మహిళ సాయంతో దుండగుడి చోరీ

Thieves Arrested In Nizamabad - Sakshi

సాక్షి, నిజామాబాద్‌: కొన్ని రోజుల క్రితం జిల్లా కేంద్రంలోని ఐదో టౌన్‌ పరిధిలో లలితానగర్‌లో చోరీ చేసిన దుండగులను అరెస్టు చేసినట్లు ఏసీపీ శ్రీనివాస్‌కుమార్‌ తెలిపారు. శనివారం ఐదో టౌన్‌లో విలేకరులతో ఆయన మాట్లాడారు. లలితానగర్‌లో తాళం వేసిన ఇంట్లో అర్ధరాత్రి, మహిళతోపాటు ఓ దుండగుడు చోరీ చేశారు. ఇంట్లో ఉన్న రెండు గ్రాముల బంగారంతో పాటు కారును ఎత్తుకెళ్లారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని విచారించారన్నారు. గత శుక్రవారం ఆర్‌ఆర్‌ చౌరస్తాలో వాహనాలు తనిఖీలు చేస్తుండగా అనుమానం వచ్చిన వారిని పట్టుకున్నామని, అందులో పందిరి స్వామి అనే దుండగుడు కూడా ఉన్నాడని ఏసీపీ తెలిపారు. అతను, అతనికి సాయంగా ఉన్న మహిళ గతంలో అనేక చోరీల కేసుల్లో నిందితులని తెలిపారు. ల్యాప్‌టాప్‌లు, రెండు యాక్టివాలు, 10 తులల బంగారం స్వాధీనం చేసుకున్నామన్నారు. వారిని అరెస్టు చేసినట్లు ఏసీపీ తెలిపారు. సమావేశంలో సీఐ శ్రీనాథ్‌రెడ్డి, రూరల్, నాలుగో టౌన్‌ పోలీసులు ఉన్నారు.   

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top