breaking news
Diplomatic policy
-
8 రోజుల్లో మరో పాక్ అధికారి ఔట్
న్యూఢిల్లీ: భారతీయులను పలు విధాలుగా ప్రలోభపెట్టి గూఢచర్యానికి వినియోగించుకున్నాడన్న నేరానికి మే 13న ఢిల్లీలోని పాకిస్తాన్ హైకమిషన్ ఉద్యోగిని భారత్ బహిష్కరించిన 8 రోజులకే మరో ఉద్యోగిపైనా భారత్ అదే వేటు వేసింది. అధికార విధులను మీరి ప్రవర్తిస్తున్నాడని, హోదాకు తగ్గట్లు ప్రవర్తించట్లేడనే కారణంగా 24 గంటల్లోపు భారత్ను వీడాలని బుధవారం ఆదేశించింది. ఈమేరకు పాక్ హైకమిషన్లో సంబంధిత వ్యవహారాల ఉన్నతాధికారి సాద్ వరాయిచ్కు ‘అధికారికంగా దౌత్య నిరసన’ నోటీసును అందజేసినట్లు విదేశాంగ శాఖ ఒక ప్రకటనలో పేర్కొంది. -
భారత్లో దౌత్యవేత్తల తొలగింపు.. కెనడాకు మద్దతుగా అమెరికా, బ్రిటన్
ఖలిస్తానీ సానుభూతిపరుడు హర్ప్రీత్సింగ్ నిజ్జర్ హత్య విషయంలో భారత్, కెనడా మధ్య నెలకొన్న విభేదాలు రోజురోజుకీ మరింత ముదురుతున్నాయి. భారత్, కెనడా దౌత్యపరమైన వివాదంలో ఇతర దేశాల ప్రమేయం పెరగడంతో కొత్త మలుపులు చోటుచేసుకుంటున్నాయి. భారత్లోని 41 మంది దౌత్యవేత్తలను కెనడా వెనక్కి రప్పించిన విషయం తెలిసిందే. ఈ విషయంలో అమెరికా, బ్రిటన్ కల్పించుకొని కెనడాకు మద్దతుగా నిలిచాయి. కెనడా దౌత్యపరమైన ఉనికిని తగ్గించాలని భారత ప్రభుత్వం పట్టుబట్టవద్దని కోరాయి. ‘భారత్లో కెనడా తమ దౌత్యవేత్తలను తగ్గించాలని ఢిల్లీ ఆదేశించడం, ఈ మేరకు కెనడా తమ దౌత్య సిబ్బందిని వెనక్కి రప్పించడం ఆందోళన కలిగిస్తోంది.’ అని యూఎస్ స్టేట్ డిపార్ట్మెంట్ ప్రతినిధి మాథ్యూ మిల్లర్ తెలిపారు. చదవండి: భారత్ చర్యతో లక్షల మంది జీవితాలు దుర్భరం: ట్రూడో ‘క్షేత్రస్థాయిలో విభేదాలను పరిష్కరించడానికి దౌత్యవేత్తలు అవసరం. దౌత్య సిబ్బందిని తగ్గించాలని పట్టుబడ్డవద్దని మేము భారత ప్రభుత్వాన్ని కోరుతున్నాం. అలాగే నిజ్జర్ హత్య విషయంలో కెనడా దర్యాప్తుకు సహకరించాలని విజ్ఞప్తి చేస్తున్నాం. దౌత్య సంబంధాలపై 1961 వియన్నా ఒప్పందం ప్రకారం భారత్ తన బాధ్యతలను నిలబెట్టుకుంటుందని ఆశిస్తున్నాం’ అని ఆయన పేర్కొన్నారు. కెనడా ఆరోపణలో తీవ్రంగా పరిగణిస్తున్నట్లు అమెరికా పేర్కొంది. తామకు భారత్తో సంబంధాలు అత్యంత కీలమని చెబుతూ.. ఖలీస్తానీ ఉగ్రవాది హత్య విచారణలో కెనడాకు సహకరించాలని న్యూఢిల్లీపై ఒత్తిడి తెస్తున్నాయి. యూఎస్ బాటలోనే బ్రిటన్ నడుస్తోంది. కెనడా విషయంలో భారత్ వైఖరిని తప్పుబడుతూ శుక్రవారం బ్రిటన్ విదేశాంగ కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది. పదుల సంఖ్యలో కెనడా దౌత్యవేత్తలు దేశాన్ని విడిచిపెట్టి వెళ్లాలంటూ భారత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలతో మేము ఏకీభవించడం లేదని బ్రిటన్ విదేశాంగ శాఖ ప్రతినిధి తెలిపారు. కెనడా దౌత్య వేత్తల ఏకపక్ష తొలగింపు, వియన్నా ఒప్పంద సూత్రాలకు అనుగుణం కాదని అభిప్రాయపడింది సిక్కు వేర్పాటువాది, కెనడా పౌరుడు హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య వెనక భారత సీక్రెట్ ఏజెంట్ల హస్తం ఉందని కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో ఆరోపించడంతో ఇరు దేశాల మధ్య దౌత్య వివాదం మొదలైన విషయం తెలిసిందే. ఈ క్రమంలో కెనడాలోని మన దౌత్యవేత్తలను ఆ దేశం బహిష్కరించడం, బదులుగా దౌత్యపరమైన సంఖ్యను తగ్గించుకోవాలని భారత్ గత నెలలో కోరింది. భారత్ విధించిన డెడ్లైన్ ముగియడంతో కెనడా 41 మంది దౌత్యవేత్తలను ఉపసంహరించుకుంది. అంతేగాక చండీగఢ్, ముంబై, బెంగళూరు నగరాల్లోని కాన్సులేట్లలో వ్యక్తిగత కార్యకలాపాలను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు కెనడా శుక్రవారం తెలిపింది. -
రొట్టె ముక్క... దుడ్డు కర్ర
‘విభజన-అభివృద్ధి’ చైనా సరికొత్త దౌత్యనీతి. గడ్డు సమస్యలన్నిటినీ పక్కన పెట్టి, ఆర్థిక సహకారంతో అభివృద్ధిని సాధించాలనేది వియత్నాంతో చైనా తాజా దౌత్య విధానం. అదే ‘విభజన-అభివృద్ధి’ అంతరార్థం. ‘అభివృద్ధి’ దౌత్యాన్ని కాదంటే నోటి ముందున్న రొట్టె ముక్క అదృశ్యమై దుడ్డు కర్ర ప్రత్యక్షమౌతుంది. ‘విభజించి పాలించు’ తెల్లోడి కూట నీతి. ‘విభజన-అభివృద్ధి’ చైనా సరికొత్త దౌత్య నీతి. ఆ దౌత్యం వియత్నాం ప్రధాని గుయెన్ టాన్ డుంగ్పై వశీకరణ మంత్రంలాగా పనిచేసినట్టుంది. చైనా దురాక్రమణకు గురై స్వతంత్రం కోసం పోరాడిన గత చరిత్ర ను వియత్నమీయులు నేటికీ మరవలేదు. పైగా 1979లో కూడా చైనా ఆ దేశంపై దురాక్రమణకు పాల్ప డింది. నదీ జలాల నుంచి దక్షిణ చైనా సము ద్ర జలాల వరకు అడుగడుగునా వియత్నాం పై చైనా ఆధిపత్యవాద ధోరణిని ప్రదర్శిస్తోంది. ఈ నెల 15న చైనా ప్రధాని లీ కెగియాంగ్ వియత్నాంలో పర్యటించారు. అవి రెండూ చిరకాల మిత్ర దేశాలనిపించేలా లీ పర్యటన సాగింది. అనూహ్యమైన ఈ మార్పునకు కారణం చైనా నూతన నాయకత్వమేనని అనుకుంటే పొరపాటు. అది చైనా దౌత్య మాయాజాలం. గడ్డు సమస్యలన్నిటినీ పక్కన పెట్టి, ఆర్థిక సహకారంతో అభివృద్ధిని సాధించాలనేది వియత్నాంతో చైనా తాజా దౌత్య విధానం. అదే ‘విభజన-అభివృద్ధి’ అంతరార్థం. అతి సరళమైన చెల్లింపుల పద్ధతిలో సకల రంగాల్లో ఆర్థిక, సాంకేతిక సహకారాన్ని అందించడానికి లీ చొరవ చూపడం వియత్నాం ప్రధాని డుంగ్ను చిత్తు చేసింది. 2015 నాటికి ద్వైపాక్షిక వాణిజ్యాన్ని రెట్టింపు చేయడానికి, భారీ ఎత్తున చైనా వియత్నాంలో పెట్టుబడులు పెట్టడానికి ఒప్పందాలు కుది రాయి. మౌలిక సదుపాయాల నిర్మాణానికి వియత్నాంకు తక్షణం అవసరమైన 100 కోట్ల డాలర్ల సహాయాన్ని కూడా చైనా అందిస్తోంది.ై పెగా వివాదాస్పదమైన స్ప్రాట్లీ, పార్సెల్ దీవులకు కూడా ఈ ‘అభివృద్ధి’ విస్తరిస్తుంది. అమెరికా, జపాన్లు ఇవ్వలేని వరాలను ఆధిపత్యశక్తిగా వ్యవహరించే చైనా ఇస్తుంటే డుంగ్ ఎందుకు కాదనాలి? ఏకైక అగ్రరాజ్యం అమెరికాది బాంబుల దౌత్యం లేదా ‘గన్బోట్ డిప్లమసీ.’ బెదిరిం చడం లొంగకపోతే బాంబులు కురిపించడమే తప్ప మరొకటి దానికి తెలియదు. ఇరాక్ ఆ దౌత్య నీతికి భీకర నిదర్శనం. అమెరికా దౌత్య ఆయుధాగారంలో ‘దుడ్డుకర్ర, రొట్టెముక్క’ కూడా లేకపోలేదు. అయితే అది రొట్టెముక్క విసరాడనికి ముందే... దుడ్డుకర్ర భయానికి దాని కోరికలన్నిటినీ నెరవేర్చక తప్పదు. చైనా అందుకు విరుద్ధంగా రొట్టెముక్కలు ముందుగానే ఇచ్చి కావాలనుకున్నది సాధిస్తోంది. బాంబుల దౌత్యంతో అమెరికా ప్రపంచాధిపత్యాన్ని నెరపుతుంటే చైనా వాణిజ్య, పెట్టుబడుల సేనలతో ఆ ఆధిపత్యానికి నిచ్చెనలు వేస్తోంది. వాణిజ్యపరంగా, ఆర్థికంగా తమపై ఆదారపడ్డ దేశాలు రాజకీయంగా తమకు అనుకూలంగా లేదా తటస్థంగా వ్యవహరించ క తప్పదనేది చైనా తర్కం. దక్షిణ చైనా సముద్రంలోని సుసంపన్నమైన కర్బన ఇంధన వనరుల కోసం కాకపోతే చిన్నా చితక దీవులపై చైనా ‘చారిత్రక హక్కుల’ ప్రకటన మరెం దుకు? ఆర్థిక సహకారం, అభివృద్ధి పేరిట ‘శాంతియుతంగానే’ ఆ హక్కులు సమకూరితే మరేం కావాలి? గత ఏదాది వియత్నాం తీరంలో భారత చమురు, సహజ వాయువుల సంస్థ (ఓఎన్జీసీ) చేపట్టిన చమురు అన్వేషణపై చైనా తీవ్ర అభ్యంతరాలు తెలిపింది. నాటి ఉద్రిక్తతల మధ్య చైనా ప్రభుత్వ పత్రిక ‘గ్లోబల్ టైమ్స్’... ‘భారత చర్యలు చైనా సహనం హద్దులు దాటేంత వరకు నెడుతున్నాయి’ అని హెచ్చరించింది. చివరకు ‘రాజ కీయ కారణాల వల్ల’ వియత్నాం ఓఎన్జీసీతో ఒప్పందాన్ని రద్దు చేసింది. అదే టోంకిన్ అఖాతంలో చమురు అన్వేషణ, వెలికితీత కాంట్రాక్టులను చైనాకు కట్టబెట్టింది! వియత్నాం రావటానికి ముందు లీ ‘ఆసియాన్’ (అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఈస్ట్ ఏసియన్ నేషన్స్) సమావేశాలకు హాజరయ్యారు. ఆసందర్భంగా బ్రూనీలో కూడా లీ ‘రొట్టె ముక్కలను’ పంచారు. అభివృద్ధి ఆశను చూపి దీర్ఘకాలిక సహకారానికి పునాదులు వేశారు. మొత్తంగా దక్షిణ చైనా సముద్రప్రాంతం అంతటికీ చైనా ఇదే దౌత్యాన్ని విస్తరింపజేస్తోంది. చైనా దుడ్డు కర్రను దాచేసిందే తప్ప వదిలేయలేదు. ‘అభివృద్ధి’ దౌత్యాన్ని కాదం టే నోటి ముందున్న రొట్టె ముక్క అదృశ్యమై దుడ్డు కర్ర ప్రత్యక్షమౌతుందని తెలిసేట్టు చేసింది. వియత్నాంతో హనీమూన్లా సాగిన తన పర్యటనలో లీ... ద్వైపాక్షిక సమస్యలను ‘అంతర్జాతీయం చేస్తే సహించేది లేదని’ హెచ్చరించారు. చైనాను ఏకాకిని చేయడానికి అమెరికా, జపాన్లు రచిస్తున్న సైనిక వ్యూహా లకు దూరంగా ఉండాలని అంతరార్థం. - పిళ్లా వెంకటేశ్వరరావు