తొండంతో ఎత్తి.. నేలకేసి కొట్టి | Elaphant Attack on Man in Karnataka | Sakshi
Sakshi News home page

తొండంతో ఎత్తి.. నేలకేసి కొట్టి

Feb 17 2019 12:08 PM | Updated on Jul 11 2019 6:30 PM

Elaphant Attack on Man in Karnataka - Sakshi

గాయపడిన ప్రతాప్‌ (ఫైల్‌) సర్కస్‌ ఏనుగు

కర్ణాటక, తుమకూరు : అరటిపండ్లు తినిపించడానికి ప్రయత్నించిన యువకుడిని సర్కస్‌ ఏనుగు తొండంతో విసిరి నేలకేసి కొట్టిన ఘటన శనివారం తుమకూరు తాలూకా కోరా గ్రామంలో చోటు చేసుకుంది. కోర గ్రామానికి చెందిన ప్రతాప్‌ (20) ఆటో డ్రైవర్‌గా పనిచేస్తూ జీవిస్తున్నాడు. ఈ క్రమంలో శనివారం కోరా గ్రామ శివార్లలోని ఓ షెడ్‌లో ప్రభాస్‌ సర్కస్‌ కంపెనీకి చెందిన సిబ్బంది షెడ్‌లో ఏనుగును కట్టేసి ఉంచారు. దీంతో ఏనుగుకు అరటిపండ్లను తినిపించడానికి ప్రతాప్‌ ప్రయత్నించగా అరటిపండ్లతో పాటు ప్రతాప్‌ను కూడా తొండంతో ఎత్తి నేలకేసి కొట్టింది. దీంతో ప్రతాప్‌ తీవ్రంగా గాయపడగా గమనించిన సర్కస్‌ సిబ్బంది వెంటనే ఆసుపత్రికి తరలించడంతో వైద్యులు చికిత్స అందిస్తున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement