కాంగ్రెస్, టీడీపీకి ఓటేస్తే.. మోరీలో వేసినట్లే | Kishan reddy comments on congress and TDP | Sakshi
Sakshi News home page

కాంగ్రెస్, టీడీపీకి ఓటేస్తే.. మోరీలో వేసినట్లే

Feb 27 2016 3:14 AM | Updated on Mar 29 2019 9:31 PM

కాంగ్రెస్, టీడీపీకి ఓటేస్తే.. మోరీలో వేసినట్లే - Sakshi

కాంగ్రెస్, టీడీపీకి ఓటేస్తే.. మోరీలో వేసినట్లే

కాంగ్రెస్, టీడీపీలాంటి పార్టీలకు ఓటు వేస్తే మోరీలో వేసినట్లేనని, ఈ పార్టీల అభ్యర్థులు గెలిచినా వారు ఆ పార్టీలో ఉండరని, అధికార టీఆర్‌ఎస్‌లో చేరుతారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి అన్నారు.

వారికి ఓటేసినా.. టీఆర్‌ఎస్‌లో చేరుతారు: కిషన్‌రెడ్డి

 హన్మకొండ:  కాంగ్రెస్, టీడీపీలాంటి పార్టీలకు ఓటు వేస్తే మోరీలో వేసినట్లేనని, ఈ పార్టీల అభ్యర్థులు గెలిచినా వారు ఆ పార్టీలో ఉండరని, అధికార టీఆర్‌ఎస్‌లో చేరుతారని  బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి అన్నారు. శుక్రవారం హన్మకొండలో ఆయన విలేకరుల సమావేశంలో, గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్‌లో పోటీ చేస్తున్న అభ్యర్థుల సమావేశంలో ఎమ్మెల్యే చింతల రాంచంద్రారెడ్డితో కలసి మాట్లాడారు. టీఆర్‌ఎస్‌కు ప్రత్యమ్నాయం బీజేపీయేనని, వరంగల్ ప్రజలు బీజేపీని ఆదరించాలని కోరారు.

వరంగల్ అభివృద్ధికి బీజేపీ కట్టుబడి ఉందన్నారు. స్థానిక నాయకత్వం నిర్ణయం మేరకు వరంగల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేస్తున్నామని, భవిష్యత్తు పొత్తులపై ఇప్పుడే ఏమీ చెప్పలేమన్నారు. రాష్ట్రంలో కుటుంబ పాలన నడుస్తున్నదని, 1,200 మంది ఉద్యమకారుల బలిదానాలతో సాధించుకున్న తెలంగాణ రాష్ట్రం ఒక కుటుంబం చేతిలో బందీ అయిందన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement