సమస్యాత్మక పోలింగ్‌ కేంద్రాల పరిశీలన | Sakshi
Sakshi News home page

సమస్యాత్మక పోలింగ్‌ కేంద్రాల పరిశీలన

Published Thu, Nov 16 2023 1:12 AM

కొత్తకోటలో మాట్లాడుతున్న ఎస్పీ రక్షిత కె.మూర్తి  - Sakshi

కొత్తకోట: పట్టణంతో పాటు మండలంలోని పలు గ్రామాల్లో 31 సమస్యాత్మక పోలింగ్‌ కేంద్రాలను గుర్తించినట్టు ఎస్‌ఐ మంజునాథ్‌రెడ్డి తెలిపారు. బుధవారం పట్టణంలోని బాలుర, బాలికల పాఠశాల పోలింగ్‌ కేంద్రాలను ఎస్పీ రక్షిత కె.మూర్తి ఆకస్మికంగా తనిఖీ చేసినట్లు వివరించారు. వసతులు పరిశీలించి ఏర్పాట్ల గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు.

ఓటర్లకు ఇబ్బందులు కలగొద్దు..

ఖిల్లాఘనపురం: పోలింగ్‌ కేంద్రాల్లో ఓటర్లకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అవసరమైన భద్రత, మౌలిక వసతులు కల్పించాలని ఎస్పీ రక్షిత కె.మూర్తి అధికారులను ఆదేశించారు. బుధవారం ఎస్‌ఐ శ్రీహరితో కలిసి మండలంలోని మానాజీపేట, సోళీపురం, ఖిల్లాఘనపురంలోని పోలింగ్‌ కేంద్రాలను పరిశీలించారు. తాగునీరు, విద్యుత్‌ సౌకర్యం తదితర సౌకర్యాలను పరిశీలించారు. స్థానిక పరిస్థితుల దృష్ట్యా కల్పించాల్సిన భద్రత, సీసీ కెమెరాల ఏర్పాటుపై ఎస్‌ఐతో చర్చించారు.

Advertisement
Advertisement