రెల్లి కులస్తులను ఆదుకోవాలి | Relli Caste leaders Meet YS Jagan in Praja Sankalpa Yatra | Sakshi
Sakshi News home page

రెల్లి కులస్తులను ఆదుకోవాలి

Nov 28 2018 7:28 AM | Updated on Nov 28 2018 7:28 AM

Relli Caste leaders Meet YS Jagan in Praja Sankalpa Yatra - Sakshi

రెల్లికుల ఐక్యపోరాటసమితి ప్రతినిధులు

శ్రీకాకుళం : ఇంటింటికి తిరిగి కూరగాయలు, పళ్లు అమ్ముకుంటూ, పట్టణాల్లో పారిశుద్ధ్య పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్న తమని ఆదుకోవాలని రెల్లి ఐక్యపోరాట సమితి రాష్ట్ర కోఆర్డినేటర్‌ జలుమూరు అమర్‌నాథ్‌ కోరారు. పాదయాత్రలో భాగంగా వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని కలిసి తమ గోడు వెళ్లగక్కారు. రాష్ట్రంలో సుమారు 10 లక్షల మంది జనాభా ఉన్నామని, తమకు ఎస్సీ కార్పోరేషన్‌ ద్వారా సమన్యాయం జరగడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.  గత ప్రభుత్వాలు కేవలం ఓటు బ్యాంకుగా వాడుకున్నాయని వాపోయారు. రెల్లి కార్పోరేషన్‌ ఏర్పాటుకు కృషి చేయాలని కోరారు. మన ప్రభుత్వం వచ్చాక తప్పక న్యాయం చేస్తామని జగన్‌మోహన్‌రెడ్డి భరోసా కల్పించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement