-
చంద్రగిరిలో చిత్తూరు రౌడీయిజం
సాక్షి, తిరుపతి: ఓటమి భయంతో కూటమి అభ్యర్థులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. ఓటర్లను భయభ్రాంతులకు గురిచేసి పోలింగ్ శాతాన్ని తగ్గించాలని పక్కా ప్లాన్తో విధ్వంసాలు సృష్టించారు.అల్లర్లు సృష్టించి..అసత్యాలకు పదును పెట్టి ఎన్నికల్లో అల్లర్లు, విధ్వంసాలు సృష్టించేందుకు కూటమి అభ్యర్థులు నోటిఫికేషన్ వెలువడక ముందు నుంచే విధ్వంసాలకు పథక రచన చేశారు. అందులో భాగంగానే నామినేషన్ రోజున ఆర్డీఓ కార్యాలయం వద్ద ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్రెడ్డి వాహనంపై దాడికి తెగబడ్డారు. ఆపై విచక్షణారహితంగా పోలీసులపైన, వైఎస్సార్సీపీ శ్రేణులపై రాళ్ల వర్షం కురిపించారు. మరోవైపు తిరుపతి నగరంలో జరుగుతున్న ప్రచారంలో జనసేన రౌడీలు స్థానికులు, వైఎస్సార్సీపీ శ్రేణులపైన దాడులకు తెగబడ్డారు. ఇదంతా కుట్రలో భాగమేనని ఓటర్లు చర్చించుకుంటున్నారు. రిగ్గింగ్ని అడ్డుకున్నందుకే విధ్వంసాలు పోలింగ్ రోజు చంద్రగిరి నియోజకవర్గ ఓటర్లంతా వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి చెవిరెడ్డి మోహిత్రెడ్డికే పట్టం కడుతున్నారన్న విషయాన్ని గ్రహించిన కూటమి అభ్యర్థి పులివర్తి నాని అనుచరులు రామంద్రాపురం మండలం, బ్రాహ్మణకాలువ పోలింగ్ కేంద్రంలో రిగ్గింగ్కు యతి్నంచారు. తమకు అడ్డుగా ఉన్న దళిత ఏజెంట్ని బయటకు లాక్కొచ్చి అతనిపై దాడిచేశారు. వైఎస్సార్సీపీ పాకాల మండల పార్టీ అధ్యక్షులు నంగా నరే‹Ùరెడ్డి కుమారుడు లవంత్రెడ్డిపై కత్తులతో దాడికి పాల్పడ్డారు. తర్వాత పులివర్తివారి పల్లెలో రిగ్గింగ్కు యతి్నంచారు. వైఎస్సార్సీపీ ఏజెంట్పై మాజీ జెడ్పీటీసీ సురేష్ చౌదరి, పులివర్తి నాని కుమారుడు వినీల్ దాడికి దిగారు. నారావారిపల్లె పరిధిలోని పోలింగ్ కేంద్రంలో ఉన్న వైఎస్సార్సీపీ ఏజెంట్పైనా టీడీపీ మూకలు దాడిచేశారు. అదేవిధంగా కూచువారిపల్లె పరిధిలోని పోలింగ్ కేంద్రంలో రిగ్గింగ్కి అడ్డుగా ఉన్న వైఎస్సార్సీపీ ఏజెంట్ రాజశేఖర్ని, రిలీవ్ ఏజెంట్గా ఉన్న సర్పంచ్ కొట్టాల చంద్రశేఖర్రెడ్డిపై దాడి చేశారు. చంద్రశేఖర్రెడ్డి ఇంటిని ధ్వంసం చేశారు. గ్రామానికి చేరుకున్న చెవిరెడ్డి మోహిత్రెడ్డిపై దౌర్జన్యానికి దిగారు. మోహిత్రెడ్డి వాహనానికి నిప్పు పెట్టి, మరో ఎస్కార్ట్ వాహనాన్ని ధ్వంసం చేశారు. కార్యకర్తలపై దౌర్జన్యం చేశారు. కూచువారిపల్లెలో కార్యకర్తలను బేడ్లతో కోసి రక్త గాయాలు చేశారు.అక్కడే ఎందుకు తిష్ట? పోలింగ్ రోజున ఎటూ ఓటింగ్ శాతాన్ని తగ్గించలేకపోయామని భావించిన కూటమి టీడీపీ అభ్యర్థి పులివర్తి నాని అనుచరులు రెచ్చిపోతున్నారు. మహిళా విశ్వవిద్యాలయం ప్రాంతంలో 144 సెక్షన్ అమలులో ఉండగా స్ట్రాంగ్ రూమ్ పరిసరాల్లో పులివర్తి నాని అనుచరులు మారణాయుధాలతో పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకోవాల్సిన అవసరం ఏమొచ్చిందని అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. స్ట్రాంగ్ రూమ్ పరిధిలో ఉన్న రౌడీ మూకలు మహిళా యూనివర్సిటీ సమీపంలో వైఎస్సార్సీపీ స్టిక్కర్తో ఉన్న ద్విచక్ర వాహనాన్ని కిందపడేసి ధ్వంసం చేశారు. ఆపై దానికి నిప్పంటించారు. అదేవిధంగా వైఎస్సార్సీపీ నాయకుడికి కారును కూడా ధ్వంసం చేశారు. -
TTD: శ్రీవారి దర్శనానికి ఎనిమిది గంటలు
తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. క్యూ కాంప్లెక్స్లో 8 కంపార్ట్మెంట్లు నిండాయి. స్వామివారిని 70,815 మంది సోమవారం అర్ధరాత్రి వరకు దర్శించుకోగా, తలనీలాలను 25,245 మంది భక్తులు సమర్పించారు. కానుకల రూపంలో హుండీలో రూ.3.16 కోట్లను సమర్పించారు. టైమ్ స్లాట్ టికెట్లు కలిగిన భక్తులకు సకాలంలోనే దర్శనమవుతోంది. టికెట్లు లేని భక్తులకు ఎనిమిది గంటల్లో దర్శనం లభిస్తోంది. ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లు కలిగిన వారికి రెండు గంటల్లో దర్శనమవుతోంది. -
జిల్లా వ్యాప్తంగా ఆరోగ్య కేంద్రాల వివరాలు
పీహెచ్సీలు 62యూపీహెచ్సీలు 26ఏరియా ఆసుపత్రులు 2 కమ్యూనిటీ హెల్త్ సెంటర్ 10టీచింగ్ ఆసుపత్రి 1పీహెచ్సీల్లో అందుబాటులో ఉండే మందులు 105 రకాలునర్సులు 185పీహెచ్సీల్లో అందుబాటులో ఉన్న వైద్యులు 124టెక్నీషియన్లు 56ల్యాబ్లు : 62 -
ఏనుగుల దాడిలో పంటల ధ్వంసం
తవణంపల్లె మండలం సరకల్లు వద్ద సోమవారం ఏనుగులు దాడి చేసి పంటలు నాశనం చేశాయి.పోలింగ్ కేంద్రంలోనే హత్యాయత్నం చిత్తూరు నియోజవర్గం గుడిపాల మండలం మందికృష్ణాపురం పోలింగ్ బూత్ నంబర్ 220లో వైఎస్సార్సీపీ ఏజెంట్ సురేష్రెడ్డి (48) పై టీడీపీ నేత చంద్ర హత్యాయత్నం చేశాడు. ముందస్తు పథకం ప్రకారమే కత్తితో పోలింగ్ కేంద్రానికి వచ్చిన దుండగుడు ఏజెంట్పై ఒక్కసారిగా దాడి చేసి కత్తితో పొడిచి పారిపోయాడు. పోలింగ్ కేంద్రం ఆవరణలో జరిగిన ఈ ఘటనతో అప్పటికే క్యూలో వేచి ఉన్న ఓటర్లు భయబ్రాంతులై పరుగులు తీశారు. తీవ్ర రక్తస్రావంతో పడిపోయిన బాధితుడిని వైఎస్సార్సీపీ నేతలు, పోలీసులు ఆస్పత్రికి తరలించారు. – 8లో -
అడుగడుగునా
పలకరిస్తూ.. పరిశీలిస్తూ! పుంగనూరు కొత్తయిండ్లు హైస్కూల్లో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాన్ని మంత్రి పెద్దిరెడ్డి పరిశీలించారు.సార్వత్రిక ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలి.. రక్తపాతం సృష్టించైనా అనుకూల ఫలితం రాబట్టాలి.. దాడులు చేసైనా అనుకున్నది సాధించాలి.. ఇదే లక్ష్యంతో టీడీపీ అభ్యర్థులు ప్రణాళిక రూపొందించుకున్నారు. సోమవారం పోలింగ్ రోజున తొలి గంటలోనే ఓటరు నాడి పచ్చనేతలకు అర్ధమైపోవడంతో ఎక్కడికక్కడ అరాచకాలకు తెగబడ్డారు. వైఎస్సార్సీపీ ఏజెంట్లు.. నాయకులను టార్గెట్ చేసుకుని మారణాయుధాలతో అల్లర్లకు పాల్పడ్డారు. ప్రజలను భయభ్రాంతులకు గురిచేసి ఓటింగ్ శాతం తగ్గించేందుకు యత్నించారు. ప్రశాంతంగా సాగుతున్న పోలింగ్ను రక్తసిక్తంగా మార్చేశారు.