పాక్ జర్నలిస్ట్‌తో సీఎం సెల్ఫీ.. పెను దుమారం! | Sakshi
Sakshi News home page

పాక్ జర్నలిస్ట్‌తో సీఎం సెల్ఫీ.. పెను దుమారం!

Published Mon, Oct 23 2017 5:18 PM

Punjab CM selfie with pakistan journalist viral - Sakshi

చంఢీగఢ్‌ : పాకిస్తానీ జర్నలిస్ట్ అరూసా అలామ్‌తో పంజాబ్ ముఖ్యమంత్రి, కెప్టెన్ అమరీందర్ సింగ్ తీసుకున్న సెల్ఫీ పెను దుమారం రేపింది. సీఎం తీసుకున్న తొలిసెల్ఫీ సూపర్ అంటూ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. అరూసాతో సీఎం సంబంధం మరోసారి బయటపడిందంటూ ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి.

పాక్ జర్నలిస్ట్ అరూసా, పంజాబ్ సీఎం అమరీందర్ స్నేహితులన్న విషయం తెలిసిందే. ఇటీవల వీరు రేంజ్ రోవర్ కారులో వెళ్తుండగా వెనుక సీట్లో కూర్చున్న అరూసాతో అమరీందర్ సెల్ఫీ తీసుకున్నారు. ఈ క్రమంలో వీరి సెల్ఫీ సోషల్ మీడియాలో వైరల్ అయింది. అరూసాతో అమరీందర్‌కు వ్యక్తిగత సంబంధం ఉందని, సీఎం ఆమెను వివాహం చేసుకోనున్నారని గతంలో ఎన్నో వదంతులు వ్యాపించాయి. తాజా సెల్ఫీతో వారి బంధం మరోసారి వెలుగుచూసిందంటూ మరోసారి ప్రతిపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి.

వీరి రిలేషన్ పై విమర్శలు వెల్లువెత్తగా.. 2007 డిసెంబర్ 26న చంఢీగఢ్‌లో జరిగిన ఓ ప్రెస్ కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న సందర్భంగా వదంతులకు ఫుల్ స్టాప్ పెట్టారు జర్నలిస్ట్ అరూసా. 'అమరీందర్, నేను స్నేహితులం మాత్రమే. మా మధ్య ప్రేమ లాంటి బంధం లేదు. మా స్నేహం ఇలాగే కొనసాగుతుందంటూ' అరూసా కుండబద్ధలుకొట్టారు. అమరీందర్ పంజాబ్ సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన కార్యక్రమానికి ఆమె ప్రత్యేక అతిథిగా విచ్చేశారు. అమరీందర్ పుస్తకావిష్కరణ సందర్భంగా ఆమె ఓసారి ఢిల్లీకి వచ్చారు. గత మే 18న అరూసా పుట్టినరోజు వేడుకలను సీఎం అమరీందర్ తన కేబినెట్‌లోని కొందరు సన్నిహితులతో కలిసి హిమాచల్ ప్రదేశ్‌లో నిర్వహించచడం పెను దుమారం రేపిన విషయం తెలిసిందే.

1/3

2/3

3/3

Advertisement
Advertisement