కిక్కిరిసిపోతాయి. మరి ఐర్లాండ్తో మ్యాచ్ అంటే.. అది కూడా ఒకరిద్దరు మినహా మిగతా అంతా యువ ఆటగాళ్లతో కూడిన దాదాపు ద్వితీయ శ్రేణి జట్టు అంటే మ్యాచ్ చూసేందుకు వచ్చే వారెవరుంటారు? ఇలా అనుకుంటే మాత్రం పొరపాటే! ఐర్లాండ్లో ఉన్న మన వాళ్లకు, స్థానికులకు ఇలాంటపుడే టీమిండియా ఆటగాళ్లను నేరుగా చూసే అవకాశం వస్తుంది కదా! అందుకే పోటీపడి మరి టీమిండియా- ఐర్లాండ్ టీ20 మ్యాచ్లకు సంబంధించిన టిక్కెట్లు కొనుగోలు చేశారు. హౌజ్ఫుల్! తొలి రెండు మ్యాచ్ల కోసం ఇప్పటికే మొత్తం టిక్కెట్లు అమ్ముడుపోయాయి. ఈ విషయాన్ని అధికారిక ప్రకటన ద్వారా తెలియజేసింది ఐర్లాండ్ క్రికెట్ బోర్డు. మూడో టీ20కి సంబంధించి కూడా త్వరలోనే టిక్కెట్ల విక్రయ ప్రక్రియ ఆరంభిస్తామని తెలిపింది. టీమిండియాతో మ్యాచ్లకు పెద్ద సంఖ్యలో అభిమానులు తరలిరానున్నారని హర్షం వ్యక్తం చేసింది. బుమ్రా- ఎక్స్ప్రెస్కు పరీక్ష! కాగా ఆగష్టు 18- 23 వరకు 3 మ్యాచ్ల టీ20 సిరీస్ నేపథ్యంలో భారత జట్టు ఇప్పటికే ఐర్లాండ్లో అడుగుపెట్టింది. జస్ప్రీత్ బుమ్రా సారథ్యంలో యువ ఆటగాళ్లు ఐరిష్ టీమ్తో తలపడనున్నారు. ఏడాది కాలం తర్వాత రీఎంట్రీ ఇస్తున్న బుమ్రా ఫిట్నెస్కు సంబంధించి ఈ సిరీస్ ప్లాట్ఫామ్లా ఉపయోగపడనుంది. చిన్న జట్లకు మేలు ఇక ఐర్లాండ్ వంటి చిన్న జట్లతో పటిష్ట భారత జట్టు ఇటీవలి కాలంలో ఎక్కువగా సిరీస్లు ఆడటం ఆయా జట్లకు మేలు చేస్తోంది. ప్రపంచంలోని సంపన్న బోర్డుకు చెందిన జట్టుతో పోటీ పడుతూ.. ఆటగాళ్లు తమ ప్రతిభను నిరూపించుకోవడంతో పాటు ఆయా దేశాల క్రికెట్ బోర్డుల మంచి ఆదాయం ఆర్జించేందుకు దోహదం చేస్తోంది కూడా! ఇదే తొలిసారి కాగా 2018, 2022లో భారత జట్టు ఐర్లాండ్లో పర్యటించిన విషయం తెలిసిందే. ఇక ఇప్పటి వరకు ఇరు జట్లు పొట్టి ఫార్మాట్లో ఐదు సందర్భాల్లో తలపడ్డాయి. టీ20 వరల్డ్కప్-2009లో భాగంగా ఐర్లాండ్ టీమిండియాను ఢీకొనగా.. మిగతా నాలుగుసార్లు ద్వైపాక్షిక సిరీస్లో ముఖాముఖి పోటీపడింది. అయితే, మూడు మ్యాచ్ల టీ20 సిరీస్ ఆడటం మాత్రం ఇదే తొలిసారి. చదవండి: IND VS IRE 1st T20: చరిత్ర సృష్టించనున్న జస్ప్రీత్ బుమ్రా
Pagination
మళ్లీ చరిత్ర సృష్టిస్తున్నాం
చేతులు కాలాక ఆకులు పట్టుకున్న ఈసీ
ఓటీటీలోకి వచ్చేసిన మిడిల్ క్లాస్ మూవీ.. స్ట్రీమింగ్ అందులోనే?
వరల్డ్కప్ జట్టులో నో ఛాన్స్: రోహిత్పై కేఎల్ రాహుల్ కామెంట్స్ వైరల్
ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు అలెర్ట్.. మారిన విత్ డ్రా నిబంధనలు
ఎన్ఆర్ఐతో విధి ఆడిన వింత నాటకం.. విషాదం
స్వాతి మలివాల్ డ్రామా.. బీజేపీ కుట్రే ఇదంతా: సంచలన వీడియో బయట పెట్టిన ఆప్
Heeramandi Jewellery ఎవరీ సినిమా నగల స్పెషలిస్ట్ జంట
తప్పక చదవండి
- నేటి నుంచే టెట్.. రోజుకు రెండు షిప్టులుగా నిర్వహణ
- అధికారం చేపట్టగానే అగ్నివీర్ రద్దు.. రాహుల్ కీలక వ్యాఖ్యలు
- కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలపై ప్రధాని సంచలన వ్యాఖ్యలు
- పెట్టుబడుల సునామీ.. టాటా మోటార్స్ కీలక నిర్ణయం
- హీరామండి హీరోయిన్.. వేలకోట్ల అధిపతిని పెళ్లాడిన భామ!
- సభలో గందరగోళం.. మధ్యలోనే వెళ్లిపోయిన రాహుల్, అఖిలేష్
- T20 WC Trophy: ఈ పొట్టోడిని గెలవడమే అందరి టార్గెట్
- నాణ్యతలేని ‘పతంజలి సోన్పాపిడి’.. ముగ్గురికి జైలు, జరిమానా
- మేమిద్దరం ఎక్కువగా కలిసుండము.. అందుకే! :నటి ఆసక్తికర వ్యాఖ్యలు
- RCB: అమెరికాలో అంబరాన్నంటిన సంబరాలు.. ఎందుకంత స్పెషల్?
Advertisement