
తిరుత్తణిలో వాహన ప్రమాదాలకు చెక్
● రూ. కోటి వ్యయంతో రౌండ్టానా ఏర్పాటు
తిరుత్తణి: తిరుత్తణిలో ట్రాఫిక్ సమస్యతో పాటూ వాహన ప్రమాదాలు అరికట్టే విధంగా రూ. కోటి వ్యయంతో రౌండ్టానా పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఆధ్యాత్మిక పట్టణం తిరుత్తణికి ప్రతిరోజూ వందలాది వాహనాల్లో వేలాది మంది ద్విచక్ర వాహనాలు, బస్సులు, కార్లు. లారీలు సహా వివిధ వాహనాల్లో ప్రయాణం చేస్తుంటారు. దీంతో పాటూ శుభ ముహూర్త రోజులు, పండుగలు సహా ప్రదాన రోజుల్లో వాహనాల రద్దీ విపరీతంగా పెరిగి ట్రాఫిక్ సమస్య ఏర్పడుతోంది. ప్రధానంగా బైపాస్రోడ్డు నుంచి చిత్తూరు జంక్షన్ వద్ద మూడు వైపుల నుంచి వచ్చే వాహనాలతో ప్రమాదాలు నిత్యం చోటుచేసుకునేవి. దీంతో ఆ ప్రాంతంలో రౌండ్టానా నర్మించేందుకు హైవేశాఖ అధికారులు ప్రభుత్వ దృష్టికి తీసుకొచ్చారు. రోడ్లు విస్తరణ పధకం ద్వారా రూ. కోటి వ్యయంతో చిత్తూరు తిరుత్తణి జంక్సన్ వద్ద రౌండ్టానా నిర్మాణపు జరుగుతున్నాయి. నాలుగు వైపుల నుంచి వాహనాలు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పయనించే విదంగా రోడ్డు నిర్మాణం చేపట్టి అందంగా రౌండ్టానా ఏర్పాటు చేశారు. పట్టణ ప్రాంతాలతో పోటీ పడే విధంగా తిరుత్తణిలో రోడ్డు నిర్మాణపు పనులు మెరుగుపడడంతో పట్టణ ప్రజలు వాహన చోదుకులు హర్షం వ్యక్తం చేసారు. రౌండ్టానా పట్ల తిరుత్తణి హైవేశాఖ సబ్ డివిజన్ ఇంజినీరు రఘురామన్ మాట్లాడుతూ ప్రమాదాలు అరికట్టే విధంగా రౌండ్టానా నిర్మాణ పనులు జరుగుతున్నాయి. రౌండ్టానా లోపలి భాగంగా వివిధ చెట్లు పెంచి పోషించనున్నట్లు, అలాగే చిత్తూరు తిరుత్తణి రోడ్డు డివైడర్కు మధ్యలో అందంగా దర్శనమిచ్చే చెట్లు నాటనున్నట్లు తెలిపారు. పనులు మరో నెల వ్యవధిలో పూర్తి చేయనున్నట్లు తెలిపారు.