-
National Bubble Tea Day 2024: అసలేంటీ బబుల్ టీ, అందరూ తాగొచ్చా?
ప్రపంచవ్యాప్తంగా టీ ప్రేమికులకు కొరత లేదు. ఇందులో గ్రీన్టీ, బ్లాక్ టీ ఇలా రకరకాల టీలు చాయ్ ప్రియులను ఉల్లాస పరుస్తుంటాయి. మరి బుబుల్ టీ అని ఒక ‘టీ’ ఉంది. దీని గురించిఎపుడైనా విన్నారా? ఈ రోజు(ఏప్రిల్ 30) నేషనల్ బబుల్టీ డే అట. అసలు దీన్ని ఎలా తయారు చేస్తారు. దీని వలన లాభాలేంటో ఒకసారి చూద్దామా..?బబుల్ టీ.. ఈ పేరే కొత్తగా ఉంది కదా. బబుల్ టీని బోబా లేదా పెర్ల్ మిల్క్ టీ అని కూడా పిలుస్తారు. ఇది ఆసియాలో ముఖ్యంగా తైవాన్లో బాగా పాపులర్. అధిక ప్రోటీన్తో నిండి ఉంటుంది కనుక చైనా ధనవంతుల్లో దీనికి డిమాండ్ ఎక్కువ.బబుల్ టీని పాలు, పండ్లు, పండ్ల రసాలతో టీ కలిపి, చివర్లో టేపియోకా ముత్యాలను కలిపి సేవిస్తారు. దీన్ని శీతాకాలంలో వేడిగా, వర్షాకాలంలో చల్లగా సేవిస్తారు.అయితే, బబుల్ టీలో చక్కెర, కొవ్వులు ,సాధారణ కార్బోహైడ్రేట్లు అధికంగా ఉండటం వల్ల క్రమం తప్పకుండా మరియు అధికంగా తీసుకుంటే ఆరోగ్యానికి హానికరం. మధుమేహం ,గుండె జబ్బులు వంటి దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదాన్ని పెంచుతుంది. అందుకని మితంగా తీసుకోవడమే ఉత్తమం.బబుల్ టీలో ఉపయోగించే టపియోకా ముత్యాలు కాసావా రూట్ నుండి తయారవుతాయిపైగా వీటిలో కార్బోహైడ్రేట్లు ఎక్కువగా ఉంటాయి. అవి అంతర్గతంగా అనారోగ్యకరమైనవి కానప్పటికీ, అదనపు కేలరీలు, కార్బోహైడ్రేట్లు ఈటీలో చేరతాయి.కేలరీల గని ఈ బబుల్ టీ. కార్బోహైడ్రేట్లు కూడా పుష్కలంగా లభిస్తాయి. అందుకే దీన్ని రోజువారీ పానీయంగా కాకుండా అప్పుడప్పుడు తీసుకునే స్పెషల్ ట్రీట్గా మాత్రమే భావించాలి. సాధ్యమైనప్పుడు తక్కువ చక్కెర లేదా చక్కెరలేని స్వీట్నెర్లను, అలాగే క్యాలరీ ,కార్బోహైడ్రేట్లను తగ్గించేందుకు టపియోకా ముత్యాలకు బదులుగా ఫ్రూట్ జెల్లీలు లేదా అలోవెరా వంటి టాపింగ్స్ను వాడుకోవచ్చు. -
చైనా కొత్త టెక్నాలజీ - ట్రాక్లెస్ ట్రైన్ వీడియో వైరల్
ఇప్పటి వరకు ఎన్నెన్నో అద్భుతాలు సృష్టించిన చైనా.. మరో కొత్త ఆవిష్కరణను తీసుకువచ్చింది. ఇందులో పట్టాలు లేని లేదా ట్రాక్లెస్ ట్రైన్స్ నగరం నడిబొడ్డున తిరగడం చూడవచ్చు. దీనికి సంబంధించిన వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ వాడుతున్నాయి. పట్టాలు లేకుండా ట్రైన్ ఎలా వెళ్లగలుగుతుంది, దాని పూర్వాపరాలు ఏంటనే వివరాలు వివరంగా ఇక్కడ చూసేద్దాం. రోడ్డుపై పరుగులు పెట్టే ఈ ట్రైన్ గంటకు 60 మైల్స్ వేగంతో ప్రయాణిస్తుంది, ఒక్క సారికి 100మందిని తీసుకెళ్లే కెపాసిటీని కలిగి ఉంటుంది. ఈ ట్రైన్ నగరంలో ప్రయాణించడం వల్ల సిటీ బస్సు మాదిరిగా ఎక్కువ మందికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఇది పూర్తిగా విద్యుత్తుతో పనిచేస్తుండం వల్ల జీరో ఉద్గారాలను విడుదల చేస్తుంది. అంటే ఇది పూర్తిగా కాలుష్య రహితమైన ట్రైన్ అని తెలుస్తోంది. ఇదీ చదవండి: మునుపెన్నడూ చూడని అద్భుతాలు 'ఏఐ'తో సాధ్యం - బిల్ గేట్స్ ట్రాక్లెస్ అవసరం లేని ఈ ఎలక్ట్రిక్ ట్రైన్.. వేగంగా ప్రయాణించడమే కాకుండా చాలా ఫ్లెక్సిబుల్గా ఉంటుంది. ప్రయాణ సమయంలో ట్రాఫిక్ సిగ్నెల్ పడితే ఆగుతుంది కూడా. ఇది ఆటోమాటిక్ టెక్నాలజీని కలిగి ఉండటం వల్ల రూట్ బాగా ఫాలో అవుతుంది. స్టీరింగ్ వీల్ కూడా ఈ టెక్నాలజీ ద్వారా ఆపరేట్ అవ్వడానికి ప్రత్యేకమైన సెన్సార్ సిస్టం కలిగి ఉంటుంది. Trackless train in China ...pic.twitter.com/MsMrW4Wi26 — Figen (@TheFigen_) December 29, 2023 -
గోల్డ్మెడల్ టార్గెట్గా.. చైనాకు బయలు దేరిన టీమిండియా
ఆసియా క్రీడలు-2023లో పాల్గోనేందుకు రుతురాజ్ గైక్వాడ్ సారధ్యంలోని భారత జట్టు గురువారం చైనాకు బయలు దేరి వెళ్లింది. ముంబై నుంచి నేరుగా ఏసియన్ గేమ్స్ జరగుతున్న హంగ్జూకు టీమిండియా పయనమైంది. కాగా క్రీడలకు భారత త్వితీయ శ్రేణి జట్టును బీసీసీఐ సెలక్షన్ కమిటీ ఎంపిక చేసింది. ఈ జట్టుకు రుత్రాజ్ గైక్వాడ్ను కెప్టెన్గా ఎంపిక చేసిన బీసీసీఐ.. వీవీయస్ లక్ష్మణ్కు కోచింగ్ బాధ్యతలు అప్పజెప్పింది. అదే విధంగా ఈ జట్టులో యశస్వీ జైశ్వాల్, తిలక్ వర్మ, రింకూ సింగ్ వంటి యువ సంచలనాలకు చోటు దక్కింది. ఇక ఇప్పటికే ఏషియన్ గేమ్స్ మహిళల క్రికెట్లో భారత జట్టు గోల్డ్మెడల్ సాధించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు భారత పురుషల జట్టు కూడా పసిడి పతకమే లక్ష్యంగా బరిలోకి దిగనుంది. ఈ క్రీడల్లో భారత్ ప్రయాణం అక్టోబర్ 3వ తేదీ నుంచి ప్రారంభం కానున్నది. భారత్ నేరుగా క్వార్టర్ ఫైనల్స్లో తలపడనుంది. నేరుగా క్వార్టర్స్ ఆడుతున్న జట్లలో.. ఇండియాతో పాటు ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్, పాకిస్థాన్, శ్రీలంక జట్లు ఉన్నాయి. భారత జట్టు : రుతురాజ్ గైక్వాడ్(కెప్టెన్), ముకేశ్ కుమార్, శివం మావి, శివమ్ దూబే, ప్రభుసిమ్రన్ సింగ్(వికెట్ కీపర్), యశస్వి జైస్వాల్, రాహుల్ త్రిపాఠి, తిలక్ వర్మ, రింకూ సింగ్, జితేశ్ శర్మ(కీపర్), వాషింగ్టన్ సుందర్, షాబాజ్ అహ్మద్, రవి బిష్ణోయ్, అవేశ్ ఖాన్, అర్షదీప్సింగ్. The Ruturaj Gaikwad-led #TeamIndia depart for the #AsianGames 👌👌#IndiaAtAG22 | @Ruutu1331 | @VVSLaxman281 pic.twitter.com/7yYkCLw5zM — BCCI (@BCCI) September 28, 2023 చదవండి: IND vs AUS: విరాట్ కోహ్లి అరుదైన ఘనత.. రికీ పాంటింగ్ రికార్డు బద్దలు -
Asian Games 2023, Fencing: క్వార్టర్ ఫైనల్లో భవానీ దేవి ఓటమి..
చైనా వేదికగా జరుగుతున్న ఆసియా క్రీడల్లో భారత ఫెన్సర్ భవానీ దేవి కథ ముగిసింది. మహిళల వ్యక్తిగత సేబర్ విభాగం క్వార్టర్ ఫైనల్లో చైనాకు చెందిన యాకీ షావో చేతిలో 7-15 తేడాతో భవానీ ఓటమి పాలైంది. దీంతో తొలి ఆసియా క్రీడల పతకానికి అడుగుదూరంలో భవానీ దేవి నిలిచిపోయింది. క్వార్టర్స్ మొదటి పీరియడ్ ఆరంభంలో మూడు టచ్లతో అదరగొట్టిన భవానీ.. ఆ తర్వాత ప్రత్యర్ధి యాకీ షావో అద్బుతమైన కమ్బ్యాక్ బ్యాక్ ఇచ్చింది. యాకీ షావో వరుస టచ్లతో 8-3 అధిక్యంలోకి వెళ్లింది. ఇక రెండో పీరియడ్లో కూడా యాకీ షావో తన అధిపత్యాన్ని కొనసాగించింది. రెండో పీరియడ్లో చైనీస్ ఫెన్సర్ 6 టచ్లు చేయగా.. భవానీ దేవీ 4 టచ్లు మాత్రమే చేసి ఓటమి పాలైంది. కాగా అంతకముందు 2021లో ఒలింపిక్స్కు అర్హత సాధించిన తొలి భారతీయ ఫెన్సర్గా భవానీ దేవి చరిత్ర సృష్టించింది. చదవండి: ODI World Cup 2023: వరల్డ్కప్కు జట్టును ప్రకటించిన శ్రీలంక.. స్టార్ ఆటగాడు రీ ఎంట్రీ -
Asian Games 2023: పతకాల వేట ఆరంభం.. తొలి రోజు భారత షెడ్యూల్ ఇదే
ప్రపంచవ్యాప్తంగా క్రీడాభిమానులంతా ఎంతో ఆతృతగా ఎదురుచూసిన ఆసియాక్రీడలు-2023కు తేరలేచింది. శనివారం జరిగిన వేడుకలతో ఈ ఆసియా క్రీడల పోటీలు అధికారికంగా పోటీలు ప్రారంభమయ్యాయి. అయితే ఆదివారం నుంచి పతకాల వేట ప్రారంభం కానుంది. ఇ ఈ మెగా ఈవెంట్లో భారత్ షెడ్యూల్ను ఓ సారి పరిశీలిద్దాం. మెడల్ ఈవెంట్స్ షూటింగ్: మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ టీమ్, వ్యక్తిగత విభాగం: రమిత, మెహులీ, ఆశి చౌక్సీ (ఉదయం గం. 6 నుంచి 9:15 వరకు). రోయింగ్: పురుషుల లైట్వెయిట్ డబుల్ స్కల్స్ ఫైనల్ (అర్జున్ లాల్, అరవింద్ సింగ్; ఉదయం గం. 7:10కు); పురుషుల డబుల్ స్కల్స్ ఫైనల్ (సత్నామ్ సింగ్, పరి్మందర్ సింగ్; ఉదయం గం. 8 నుంచి). మహిళల ఫోర్ ఫైనల్ (అశ్వతి, మృణ్మయి, ప్రియా దేవి, రుక్మిణి; ఉదయం. గం. 8:20 నుంచి). పురుషుల పెయిర్ ఫైనల్: బాబూలాల్ యాదవ్, లేఖ్ రామ్ (ఉదయం గం. 8:40 నుంచి). పురుషుల ఎయిట్ ఫైనల్ (ఉదయం గం. 9:00కు). మహిళల బాక్సింగ్ (54 కేజీలు తొలి రౌండ్): ప్రీతి వర్సెస్ సిలీనా (జోర్డాన్; ఉదయం గం. 11:30 నుంచి). 51 కేజీలు: నిఖత్ వర్సెస్ ఎన్గుయెన్ థి టామ్ (వియత్నాం; సాయంత్రం గం. 4:30 నుంచి) మహిళల టి20 క్రికెట్ సెమీఫైనల్: భారత్ వర్సెస్ బంగ్లాదేశ్ (ఉ. గం. 6:30 నుంచి). ఫుట్బాల్ (లీగ్ దశ): పురుషుల విభాగం: భారత్ వర్సెస్ మయన్మార్ (సాయంత్రం గం. 5 నుంచి); మహిళల విభాగం: భారత్ వర్సెస్ థాయ్లాండ్ (మధ్యాహ్నం గం. 1:30 నుంచి). హాకీ (లీగ్ దశ): పురుషుల విభాగం: భారత్ గీ ఉజ్బెకిస్తాన్ (ఉదయం గం. 8:45 నుంచి). టేబుల్ టెన్నిస్ (ప్రిక్వార్టర్ ఫైనల్స్): మహిళల విభాగం: భారత్ గీ థాయ్లాండ్ (ఉదయం గం. 7:30 నుంచి). పురుషుల విభాగం: భారత్ వర్సెస్ కజకిస్తాన్ (ఉ.గం. 9:30 నుంచి). వాలీబాల్ (క్వార్టర్ ఫైనల్): భారత్ వర్సెస్ జపాన్ (మధ్యాహ్నం గం. 12 నుంచి). -
ఉవ్వెత్తున ఎగసిన ‘ఆసియా’ ఉత్సవం.. పతకాల వేటకు రంగం సిద్దం
ఆర్టిఫీషయల్ ఇంటలిజెన్స్... డిజిటల్ టార్చ్ రిలే టెక్నాలజీ... స్టేడియంలోనే ఉవ్వెత్తున ఎగసి ప్రేక్షకుల మీదికే దూసుకొచి్చనట్లు కనిపించిన అలలు... టపాకాయలు లేకుండానే అందరి చుట్టూ బాణాసంచా పేలినట్లుగా అనుభూతి... ఒక్కటేమిటి, ఇలా ప్రతీది అత్యుత్తమ స్థాయి సాంకేతిక నైపుణ్యంతో కూడిన ప్రదర్శన... అనూహ్య రీతిలో, గతంలో ఎన్నడూ చూడని స్థాయిలో అంతా అచ్చెరువొందేలా ఆసియా క్రీడల ప్రారంభోత్సవం జరిగింది... సాంకేతికతను గొప్పగా వాడుకోవడంలో తమ ఘనత ఏమిటో ప్రపంచానికి చైనా మళ్లీ చూపించింది... ఆటలో అగ్రస్థానానికి గురి పెట్టిన ఆ దేశం అసలు సమరానికి ముందే అందరితే ఔరా అనిపించే ఉత్సవాన్ని ప్రదర్శించింది. హాంగ్జౌ: క్రీడాభిమానులంతా ఎంతో ఆసక్తికరంగా ఎదురు చూసిన 19వ ఆసియా క్రీడలకు విజిల్ మోగింది. శనివారం జరిగిన వేడుకలతో అధికారికంగా పోటీలు ప్రారంభమయ్యాయి. చైనా దేశాధ్యక్షుడు జిన్పింగ్ ఈ కార్యక్రమానికి హాజరై పోటీల ప్రారంభపు ప్రకటన చేశారు. 45 దేశాల నుంచి దాదాపు 12 వేలకు పైగా అథ్లెట్లు ఈ ఆసియా క్రీడల్లో పాల్గొంటున్నారు. 80 వేల సామర్థ్యం గల ఒలింపిక్ స్పోర్ట్స్ సెంటర్ వేదికగా ఆరంభోత్సవం జరగ్గా... అదరగొట్టిన మెరుపు ప్రదర్శనలతో స్టేడియం దద్దరిల్లింది. ఆసియా క్రీడల ఆరంత్సవ వేడుకలకు ‘టైడ్స్ సర్జింగ్ ఇన్ ఏషియా’ అనే నేపథ్యాన్ని ఎంచుకున్నారు. పోటీల వేదిక అయిన హాంగ్జౌ నగరం గుండా కియాన్టాంగ్ నది ప్రవహిస్తుంది. ప్రపంచంలో అత్యంత ఎత్తయిన అలలు వచ్చే నదిగా కియాన్టాంగ్కు గుర్తింపు ఉంది. అందుకే ఆసియాలో ఉధృత అలలు అనే తరహా థీమ్ను క్రీడలకు కలిపారు. 13 వేర్వేరు అంశాలు ప్రదర్శించగా అన్నింటా ఏదో ఒక చోట నీటి నేపథ్యం కనిపిస్తూ ఉంటుంది. ►ఆసియా క్రీడల్లో నిర్వహిస్తున్న అన్ని రకాల క్రీడల గురించి ప్రత్యేక బ్యాంగ్ను ప్రదర్శించారు. ►ప్రాచీన చైనా నుంచి మొదలు ఆధునిక చైనా వరకు ఆ దేశ పురోగతి, ప్రస్థానం... ఇలా అన్ని అంశాలను కలుపుతూ చేసిన ప్రత్యేక ప్రదర్శన హైలైట్గా నిలిచింది. సంస్కృతి సాంప్రదాయాల గురించి చెబుతూనే కొత్త తరం సాంకేతికలో ఆ దేశం ముందంజ వేయడాన్ని ప్రముఖంగా ప్రస్తావించారు. పోటీల ప్రారంభోత్సవ రోజైన సెపె్టంబర్ 23కు చైనా సౌర వ్యవస్థలో ప్రత్యేక చోటు ఉంది. ఈ సీజన్ ఆ దేశంలో పంట సేకరణ (మన సంక్రాంతిలాంటిది) అతిథులను ఆహ్హనించే సమయం కూడా. అందుకే ఈ కార్యక్రమానికి ‘ఆటమ్ గ్లో’ అంటూ ప్రత్యేకంగా ప్రస్తావించారు. ►1990, 2010లలో కూడా ఆసియా క్రీడలు నిర్వహించిన చైనా అప్పటి జ్ఞాపకాలను గుర్తు చేస్తూ... ఈసారి క్రీడలు జరుగుతున్న హాంగ్జౌ సమీపంలోనే మూడు హెరిటేజ్ నగరాల విశేషాలు చెబుతూ ‘మెమరీస్ ఆఫ్ జియాంగ్నాన్’ పేరుతో క్రీడల మూడు మస్కట్లు చెన్చెన్, కాంగ్కాంగ్, లియాన్ లియాన్ సందడి చేశాయి. ► ప్రారంభోత్సవ వేడుకల మార్చ్పాస్ట్లో అన్నింటికంటే ముందుగా అఫ్గానిస్తాన్, చివరగా ఆతిథ్య చైనా వచ్చాయి. అఫ్గానిస్తాన్ నుంచి రెండు జట్లు బరిలో ఉన్నాయి. ఒకటి మహిళలు లేకుండా ఆ దేశం పంపిన అధికారిక జట్టు కాగా... మరొకటి విదేశాల్లో తలదాచుకొని శిక్షణ తీసుకుంటూ బరిలోకి దిగిన బృందం. ఇందులో 17 మంది మహిళా అథ్లెట్లు ఉన్నారు. మార్చ్పాస్ట్ సమయంలో బ్యాక్గ్రౌండ్లో ‘అవర్ ఏషియా’ పాటను వినిపించారు. ► భారత పురుషుల హాకీ జట్టు కెప్టెన్ హర్మన్ప్రీత్ సింగ్, ఒలింపిక్ మెడలిస్ట్ బాక్సర్ లవ్లీనా బొర్గొహైన్ మన దేశపు జాతీయ పతాకంతో టీమ్ మార్చ్పాస్ట్కు నాయకత్వం వహించారు. ► చైనాకు చెందిన ముగ్గురు స్టార్లు ప్లేయర్లు, ఒలింపిక్ పతక విజేతలు యి షివెన్, ఫ్యాన్ జెండాంగ్, వాంగ్ జ్యోతిని వెలిగించే కార్యక్రమంలో పాల్గొన్నారు. అయితే వీరంతా ఒకవైపు నిలబడగా... డిజిటల్ పద్ధతిలోనే టార్చ్ను వెలిగించారు. టార్చ్తో అథ్లెట్ పరుగెడుతూ వెళుతున్న లేజర్ షో ప్రేక్షకులకు కొత్త తరహా అను భూతిని పంచింది. చివర్లో బాణాసంచాను కూడా ఇదే తరహాలో పేల్చి క్రీడల ఆరం¿ోత్సవానికి ఘనమైన ముగింపునిచ్చారు. చదవండి: నేడు ఆసీస్తో రెండో వన్డే: సిరీస్ విజయం లక్ష్యంగా భారత్ -
ఆసియా క్రీడలకు శ్రీలంక జట్టు ప్రకటన.. కెప్టెన్ ఎవరంటే?
చైనా వేదికగా జరగనున్న ఆసియా క్రీడలు-2023కు 15 మంది సభ్యులతో కూడిన శ్రీలంక-ఏ జట్టును ఆ దేశ క్రికెట్ బోర్డు ప్రకటించింది. ఈ జట్టుకు ఆల్రౌండర్ సహన్ అరాచ్చిగే కెప్టెన్గా ఎంపికయ్యాడు. సహన్ అరాచ్చిగే శ్రీలంక సీనియర్ జట్టు తరపున ఇప్పటివరకు కేవలం 2 వన్డేలు మాత్రమే ఆడాడు. అయితే దేశవాళీ క్రికెట్లో మంచి ట్రాక్ రికార్డు ఉండడంతో జట్టు పగ్గాలు అతడికి సెలక్టర్లు అప్పగించారు. అంతేకాకుండా ఆసియాకప్-2023 ఫైనల్ శ్రీలంక జట్టులో కూడా అరాచ్చిగే బ్యాకప్గా ఉన్నాడు. అదే విధంగా ఆసియా క్రీడల్లో పాల్గోనే శ్రీలంక జట్టులో నువానీడు ఫెర్నాండో,అషెన్ బండార వంటి సీనియర్ ఆటగాళ్లు ఉన్నారు. ఇక వన్డే వరల్డ్కప్-2023కు సమయం ఆసన్నం కావడంతో ద్వితీయ శ్రేణి జట్టును చైనాకు పంపాలని శ్రీలంక సెలక్షన్ కమిటీ నిర్ణయం తీసుకుంది. కాగా ఆసియాకప్ ఫైనల్లో భారత్ చేతిలో 10 వికెట్ల తేడాతో శ్రీలంక ఘోర ఓటమి చవిచూసిన సంగతి తెలిసిందే. మరోవైపు ఈ టోర్నీలో పాల్గోనే తమ మహిళల జట్టును కూడా శ్రీలంక క్రికెట్ వెల్లడించింది. ఈ జట్టుకు ఆతపట్టు నాయకత్వం వహించనుంది. ఈ మెగా ఈవెంట్ సెప్టెంబర్ 23 నుంచి ఆక్టోబర్ 8వరకు జరగనుంది. శ్రీలంక జట్టు: లసిత్ క్రూస్పుల్లే, షెవోన్ డేనియల్, అషెన్ బండార, సహన్ అరాచ్చిగే (కెప్టెన్), అహన్ విక్రమసింఘే, లహిరు ఉదార (వికెట్ కీపర్), రవిందు ఫెర్నాండో, రాణిత లియానారాచ్చి, నువానీడు ఫెర్నాండో, సచిత జయతిలకే, విజయకాంత్ వియస్కాంత్, నిమేష్ నూతుస్ర విముక్తి, నిమేష్ నూతుస్ర విముక్తి, చదవండి: Asia Cup 2023: పాక్ క్రికెట్లో ముసలం.. బాబర్తో విభేదాలు! వైస్ కెప్టెన్పై వేటు The Sri Lanka Cricket Selection Committee selected the following men’s (Sri Lanka ‘A’) and women’s squad to take part in the Asian Games 2023 to be held in Hangzhou, China, from September 23 to October 8.#AsianGames pic.twitter.com/fOV9reZmwV — Sri Lanka Cricket 🇱🇰 (@OfficialSLC) September 18, 2023 -
చైనా కంపెనీ సీక్రెట్ ఆపరేషన్.. రహస్యంగా చిప్ల తయారీ!
అమెరికా ఆంక్షల నేపథ్యంలో చైనాకు చెందిన టెక్నాలజీ కంపెనీ హువాయి టెక్నాలజీస్ ( Huawei Technologies ) చైనా అంతటా రహస్యంగా సెమీకండక్టర్ తయారీ కేంద్రాలను నిర్మిస్తున్నట్లుగా వాషింగ్టన్ కేంద్రంగా ఉన్న సెమీకండక్టర్ అసోసియేషన్ హెచ్చరించినట్లు బ్లూమ్బెర్గ్ న్యూస్ తాజాగా నివేదించింది. ఈ చైనీస్ టెక్ దిగ్గజం ఏడాది క్రితమే చిప్ల ఉత్పత్తి చేపట్టిందని, ఇందు కోసం ఆ దేశ ప్రభుత్వం నుంచి 30 బిలియన్ డాలర్ల నిధులను సైతం పొందిందని సెమీకండక్టర్ ఇండస్ట్రీ అసోసియేషన్ చెబుతోంది. దేశంలో ఇప్పటికే రెండు ప్లాంట్లను ఏర్పాటు చేసిన హువాయి మరో మూడు ప్లాంట్లను నిర్మిస్తోందని అనుమానం వ్యక్తం చేసింది. భద్రతాపరమైన సమస్యల కారణంగా 2019లో యూఎస్ వాణిజ్య విభాగం తమ ఎగుమతి నియంత్రణ జాబితాలో హువాయి కంపెనీని చేర్చింది. సెమీకండక్టర్ ఇండస్ట్రీ అసోసియేషన్ చెప్పినట్లుగా ఇతర కంపెనీల పేర్లతో హువాయి తయారీ కేంద్రాలను నిర్మిస్తుంటే యూఎస్ ఆంక్షలను అధిగమించి అమెరికన్ చిప్ తయారీ పరికరాలను పరోక్షంగా కొనుగోలు చేస్తుండవచ్చని బ్లూమ్బెర్గ్ రిపోర్ట్ పేర్కొంది. యూఎస్లో హువాయి కంపెనీని ట్రేడ్ బ్లాక్లిస్ట్లో చేర్చారు. దీంతో ఆ కంపెనీకి ఇక్కడి కంపెనీలు విడిభాగాలు, సాంకేతికతను అందించేందుకు వీలు లేదు. సెమీకండక్టర్ చిప్లను తయారు చేయకుండా హువాయి కంపెనీ కట్టడి చేసేందుకు యూఎస్ అధికారులు నియంత్రణలను కఠినతరం చేస్తున్నారు. ఇదీ చదవండి: సంపదకు సరికొత్త నిర్వచనం.. వారెన్ బఫెట్! ఆస్తుల్లో కొత్త మైలురాయి.. -
తీవ్ర సంక్షోభంలో చైనా ఆర్థిక వ్యవస్థ
-
చైనా మళ్లీ ఏసేసిందిగా.. ఏకంగా మారుతి జిమ్నీకే ఎసరు
చైనా ఆటోమొబైల్ మార్కెట్ ఇప్పటికే కొన్ని వాహనాలను కాపీ కొట్టి తయారు చేసినట్లు గతంలో చదువుకున్నాం. అలాంటి సంఘటనే మళ్ళీ వెలుగులోకి వచ్చింది. ఇందులో మారుతి జిమ్నీ ఆధారంగా డూప్లికేట్ జిమ్నీ తయారు చేశారు. ఇది చూడటానికి జిమ్నీ మాదిరిగా కనిపించినప్పటికీ జిమ్నీ కాదని చూడగానే తెలిసిపోతోంది. SIAC యాజమాన్యంలోని 'బౌజన్' కంపెనీ 'బౌజన్ ఏప్' (Baojun Yep) ఎలక్ట్రిక్ ఎస్యువి ఆవిష్కరించింది. ఇది ఇప్పటికే మార్కెట్లో ఉన్న జిమ్నీ 3-డోర్స్ మోడల్ని పోలి ఉంటుంది. ఈ ఎలక్ట్రిక్ కారు 2023 ఏప్రిల్లో జరగనున్న షాంగై ఆటో షోలో ప్రదర్శనకు వస్తుంది. ఇదే ఏడాది 'మే' నెల నాటికి అధికారికంగా విడుదలవుతుంది. భారతదేశంలో విక్రయిస్తున్న మారుతి జిమ్నీ 1.5 లీటర్ పెట్రోల్ ఇంజన్తో లభిస్తుంది, బౌజన్ ఏప్ ఎలక్ట్రిక్ వెర్షన్ డిజైన్ పరంగా కొత్తగా ఉంటుంది. అయినప్పటికీ ఒక ఛార్జ్తో గరిష్టంగా 303 కిమీ పరిధిని అందిస్తుంది. ఈ ఎలక్ట్రిక్ కారుకి సంబంధించిన చాలా వివరాలు అధికారికంగా అందుబాటులోకి రాలేదు. గ్లోబల్ మార్కెట్లో ఎంతోమంది మనసు దోచిన జిమ్నీ డూప్లికేట్ అవతారంలో పుట్టుకొస్తుంది, మరి ఇది ఎలాంటి ఆదరణ పొందుతుందో చూడాలి..! చైనీస్ తయారీదారులు ఇప్పటికే బజాజ్ పల్సర్, కెటిఎమ్ డ్యూక్, యమహా ఆర్3, కవాసకి నింజా వంటి మోడల్స్ కాపీ చేసి పాకిస్తాన్, బంగ్లాదేశ్ దేశాల్లో విరివిగా తక్కువ ధరలకే విక్రయిస్తున్నారు. -
బోర్డర్లో రెచ్చిపోతున్న చైనా.. నివేదికలో పలు సంచలన అంశాలు
న్యూఢిల్లీ: వాస్తవాధీన రేఖ(ఎల్ఏసీ) వద్ద డ్రాగన్ దేశం చైనా రెచ్చిపోతోంది. డ్రాగన్ సైన్యం భారత భూభాగంలోకి క్రమంగా చొచ్చుకొస్తూ సరిహద్దును సైతం మార్చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. అంతేకాకుండా ఆధునిక మౌలిక సదుపాయాలు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇటీవల జరిగిన డీజీపీల సమావేశంలో చైనా వ్యవహారంపై అధికారులు సమర్పించిన ఓ నివేదికలో పలు సంచలన అంశాలు బహిర్గతమయ్యాయి. సరిహద్దు ప్రాంతంలో చైనా కొత్త సైనిక స్థావరాలను ఏర్పాటుచేస్తున్న నేపథ్యంలో భారత్–చైనా సైనికుల నడుమ మరిన్ని ఘర్షణలు జరగవచ్చని అంచనా వేస్తున్నట్లు ఈ నివేదికలో పేర్కొన్నారు. దీనిపై అంతర్జాతీయ వార్తా సంస్థ రాయిటర్స్ ఒక కథనాన్ని వెలువరించింది. భారత్–చైనాల మధ్య కొన్నేళ్లుగా నెలకొన్న ఉద్రిక్తతలు, నిఘా సంస్థలు సేకరించిన సమాచారం ఆధారంగా ఈ నివేదిక రూపొందించారు. ‘‘2013–14 తర్వాత రెండు మూడేళ్లకోసారి ఇరు దేశాల నడుమ ఉద్రిక్తతల తీవ్రత పెరుగుతున్నట్లు స్పష్టమవుతోంది. సరిహద్దులో ఇరు దేశాలు పోటాపోటీగా సైనిక బలగాలను పెంచుకుంటున్నాయి. చైనా చర్యల వల్ల తూర్పు లద్దాఖ్లో భారత్ ఇప్పటికే పలు కీలక గస్తీ పాయింట్లను కోల్పోయింది. చైనా దూకుడును అడ్డుకోవాలంటే సరిహద్దు ప్రాంతాల్లో అభివృద్ధిని వేగవంతం చేయాలి. సరిహద్దు పర్యాటకాన్ని ప్రోత్సహించాలి’’ అని సూచించారు. -
జనాభాలో చైనాను దాటేశాం