● ఓటమి భయంతో టీడీపీ దాడులు ● జిల్లాలో రెచ్చిపోయిన పచ్చ గూండాలు ● పోలింగ్ కేంద్రాల వద్ద యథేచ్ఛగా దౌర్జన్యాలు ● గుడిపాలలో వైఎస్సార్సీపీ ఏజెంట్పై హత్యాయత్నం ● కుప్పంలో భారీగా పోలైన దొంగ ఓట్లు ● ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేసిన వైఎస్సార్సీపీ నేతలు ● పలుచోట్ల పోలింగ్ సిబ్బంది సహకారంతో అక్రమాలు మంగళవారం శ్రీ 14 శ్రీ మే శ్రీ 2024పూతలపట్టు నియోజకవర్గం పేటపల్లెలో పోలీసులపై దౌర్జన్యం చేస్తున్న టీడీపీ నేతలుసాక్షి, చిత్తూరు : జిల్లాలో సార్వత్రిక ఎన్నికల పోలింగ్లో టీడీపీ నేతలు యథేచ్ఛగా ఘర్షణలకు పాల్పడ్డారు. ఓటమి భయంతో అడుగడుగునా అరాచకాలు సృష్టించారు. వైఎస్సార్సీపీ ఏజెంట్లు, నేతలే లక్ష్యంగా దాడులకు తెగబడ్డారు. జిల్లావ్యాప్తంగా ఓటర్లను భయాందోళనకు గురిచేశారు. పోలింగ్ శాతం పెరగకుండా ఓటర్లను కట్టడి చేసేందుకు శతవిధాలా ప్రయత్నించారు. తద్వారా వైఎస్సార్సీపీ మెజారిటీ తగ్గించేందుకు కుట్ర చేశారు. సోమవారం ఉదయం పోలింగ్ మొదలైనప్పటి నుంచి సాయంత్రం ముగిసే వరకు జిల్లా అంతటా ఇలాంటి పరిస్థితే కొనసాగింది. పోలింగ్కు అంతయాచం చిత్తూరులో మాజీ ఎమ్మెల్యే సీకే బాబు ఎక్కడికక్కడ పోలింగ్ కేంద్రాల్లో చొరబడ్డారు. ఓటర్లను ప్రభావితం చేసేందుకు యత్నించారు. విషయం తెలుసుకున్న మిట్టూరు పోలింగ్ కేంద్రం వద్ద అడ్డుకోవడంతో సీకే బాబు వెలుపలకు వచ్చారు. దీనిపై ఇద్దరి మధ్య కొంత వాగ్వాదం జరిగింది. జాయింట్ కలెక్టర్ శ్రీనివాసులు జోక్యం చేసుకోవడంతో వివాదం సద్దుమణిగింది. కుప్పంలో దొంగ ఓట్లు కుప్పంల నియోజకవర్గంలో టీటీడీ నేతలు భారీగా దొంగ ఓట్లు వేయించారు. కుప్పం మున్సిపాలిటీ పరిధిలోని 163వ పోలింగ్ బూత్లో తన ఓటు ఎవరో వేశారని గాయత్రి అనే మహిళ ఆవేదన వ్యక్తం చేశారు. చాలా పోలింగ్ కేంద్రాల్లో ఇలాంటి పరిస్థితే కనిపించింది. తమ ఓట్లు ముందుగానే ఎవరో వేసేశారని, ఓటమి భయంతోనే దొంగ ఓటర్లతో టీడీపీ ఇలాంటి దిగజారుడు రాజకీయాలకు తెరతీసిందని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. దొంగ ఓట్లను అడ్డుకున్న వైఎస్సార్సీపీ శ్రేణులపై కూడా టీడీపీ నేతలు దూషణలకు దిగారు. జీడీనెల్లూరులో దౌర్జన్యం జీడీ నెల్లూరు టీడీపీ అభ్యర్థి థామస్ పదుల సంఖ్యలో బౌన్సర్లను వెంటబెట్టుకుని హల్చల్ చేశారు. పోలింగ్ కేంద్రాల వద్ద భారీ సంఖ్యలో అనుచరగణంతో సంచరిసత్తూ ఓటర్లను భయాందోళను గురి చేశారు.ఈ క్రమంలో కార్వేటినగరం మండంలోని అన్నూరు పోలింగ్ బూత్ వద్ద థామస్ దౌర్జన్యాలకు ఉపముఖ్యమంత్రి నారాయణస్వామి అభ్యంతరం తెలిపారు. తమిళనాడు నుంచి ప్రైవేట్ సైన్యం తీసుకురావడంపై మండిపడ్డారు. దీనిపై థామస్ బెదిరింపులకు దిగడంతో పోలీసులు జోక్యం చేసుకున్నారు. అలాగే క్యూఆర్ కోడ్తో కూడిన స్లిప్పులతో ఓటర్లను థామస్ ప్రలోభపెట్టారు. ఈ స్లిప్తో ఎక్కడకు వెళ్లినా రూ.5వేలకు కొనుగోలు చేసుకోవచ్చని ఓటర్లను నమ్మిస్తూ పంపిణీ చేశారు. పూతలపట్టులో దాడులు పూతలపట్టు నియోజకవర్గంలో టీడీపీ నేతలు గూండాగిరీ ప్రదర్శించారు. పేట అగ్రహారంలో వైఎస్సార్సీపీ ఏజెంట్ రవినాయుడిపై టీడీపీ నేతలు మూకుమ్మడిగా దాడులకు తెగబడ్డారు. ఓటర్లను ఎక్కడికక్కడ భయభ్రాంతులకు గురి చేశారు. పుంగనూరులో ఓటర్ల కట్టడికి యత్నం పుంగనూరులో మంత్రి, ఎమ్మెల్యే అభ్యర్థి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని టార్గెట్గా చేసుకుని టీడీపీ వర్గీయులు అల్లర్లు సృష్టించారు. ఈ నియోజవర్గంలో ఎన్నికలు ఏకపక్షంగా సాగే అవకాశం ఉండటంతో ఓటర్లను ఎక్కడికక్కడ కట్టడి చేసేందుకు ప్రయత్నాలు చేశారు. లెక్కకు మించి గూండాలను రంగంలోకి దించి ప్రజలను భయాందోళనకు గురిచేశారు. ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు రాలేని పరిస్థితి కల్పించారు.పైగా ఈవీఎంలు సైతం పదేపదే మొరాయించడంతోనూ పోలింగ్ కూడా ఆలస్యమైంది.కత్తిపోట్లకు గురైన వైఎస్సార్సీపీ ఏజెంట్ సురేష్– 8లో– 8లోన్యూస్రీల్నగరిలో మితిమీరిన ఆగడాలు నగరి నియోజకవర్గంలో టీడీపీ నేతల ఆగడాలు మితిమీరిపోయాయి. స్థానిక కొత్తపేట పోలింగ్ బూత్లో ఓటర్లు తమకు అనుకూలంగా లేరని గ్రహించి వారిని భయపెట్టేందుకు యత్నించారు. దాదాపు నియోజకవర్గంలో తమకు వ్యతిరేక పవనాలు వీస్తున్న ప్రాంతాల్లో అరాచకాలకు పాల్పడ్డారు. పలమనేరులో అక్రమాలు పలమనేరులో వైఎస్సార్సీపీకి అనుకూలంగా ఓటర్లు ఉండడంతో టీడీపీ నేతల్లో గుబులు పుట్టుకుంది. పోలింగ్ సిబ్బంది ద్వారా టీడీపీ నేతలు తమ చేతివాటం చూపారు. వైఎస్సార్సీపీకి పడే ఓట్లను సిబ్బంది సహకారంతో దారి మళ్లించారు. ఈ కుట్రను పసిగట్టిన ఓటర్లే సంబంఽధిత పోలింగ్ సిబ్బందితో గొడవకు దిగారు. తాము చెప్పిన గుర్తు కాకుండా మరో గుర్తుకు ఎలా వేయిస్తారు?అంటూ ఆందోళనకు చేపట్టారు. దీనిపై ఓటర్ల నుంచి ఫిర్యాదులు రావడంతో అలాంటి సిబ్బందిని గుర్తించిన అధికారులు వెంటనే విధుల నుంచి తప్పించారు. కొందరు పోలింగ్ సిబ్బంది తీరుపై వైఎస్సార్సీపీ శ్రేణులు అభ్యంతరం తెలిపారు. దీనిపై ఇరువర్గాల మధ్య వాగ్వాదం నడిచింది. -
ఏనుగుల దాడిలో పంటల ధ్వంసం
తవణంపల్లె : మండలంలోని సరకల్లు గ్రామం వద్ద పంటలపై సోమవారం ఏనుగుల గుంపు దాడి చేసి నాశనం చేసినట్లు ఎఫ్ఎస్ఓ జయశేఖర్ తెలిపారు. సమీప అటవీప్రాంతం నుంచి సుమారు 11 ఏనుగులు పొలాల్లోకి చొరబడి రమేష్ అనే రైతుకు చెందిన మామిడి చెట్లు, కంచె, రాతి కూసాలను ధ్వంసం చేశాయన్నారు. అలాగే ఎస్టీ కాలనీకి చెందిన రాణెమ్మ పొలంలో మామిడి చెట్లను విరిచేసినట్లు వెల్లడించారు. రైతు ఎలకారయ్య అరటి చెట్లను నాశనం చేసినట్లు వివరించారు. ఏనుగుల సంచారంపై సమీప గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. -
దళితులపై టీడీపీ దాష్టీకం
● అర్ధరాత్రి ఇళ్లలోకి చొరబడి దాడులు ● పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధితులుశ్రీరంగరాజపురం : టీడీపీకి ఓటు వేయలేదనే నెపంతో దళిత గ్రామాలపై పచ్చమూకలు దాడులకు పాల్పడ్డాయి. సోమవారం రాత్రి విద్యుత్ సరఫరా నిలిపివేసి మరీ దళితులను చితకబాదారు. వివరాలు.. శ్రీరంగరాజపురం మండలం పుల్లూరు పంచాయతీలో టీడీపీ నేతలు ఆదివారం ప్రచారం చేసేందుక వచ్చారు. అయితే ఎన్నికల నిబంధనల మేరకు ప్రచారం చేయకూడదు కాబట్టి తమ గ్రామంలో తిరిగేందుకు వీల్లేదంటూ స్థానికులు అడ్డుకున్నారు. దీంతో ఆగ్రహించిన టీడీపీ నేతలు ఎన్నికలు అయిన తర్వాత మీ సంగతి తేలుస్తామని హెచ్చరించారు. అన్నట్టుగానే సోమవారం పోలింగ్ ముగిసిన తర్వాత అర్ధరాత్రి మారణాయుధాలతో దళితులపై ఒక్కసారిగా దాడి చేశారు. మేం చెప్పినట్లు టీడీపీకి ఓటేయకుండా, మీ ఇష్టం వచ్చినట్లు వ్యవహరిస్తారా అంటూ ఇళ్లలోకి దూరి మరీ దాడులు చేశారు. వారి ఇళ్లలో వస్తువులను ధ్వంసం చేశారు. ఓ ఇంట్లో నిండు గర్భిని నిద్రిస్తుండగా కనీస మానవత్వం కూడా లేకుండా తలుపులు పగులగొట్టారు. వాషింగ్మిషన్, వంటగదిలో సామాన్లు నాశనం చేశారు. ఓ దళితుడు నిర్వహిస్తున్న దుకాణం తలుపు బద్దలుగొట్టి రూ.లక్ష నగదు సైతం దోచుకెళ్లారు. దీనిపై దళితులు భయాందోళనకు గురయ్యారు. సకాలంలో పోలీసులు రావడంతో పచ్చమూకలు కాలికి బుద్ధిచెప్పాయి. దీనిపై బాధితుల ఫిర్యాదు మేరకు సీఐ సత్తిబాబు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. -
