పిల్లలను విద్యావేత్తలుగా తీర్చిదిద్దాలి | - | Sakshi
Sakshi News home page

పిల్లలను విద్యావేత్తలుగా తీర్చిదిద్దాలి

Jun 3 2025 2:16 PM | Updated on Jun 3 2025 2:16 PM

పిల్లలను విద్యావేత్తలుగా తీర్చిదిద్దాలి

పిల్లలను విద్యావేత్తలుగా తీర్చిదిద్దాలి

వేలూరు: గ్రామీణ ప్రాంతాల్లోని నిరుపేద విద్యార్థులను విద్యావేత్తలుగా తయారు చేసేందుకు చ ర్యలు చేపట్టాలని తమిళనాడు పట్టభద్ర టీచర్ల సంఘం నిర్వాహక అధ్యక్షుడు మాయవన్‌ అన్నా రు. తమిళనాడు ప్రాథమికోన్నత పాఠశాల టీచర్ల సంఘం ఆధ్వర్యంలో ఉద్యోగ విరమణ పొందిన ఉపాధ్యాయులు, పదో తరగతి, ప్లస్‌టూ పరీక్షల్లో వందశాతం మార్కు లు సాధించిన హెచ్‌ఎంలు, టీచర్లకు అభినందన సభ ను వేలూరు సమీపంలోని అరపాక్కంలో ఉన్న ప్రైవే టు ఇంజినీరింగ్‌ కళాశాలలో నిర్వహించారు. ఈ సమా వేశానికి ఆ సంఘం జిల్లా అధ్యక్షుడు సెల్వకుమార్‌ అధ్యక్షత వహించారు. రాష్ట్ర అధ్యక్షుడు మాయవన్‌ మాట్లాడుతూ 545 మంది టీచర్లకు సాధన అవార్డు లు అందజేయడం అభినందనీయమన్నారు. సంఘంలోని సభ్యులు సేవాకార్యక్రమాలు చేసేందుకు ముందుకు రావాలన్నారు. ఉత్తీర్ణతా శాతంలో వేలూరు జి ల్లా ఆఖరి స్థానంలో ఉండడంతో నిరుత్సాహం చెందకుండా పట్టుదలతో ప్రయత్నం చేయాలన్నారు. అనైమిరా ఇంజినీరింగ్‌ కళాశాల చైర్మన్‌ రామదాస్‌, కార్యదర్శి దామోదరన్‌, పట్టభద్రుల టీచర్ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జయకుమార్‌, కోశాధికారి విజయసారధి, సలహాదారుడు భక్తవత్సలం, జాక్టోజియో కూటమి రాష్ట్ర కార్యవర్గ స భ్యులు, తమిళనాడు ఓకేషనల్‌ టీచర్‌ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జనార్దనన్‌, జిల్లా కార్యదర్శి ధనశేఖరన్‌, నిర్మల, శ్రీ వేంకటేశ్వర పాఠశాల మాజీ హెచ్‌ఎం నెపోలియన్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement