ఆర్టీసీ బస్సు ఢీకొని ఇద్దరికి గాయాలు | Sakshi
Sakshi News home page

ఆర్టీసీ బస్సు ఢీకొని ఇద్దరికి గాయాలు

Published Sun, Nov 19 2023 1:46 AM

గాయపడ్డ చంద్రమౌళి - Sakshi

పోరుమామిళ్ల : మండలంలోని నరసింగుపల్లె దగ్గర శనివారం సాయంత్రం మైదుకూరు డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు బైక్‌ను ఢీకొట్టి ఆగకుండా వెళ్లిపోయింది. కాశినాయన మండలం ఇటుకుళ్లపాడుకు చెందిన చంద్రహౌళి, రామానాయుడు బైక్‌పై పోరుమామిళ్లకు వస్తుండగా ఈ ఘటన జరిగింది. అదృష్టవశాత్తు ఇద్దరూ స్వల్పగాయాలతో బయట పడ్డారు. పోరుమామిళ్ల ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స చేయించుకున్నారు. చంద్రమౌళిని విచారించగా మైదుకూరు డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు ఢీకొట్టి ఆగకుండా వెళ్లిపోయిందని, దీనిపై పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయలేదన్నారు.

Advertisement
Advertisement