కేజీబీవీలను ఆదర్శంగా తీర్చిదిద్దాలి | kgbv meeting | Sakshi
Sakshi News home page

కేజీబీవీలను ఆదర్శంగా తీర్చిదిద్దాలి

Sep 25 2016 1:07 AM | Updated on Sep 4 2017 2:48 PM

కేజీబీవీలను ఆదర్శంగా తీర్చిదిద్దాలి

కేజీబీవీలను ఆదర్శంగా తీర్చిదిద్దాలి

నెల్లూరు(స్టోన్‌హౌస్‌పేట):కస్తూర్బా గాంధీ విద్యాలయాలను దేశంలోనే ప్రథమ స్థానంలో నిలిపేం దుకు కృషి చేయాలని సర్వశిక్షా అభియాన్‌ రాష్ట్ర పథక సంచాలకులు జీ శ్రీనివాసులు పిలుపునిచ్చారు.

 
  • ఎస్‌ఎస్‌ఏ రాష్ట్ర పథక సంచాలకులు జీ శ్రీనివాసులు
నెల్లూరు(స్టోన్‌హౌస్‌పేట):కస్తూర్బా గాంధీ విద్యాలయాలను దేశంలోనే ప్రథమ స్థానంలో నిలిపేం దుకు కృషి చేయాలని సర్వశిక్షా అభియాన్‌ రాష్ట్ర పథక సంచాలకులు జీ శ్రీనివాసులు పిలుపునిచ్చారు. దర్గామిట్టలోని జెడ్పీ సమావేశ మందిరంలో గుంటూరు, నెల్లూరు, చిత్తూరు, వైఎస్సార్‌ జిల్లాల్లోని కేజీబీవీల ప్రత్యేకాధికారులు, సీఆర్టీలు, పీఈటీలు, ఏఎంఎంలతో ప్రాంతీయ సమావేశాన్ని శనివారం నిర్వహించారు. మెరుగైన విద్యాబోధన, మౌలిక వసతుల కల్పనపై దృష్టి సారించాలన్నారు. ఆంగ్ల మా«థ్యమ బోధనను మెరుగుపరిచేందుకు సీఆర్టీలకు యూనెస్కో ఆధ్వర్యంలో శిక్షణ అందిస్తున్నట్లు తెలిపారు. విద్యార్థినులు క్రీడల్లో రాణించేలా శిక్షణ ఇవ్వాలని సూచించారు. కేజీబీవీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి ఎంఎల్‌ కుమార్, పీఓలు రమేష్‌‡, వెంకటసుబ్బయ్య, లక్ష్మి, డీఈఓ రామలింగం  పాల్గొన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement