బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం, ఉపరితల ఆవర్తన ద్రోణి కారణంగా తూర్పు గోదావరి జిల్లాలో ఒక మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది. కోనసీమ, ఏజెన్సీతోపాటు మెట్ట ప్రాంతంలో సైతం వర్షం కురుస్తోంది. గడచిన మూడు రోజులుగా జిల్లాలో నిరంతరాయంగా జల్లులు పడుతూనే ఉన్నాయి.
మంగళవారం సాయంత్రం వరకూ జోరుగా వర్షం కురుసింది. మంగళవారం ఉదయం వరకూ జిల్లాలో సగటున 12.3 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఏజెన్సీలో వాగులు పొంగి పొర్లుతున్నాయి. దీంతో పలు గ్రామాల్లో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. జోరుగా కురుస్తున్న వర్షంతో జిల్లాలో జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. కొన్నిచోట్ల ఒక మోస్తరు నుంచి భారీ వర్షం కురవడం, కొన్నిచోట్ల జల్లులు పడుతూనే ఉండడంతో రహదారులు నిర్మానుష్యంగా మారాయి. రాజమహేంద్రవరం, కాకినాడ నగరాల్లో మురుగునీరు రోడ్ల మీదకు చేరడంతో జనం ఇబ్బందులు పడ్డారు. ఎగువ ప్రాంతాల్లో వర్షాలు కురవడంతో శబరినదిలో వరద ఉధృతి పెరుగుతోంది. మెట్ట ప్రాంతంలో చెరువులకు జలకళ వచ్చింది. వర్షాలతో ఏజెన్సీ, మెట్ట ప్రాంతాల్లో ఖరీఫ్ సాగుకు రైతులు సన్నాహాలు చేస్తున్నారు.
‘తూర్పు’న జోరుగా వర్షం
Published Tue, Jun 28 2016 7:55 PM
Advertisement
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
తప్పక చదవండి
- కొత్త గణేశునిపాడులో బీభత్సకాండ
- 13 సీట్లు మాకే!
- 10 పక్కా.. 12 వచ్చినా ఆశ్చర్యపోవద్దు!
- చంద్రగిరిలో టీడీపీ దౌర్జన్యకాండ
- తెలంగాణ లోక్సభ ఎన్నికల ఫైనల్ పోలింగ్ 65.67 శాతం
- మోదీకి సొంత ఇళ్లు, కారు కూడా లేదట!.. ప్రధాని ఆస్తులివే..
- మాజీ భర్త గే అన్న సుచిత్ర.. స్పందించిన నటుడు
- MS Dhoni: అందుకే వాళ్లంటే నాకు, జడ్డూకు చిరాకు!
- స్వాతిమలివాల్పై దాడి.. ఆందోళనకు దిగిన బీజేపీ కార్పొరేటర్లు
- టీడీపీ కార్యకర్తల్లా పోలీసులు: అనిల్కుమార్ ఆగ్రహం
Advertisement