‘ఉపాధ్యాయ, ఉద్యోగులకు హెల్త్కార్డులను అందించి ఆదుకోండి’ అని వైఎస్సార్టీఎఫ్ నాయకులు వైఎస్ జగన్ను కలిసి వినతిపత్రం అందజేశారు. గురువారం ప్రజా సంకల్ప పాదయాత్ర శింగనమల మండలం గుమ్మేపల్లి నుంచి పాపినేపాలెం మీదుగా సాగుతుండగా జననేతను ఉద్యోగ, ఉపాధ్యాయ నాయకులు కలిసి దీర్ఘకాలికంగా ఎదుర్కొంటున్న సమస్యలను విన్నవించారు. ఉపాధ్యాయులకు గుండె, కాలేయం, అవయవ మార్పిడికి రూ.20 లక్షల ప్యాకేజీ అందించాలని కోరారు.
ఉద్యోగ, ఉపాధ్యాయుల సొంతింటి కలను నెరవేర్చాలని విజ్ఞప్తి చేశారు. వైఎస్సార్టీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఓబుళపతి, రాష్ట్ర కార్యదర్శి గోవిందరెడ్డి, రాష్ట్ర ఉపాధ్యక్షుడు గిరినాథ్రెడ్డి, జిల్లా కార్యదర్శి రవీంద్రరెడ్డి, జిల్లా కోశాధికారి ఫల్గుణప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.