పవిత్ర పుణ్యక్షేత్రం తిరుమలలో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు, ముఖ్య అధికారులకు చేదు అనుభవం ఎదురైంది.
పవిత్ర పుణ్యక్షేత్రం తిరుమలలో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు, ముఖ్య అధికారులకు చేదు అనుభవం ఎదురైంది. ముఖ్యమంత్రి హోదాలో శ్రీ వేంకటేశ్వరునికి పట్టు వస్త్రాలు సమర్పించేందుకు చంద్రబాబు నాయుడు వెళ్లారు.
అయితే ఆ కార్యక్రమం ఆలస్యం కావడంతో ఎమ్మెల్యేలు, ఇతర అధికారులను తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు గంటన్నర పాటు వైకుంఠం క్యూ కాంప్లెక్సులోనే నిలిపివేశారు. దాంతో తమను ఎంఉదకు లోనికి అనుమతించరంటూ సిబ్బందితో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు, అధికారులు వాగ్వాదం వేసుకున్నారు.