ఫలితం.. నిక్షిప్తం
సదుం : ఓటేసిన మంత్రి పెద్దిరెడ్డి, ఎంపీ మిథున్రెడ్డి కుటుంబసభ్యులు, కార్వేటినగరం : డిప్యూటీ సీఎం నారాయణస్వామి, నగరి : మంత్రి ఆర్కే రోజా కుటుంబసభ్యులు● ముగిసిన సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ● ఉదయం 7 గంటలకు నుంచే పోటెత్తిన ఓటర్లు ● పలు చోట్ల ఈవీఎంల మొరాయింపు ● చెదురుమదురు ఘటనలు మినహా ప్రశాంతం ● ఊపిరి పీల్చుకున్న జిల్లా యంత్రాంగం ● జూన్ 4న కౌంటింగ్ చిత్తూరు కలెక్టరేట్ : సార్వత్రిక ఎన్నికల ప్రక్రియలో భాగంగా సోమవారం పోలింగ్తో ప్రధాన ఘట్టం ముగిసింది. ఇక కౌంటింగ్ మాత్రమే మిగిలింది. జిల్లాలోని ఒక పార్లమెంట్, ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల పోలింగ్ ప్రక్రియ సజావుగా సాగింది. చెదురుమదురు ఘటనలు మినహా అంతటా ప్రశాంతంగా పూర్తైంది. ఉదయం 7 నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ ప్రక్రియ నిర్వహించారు. కొన్న పోలింగ్ కేంద్రాల్లో 6 గంటల సమయానికి ఓటర్లు ఉండడంతో వారందరికీ టోకెన్లు ఇచ్చి ఓటు వేసే అవకాశం కల్పించారు. ఈ క్రమంలో కుప్పం, నగరి, పలమనేరు, ఇతర నియోజకవర్గాల్లో పోలింగ్ పూర్తి అయ్యేందుకు ఆలస్యం అవుతుందని అధికారులు వెల్లడించారు. ప్రతి పోలింగ్ కేంద్రంలోనూ పోలీస్ శాఖ పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టింది. ఎక్కడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా జాగ్రత్తలు తీసుకుంది. కలెక్టరేట్లోని వెబ్కాస్టింగ్ సెంటర్ నుంచి అబ్జర్వర్లు, జిల్లా ఎన్నికల అధికారి షణ్మోహన్, ఎస్పీ మణికంఠ పోలింగ్ సరళిని పర్యవేక్షించారు. పలుచోట్ల ఈవీఎంలు మొరాయించడంతో పోలింగ్కు అంతరాయం ఏర్పడింది. టెక్నికల్ అసిస్టెంట్లు వెంటనే వాటిని సరిచేసి పోలింగ్ను పునరుద్ధరించారు. ఎన్నికలు ప్రశాంతంగా ముగియడంతో జిల్లా యంత్రాంగం ఊపిరి పీల్చుకుంది. ఎన్నికల ఫలితాలు నిక్షిప్తమైన ఈవీఎంలను భారీ బందోబస్తు నడుమ స్ట్రాంగ్ రూమ్లలో భద్రపరిచేందు చర్యలు చేపట్టింది. అంచనాల్లో అభ్యర్థులు అభ్యర్థుల భవితవ్యం ఈవీఎంలలో నిక్షిప్తమైంది. జూన్ 4వ తేదీన ఫలితం తేలనుంది. సోమవారం పోలింగ్ ముగియడంతో ఆయా పార్టీల అభ్యర్థులు గెలుపోటముల అంచనాల్లో మునిగిపోయారు. పోలింగ్ కేంద్రాలు, సామాజిక వర్గాల వారీగా లెక్కలు వేసుకునే పనిలో నిమగ్నమయ్యారు. అయితే సంక్షేమ, అభివృద్ధిని ప్రజలకు చేరువ చేసిన వైఎస్సార్సీపీ వైపే ఓటర్లు అధిక శాతం మొగ్గుచూపినట్లు పలువురు అభిప్రాయపడుతున్నారు. ఇక ఓట్ల లెక్కింపే.. సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపును జూన్ 4వ తేదీన నిర్వహించనున్నారు. ఈ మేరకు చిత్తూరు సమీపంలోని ఎస్వీసెట్ ఇంజినీరింగ్ కళాశాలలో కౌంటింగ్ కేంద్రం ఏర్పాటు చేశారు. పోలింగ్ ముగిసన తర్వాత ఈవీఎంలను ఎస్వీసెట్ కౌంటింగ్ కేంద్రానికి తరలించనున్నారు. అక్కడ ప్రత్యేక గదులలో మూడంచెల భద్రతలో ఈవీఎంలను భద్రపరచేందుకు ఏర్పాట్లు చేశారు. -
టీడీపీ డేటా చౌర్యంపై ఫిర్యాదు
చిత్తూరు కార్పొరేషన్: టీడీపీ నాయకులు ‘వుయ్’ యాప్ ద్వారా ఓటర్లను ప్రలోభపెడుతున్నారి వైఎస్సార్సీపీ లీగల్ సెల్ జిల్లా అధ్యక్షుడు సూర్యప్రతాప్రెడ్డి మండిపడ్డారు. ఆదివారం ఈ మేరకు లీగల్ సెల్ సభ్యులతో కిసి వన్టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ యాప్లో ఓటరు పేరు, ఊరు, వీధి పేరు, కులం, ఏ పార్టీ మద్దతుదారుడు అనే వివరాలు ఉన్నాయన్నారు. డేటాచోరీ చేసి టీడీపీకి ఓట్లు వేయించడానికి యత్నిస్తున్నారని ఆరోపించారు. ఇందులో ఓటర్ స్లిప్స్, బార్కోడ్ ఆప్షన్లు ఉన్నాయన్నారు. టీడీపీకి ఓటు వేయకపోతే ఓటు తొలగిస్తామని బెదిరిస్తున్నారని తెలిపారు. తటస్తులను టీడీపీ పక్కకు తిప్పుకోవడానికి సంప్రదింపులు చేస్తున్నారన్నారు. ప్రజల డేటా చోరీ చేయడమే కాకుండ వారిని ప్రలోభాలకు గురిచేయడం అన్యాయమని ఆగ్రహం వ్యక్తం చేశారు. వ్యక్తిగత స్వేచ్ఛకు ఆటంకం కలిగిస్తున్నందున వారిపై చర్యలు తీసుకోవాలని వివరించారు. కార్యక్రమంలో లీగల్ సెల్ సభ్యులు సురేష్రెడ్డి, సుగణశేఖర్రెడ్డి, ఆంజాద్, చంద్రశేఖర్రెడ్డి పాల్గొన్నారు. పచ్చనేతల ప్రకోపం – ఓటర్లను భయపెట్టేందుకు కుట్రలు చిత్తూరు రూరల్(కాణిపాకం): సార్వత్రిక ఎన్నికల పోలింగ్ సోమవారం జరగనున్న నేపథ్యంలో ఓటర్లను భయపెట్టేందుకు టీడీపీ నేతలు కుట్రలకు పాల్పడుతున్నారు. చిత్తూరు మండలంలో గత మూడు రోజులుగా టీడీపీ నాయకులు డబ్బులు పంచడమే కాకుండా, ప్రతి ఇంటా బియ్యం, కుంకమం చల్లుతున్నారు. దీంతో పలుచోట్ల స్థానికులు వాగ్వాదానికి సైతం దిగారు. ఓట్ల కోసం ఇలాంటి పనులు చేయడం ఏమిటని పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. -
ఓటుకువేళాయె!
జిల్లా సమాచారం మొత్తం ఓటర్లు 15,63,911 మొత్తం పోలింగ్ కేంద్రాలు 1,771 పోలింగ్ లొకేషన్లు 1,267 చిత్తూరు పార్లమెంట్కు పోటీ చేస్తున్న అభ్యర్థులు 19 అసెంబ్లీ నియోజకవర్గాల బరిలో ఉన్న అభ్యర్థులు 78 ఎన్నికల సిబ్బంది 12,310 బ్యాలెట్ యూనిట్లు 2,290 కంట్రోల్ యూనిట్లు 2,200 వీవీప్యాట్లు 2,471 వెబ్కాస్టింగ్ కేంద్రాలు 1,309చిత్తూరు నియోజకవర్గంలో ఎన్నికల విధులకు హాజరైన అధికారులు, సిబ్బందిసార్వత్రిక ఎన్నికల సమరంలో ఓటరు తీర్పు వెలువరించే రోజు వచ్చేసింది. ప్రతి ఒక్కరూ తమ అమూల్యమైన ఓటును సద్వినియోగం చేసుకోవాల్సిన అవసరముంది. చైతన్యవంతమైన పౌరులుగా సమాజంలో సగర్వంగా నిలబడేందుకు ముందడుగు వేయాల్సి ఉంది. పాలకులను నిర్దేశించే బాధ్యతను చిత్తశుద్ధితో నిర్వర్తించాల్సిన సమయం ఆసన్నమైంది. ఈ మేరకు ప్రశాంత వాతావరణంలో స్వేచ్ఛగా ప్రజలు ఓటేసేందుకు ఎన్నికల సంఘం పకడ్బందీ ఏర్పాట్లు చేపట్టింది. సోమవారం ఉదయం 7 నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ నిర్వహించేందుకు సర్వం సిద్ధం చేసింది. అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా పకడ్బందీ బందోబస్తు కల్పించింది. ఓట్ల పండుగలో అందరినీ భాగస్వామ్యం చేసేందుకు సన్నద్ధమైంది. సాక్షి చిత్తూరు /చిత్తూరు కలెక్టరేట్ : సార్వత్రిక ఎన్నికల ప్రక్రియలో కీలకమైన పోలింగ్ రోజు రానే వచ్చింది. జిల్లాలో సోమవారం ఉదయం 7 నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరగనుంది. ఇందుకోసం జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఈ క్రమంలో ఆదివారం నియోజకవర్గాల వారీగా ఆయా డిస్ట్రిబ్యూషన్ కేంద్రాల నుంచి ఎన్నికల సిబ్బంది పోలింగ్ సామగ్రిని తీసుకుని ఆయా పోలింగ్ కేంద్రాలకు చేరుకున్నారు. ఇప్పటికే జిల్లాలోని మొత్తం 1,771 పోలింగ్ కేంద్రాల్లోనూ పక్కాగా మౌలిక వసతులు కల్పించారు. ఓటర్లు, సిబ్బందికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా సౌకర్యాలు ఏర్పాటు చేశారు. సమస్యాత్మక, అత్యంత సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలపై ప్రత్యేక దృష్టి సారించారు. అదనపు పోలీసు బలగాలతో బందోబస్తు చేపట్టారు. ఓటింగ్ శాతం పెరిగేలా.. ఈ ఎన్నికల్లో ఓటింగ్ శాతం పెంచేందుకు అధికారులు విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు చేపట్టారు. 2019లో జిల్లావ్యాప్తంగా 85.02 శాతం పోలింగ్ నమోదైంది. ప్రస్తుత ఎన్నికల్లో మరింతగా పోలింగ్ శాతం పెంచేందుకు అధికార యంత్రాంగం చర్యలు చేపట్టింది. జిల్లాలోని 15,63,911 మంది ఓటర్లలో సాధ్యమైనంత మంది పోలింగ్ కేంద్రాలకు వచ్చేలా క్షేత్రస్థాయిలో ఇప్పటికే అవగాహన కల్పించారు. ముందుగా మాక్ పోలింగ్ సార్వత్రిక ఎన్నికలకు దాదాపు ఐదు నెలలుగా జిల్లా వ్యాప్తంగా ఏర్పాట్లు చేపట్టారు. అందులో భాగంగా ప్రత్యేకంగా ఓటర్ల జాబితా సవరణ, ఈవీఎంలను సిద్ధం చేయడం, ఎన్నికల సిబ్బంది నియామకం, శిక్షణ, పోలింగ్ కేంద్రాల గుర్తింపు, ఓటర్లకు సదుపాయాల కల్పన, భద్రతా ఏర్పాట్లను పూర్తి చేశారు. మొత్తం ఈ ఎన్నికల్లో 12,310 మంది అధికారులు, సిబ్బంది విధుల్లో పాల్గొంటున్నారు. వీరంతా ఆదివారం రాత్రి పోలింగ్ కేంద్రాలలోనే బస చేస్తారు. ప్రిసైడింగ్ అధికారులు సోమవారం ఉదయం 5.30 గంటలకు ఏజెంట్ల సమక్షంలో ఈవీఎంలతో మాక్పోలింగ్ నిర్వహిస్తారు. తర్వాత కంట్రోల్ యూనిట్లోని మెమరీని డిలీట్ చేసి, వీవీప్యాట్ కంటెయినర్ బాక్స్ నుంచి మాక్ ఓటింగ్ స్లిప్పులను తొలగిస్తారు. నేడే సార్వత్రిక ఎన్నికల పోలింగ్ సర్వం సిద్ధం చేసిన అధికారులు పోలింగ్ కేంద్రాలకు చేరిన ఎన్నికల సామగ్రి సాయుధ బలగాలతో పటిష్ట బందోబస్తు సమస్యాత్మక కేంద్రాలపై ప్రత్యేక నిఘా పక్కాగా పర్యవేక్షణ పోలింగ్ నిర్వహణ ఏర్పాట్లను జిల్లా ఎన్నికల అధికారి షణ్మోహన్ ఆధ్వర్యంలో పక్కాగా పర్యవేక్షించారు. బందోబస్తుకు సంబంధించి ఎస్పీ మణికంఠ ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేపట్టారు. కలెక్టరేట్లోని మానిటరింగ్ సెల్లో ఏర్పాటు చేసిన వెబ్కాస్టింగ్ ప్రక్రియ ద్వారా జిల్లావ్యాప్తంగా పోలింగ్ కసరత్తును సమీక్షిస్తున్నారు. మొత్తం 425 సమస్యాత్మక, అత్యంత సమస్యాత్మక కేంద్రాలపై డేగకన్ను పెట్టారు. ప్రతి పోలింగ్ కేంద్రంలో వెబ్కాస్టింగ్, సీసీ కెమెరాలను, వీడియోగ్రఫీకి చర్యలు చేపట్టారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ఒడిశా, మధ్యప్రదేశ్ చెందిన పోలీసులు, కేంద్ర బలగాలతో కట్టుదిట్టంగా భద్రత కల్పించారు. క్షేత్రస్థాయిలో పరిశీలనకు మైక్రో అబ్జర్వర్లను నియమించారు. ఓటు మన బాధ్యత ఓటు హక్కు ప్రజలందరి బాధ్యత. ఈ విషయాన్ని గుర్తించి అందరూ ఓటు వేసేందుకు ముందుకురావాలి. స్వేచ్ఛగా, ప్రశాంత వాతావరణంలో అందరూ ఓటు హక్కు వినియోగించుకునేలా ఏర్పాట్లు చేశాం. పోలింగ్ సరళిని కంట్రోల్ రూమ్ ద్వారా పర్యవేక్షిస్తాం. 144 సెక్షన్ అమలులో ఉన్నందున గుంపులుగా తిరగొద్దు. – షణ్మోహన్, జిల్లా ఎన్నికల అధికారి -
జిల్లాలో ఏడు మోడల్ పోలింగ్ స్టేషన్లు
చిత్తూరు కలెక్టరేట్ : ఓటింగ్ శాతం పెంచేందుకు జిల్లా యంత్రాంగం ఏడు నియోజకవర్గాల్లో మోడల్ పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేసింది. మహిళలు, దివ్యాంగులు, యువకులకు ప్రత్యేకంగా పోలింగ్ స్టేషన్లను అందుబాటులోకి తీసుకువచ్చింది. వాటిని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దింది. పోలింగ్ కేంద్రాల వద్ద వైద్యశిబిరాలు చిత్తూరు రూరల్(కాణిపాకం): సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో అన్ని పోలింగ్ కేంద్రాల వద్ద వైద్యశిబిరాలను తప్పనిసరిగా ఏర్పాటు చేయాలని డీఎంహెచ్ఓ ప్రభావతీదేవి ఆదేశించారు. ఆదివారం చిత్తూరులోని వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయం నుంచి అధికారులతో వీడియోకాన్ఫరెన్స్ నిర్వహించారు. పోలింగ్ కేంద్రాల వద్ద శిబిరాల్లో వైద్య సిబ్బంది ఉదయం 7 నుంచి సాయంత్రం 6 గంటల వరకు విధిగా ఉండాలని స్పష్టం చేశారు. వైద్యాధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని సూచించారు. ఓటేసేందుకు గుర్తింపు కార్డు తప్పనిసరి చిత్తూరు కలెక్టరేట్ : జిల్లా వ్యాప్తంగా సోమవారం ఓటేసేందుకు వెళ్లేవారు తప్పనిసరిగా ఏదైన ఒక కార్డు తీసుకెళ్లాలని జిల్లా ఎన్నికల అధికారి షణ్మోహన్ తెలిపారు. ఆదివారం ఆయన విలేకర్లతో మాట్లాడుతూ ఓటు హక్కు వినియోగించుకునే ఓటర్లు ఒక గుర్తింపు కార్డును అధికారులకు చూపించాలన్నారు. ఓటరు స్లిప్పులో కేవలం పోలింగ్ కేంద్రాలు, ఓటర్లకు సంబంధించిన సమాచారం ఉంటుందని చెప్పారు. ఓటరు గుర్తింపు కార్డు, ఆధార్ కార్డు, ఉపాధి హామీ పథకం జాబ్కార్డు, బ్యాంకు పాసుపుస్తకం, హెల్త్ ఇన్సూరెన్స్ స్మార్ట్కార్డు, డ్రైవింగ్ లైసెన్సు, పాన్కార్డు, పాస్పోర్టు, సర్వీస్ ఐడీ కార్డు, వైకల్య ధ్రువీకరణపత్రం, కార్మిక శాఖ జారీచేసిన గుర్తింపుకార్డు, ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలకు జారీచేసిన గుర్తింపు కార్డుల్లో ఏదైన ఒకటి తీసుకెళ్లాలని సూచించారు. -
పోలింగ్ వేళ.. కరెంట్ కంట్రోల్ రూమ్
చిత్తూరు కార్పొరేషన్: సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో సోమవారం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా విద్యుత్ సమస్యల పరిష్కారం కోసం కంట్రోల్ రూములు ఏర్పాటు చేశామని ట్రాన్స్కో ఎస్ఈ కృష్ణారెడ్డి తెలిపారు. క్షేత్రస్థాయిలో 2,350 మంది ఉద్యోగులు విధి నిర్వహణలో అందుబాటులో ఉంటారని వెల్లడించారు. ఎక్కడైనా విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడితే వెంటనే కంట్రోల్ రూమ్ నంబర్లకు ఫోన్ చేయాలని సూచించారు. ప్రాంతం మండలం కంట్రోల్ రూమ్ నంబరు తిరుపతి – తిరుపతి అర్బన్, రూరల్, రేణిగుంట 9440817413 చంద్రగిరి – చంద్రగిరి, పాకాల, కేవీబీపురం 9440817414 పుత్తూరు – ఆర్సీపురం, జీడీనెల్లూరు, 9440817421 క్వారేటినగరం, వెదురుకుప్పం, ఎస్ఆర్పురం, నారాయణవనం, నాగలాపురం,పిచ్చాటూరు, వరదయ్యపాలెం,నగరి, నిండ్ర విజయపురం, వడమాలపేట పీలేరు – ఎర్రవారిపాళెం, చిన్నగొట్టిగల్లు 9491054705 శ్రీకాళహస్తి – ఏర్పేడు, తొట్టంబేడు, బీఎన్కండ్రిగ 9440817414 చిత్తూరు – జీడీనెల్లూరు, పాలసముద్రం, 9440817419 పెనుమూరు, గుడిపాల పూతలపట్టు – ఐరాల,తవణంపల్లె,బంగారుపాళ్యం, 9491052934 యాదమరి, మదనపల్లె – నిమ్మనపల్లె,రామసముద్రం 7382623216 ములకలచెరువు, తంబళ్లపల్లె, పెద్దపంజాణి, పీటీఎం, బి.కొత్తకోట, కురబలకోట,గుర్రంకొండ కలికిరి – కలకడ, కేవీపల్లె 9491054705 పలమనేరు – పెద్దపంజాణి, గంగవరం, 8074051992 బైరెడ్డిపల్లె, వి.కోట ,సోమల, రొంపిచెర్ల, కల్లూరు చౌడేపల్లె, పుంగనూరు, సదుం, -
పారదర్శకంగా పోలింగ్
● ప్రజల పక్షాన పనిచేస్తాం ● జిల్లాలో సెక్షన్ 144 అమలు ● కేంద్ర బలగాలతో బందోబస్తు ● ఎస్పీ మణికంఠచిత్తూరు అర్బన్: సార్వత్రిక ఎన్నికల పోలింగ్ను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు రాజకీయపార్టీలకు చెందిన అభ్యర్థులు, నాయకులు సహకరించాలని ఎస్పీ మణికంఠ కోరారు. ఆదివారం ఆయన మాట్లాడుతూ ప్రజలు స్వేచ్ఛగా ఓటు హ క్కు వినియోగించుకునే పోలీస్ యంత్రాంగం చర్య లు చేపట్టినట్లు వెల్లడించారు. ఈ క్రమంలో సోమ వారం జిల్లా వ్యాప్తంగా పోలింగ్ నేపథ్యంలో తీసుకున్న భద్రతాపరమైన అంశాలు, ఇతర విషయాలపై ‘సాక్షి’తో మాట్లాడారు. ఆయన మాటల్లోనే.. ● ఓటు హక్కు లేనివాళ్లు వెంటనే వారి సొంత ప్రాంతానికి వెళ్లిపోవాలి. తప్పనిసరి పరిస్థితుల్లో ఇక్కడ ఉండాల్సి వస్తే ఇంట్లోనే ఉండాలి. పోలింగ్ కేంద్రాల వద్దకు రాకూడదు. ఒక గ్రామంలోని ఓటరు, మరో గ్రామానికి కూడా వెళ్లకూడదు. ఓటర్లు, పోలింగ్ సిబ్బంది తప్ప.. బూత్కు వంద మీటర్ల పరిధిలో ఎవరూ ఉండటానికి వీల్లేదు. ఎవరైనా నిబంధనలు అతిక్రమిస్తే సహించే ప్రస క్తే లేదు. దీనిపై ఇప్పటికే పోలీసులకు స్పష్టమైన ఆదేశాలిచ్చాం. బయటివాళ్లు ఎక్కడైనా ఉంటే మాకు సమాచారం ఇవ్వండి. చర్యలు తీసుకుంటాం. ● ప్రతీ ఒక్కరూ స్వేచ్ఛాయుత వాతావరణంలో ఓటు హక్కు వినియోగించుకునేలా జాగ్రత్తలు తీసుకున్నాం. జిల్లా వ్యాప్తంగా దాదాపు 3 వేల మంది పోలీసులతో బందోబస్తు పెట్టాం. ప్రతీ నియోజకవర్గంలో ఓ ఏఎస్పీ స్థాయి అధికారి భద్రతను పర్యవేక్షిస్తారు. అలాగే ఓ డీఎస్పీ, కేంద్ర బలగాలు ఉంటాయి. 236 మొబైల్ పార్టీలు నిత్యం భద్రతను పర్యవేక్షిస్తాయి. కేంద్రం నుంచి వచ్చిన బలగాలతో పాటు తమిళనాడు, కేరళ, కర్ణాటక పోలీసులను ఈ ఎన్నికల విధులకు వినియోగించుకుంటున్నాం. పోలింగ్ పూర్తయ్యేంత వరకు జిల్లాలో 144 సెక్షన్ అమల్లో ఉంటుంది. అభ్యర్థి వెంట కాన్వాయ్గా వెళ్లడం నిషేదం. ఎక్కడైనా ఇబ్బందులు వస్తే డయల్–100, పోలీసు వాట్సాప్–9440900005 నంబర్లకు సమాచారం ఇవ్వండి. ● ఎన్నికల్లో పోలీసుశాఖ ఒకరికి ఫేవర్గా పనిచేయదు. ప్రజల పక్షాన నిలబడి పనిచేస్తాం. మా వాళ్ల పనితీరుపై కూడా నాకు ఫీడ్ బ్యాక్ ఉంటుంది. పారదర్శకంగా, నిక్కచ్చిగా విధులు నిర్వహించాలని స్పష్టంగా ఆదేశాలు జారీ చేశాం. చాలా వరకు బయటివాళ్లకే భద్రతా విధులు వేశాం. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలపై మరింత నిఘా ఉంటుంది. అక్కడ సమస్యలు పునరావృతం కాకుండా చూస్తాం. -
బరితెగించిన టీడీపీ నేతలు
కొలిమిగుండ్ల/వీరపునాయునిపల్లె/చింతకొమ్మ దిన్నె/పాడేరు (అల్లూరి సీతారామరాజు జిల్లా)/చిల్లకూరు (తిరుపతి జిల్లా)/గంగాధర నెల్లూరు (చిత్తూరు జిల్లా): ఎన్నికల ముంగిట టీడీపీ నాయకులు బరితెగించారు. ఓడిపోవడం ఖాయమని తేలిపోవడంతో దింపుడుకళ్లెం ఆశతో ప్రలోభాలకు పాల్పడుతున్నారు. కనీసం పరువైనా దక్కించుకోవడానికి అడ్డదారులు తొక్కుతున్నారు. ఓటర్లకు భారీ ఎత్తున నగదు, మద్యం, బియ్యం బస్తాలను ఎరవేస్తున్నారు. మహిళా ఓటర్లకు చీరలు, ముక్కుపుడకలు, వెండి భరిణెలు పంపిణీ చేస్తూ ప్రలోభపెడుతున్నారు. మరికొన్ని గంటల్లో పోలింగ్ జరగనున్న నేపథ్యంలో పలు రకాల తాయిళాలు ఎరవేస్తూ ఓటర్లను ఆకట్టుకునే పనిలో టీడీపీ నేతలు నిమగ్నమయ్యారు. తద్వారా నిర్భీతిగా ఎన్నికల కోడ్ను ఉల్లంఘిస్తున్నారు. 300 మందికిపైగా ముక్కుపుడకలు.. నంద్యాల జిల్లా కొలిమిగుండ్ల మండలంలో వైఎస్సార్సీపీ బలంగా ఉండటంతో ఓటమి ఖాయం అని భావించిన టీడీపీ నేతలు నగదు పంచారు. అయినా ఫలితం లేకపోవడంతో కల్వటాలలో ఆదివారం మహిళా ఓటర్లకు 300 మందికిపైగా ముక్కుపుడకలను పంపిణీ చేశారు. మరికొన్ని గ్రామాల్లో చీరలు అందజేశారు. వైఎస్సార్ జిల్లా వీరపునాయునిపల్లె మండలం యు.రాజుపాలెం, తాటిమాకులపల్లె సమీపంలోని అరటి తోటలో నాలుగు వందల చీరల బస్తాలను పోలీసులు స్వా«దీనం చేసుకున్నారు. బస్తాలపై టీడీపీ నేతలు ఎన్.వేణుగోపాల్, ఎం.నాగరాజు పేర్లు ఉన్నాయి.వీరిద్దరూ ఓటర్లకు పంపిణీ చేసేందుకు అరటితోటలో చీరలు దాచి ఉంచారని తెలిసింది. దీంతో పోలీసులు కేసు నమోదు చేశారు. అలాగే కడప సమీపంలోని ఊటుకూరు వద్ద 250 బియ్యం బస్తాలతో వెళుతున్న ఆటోను పోలీసులు పట్టుకున్నారు. విచారణలో వీటిని టీడీపీ నేత డాక్టర్ కృష్ణకిషోర్రెడ్డికి చెందినవిగా గుర్తించారు. ఈ బియ్యాన్ని చింతకొమ్మదిన్నె మండలం బుగ్గలపల్లి పంచాయతీ పరిధిలో ఓటర్లకు పంచేందుకు తీసుకెళుతున్నారు.ఆటోను, బియ్యం బస్తాలను విడిపించుకునేందుకు పోలీస్స్టేషన్ వద్ద టీడీపీ నేత కృష్ణ కిషోర్రెడ్డి, ఆయన అనుచరులు హల్చల్ చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేస్తామని సీఐ శివశంకర్ నాయక్ తెలిపారు. పాడేరు అసెంబ్లీ నియోజకవర్గంలో ఓటర్లకు çపంపిణీ చేసే స్లిప్పులపైన టీడీపీ పథకాలను ఆ పార్టీ నేతలు ముద్రించి అందజేస్తున్నారు. శ్రీకాకుళం జిల్లాలో రూ.1,500 విలువైన వెండి భరిణెల పంపిణీ శ్రీకాకుళం జిల్లా పలాస–కాశీబుగ్గ మున్సిపాలిటీ పరిధిలోని పలు వార్డుల్లో కూటమి అభ్యర్థులు ఇంటింటికీ రూ.వెయ్యి నగదు, రూ.1,500 విలువైన వెండిభరిణెలు పంపిణీ చేశారు. శ్రీకాకుళంలో టీడీపీ నాయకులు ఒక్కో ఓటుకు రూ.2 నుంచి రూ.3 వేల వరకు అందించారు. మద్యాన్ని కూడా ఇష్టారాజ్యంగా పంపిణీ చేశారు.బీజేపీ అభ్యర్థికి చుక్కెదురు తిరుపతి పార్లమెంటు బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న వరప్రసాద్రావుకు చుక్కెదురైంది. చిల్లకూరు మండలం నెలబల్లిరెట్టపల్లిలో ఓటర్లకు నగదు పంపిణీ చేస్తుండగా గ్రామస్తులు అడ్డుకున్నారు. ప్రచార పర్వం ముగిశాక కూడా ఓటర్లను కలుసుకుని ఇలా ప్రలోభాలకు గురి చేయడం సబబుగా లేదని వెళ్లిపోవాలని కోరారు. దీంతో వరప్రసాద్రావు అక్కడ నుంచి జారుకున్నారు. చిత్తూరు జిల్లా గంగాధరనెల్లూరు నియోజకవర్గంలో టీడీపీ నేతలు కార్డులు పంపిణీ చేస్తున్నారు. ఈ కార్డులను స్కాన్ చేస్తే రూ.500 తీసుకోవచ్చని ప్రలోభపెడుతున్నారు. -
వాజ్పేయిని ఒప్పించి రోడ్లేశా!