న్యూఢిల్లీ: మరో మూడు నెలల తర్వాత జరుగుతుందనుకున్నది కొన్నాళ్ల క్రితమే జరిగిపోయిందా? జనాభాలో మనం చైనాను దాటేశామా? ప్రపంచంలోకెల్లా అత్యంత ఎక్కువ జనాభా ఉన్న దేశంగా అవతరించామా!! అవుననే అంటోంది వరల్డ్ పాపులేషన్ రివ్యూ (డబ్ల్యూపీఆర్) నివేదిక. గతేడాది చివరి నాటికే భారత జనాభా చైనా కంటే కనీసం 50 లక్షలు ఎక్కువని చెబుతోంది. 2022 డిసెంబర్ 31 నాటికి తమ జనాభా 141.2 కోట్లని చైనా మంగళవారం అధికారికంగా ప్రకటించడం తెలిసిందే. అదే రోజున భారత్ జనాభా 141.7 కోట్లకు చేరిందని డబ్ల్యూపీఆర్ అంచనా వేసింది. తాజాగా బుధవారం నాటికి 142.3 కోట్లకు ఎగబాకిందని చెప్పుకొచ్చింది. మాక్రోట్రెండ్స్ అనే మరో సంస్థ అంచనాల ప్రకారం బుధవారం నాటికి భారత జనాభా 142.8 కోట్లు. మన జనాభాలో 50 శాతానికి పైగా 30 ఏళ్లో లోపు వయసువారే. కనుక దేశ జనాభా పెరుగుదల 2050 దాకా కొనసాగుతూనే ఉంటుందని భావిస్తున్నారు. 1961 తర్వాత తొలిసారిగా 2022లో తమ జనాభాలో తొలిసారిగా 8.5 లక్షల మేరకు తగ్గుదల నమోదైనట్టు చైనా మంగళవారం ప్రకటించడం తెలిసిందే. ఈ ధోరణి ఇలాగే కొనసాగి 2050 కల్లా ఆ దేశ జనాభా 131 కోట్లకు పరిమితం అవుతుందని అంచనా. ఆ సమయానికి భారత జనాభా 166 కోట్లకు పెరుగుతుందని భావిస్తున్నారు. పదేళ్లకోసారి జరిగే ఆనవాయితీ మేరకు మన దేశంలో 2020లో జరగాల్సిన జనాభా గణన కరోనా కారణంగా వాయిదా పడటం తెలిసిందే. దాంతో మన జనాభాపై అధికారికంగా తాజా గణాంకాలు అందుబాటులో లేవు. -
చైనాను భారత్ భర్తీ చేస్తుందా? ఆర్బీఐ మాజీ గవర్నర్ వ్యాఖ్యలు
దావోస్: ప్రపంచ ఆర్థిక వృద్ధిని ప్రభావితం చేసే విషయంలో చైనాను భారత్ భర్తీ చేస్తుందని భావించడం.. తొందరపాటే (ప్రీమెచ్యూర్) అవుతుందని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ మంగళవారం అన్నారు. భారత్ ఎకానమీ చాలా చిన్నదని పేర్కొంటూ, ప్రపంచ ఎకనామీని ప్రభావితం చేసే స్థాయి ఇప్పుడే దేశానికి లేదని పేర్కొన్నారు. అయితే, భారతదేశం ఇప్పటికే ప్రపంచంలో ఐదవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉన్నందున దేశ ఎకానమీ మరింత వృద్ధి చెందుతూ, పరిస్థితి (ప్రపంచ ఆర్థిక వృద్ధిని ప్రభావితం చేసే విషయంలో) మున్ముందు మారే అవకాశం ఉందని కూడా విశ్లేషించారు. 2023లో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మాంద్యాన్నే ఎదుర్కొనే అవకాశం ఉందంటూ ప్రపంచ ఆర్థిక వేదిక (డబ్ల్యూఈఎఫ్) విడుదల చేసిన ఒక నివేదిక సందర్భంగా రాజన్ విలేకరులతో మాట్లాడారు. చైనా ఆర్థిక వ్యవస్థలో ఏదైనా పునరుద్ధరణ జరిగితే, అది ఖచ్చితంగా ప్రపంచ వృద్ధి అవకాశాలను పెంచుతుందని అన్నారు. ఈ సమయంలో విధాన రూపకర్తలు కార్మిక మార్కెట్తో పాటు హౌసింగ్ మార్కెట్ పరిస్థితులపై కూడా దృష్టి సారిస్తున్నారని అన్నారు. అమెరికాను ప్రస్తావిస్తూ, అక్కడ గృహాల విక్రయాలు జరగడం లేదని, అయితే ధరలు కూడా తగ్గడం లేదని అన్నారు. ‘ఇదంతా అంధకారమా లేక వినాశనమా? బహుశా కాకపోవచ్చు. రష్యా అధ్యక్షుడు పుతిన్ యుద్ధాన్ని ముగించాలని నిర్ణయించుకుంటే, ఖచ్చితంగా పరిస్థితి అంతా మారిపోతుంది’’ అని రాజన్ పేర్కొన్నారు. ‘‘2023లో ఇంకా 12 నెలల సమయం ఉంది. రష్యా యుద్ధం నిలిచిపోయినా, చైనా పురోగతి సాధించినా ప్రపంచ ఎకానమీ మెరుగుపడుతుంది’’’ అని ఆయన విశ్లేషించారు. చైనా ఎకానమీ మార్చి, ఏప్రిల్ నుంచి రికవరీ సాధించే అవకాశం ఉందని కూడా రాజన్ అంచనా వేశారు. -
జన చైనాలో తగ్గిన జనాభా.. 1961 తర్వాత ఇదే తొలిసారి
బీజింగ్: జన చైనాలో జనాభా కాస్త తగ్గింది. అక్కడ జనాభా సంఖ్య తగ్గుముఖం పట్టడం 1961 ఏడాది తర్వాత ఇదే తొలిసారి! 2021 ఏడాది జనాభా లెక్కలతో పోలిస్తే 2022ఏడాదిలో జనాభా 8,50,000 తగ్గిందని నేషనల్ బ్యూరో ఆఫ్ స్టాటిస్టిక్స్ తాజాగా వెల్లడించింది. 2022 ఏడాదిలో చైనా జనాభా 141.18 కోట్లు అని నేషనల్ బ్యూరో లెక్క తేల్చింది. జననాల వృద్ధిరేటు తగ్గడమే ఇందుకు ప్రధాన కారణమని తెలుస్తోంది. ఇది ఇలాగే కొనసాగితే అంచనావేసిన దానికంటే ముందుగానే చైనాను దాటేసి భారత్ ప్రపంచంలోనే అత్యంత అధిక జనాభాగల దేశంగా అవతరించనుంది. చైనా ఆర్థిక వృద్ధి రేటు దాదాపు 3 శాతంగా నమోదైన ఈ తరుణంలో జనసంఖ్య సైతం వెనకడుగు వేస్తోంది. గత ఐదు దశాబ్దాల్లో చైనాలో ఇంతటి అత్యల్ప వృద్ధిరేటు నమోదవడం ఇది రెండోసారి. ఐక్యరాజ్యసమితి ఆర్థిక, సామాజిక, జనాభా విభాగం 2022 అంచనాల ప్రకారం ఈ ఏడాదిలోనే చైనాను భారత్ జనసంఖ్యలో అధిగమించనుంది. 2050కల్లా భారత్ 166.8 కోట్ల మందితో కిటకిటలాడనుంది. 131.7 కోట్లతో చైనా రెండోస్థానానికి పడిపోనుంది. ► 2022లో చైనాలో 95.6 లక్షల మంది జన్మించారు. 2021లో 1.062 కోట్ల మంది జన్మించారు. 2021లో 7.52 శాతమున్న జననాల రేటు 2022లో 6.77 శాతానికి పడిపోయింది. ► చైనాలో 72.20 కోట్ల మంది పురుషులు, 68.96 కోట్ల మంది స్త్రీలు ఉన్నారు. మున్న 16– 59 ఏళ్ల వయసు వారు 87.56 కోట్ల మంది ఉన్నారు. ► దేశ జనాభాలో సీనియర్ సిటిజన్లు 62 శాతం. ► 60 ఏళ్లు పైబడిన వృద్ధుల జనాభా 28 కోట్లు దాటింది. జనాభాలో వీరు 19.8 శాతం. ► ఒకప్పుడు వ్యవసాయ ఆధారిత దేశమైన చైనా ఇప్పుడు ప్రపంచ ఉత్పత్తుల కేంద్రంగా ఎదిగింది. దీంతో పరిశ్రమల్లో పనిచేసేందుకు జనం పట్టణాల బాటపట్టారు. దీంతో పట్టణాల్లో నివసిస్తున్న వారి సంఖ్య 92.07 కోట్లకు ఎగబాకింది. -
చైనాను భారత్ భర్తీ చేస్తుందనడం తొందరపాటే..
దావోస్: ప్రపంచ ఆర్థిక వృద్ధిని ప్రభావితం చేసే విషయంలో చైనాను భారత్ భర్తీ చేస్తుందని భావించడం.. తొందరపాటే (ప్రీమెచ్యూర్) అవుతుందని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ మంగళవారం అన్నారు. భారత్ ఎకానమీ చాలా చిన్నదని పేర్కొంటూ, ప్రపంచ ఎకనామీని ప్రభావితం చేసే స్థాయి ఇప్పుడే దేశానికి లేదని పేర్కొన్నారు. అయితే, భారతదేశం ఇప్పటికే ప్రపంచంలో ఐదవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉన్నందున దేశ ఎకానమీ మరింత వృద్ధి చెందుతూ, పరిస్థితి (ప్రపంచ ఆర్థిక వృద్ధిని ప్రభావితం చేసే విషయంలో) మున్ముందు మారే అవకాశం ఉందని కూడా విశ్లేషించారు. 2023లో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మాంద్యాన్నే ఎదుర్కొనే అవకాశం ఉందంటూ ప్రపంచ ఆర్థిక వేదిక (డబ్ల్యూఈఎఫ్) విడుదల చేసిన ఒక నివేదిక సందర్భంగా రాజన్ విలేకరులతో మాట్లాడారు. చైనా ఆర్థిక వ్యవస్థలో ఏదైనా పునరుద్ధరణ జరిగితే, అది ఖచ్చితంగా ప్రపంచ వృద్ధి అవకాశాలను పెంచుతుందని అన్నారు. ఈ సమయంలో విధాన రూపకర్తలు కార్మిక మార్కెట్తో పాటు హౌసింగ్ మార్కెట్ పరిస్థితులపై కూడా దృష్టి సారిస్తున్నారని అన్నారు. అమెరికాను ప్రస్తావిస్తూ, అక్కడ గృహాల విక్రయాలు జరగడం లేదని, అయితే ధరలు కూడా తగ్గడం లేదని అన్నారు. ‘ఇదంతా అంధకారమా లేక వినాశనమా? బహుశా కాకపోవచ్చు. రష్యా అధ్యక్షుడు పుతిన్ యుద్ధాన్ని ముగించాలని నిర్ణయించుకుంటే, ఖచ్చితంగా పరిస్థితి అంతా మారిపోతుంది’’ అని రాజన్ పేర్కొన్నారు. ‘‘2023లో ఇంకా 12 నెలల సమయం ఉంది. రష్యా యుద్ధం నిలిచిపోయినా, చైనా పురోగతి సాధించినా ప్రపంచ ఎకానమీ మెరుగుపడుతుంది’’’ అని ఆయన విశ్లేషించారు. చైనా ఎకానమీ మార్చి, ఏప్రిల్ నుంచి రికవరీ సాధించే అవకాశం ఉందని కూడా రాజన్ అంచనా వేశారు. -
వైరల్ వీడియో: రోడ్డుపై వెళ్తున్న పాదచారులపై దూసుకెళ్లిన లగ్జరీ కారు
-
ఎడిటర్ కామెంట్: అనగనగా ఒక చైనా కథ..!
-
యాపిల్ ఐఫోన్ 14.. ఇక కష్టమే..
-
వెనక్కి తగ్గేదేలే! రాజీపడం అంటున్న తైవాన్.... చైనాకి స్ట్రాంగ్ వార్నింగ్
తైపీ: బీజింగ్లో ఐదేళ్లకు ఒకసారి జరిగే కమ్యూనిస్ట్ పార్టీ కాంగ్రెస్ ప్రారంభోత్సవంలో చైనా అధ్యక్షుడు జిన్పింగ్ తైవాన్పై బలప్రయోగాన్ని ఎప్పటికి వదులుకోమని కరాఖండిగా చెప్పారు. అలాగే హాంకాంగ్పై పట్టు సాధించి నియంత్రణలోకి తెచ్చుకున్నామని తర్వాత తైవానే అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలపై తైవాన్ తీవ్రంగా ప్రతిస్పందించింది. తన సార్వభౌమాధికారం, స్వేచ్ఛపై రాజీపడేదే లేదని, వెనక్కి తగ్గమని తెగేసీ చెప్పింది తైవాన్. ఈ మేరకు తైవాన్ అధ్యక్ష కార్యాలయం ఒక ప్రకటనను కూడా విడుదల చేసింది. ఇరు దేశాల మధ్య శాంతి స్థిరత్వాన్ని కాపాడుకోవటం ఇరుపక్షాల భాద్యత అని నొక్కిచెప్పింది. యుద్ధం ఒక్కటే ఆప్షన్ కాదని తేల్చి చెప్పింది. తైవాన్లో సుమారు 23 మిలియన్ల మంది ప్రజలు ఉన్నారని, వారికి తమ భవిష్యత్తును నిర్ణయించుకునే హక్కు ఉందని స్పష్టం చేసింది. అలాగే తాము బీజింగ్ ఏకపక్ష నిర్ణయాన్ని ఎట్టిపరిస్థితుల్లో అంగీకరించమని తెగేసి చెప్పింది. వాస్తవానికి 2016లో ప్రెసిడెంట్ త్సాయ్ ఇంగ్-వెన్ తొలిసారిగా ఎన్నికైనప్పటి నుంచి చైనాతో ఉన్న సంబంధాలను కట్టడి చేసింది. రాజీకీయాలతో దిగ్బంధం చేసి సైనిక బలగాలతో బలవంతంగా అధీనంలోకి తెచ్చుకోవాలనే కుట్రలను విడిచిపెట్టాలని చైనీస్ కమ్యూనిస్ట్ అధికారులకు పిలుపినిచ్చింది తైవాన్. మరోవైపు చైనా అధ్యక్షుడు జిన్పింగ్ తైవాన్ విషయంలో విదేశీ శక్తులు జోక్యం చేసుకుంటున్నాయని, తైవాన్ని స్వతంత్ర దేశంలా ఉంచే క్రమంలో ఇరు దేశాల మధ్య యుద్ధ వాతావరణాన్ని నెలకొల్పుతున్నారంటూ ఆరోపణలు చేశారు. పైగా శాంతియుత పునరేకీకరణ కోసం ప్రయత్నిస్తాం కానీ యుద్ధం చేయమని హామీ ఇవ్వం అని చెప్పారు. (చదవండి: హాంకాంగ్పై నియంత్రణ సాధించాం.. తర్వాత తైవానే.. జిన్పింగ్ కీలక ప్రకటన) -
World TT Championship: ప్రిక్వార్టర్ ఫైనల్లో భారత్
చెంగ్డూ (చైనా): ప్రపంచ టేబుల్ టెన్నిస్ (టీటీ) టీమ్ చాంపియన్షిప్లో భారత పురుషుల జట్టు కూడా ప్రిక్వార్టర్ ఫైనల్కు అర్హత సాధించింది. మంగళవారం జరిగిన గ్రూప్–2 చివరి లీగ్ మ్యాచ్లో భారత్ 0–3తో ఫ్రాన్స్ చేతిలో ఓడిపోయింది. తొలి మ్యాచ్లో మానవ్ ఠక్కర్ 6–11, 8–11, 8–11తో అలెక్సిస్ చేతిలో... రెండో మ్యాచ్లో సత్యన్ 4–11, 2–11, 6–11తో ఫెలిక్స్ లెబ్రున్ చేతిలో... మూడో మ్యాచ్లో హర్మీత్ దేశాయ్ 13–11, 11–13, 11–7, 8–11, 7–11తో జులెస్ రొలాండ్ చేతిలో ఓడిపోయారు. లీగ్ మ్యాచ్లు పూర్తయ్యాక జర్మనీ, ఫ్రాన్స్, భారత్ ఏడు పాయింట్లతో సమఉజ్జీగా నిలిచాయి. టోర్నీ నిబంధనల ప్రకారం మొత్తం ఏడు గ్రూప్ల నుంచి తొలి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు నేరుగా ప్రిక్వార్టర్ ఫైనల్ చేరుకుంటాయి. ఆ తర్వాత మూడో స్థానంలో నిలిచిన రెండు అత్యుత్తమ జట్లకు మిగతా రెండు బెర్త్లు లభిస్తాయి. ముఖాముఖి ఫలితాల ఆధారంగా గ్రూప్– 2 నుంచి జర్మనీ, ఫ్రాన్స్ నేరుగా ప్రిక్వార్టర్ ఫైనల్కు అర్హత పొందాయి. మూడో స్థానంలో నిలిచిన రెండు అత్యుత్తమ జట్లలో ఒకటిగా భారత్ కూడా ప్రిక్వార్టర్ ఫైనల్ చేరింది. నేడు జరిగే ప్రిక్వార్టర్ ఫైనల్స్లో చైనాతో భారత పురుషుల జట్టు... చైనీస్ తైపీతో భారత మహిళల జట్టు తలపడతాయి. చదవండి: IND vs SA: శబాష్ దీపక్ చాహర్.. రనౌట్ చేసే అవకాశం ఉన్నప్పటికీ..! -
చైనా మిలటరీ చేతుల్లోకి వెళ్లిందా...?
-
చైనాలో ఏమి జరుగుతోంది ..?
-
ఎన్నాళ్ళీ.. నిరీక్షణ..! ఎలక్ట్రిక్ వెహికల్స్ తయారీలో షావోమీకి భంగపాటు!
చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ షావోమీ ఆటోమొబైల్ రంగంలోకి అడుగు పెట్టిన విషయం తెలిసిందే. 2024కల్లా మార్కెట్లో తన తొలి ఎలక్ట్రిక్ కారును విడుదల చేయాలని ప్రయత్నాల్ని ముమ్మరం చేసింది. కానీ ఈ ప్రయత్నాలు బెడిసి కొడుతున్నాయి. కార్ల తయారీ కోసం డ్రాగన్ కంట్రీ పర్మీషన్లు ఇవ్వడంలో జాప్యం చేస్తుందని సమాచారం. బిజింగ్ కేంద్రంగా షావోమీ ఎలక్ట్రిక్ కార్ల తయారీ సంస్థ ఏర్పాటు కోసం స్థలం చూసుకుంది. కానీ ఆ సంస్థ ఏర్పాటు కోసం కావాల్సిన అనుమతుల్ని నేషనల్ డెవలప్మెంట్ అండ్ రిప్మార్ కమిషన్ అధికారులు ఇచ్చేందుకు సుముఖంగా లేరని, నెలల తరబడి సంబంధిత శాఖ అధికారుల్ని సంప్రదించినా పట్టించుకోవడం లేదని పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. షావోమీకి కష్టమే వెలుగులోకి వచ్చిన నివేదికల ప్రకారం.. షావోమీ తన ప్రత్యర్ధులతో పోటీ పడుతూ ఈవీ మార్కెట్లోకి అడుగుపెట్టింది. ఆటోమొబైల్ మార్కెట్లో వినియోగదారులకు కావాల్సిన ఈవీ వెహికల్స్ను అదించాలని, అతిపెద్ద ఈవీ మార్కెట్గా అవతరిస్తుందని ఆశించాం. కానీ లైసెన్స్ పొందడంలో ఆలస్యం అవుతుందని.. ఇలాగే కొనసాగితే షావోమీ ప్రత్యర్ధులు మార్కెట్లో రాణిస్తారని ఆ సంస్థ సీఈవో లీ జున్ అభిప్రాయం వ్యక్తం చేశారు. -
సంచలనం: ప్రపంచంలోనే తొలి 200 మెగాపిక్సెల్ స్మార్ట్ ఫోన్..ధర ఎంతంటే!
అమెరికా స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ మోటరోలా ప్రపంచంలో తొలిసారి 200ఎంపీ మెగా ఫిక్సెల్ కెమెరాతో స్మార్ట్ ఫోన్ను విడుదల చేయనుంది. మోటో ఎక్స్ 30 ప్రో పేరుతో ఈ ఫోన్ ఆగస్ట్ 2న చైనాలో విడుదల కానుంది. చైనా మీడియా కథనాల ప్రకారం..మోటో ఎక్స్ 30 ప్రోలో స్నాప్డ్రాగన్ 8 ప్లస్ జనరేషన్ 1 ప్రాసెసర్, 125 డబ్ల్యూ జెన్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్, ఆండ్రాయిడ్ 12 సపోర్ట్ 12జీబీ ర్యామ్ సౌకర్యం ఉందని పేర్కొన్నాయి.ఇక ఈ ఫోన్లో డ్రమెటిక్ బ్యాగ్ గ్రౌండ్ ఇమేజెస్ తీసుకునేందుకు 85 ఎంఎం, 50 ఎంఎం, 35 ఎంఎం లెన్స్ ఫోకల్ లెగ్త్ సెన్సార్లు ఉన్నాయి. దీంతో పాటు క్లోజప్, పోట్రేట్ షాట్స్, 50 ఎంఎం లెన్స్తో స్టాండర్డ్ వ్యూయింగ్ యాంగిల్ ఫోటోలు తీసుకోవచ్చు. 35 ఎంఎం లెన్స్ తో క్లోసెస్ట్ వ్యూయింగ్ యాంగిల్లో సైతం ఫోటోల్ని ఫోన్లో క్యాప్చర్ చేయొచ్చు. మోటో ఎక్స్ 30 ప్రో స్పెసిఫికేషన్లు వెలుగులోకి వచ్చిన నివేదికల ప్రకారం..మోటో ఎక్స్ 30 ప్రో స్మార్ట్ఫోన్లో 5,000ఎంఏహెచ్ బ్యాటరీ, ఎక్స్ 30 ప్రో హెచ్డీప్లస్ రిజల్యూషన్తో 6.67-అంగుళాల ఓఎల్ఈడీ డిస్ప్లే, 144 హెచ్జెడ్ రిఫ్రెష్ రేట్, 8జీబీ ర్యామ్ ప్లస్ 128జీబీ స్టోరేజ్, 12జీబీ ర్యామ్ ప్లస్ 256జీబీ స్టోరేజ్ వేరియంట్లలో లభ్యం కానుంది. 12 జీబీ ర్యామ్ 256 జీబీ స్టోరేజీ మోడల్ ధర సుమారు రూ.59,990 ఉంటుందని టెక్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. -
రాహుల్ గాంధీ వ్యాఖ్యలను సమర్థించడం లేదు: అమెరికా
వాషింగ్టన్/న్యూఢిల్లీ: భారత్లో ఎన్డీయే ప్రభుత్వ విదేశాంగ విధానాలు, నిర్ణయాలపై కాంగ్రెస్ పార్టీ నేత రాహుల్ గాంధీ చేసిన తాజా వ్యాఖ్యలను తాము సమర్థించబోమని అమెరికా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి నెడ్ ప్రైస్ అన్నారు. ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాల కారణంగానే భారత్కు వ్యతిరేకంగా పాకిస్తాన్–చైనా ఒక్కటయ్యాయంటూ రాహుల్ గాంధీ లోక్సభలో ఆరోపణలు గుప్పించిన సంగతి తెలిసిందే. పాక్–చైనా బంధంపై మాట్లాడే విషయాన్ని ఆయా దేశాల ప్రజలకే వదిలేద్దామని నెడ్ ప్రైస్ పేర్కొన్నారు. అమెరికా, చైనాలలో స్నేహం కోసం దేన్ని ఎంచుకోవాలన్నది ప్రపంచ దేశాల ఇష్టమని చెప్పారు. దేశానికి రాజా అనుకుంటున్నారు... లోక్సభలో రాహుల్ గాంధీ చేసిన ప్రసంగంపై అధికార బీజేపీ మాటల దాడి కొనసాగిస్తోంది. ఆయన భారతదేశానికి ఇన్నాళ్లూ యువరాజులాగా ప్రవర్తిం చేవారని, తప్పుడు రాజును అనుకుంటున్నారని కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు గురువారం ఎద్దేవా చేశా రు. జమ్మూకశ్మీర్లో ఉగ్రవాదులను అణచివేయడం, ఆర్టికల్ 370ని రద్దు చేయడం రాహుల్ గాంధీ దృష్టిలో తప్పేనా? అని బీజేపీ అధికార ప్రతినిధి, బిహార్ మంత్రి షానవాజ్ హుస్సేన్ నిలదీశారు. నిజాలే మాట్లాడారన్న కాంగ్రెస్ రెండు భారతదేశాలు అంటూ పార్లమెంట్లో ప్రసంగించిన రాహుల్ గాంధీని పలువురు కాంగ్రెస్ పార్టీ నేతలు సమర్థించారు. దేశానికి రెండు ముఖాలు ఉన్నాయని, ఒకటి ధనికం కాగా, మరొకటి నిరుపేద అని సీనియర్ నేత మల్లికార్జున ఖర్గే అన్నారు. రెండింటి మధ్య అంతరాన్ని పూడ్చడానికి ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని మాత్రమే రాహుల్ విమర్శించారని గుర్తుచేశారు. ప్రభుత్వ తప్పిదాలను బయటపెట్టాల్సిన బాధ్యత ప్రతిపక్షంపై ఉందని పేర్కొన్నారు. రాహుల్ నిజాలే మాట్లాడారని కాంగ్రెస్ అధికార ప్రతినిధి సుప్రియా శ్రీనాథే స్పష్టం చేశారు. ఇదిలా ఉండగా, రాహుల్ వ్యాఖ్యలను విదేశాంగ శాఖ మాజీ మంత్రి నట్వర్ సింగ్ ఖండించారు. సభా హక్కుల నోటీసు పార్లమెంట్ సభ్యులను, దేశ ప్రజలను రెచ్చగొట్టేలా మాట్లాడారని ఆరోపిస్తూ బీజేపీ ఎంపీ నిశికాంత్ దూబే కాంగ్రెస్ నేత రాహుల్ గాం ధీకి వ్యతిరేకంగా సభా హక్కుల ఉల్లంఘన నోటీసును లోక్సభ సెక్రటేరియట్కు అందజేశారు. భావాలను, అభిప్రాయాలను స్వేచ్ఛ వెల్లడించే రాజ్యాంగబద్ధ హక్కు ప్రతి ఎంపీకి ఉన్నప్పటికీ ఈ విషయంలో మర్యాద పాటించాలని దూబే పేర్కొన్నారు. పార్లమెంట్ ప్రతిష్టను దిగజార్చేలా మాట్లాడడం సరైంది కాదన్నారు. కేంద్రం, రాష్ట్రాలకు సంబంధించి రాహుల్ చేసి న వ్యాఖ్యలను ఆయన తప్పుపట్టారు. భారత్ను రాహుల్ ఒక దేశంగా పరిగణించకపోవడం బా ధాకరమని, రాహుల్ అసలు రాజ్యాంగ ప్రవేశికను చదివారా? అని ప్రశ్నించారు. ఆయన ప్రసంగంలోని కొన్ని భాగాలను తొలగించాలన్నారు.
Pagination
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
కోనసీమ: ఉడుమూడిలో ఘోర రోడ్డు ప్రమాదం
త్రినయని సీరియల్ నటి కన్నుమూత.. తిరిగి వచ్చేయంటూ భర్త ఎమోషనల్ (ఫోటోలు)
స్టార్ హీరో గొప్పమనసు.. రూ. కోటి చెక్ విరాళం!
ఎరక్కపోయి ఇరుక్కుపోయి
మోదీకి సొంత ఇళ్లు, కారు కూడా లేదట!.. ప్రధాని ఆస్తులివే..
కేఎల్ రాహుల్ మాస్టర్ ప్లాన్.. మెక్ గర్క్ సిల్వర్ డక్! వీడియో
Virat Kohli: ఆర్సీబీ కెప్టెన్గా మళ్లీ కోహ్లినే!
రామ్- పూరి కాంబో.. డబుల్ మాస్ అప్డేట్ వచ్చేసింది!
స్వాతి మలివాల్పై దాడి నిజమే.. అంగీకరించిన ఆప్ ఎంపీ సంజయ్ సింగ్
'ఆ రూలే ఐపీఎల్ను మార్చేసింది.. వారు పునరాలోచనలో పడ్డారు'
తప్పక చదవండి
- తెలంగాణ లోక్సభ ఎన్నికల ఫైనల్ పోలింగ్ 65.67 శాతం
- మోదీకి సొంత ఇళ్లు, కారు కూడా లేదట!.. ప్రధాని ఆస్తులివే..
- మాజీ భర్త గే అన్న సుచిత్ర.. స్పందించిన నటుడు
- Royal Challengers Bengaluru: తిరుమల శ్రీవారి సేవలో ఆర్సీబీ క్రికెటర్లు (ఫొటోలు)
- MS Dhoni: అందుకే వాళ్లంటే నాకు, జడ్డూకు చిరాకు!
- ప్రోటీన్ సప్లిమెంట్లను వాడుతున్నారా? హెచ్చరిస్తున్న మెడికల్ రీసెర్చ్
- స్వాతిమలివాల్పై దాడి.. ఆందోళనకు దిగిన బీజేపీ కార్పొరేటర్లు
- ఢిల్లి లిక్కర్ కేసులో కవిత జ్యుడీషియల్ రిమాండ్ పొడిగింపు
- Tandur: పసికందు ప్రాణం తీసిన పెంపుడు కుక్క
- టీడీపీ కార్యకర్తల్లా పోలీసులు: అనిల్కుమార్ ఆగ్రహం
Advertisement