20 ఏళ్లుగా మగ్గుతున్న వందమంది
కమిటీ సిఫార్సుల మాటేమిటి?
చెన్నై, సాక్షి ప్రతినిధి: రాజీవ్గాంధీ హత్యకేసులో ఉరిశిక్ష ఖైదీల క్షమాభిక్ష, విడుదల పుణ్యమా అని జైళ్లలోని ఖైదీల స్థితిగతుల వ్యవహారం చర్చనీయాంశమైంది. ఆ ఏడుగురి విడుదలపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య పోరుసాగుతుండగా, తమ సంగతేంటని 20 ఏళ్లుగా జైళ్లలో మగ్గుతున్న జీవితఖైదీలు ప్రశ్నిస్తున్నారు. రాజీవ్ హత్యకేసులో ఉరిశిక్ష ఖైదీలుగా శిక్షను అనుభవిస్తున్న పేరరివాళన్, శాంతన్, మురుగన్లకు సుప్రీం కోర్టు క్షమాభిక్ష ప్రసాదిస్తూ జీవితఖైదీలుగా మార్చిన సంగతి అందరికీ తెలిసినదే. ఈ ముగ్గురిని జైలు నుంచి విడుదల చేసే అధికారాన్ని కొన్ని చిన్నపాటి షరతులతో సుప్రీం కోర్టు రాష్ట్ర ప్రభుత్వానికి అప్పగించింది. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్న సీఎం జయలలిత పై ముగ్గురితోపాటూ ఆ కేసులో శిక్షను అనుభవిస్తున్న మరో నలుగురిని కలుపుకుని మొత్తం ఏడుగురిని విడుదల చేయాలని నిర్ణయించినట్లు ప్రకటించారు. అయితే ఇందుకు ఆగ్రహం వ్యక్తం చేసిన కేంద్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేస్తూ సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వ క్షమాభిక్షకు నోచుకున్న ఏడుగురి విడుదల ప్రశ్నార్థకమైంది. ఏడుగురు ఖైదీల విడుదలకు కేంద్రం అడ్డుకోవడం రాష్ట్రంలో ఆగ్రహాన్ని రగిల్చింది. కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఆందోళనలు జరుగుతూనే ఉన్నాయి.
4 వేల మంది జీవితఖైదీలు: రాష్ట్రంలో నాలుగువేల మంది జీవిత ఖైదీలు వివిధ జైళ్లలో ఉన్నారు. వీరిలో సుమారు వందమంది 20 ఏళ్లకు పైగా శిక్షను అనుభవిస్తున్నారు. జీవితఖైదీకి గురైన వ్యక్తి జైలులో సత్ప్రవర్తన కలిగి ఉన్నట్లయితే, సెలవులు ఇతర దినాలను కలుపుకుని పదేళ్లకే విడుదలయ్యే అవకాశం ఉంది. అదే ఉరిశిక్ష ఖైదీ యావజ్జీవ ఖైదీగా మారిన పక్షంలో అతని ప్రవర్తనను బట్టీ 14 ఏళ్ల తరువాత విడుదలయ్యే వెసులుబాటు ఉంది. జైలు జీవితంలో ఎటువంటి తప్పిదాలకు పాల్పడినా, ఆరోపణలకు గురైనా చట్టపరంగా పొందే రాయితీలన్నీ అమల్లోకి రావు. ఖైదీల ప్రవర్తనను విశ్లేషించి నిర్ణయం తీసుకునేందుకు రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి, జైలు సూపరింటెండెంట్, ఇద్దరు సంఘ సంస్కర్తలతో ఒక కమిటీ పనిచేస్తుంది.
ఖైదీల ప్రవర్తనపై ఒక నివేదికను తయారుచేసి విడుదలకు అర్హులైన ఖైదీల పేర్లను రాష్ట్ర ప్రభుత్వానికి పంపుతారు. ఈ నివేదికను ఆధారం చేసుకుని ప్రభుత్వం తన నిర్ణయాన్ని అమలుచేస్తుంది. ఈ లెక్కన రాష్ట్రం మొత్తం మీద వివిధ జైళ్లలో నాలుగు వేల మంది జీవితఖైదీలు ఉన్నారు. వీరిలో వందమంది ఖైదీలు 20 ఏళ్ల శిక్షాకాలాన్ని దాటివేశారు. రాజీవ్హత్యకేసులోని ఏడుగురి కోసం రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేపట్టడం తమ సంతోషకరమే, అయితే నడవడిక ప్రకారం విడుదల కావాల్సిన తమ మాటేమిటని వారు పోతున్నారు. సత్ప్రవర్తనా కమిటీ సమావేశమై అర్హులకు జైలు జీవితం నుంచి విముక్తి ప్రసాదించాలని వేడుకుంటున్నారు.
జైళ్లలో జీవిత ఖైదీలు
Published Mon, Mar 3 2014 11:21 PM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
చాహల్ అరుదైన రికార్డు.. టీ20 క్రికెట్ చరిత్రలోనే
టీ20 వరల్డ్కప్కు ఐర్లాండ్ జట్టు ప్రకటన.. కెప్టెన్ ఎవరంటే?
మరో కుటుంబాన్ని ఆదుకున్న స్టార్ హీరో.. వీడియో వైరల్!
ఢిల్లీ బ్యాటర్లు ఊచ కోత.. రాజస్తాన్ ముందు భారీ టార్గెట్
రాజ్యాంగానికి కట్టుబడి ఉన్నాము: కాంగ్రెస్ నేత పవన్ ఖేరా
బాహుబలి కేవలం 10 కోట్ల మంది మాత్రమే: రాజమౌళి కామెంట్స్
బీజేడీ కంచుకోటను బద్దలు కొట్టేలా.. బీజేపీ ఎన్నికల ప్రచారం
తెలంగాణను అసమర్థులు ఏలుతున్నారు: కేసీఆర్
క్యాస్టింగ్ కౌచ్పై రమ్యకృష్ణ కామెంట్స్.. కొన్నిసార్లు తప్పదంటూ!
‘ప్రజ్వల్ రేవణ్ణ’ వీడియోల వెనుక కుట్ర: హెచ్డి కుమారస్వామి
తప్పక చదవండి
- బీజేడీ కంచుకోటను బద్దలు కొట్టేలా.. బీజేపీ ఎన్నికల ప్రచారం
- క్యాస్టింగ్ కౌచ్పై రమ్యకృష్ణ కామెంట్స్.. కొన్నిసార్లు తప్పదంటూ!
- ‘ప్రజ్వల్ రేవణ్ణ’ వీడియోల వెనుక కుట్ర: హెచ్డి కుమారస్వామి
- 25 వేల మంది టీచర్ల నియామకం రద్దుపై సుప్రీం స్టే
- యువీ, ధావన్ కాదు!.. నాకిష్టమైన ప్లేయర్లు వాళ్లే!
- ‘నేను దేశాన్ని విడిచి వెళ్లాలా?’.. బెంగళూరుపై ఆంత్రప్రెన్యూర్ అసహనం
- అమోథీ.. రాహుల్, ప్రియాంకల సంపద
- అదిరిపోయిన అందాలు.. తృప్తి అలా ఆయేషా ఇలా!
- ఓటుకు నోటు..అజిత్ పవార్ వర్గంపై నాన్ కాగ్నిజబుల్ కేసు నమోదు
- T20 WC: బుమ్రాకు విశ్రాంతి?.. పొలార్డ్ కీలక వ్యాఖ్యలు
Advertisement