తొండంతో ఎత్తి.. నేలకేసి కొట్టి

Elaphant Attack on Man in Karnataka - Sakshi

కర్ణాటక, తుమకూరు : అరటిపండ్లు తినిపించడానికి ప్రయత్నించిన యువకుడిని సర్కస్‌ ఏనుగు తొండంతో విసిరి నేలకేసి కొట్టిన ఘటన శనివారం తుమకూరు తాలూకా కోరా గ్రామంలో చోటు చేసుకుంది. కోర గ్రామానికి చెందిన ప్రతాప్‌ (20) ఆటో డ్రైవర్‌గా పనిచేస్తూ జీవిస్తున్నాడు. ఈ క్రమంలో శనివారం కోరా గ్రామ శివార్లలోని ఓ షెడ్‌లో ప్రభాస్‌ సర్కస్‌ కంపెనీకి చెందిన సిబ్బంది షెడ్‌లో ఏనుగును కట్టేసి ఉంచారు. దీంతో ఏనుగుకు అరటిపండ్లను తినిపించడానికి ప్రతాప్‌ ప్రయత్నించగా అరటిపండ్లతో పాటు ప్రతాప్‌ను కూడా తొండంతో ఎత్తి నేలకేసి కొట్టింది. దీంతో ప్రతాప్‌ తీవ్రంగా గాయపడగా గమనించిన సర్కస్‌ సిబ్బంది వెంటనే ఆసుపత్రికి తరలించడంతో వైద్యులు చికిత్స అందిస్తున్నారు. 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top