బొమ్మలసత్రం/సాక్షి, చిత్తూరు: హైదరాబాద్ అభివృద్ధికి తానే కారణమని.. అందువల్లే ఐటీ కంపెనీలు డబ్బులు సంపాదిస్తున్నాయని టీడీపీ అధినేత చంద్రబాబు తెలిపారు. ప్రధాని వాజ్పేయిని ఒప్పించి అద్దంలాంటి రహదారులు వేయించానన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు శనివారం నంద్యాల, చిత్తూరుల్లో బహిరంగ సభలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తమ్ముళ్లు సెల్ఫోన్ వాడుతున్నారంటే దానికి కారణం తానేనన్నారు. తెలుగు తమ్ముళ్లు నష్టపోతారని అమరావతిని రాజధానిగా ప్లాన్ చేశానన్నారు. హైదరాబాద్ కంటే అమరావతిని బెస్ట్ సిటీగా మార్చాలని భావించానని తెలిపారు. అధికారంలోకి వచ్చిన తర్వాత అమరావతిని రాజధానిగా అభివృద్ధి చేస్తామని చెప్పారు. ఆడవాళ్లు ఉద్యోగాలకెళ్తే మగవాళ్లు వంట చేసే రోజులు వస్తాయన్నారు. పోలవరం 72 శాతం పూర్తి చేసి.. ఆ నీటిని బనకచర్లకు అనుసంధానం చేయాలని చూశానన్నారు. తన చివరి శ్వాస ఉన్నంతవరకు పేదవాళ్ల అభివృద్ధి కోసమే పనిచేస్తానని తెలిపారు. రూ.16 లక్షల కోట్లు పెట్టుబడులు రాష్ట్రానికి తీసుకొచ్చానన్నారు. 10 లక్షల మందికి ఉద్యోగాలు ఇచ్చి రెండింతలు అభివృద్ధి చేశానని వెల్లడించారు. కోవిడ్ సమయంలో కూడా వర్చువల్ సమావేశాలు పెట్టి ప్రజల కోసం పనిచేశానన్నారు. కాగా, నంద్యాలలో చంద్రబాబు సభ అట్టర్ఫ్లాప్ అయ్యింది. ఆయన మాట్లాడుతున్నప్పుడే కార్యకర్తలు వెనుదిరిగారు. చంద్రబాబు రోడ్ షోలో డిగ్రీ విద్యార్థి మృతి ఒంగోలు సబర్బన్: ఒంగోలు నగరంలో శుక్రవారం చంద్రబాబు నిర్వహించిన రోడ్డు షోలో అపశ్రుతి చోటు చేసుకుంది. చంద్రబాబు కాన్వాయ్లోని ఒక వాహనం ఫుట్పాత్పై నిలబడి ఉన్న డిగ్రీ విద్యార్థి కాట్రగడ్డ సాయికృష్ణ డ్రైవర్ సడెన్ బ్రేక్ వేయడంతో కిందపడిపోయాడు. దీంతో తీవ్రంగా గాయాలపాలైన అతడిని ఒక ప్రైవేటు వైద్యశాలలో చేరి్పంచారు. తలకు బలమైన గాయం కావడంతో చికిత్స పొందుతూ శనివారం మృతిచెందాడు. కాట్రగడ్డ సాయికృష్ణను మద్దిపాడు మండలం దొడ్డవరం గ్రామానికి చెందిన విద్యారి్థగా గుర్తించారు. -
మోసాలకు కేరాఫ్ థామస్
కార్వేటినగరం : టీడీపీ జీడీనెల్లూరు అభ్యర్థి థామస్ ఆడబిడ్డల అండాశయాలతో వ్యాపారం చేసే రాక్షసుడని, మోసాలకు కేరాఫ్ అని డిప్యూటీ సీఎం నారాయణస్వామి విమర్శించారు. శనివారం పుత్తూరులో ఆయన విలేకర్లతో మాట్లాడారు. రాజకీయంగా ఎదుర్కోలేకే థామస్ తనపై బురదజల్లేందుకు విఫలయత్నం చేస్తున్నారన్నారు. డాక్టర్ అని చెప్పుకుంటూ ప్రజలను ఏమారుస్తున్నారని, అందులో భాగంగానే మునస్వామి అనే పేరును థామస్గా మార్చుకున్నారని స్పష్టం చేశారు. గొప్ప శాస్త్రవేత్త పేరును అంటగట్టుకుని నిలువు దోపిడీ చేస్తున్నారని ఆరోపించారు. నిజమైన డాక్టర్ అయితే ఎన్నికల అఫిడవిట్లో ఎందుకు పొందుపర్చలేదని ప్రశ్నించారు. రమ్య అనే డాక్టర్ను చంపేందుకు థామస్ ప్రయత్నించేశారని, త్వరలోనే ఆమెను మీడియా ముందుకు తీసుకువచ్చి మొత్తం బండారం బయటపెడతామని తెలిపారు. థామస్ ఎలాంటి నేరం చేయలేదని దమ్ముంటే చర్చిలో ప్రమాణం చేయాలని కోరారు. తాను అవినీతి చేసినట్లు నిరూపిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటానని, లేకుంటే పాలిటిక్స్ నుంచి థామస్ తప్పుకోవాలని సవాల్ విసిరారు. -
ప్రచార తుఫ్యాన్
జిల్లాలో వైఎస్సార్సీపీ ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులు ఎన్నికల క్యాంపెయిన్ను శనివారం హోరెత్తించారు. నోటిఫికేషన్ వెలువడిన నాటి నుంచే ఇంటింటా ప్రచారానికి శ్రీకారం చుట్టారు. పోలింగ్ రోజు దగ్గరపడే కొద్దీ ప్రచారాన్ని మరింత ఉధృతం చేశారు. అభ్యర్థుల కుటుంబీకులు కూడా మేము సైతం అంటూ క్షేత్రస్థాయిలో ఓటర్లతో మమేకమవుతూ నీరాజనాలు అందుకున్నారు. గ్రామాల్లో సుడిగాలి పర్యనలు చేస్తూ ప్రజా సమస్యలు తెలుసుకుంటూ.. సంక్షేమ పథకాల లబ్ధిని వివరిస్తూ దూసుకుపోయారు. ఇక కూటమి అభ్యర్థులు మాత్రం ఎన్నికల ప్రచారంలో కాస్త వెనకబడ్డారు. నాయకులకు.. కార్యకర్తలను ఒక్కతాటిపైకి తీసుకురాలేక చివరి రోజు కూడా ముప్పుతిప్పలు పడ్డారు. సమన్వయలోపం.. నోటి దురుసుతో ప్రజల నుంచి తిరస్కారాలు ఎదుర్కొన్నారు. సాక్షి, చిత్తూరు : సార్వత్రిక ఎన్నికల ఎన్నికల ప్రచారంలో వైఎస్సార్సీపీ అభ్యర్థులు ముందంజలో ఉన్నారు. శనివా రం సాయంత్రం 6 గంటల వరకు ప్రచారాలను హోరెత్తించారు. ఈ క్రమంలో కూటమి అభ్యర్థులు వెనకబడ్డారు. సమరోత్సాహం : ఎన్నికల ప్రచారంలో భాగంగా అభ్యర్థుల గెలుపే ధ్యేయంగా సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి జిల్లాలో విస్తృతంగా పర్యటించారు. మేమంతా సిద్ధం బస్సుయాత్రలో భాగంగాద నియోజకవర్గాల వారీగా బహిరంగ సభల్లో పాల్గొన్నారు. ముఖ్యమంత్రి పర్యటన కార్యకర్తలు, అభిమానుల్లో సమరోత్సాహం నింపింది. కుటుంబ సమేతంగా.. ఎన్నికల సందర్భంగా వైఎస్సార్సీపీ అభ్యర్థులు ఓ వైపు, కుటుంబ సభ్యులు, స్నేహితులు మరో వైపు ముమ్మరంగా ప్రచారాలు నిర్వహించారు. మంత్రి పెద్దిరెడ్డి రామంచద్రారెడ్డి తన సొంత నియోజకవర్గం పుంగనూరుతో పాటు వైఎస్సార్సీపీ అభ్యర్థుల గెలుపు కోసం కుప్పం, పలమనేరు, చిత్తూరు, పూతలపట్టు, గంగాధరనెల్లూరులో ప్రచారం చేశారు. రాజంపేట, చిత్తూరు ఎంపీ అభ్యర్థులు పెద్దిరెడ్డి మిథున్రెడ్డి, రెడ్డెప్ప ఆయా పార్లమెంట్ నియోజకవర్గాల్లో సుడిగాలి పర్యటనలు చేస్తూ ఓటర్లను నేరుగా కలిసి మద్దతు కూడగట్టారు. అసెంబ్లీ అభ్యర్థుల విషయానికి వస్తే.. నగరిలో మంత్రి ఆర్కే రోజాతో పాటు ఆమె భర్త సెల్వమణి, సోదరులు, కుమారుడు, కుమార్తె ప్రచారం నిర్వహించారు. కుప్పంలో వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కేఆర్జే భరత్, తల్లి పద్మజ, సోదరుడు శరత్, సతీమణి దుర్గపద్మిని విస్తృతంగా ప్రచారం చేశారు. పలమనేరులో ఎమ్మెల్యే అభ్యర్థి వెంకటేగౌడ్, భార్య పావని గౌడ్ ప్రచారం చేశారు. పూతలపట్టులో అభ్యర్థి సునీల్కుమార్, కుమార్తె మోన మాన్విత, మేనళ్లళ్లు రాజేష్, ప్రవీణ్, రంజిత్, రాకేష్ ప్రచారం నిర్వహించారు. చిత్తూరులో ఎమ్మెల్యే అభ్యర్థి విజయానందరెడ్డి, ఆయన సతీమణి ఇందుమతి ప్రచారం చేశారు. గంగాధరనెల్లూరు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి కృపాలక్ష్మి, ఆమె తండ్రి ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి ఊరూవాడా ప్రచారం చేశారు. ఈ క్రమంలోనే అభ్యర్థుల విజయం కోసం వైఎస్సార్సీపీకి చెందిన గ్రామ, వార్డు స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి నాయకుల వరకు అంతా కలిసి కట్టుగా ప్రచారం నిర్వహించారు. జిల్లాలో చివరి రోజు హోరాహోరీగా రాజకీయ పార్టీల క్యాంపెయిన్ ప్రజల్లోకి దూసుకుపోయిన వైఎస్సార్సీపీ అభ్యర్థులు సకుటుంబ సపరివార సమేతంగా చేపట్టిన ప్రచారానికి నీరాజనాలు కపట కూటమి నేతలకు అడుగడుగునా తిరస్కారాలు -
అవగాహనతో విధుల నిర్వహణ
చిత్తూరు కలెక్టరేట్ : ఎలాంటి ఇబ్బందులు లేకుండా అవగాహనతో ఎన్నికల విధులు నిర్వర్తించాలని జిల్లా ఎన్నికల అధికారి షణ్మోహన్ ఆదేశించారు. శనివారం పీవీకేఎన్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో బీఎల్ఓలు, సెక్టోరల్, రూట్ ఆఫీసర్లతో సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ ఈ నెల 13 వ తేదీన పోలింగ్ నిర్వహణలో బాధ్యతగా పనిచేయాలని సూచించారు. ఏమైనా సందేహాలుంటే ముందస్తుగా తెలుసుకోవాలని తెలిపారు. చిత్తూరు అసెంబ్లీ రిటర్నింగ్ అధికారి శ్రీనివాసులు మాట్లాడుతూ ఆదివారం ఉదయం 6 గంటలకు సెక్టోరల్, రూట్ ఆఫీసర్లు పీవీకేఎన్ కళాశాల వద్ద ఏర్పాటు చేసిన ఎన్నికల సామగ్రి పంపిణీ కేంద్రంలో రిపోర్టు చేసుకోవాలన్నారు. 23 కౌంటర్లు, 4 హెల్ప్డెస్క్లు, నోటీసుకు బోర్డులు ఏర్పాటు చేశామన్నారు. 23 మంది సెక్టోరల్, 23 మంది రూట్ ఆఫీసర్లు కేటాయించిన కేంద్రాల వద్దకు సమయానికి చేరుకోవాలని కోరారు. విధులకు కేటాయించిన వారు హాజరుకాకపోతే వెంటనే ఆర్ఓ దృష్టికి తీసుకెళ్లాలన్నారు. సెక్టోరల్ పరిధిలో ఎన్నికల సామగ్రిని పకడ్బందీగా పరిశీలించుకోవాలని చెప్పారు. 13 వ తేదీ ఉదయం 4 గంటలకల్లా సిబ్బంది ఆయా పోలింగ్ కేంద్రాల్లో సిద్ధంగా ఉండాలన్నారు. 5.30 గంటలకు పోలింగ్ ఏజెంట్ల సమక్షంలో మాక్పోలింగ్ నిర్వహించాలని కోరారు. 50 ఓట్లు ముందస్తుగా వేయించి వాటిని బ్లాక్కవర్లో భద్రపరచాలన్నారు. పోలింగ్ కేంద్రాల్లో ఏమైనా సమస్యలు తలెత్తితే వెంటనే సెక్టోరల్ ఆఫీసర్లు, పీఓలు తెలియజేయాలని సూచించారు. సమావేశంలో ఏఆర్ఓలు అరుణ, శ్రీనివాసులురెడ్డి, విజయలక్ష్మి పాల్గొన్నారు. నీరసించిన తమ్ముళ్లు రొంపిచెర్ల: మండలంలో టీడీపీ కార్యకర్తలు నీరసించిపోయారు. ఇప్పటి వరకు తమ పార్టీ గెలుపు తథ్యమంటూ బీరాలు పలికిన తమ్ముళ్ల ఇప్పుడు వాస్తవం అర్థం కావడంతో డీలా పడ్డారు. ఓటర్లకు నగదు పంపిణీ చేసినప్పటికీ ప్రజల నుంచి ఆశించిన స్పందన లేకపోవడంతో ఆందోళన చెందుతున్నారు. ఫ్యాన్ గాలి బలంగా వీస్తుండడంతో తట్టుకోలేక ఉక్కపోతకు గురవుతున్నారు. మరింత బాధ్యతగా విధులు చిత్తూరు కలెక్టరేట్ : సార్వత్రిక ఎన్నికల ప్రక్రియలో ఈ రెండు రోజులు ఎంతో కీలకమని మరింత బాధ్యతగా విధులు నిర్వర్తించాలని అధికారులను జిల్లా ఎన్నికల అధికారి షణ్మోహన్ ఆదేశించారు. శనివారం కలెక్టరేట్లోని మానిటరింగ్ సెల్లో ఏర్పాటు చేసిన వెబ్కాస్టింగ్ ప్రక్రియను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆయన మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా జరిగే ఎన్నికల పోలింగ్ సరళిని వెబ్కాస్టింగ్ విధానంలో పర్యవేక్షించనున్నట్లు తెలిపారు. సీ విజిల్ యాప్లో వచ్చే ఫిర్యాదులకు వెంటనే స్పందించి పరిష్కరించాలని సూచించారు. ఎన్నికల సిబ్బందికి రవాణా వసతి చిత్తూరు కలెక్టరేట్ : ఎన్నికల పోలింగ్ విధులకు హాజరయ్యే సిబ్బందికి రవాణా వసతి కల్పిస్తున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి షణ్మోహన్ తెలిపారు. శనివారం ఆయన విలేకర్లతో మాట్లాడుతూ ఎన్నికల సిబ్బంది ఆయా నియోజకవర్గాల పోలింగ్ కేంద్రాలకు వెళ్లేందుకు ఆర్టీసీ బస్సులు ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. -
పోలింగ్కు రండి..ఫ్యాన్కు ఓటేయండి
పుంగనూరు : సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా సోమవారం పోలింగ్కు ప్రతి ఒక్కరూ రావాలని, ఫ్యాన్ గుర్తుకు ఓటేయాలని రాజంపేట ఎంపీ అభ్యర్థి పెద్దిరెడ్డి మిథున్రెడ్డి అభ్యర్థించారు. శనివారం పట్టణంలో పోలింగ్ ఏర్పాట్లపై ఆయన వైఎస్సార్సీపీ నేతలతో చర్చించారు. మిథున్రెడ్డి మాట్లాడుతూ ఎండ తీవ్రత కారణంగా ఓటర్లు ఇబ్బంది పడకుండా ఉదయం నుంచే పోలింగ్ సక్రమంగా నిర్వహించేందుకు కృషి చేయాలని సూచించారు. ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగేందుకు సహకరించాలని కోరారు. ఓటర్లకు మోడల్ ఈవీఎంలతో అవగాహన కల్పించాలని చెప్పారు. వృద్ధులు, దివ్యాంగులు, గర్భిణులు ఇబ్బంది పడకుండా పార్టీ నేతలు, కార్యకర్తలు జాగ్రత్తలు తీసుకోవాలని స్పష్టం చేశారు. అనంతరం జానపద కళల సంస్థ చైర్మన్ కొండవీటి నాగభూషణం కుటుంబ సభ్యులు, పిల్లలతో కాసేపు సరదాగా ముచ్చటించారు. సమావేశంలో మున్సిపల్ చైర్మన్ అలీమ్బాషా, సీమ జిల్లాల మైనారిటీ సెల్ ఇన్చార్జి ఫకృద్ధీన్షరీఫ్, వక్ఫ్ బోర్డు జిల్లా చైర్మన్ అమ్ము, పీకేఎం ఉడా చైర్మన్ వెంకటరెడ్డి యాదవ్, బోయకొండ ఆలయ కమిటీ చైర్మన్ నాగరాజారెడ్డి పాల్గొన్నారు. -
ఓటమి భయంలో ఫేక్ బెట్టింగులు
● రూ.లక్షకు రూ.4 లక్షలంటూ టీడీపీ నేతల పందేలు ● ఓటర్లను మభ్యపెట్టేందుకు పన్నాగాలు ● బాబును నమ్మమంటున్న కుప్పం ప్రజలు కుప్పం రూరల్ : సుమారు 40 ఏళ్లుగా టీడీపీకి కంచుకోటగా మారిన కుప్పంలో ఈ పర్యాయం వ్యతిరేక పవనాలు వీస్తున్నాయి. కోటకు బీటలు వారే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇన్నేళ్లు చంద్రబాబు చెప్పిన మాయమాటలను నమ్మిన ప్రజలు ఇప్పుడు విసిగెత్తిపోయారు. ఎన్నికల సమయంలో బాబు చూపించే కపట ప్రేమ.. కల్లబొల్లి కబుర్లు ఇకపై నడిచేలా లేవు. ఇప్పటి వరకు కుప్పాన్ని సింగపూర్ చేస్తా.. ప్రతి ఒక్కరినీ లక్షాధికారిని చేసేస్తా అంటూ బూటకపు హామీ గుప్పించే బాబును ఈ దఫా కుప్పం వాసులే బురిడీ కొట్టించేందుకు సిద్ధంగా ఉన్నారని స్థానిక పరిస్థితులు గమనిస్తే ఇట్టే అర్థమవుతుంది. ఇది కనిపెట్టిన చంద్రబాబు మరో కొత్త ఎత్తుగడతో ముందుకు వస్తున్నారు. ఫేక్ బెట్టింగ్లతో టీడీపీని పైకి లేపేందుకు యత్నిస్తున్నారు. తమ్ముళ్ల కుయుక్తులు కుప్పంలో రోజురోజుకూ వైఎస్సార్సీపీ ఆదరణ పెరుగుతోంది. ఇది ఓర్వలేని తెలుగు తమ్ముళ్లు కుయుక్తులు పన్నుతున్నారు. అందులో భాగంగా టీ దుకాణాలు, జన సమూహాల మధ్యకు పనిగట్టుకుని వెళ్లి బెట్టింగ్లకు దిగుతున్నారు. రూ.లక్షకు రూ.4లక్షలు చెల్లిస్తామంటూ తమలో తామే ఉత్తుత్తి పందేలకు దిగుతున్నారు. ఇదంతా చూసిన వాళ్లు టీడీపీ గెలుస్తుందని ఇంత డబ్బు కడుతున్నారంటే.. ఆ పార్టీకి నిజంగా అంతటి ఆదరణ ఉందా అని ప్రజలు చర్చించుకుంటారని వారి ప్లాన్గా తెలుస్తోంది. కుప్పంలో టీడీపీ గెలవబోతోందనే భ్రమను ప్రజల్లో కల్పించేందుకు ఇలా వంచిస్తున్నట్లు సమాచారం. ఎవరైనా తీరా పందెం కాసేందుకు వేరేవారు ముందుకు వస్తే ఇట్టే జారుకుంటున్నారు. -
ప్రచారం.. పరిసమాప్తం
మరింత బాధ్యతగా విధులు పోలింగ్ సందర్భంగా మరింత బాధ్యతగా విధులు నిర్వర్తించాలని జిల్లా ఎన్నికల అధికారి ఆదేశించారు.అవగాహనతో విధుల నిర్వహణ ఎలాంటి ఇబ్బందులు లేకుండా అవగాహనతో ఎన్నికల విధులు నిర్వర్తించాలని జిల్లా ఎన్నికల అధికారి షణ్మోహన్ ఆదేశించారు.ఆదివారం శ్రీ 12 శ్రీ మే శ్రీ 202413న వేతనంతో కూడిన సెలవు చిత్తూరు కలెక్టరేట్ : సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఈ నెల 13వ తేదీన పోలింగ్ రోజు ప్రభుత్వేతర సంస్థలు, పరిశ్రమల్లో పనిచేసే ఉద్యోగులకు వేతనంతో కూడిన సెలవు మంజూరు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. ఈ ఉత్తర్వులను ఆయా సంస్థల యాజమాన్యాలు తప్పనిసరిగా పాటించాలని పేర్కొంది. నిబంధనలను అతిక్రమిస్తే చర్యలు తప్పవని హెచ్చరించింది. చిత్తూరు కలెక్టరేట్/ చిత్తూరు అర్బన్:సార్వత్రిక ఎన్నిక ల ప్రచారానికి తెరపడింది. శనివారం సాయంత్రం 6 గంటలతో ప్రచార పర్వం పరిసమాప్తమైంది. జిల్లా వ్యాప్తంగా ఈ నెల 14వ తేదీ రాత్రి 7 గంటల వరకు 144 సెక్షన్ అమలు చేయడం జరుగుతుందని ఎన్నికల అధికారులు ప్రకటించారు. సోమవారం పోలింగ్ను స్వేచ్ఛాయుత వాతావరణంలో నిర్వహించేందుకు పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నట్లు పేర్కొన్నారు. అందులో భాగంగానే చిత్తూరులో కేంద్ర సాయుధ బలగాలు కవాతు నిర్వహించాయి. ఈ క్రమంలోనే జిల్లా వ్యాప్తంగా మద్యం దుకాణాలు, బార్లు మూతబడ్డాయి. ఈనెల 13వ తేదీ రాత్రి 8గంటల వరకు మద్యం దుకాణాలు, బార్లు మూసేయాల్సిందే అని ఎకై ్సజ్ అండ్ ప్రొహిబిషన్ జిల్లా అధికారి షేక్ ఆయేషాబేగం స్పష్టం చేశారు. చిత్తూరు నగరంలో పెద్ద సంఖ్యలో స్థానికేతరులను టీడీపీ నేతలు రప్పించినట్లు సమాచారం. పొరుగు రాష్ట్రాల నుంచి వేలాది మందిని తీసుకువచ్చి దొంగ ఓట్లు వేయించేందుకు ప్రణాళిక రచించిటన్లు తెలిసింది. దీనిపై పోలీసులు దృష్టి సారించి స్థానికేతరులను జిల్లా వెలుపలకు పంపించాల్సిన అవసరముంది. అలాగే టీడీపీ నేతలు ఓటర్లను ప్రలోభపెట్టేందుకు టీడీపీ నేతలు విచ్చలవిడిగా మద్యం, నగదు పంపకాలు చేపట్టారు. కర్ణాటక నుంచి భారీగా మద్యం తీసుకువచ్చి ఇక్కడి ఓటర్లను మత్తులో ముంచుతున్నారు. మూడో ర్యాండమైజేషన్ పూర్తి జిల్లాలో మూడో ర్యాండమైజేషన్ పూర్తి చేసినట్లు జిల్లా ఎన్నికల అధికారి షణ్మోహన్ తెలిపారు. శనివారం కలెక్టరేట్లో అబ్జర్వర్లు, గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో మొత్తం ప్రక్రియ నిర్వహించారు. జిల్లా ఎన్నికల అధికారి మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఎన్నికల సంఘం నిర్ధేశించిన 12 రకాల గుర్తింపు కార్డుల్లో ఏదో ఒకటి వెంట తెచ్చుకుని ఓటు వేయవచ్చని సూచించారు. కార్యక్రమంలో అబ్జర్వర్లు షాదిక్ అలం, శంకర్ప్రసాద్శర్మ, చిత్తూరు అసెంబ్లీ ఆర్ఓ శ్రీనివాసులు పాల్గొన్నారు. – 8లో– 8లో– 8లో రేపే పోలింగ్ అమల్లోకి 144 సెక్షన్ -
చంద్రబాబుకు ఘోర ఓటమి తప్పదు: మంత్రి పెద్దిరెడ్డి
సాక్షి, చిత్తూరు జిల్లా: రాష్ట్రంలో సైలెంట్ వేవ్ ఉందని.. 175 ఎమ్మెల్యేలు, 25 ఎంపీలు గెలుస్తామని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, కుప్పంలో వైఎస్సార్సీపీ గెలవబోతుందన్నారు. కుప్పంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలిచామని.. వరుస ఓటముల తర్వాత తనపై చంద్రబాబు కక్ష పెట్టుకున్నారన్న పెద్దిరెడ్డి.. తానను టార్గెట్ చేసి దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.అవినీతి సామ్రాట్ చంద్రబాబు. నారావారిపల్లెలో రెండు ఎకరాల భూమి బాబుకు ఉంది. ఇప్పుడు లక్షల కోట్లు సంపాదించారు. ఈ డబ్బు ఎలా వచ్చింది?. ఇది అవినీతి కాదా? అని పెద్దిరెడ్డి ప్రశ్నించారు. సీఎం జగన్, నాపై తరచూ చంద్రబాబు తప్పుడు ప్రచారం చేస్తున్నారు. చంద్రబాబులాగా మేము అవినీతి పరులం కాదు. పుంగనూరు, అంగళ్లు ఘటనలకు సూత్రధారి చంద్రబాబు. ఆయన ప్రభుత్వంలోని టీడీపీనేతలు రెచ్చిపోయి దాడులు చేశారు. పోలీసులను తీవ్రంగా కొట్టారు.’’ అని పెద్దిరెడ్డి ధ్వజమెత్తారు.‘‘టీడీపీ నేతలు గూండాల్లా వ్యవహరించారు. దాడులు చేయించింది చంద్రబాబు నిందలు మాపై పంపారు. ఈ ఎన్నికల్లో చంద్రబాబుకు ఘోర ఓటమి తప్పదు’’ అని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వ్యాఖ్యానించారు. -
కుప్పంలో టీడీపీ గూండాయిజం
సాక్షి, చిత్తూరు: కుప్పంలో టీడీపీ బరితెగించింది. టీడీపీ నేతలు గూండాయిజంతో చెలరేగిపోయారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలపై టీడీపీ నేతలు దాడులకు పాల్పడ్డారు. ఈ ఘటనలో ముగ్గురు వైస్సార్సీపీ కార్యకర్తలకు తీవ్ర గాయాలు అయ్యాయి. గాయపడిన వైఎస్సార్సీపీ కార్యకర్తలు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.టీడీపీ నేతల దాడిలో పలు వాహనాలు ధ్వంసం అయ్యాయి. టీడీపీ నేతల దౌర్జన్యకాండపై వైఎస్సార్సీపీ శ్రేణులు భారీ ఎత్తున నిరసన తెలిపారు. గాయపడ్డ వైఎస్సార్సీపీ కార్యకర్తలను ఎమ్మెల్యే అభ్యర్థి భరత్ పరామర్శించారు. -
అరాచకశక్తులకు జన్మభూమి
ఎన్నికల సమయంలో మాత్రమే రాజకీయాలు చేయాలి. ప్రజలకు సుపరిపాలన అందించడమే ప్రభుత్వాల లక్ష్యం కావాలి. ఇచ్చిన హామీలను తూచా తప్పకుండా నెరవేర్చాలి. బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి కృషి చేయాలి. ఎప్పటికప్పుడు సంక్షేమ ఫలాలను పేదలకు చేరవేయడంలో బాధ్యతగా వ్యవహరించాలి. అయితే చంద్రబాబు హయాంలో ఇవేమీ నడిచేవి కావు. పూట గడవని వారికి సైతం సర్కారు సాయం అందేది కాదు. ప్రతి గ్రామంలో ఏర్పాటు చేసిన జన్మభూమి కమిటీల చేతిలోనే గుత్తాధిపత్యం ఉండేది. వారు చేయి తడపందే ఏ పనీ చేసేవారు కాదు. తమ పార్టీ వారికి తప్ప నిరుపేదలను కూడా పట్టించుకునేవారు కాదు. ప్రజాధనాన్ని యథేచ్ఛగా దోచుకునేవారు. అభివృద్ధిని తమ వరకే పరిమితం చేసుకునేవారు. అరాచకశక్తులుగా తయారై జనం రక్తం పీల్చేసేవారు. లంచాల కోసం ప్రజలను వేధించేవారు. దీంతో జన్మభూమి కమిటీ పేరు చెబితేనే జనం వణికిపోతున్నారు. బాబుక అవకాశమిస్తే కొండ చిలువ నోటికి చిక్కినట్టే అని బెంబేలెత్తుతున్నారు. అవినీతి పరుల చేతిలో ఆయువు మూడినట్టే అని ఆందోళన చెందుతున్నారు. – చిత్తూరు అగ్రికల్చర్ -
ఐటీ ఉద్యోగులతో ఆత్మీయ సమావేశం
గుడిపాల : మండలానికి చెందిన ఐటీ ఉద్యోగులతో శుక్రవారం స్థానిక వైఎస్సార్సీపీ కార్యాలయం వద్ద ఎంపీ అభ్యర్థి రెడ్డెప్ప, ఎమ్మెల్యే అభ్యర్థి విజయానందరెడ్డి ఆత్మీయ సమావేశం నిర్వహించారు. విజయవాడ, చైన్నె, బెంగళూరు, హైదరాబాద్ తదితర ప్రాంతాల్లో పనిచేస్తున్న ఐటీ ఉద్యోగులు వైఎస్సార్సీపీకి మద్దతుగా ప్రచారం చేసేందుకు గుడిపాలకు వచ్చారు. ఈ సందర్భంగా వారితో సమావేశమైన అభ్యర్థులు మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చేసిన అభివృద్ధిని ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు. సంక్షేమ పథకాలను ప్రతి కుటుంబానికీ అందించారని, అందుకే మంచి జరిగుంటేనే ఓటేయమని అడిగారని వెల్లడించారు. దీనిపై ఐటీ ఉద్యోగులు స్పందిస్తూ జగనన్న పాలనను జనం మెచ్చారని, ఈ క్రమంలోనే తాము సైతం ముమ్మర ప్రచారంలో భాగస్వాములవుతున్నట్లు వివరించారు. మండలంలో వైఎస్సార్సీపీకి అఖండ మెజారిటీ తీసుకువచ్చేందుక కృషి చేస్తామని తెలిపారు. సమావేశంలో ఎంపీపీ ప్రసాద్రెడ్డి, వైఎస్సార్సీపీ మండల అధ్యక్షుడు జనార్ధన్, సింగిల్ విండో అధ్యక్షుడు శ్రీధర్రెడ్డి, నాయకులు మధుసూదన్రెడ్డి, మధుసూదన్ రాయల్, రజనీకాంత్, ప్రతాప్రెడ్డి, కలైఅరసి, వెంకటేశులురెడ్డి, జయకోడి పాల్గొన్నారు.
Pagination
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
సైకో థ్రిల్లర్గా 'దక్షిణ'.. ట్రైలర్తోనే భయపెట్టారు!
కాకినాడ గెలుపుపై కన్నబాబు రియాక్షన్
తిరుపతి కాల్పుల్లో ప్రాణాలు కోల్పోయిన యువకుడు
లేఆఫ్స్కు గురయ్యారా?.. హెచ్1- బీ వీసాలో కొత్త నిబంధనలు
సెలబ్రెటీల స్వీట్ ఫ్యామిలీస్ (ఫోటోలు)
Wamiqa Gabbi: క్యూట్ లుక్స్తో ఫిదా చేస్తున్న వామిక గబ్బి (ఫోటోలు)
అమ్ముడుపోని లక్షలాది ఇళ్లు.. చైనా కీలక ప్రతిపాదన!
'హౌస్ ఆఫ్ డ్రాగన్స్' సీజన్ 2 ట్రైలర్ రిలీజ్
32 వీడియో లింకులను బ్లాక్ చేసిన యూట్యూబ్!
ఆ స్ఫూర్తితోనే ‘రాజు యాదవ్’ కథ రాశా: డైరెక్టర్ కృష్ణమాచారి
తప్పక చదవండి
- లైంగిక వేధింపుల కేసు: భారత్కు ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ!
- ఆస్ట్రేలియాలో ఏం జరుగుతోంది? ఎందుకలా..?
- రేపటి నుంచి ఏపీ ఈఏపీ సెట్ పరీక్షలు.. అభ్యర్థులకు అలర్ట్
- టీడీపీ మూకలకు మంత్రి మేరుగ వార్నింగ్
- ఆంధ్రాలో చిన్న ఆలయానికి జూ.ఎన్టీఆర్ భారీ విరాళం
- సుచి లీక్స్.. నాకు ఆ ఫొటోలు త్రిషనే ఇచ్చింది: సుచిత్ర
- ఇవాళే అంతర్జాతీయ కుటుంబ దినోత్సవం!
- పోటెత్తిన ఏపీ ఓటర్లు.. అప్పట్లో ఏం జరిగిందంటే..!
- చైనాకు ఒకేసారి రెండు దెబ్బలు.. షాకిచ్చిన బైడెన్, ట్రంప్!
- MS Dhoni: ఎల్లలు దాటిన అభిమానం.. వామ్మో ఇలా కూడా చేస్తారా?
Advertisement