
సబ్ జైలులో న్యాయమూర్తుల బృందం తనిఖీ
తిరువళ్లూరు: హైకోర్టు ఆదేశాల మేరకు తిరువళ్లూరు సబ్జైలులో కలెక్టర్ ప్రతాప్ నేతత్వంలోని అధికారుల బంధం సోమవారం ఉదయం అకస్మిక తనీఖీలను నిర్వహించారు. రాష్ట్రవ్యాప్తంగా వున్న జైళ్లలో మౌలిక సదుపాయాలు, ఖైదీలకు అందించే ఆహారం, ఆయుధాల భద్రత గదితో పాటు ఇతర అంశాలపై తనిఖీలను నిర్వహించాలని హైకోర్టు ఆదేశించింది. ఇందులో భాగంగానే కలెక్టర్ ప్రతాప్, జిల్లా న్యాయమూర్తి జూలియట్ పుష్ప, ఎస్పీ శ్రీనివాసపెరుమాల్, జ్యుడిషియల్ కోర్టు న్యాయమూర్తి మీనాక్షి, చట్ట పనుల కమిషన్ కార్యదర్శి నలినీదేవి తదితరులు ఆకస్మికంగా తనిఖీ నిర్వహించారు. తిరువళ్లూరు సబ్జైలులో ఖైదీల వివరాలు, తాగునీరు, ఆహారం, మరుగుదొడ్లు, లైబ్రరి, ఆయుదాల బద్రత గది, రికార్డులు, కంప్యూటర్లను పరిశీలించారు. అనంతరం ఖైదీల వద్ద వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఖైదీలను ఇబ్బందులకు గురి చేయకుండా వుండెందుకు చర్యలు తీసుకోవడంతో పాటు వారికి అందించే ఆహారంలోనూ నాణ్యత పాటించాలని ఆదేశించారు. ఈ తనీఖీలో ఆరోగ్యశాఖ డిప్యూటీ డైరెక్టర్ ప్రియారాజన్, వైద్యశాల డీన్ రేవతితో పాటు రెవెన్యూ, విద్యాశాఖ, అగ్నిమాపకశాఖ, ఉద్యోగ ఉపాధి అవకాశాల కల్పనతో పాటూ 22 శాఖలకు చెందిన ఉన్నత అధికారులు హాజరయ్యారు.
తిరుత్తణిలో..
తిరుత్తణి: తిరుత్తణిలోని సబ్ జైలులో జిల్లా న్యాయమూర్తి ఆధ్వర్యంలో బృందం సోమవారం ఉదయం తనిఖీ చేశారు. తిరుత్తణి పాత తాలూకా కార్యాలయం సమీపంలో సబ్ జైలు వుంది. ఈ జైలులో 18 మంది విచారణ ఖైదీలు ఉంటున్నారు. ఈ క్రమంలో జైలుల్లో సదుపాయలపై జిల్లా ప్రధాన న్యాయమూర్తి జూలియట్ పుష్ప ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ ప్రతాప్, ఎస్పీ శ్రీనివాస పెరుమాళ్, జిల్లా జ్యుడిషియల్ న్యాయమూర్తి మీనాక్షి తదితరుల బందం పాల్గొన్నారు. వారికి డీఎస్పీ కందన్ ఆధ్వర్యంలో పోలీసులు స్వాగతం పలికారు.

సబ్ జైలులో న్యాయమూర్తుల బృందం తనిఖీ