మహిళ అదృశ్యం | Sakshi
Sakshi News home page

మహిళ అదృశ్యం

Published Mon, Mar 25 2024 1:25 AM

చిత్రలేఖనంలో ప్రతిభ కనబర్చిన విద్యార్థులు - Sakshi

మోతె : మహిళ అదృశ్యమైంది. ఈ ఘటన మోతె మండల పరిధిలోని కూడలి గ్రామంలో ఆదివారం వెలుగులోకి వచ్చింది. కూడలి గ్రామానికి చెందిన బోగ వెంకటమ్మ ఈ నెల 20న తన తండ్రి సత్తయ్యతో గొడవపెట్టుకొని ఇంటి నుంచి వెళ్లి తిరిగిరాలేదు. నాలుగు రోజులుగా బందువులు, తెలిసిన వారి ఇళ్ల వద్ద వెతికినా ఆచూకీ లభించలేదు. దీంతో వెంకటమ్మ భర్త శ్రీను ఫిర్యాదు మేరకు కూసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ యాదవేంద్రరెడ్డి తెలిపారు.

చిత్రలేఖనంలో విద్యార్థుల ప్రతిభ

మిర్యాలగూడ టౌన్‌ : ఇటీవల అమీర్‌ ఆర్ట్స్‌ ఆకాడమి నెల్లూరువారు నిర్వహించిన ఆలిండియా చిల్డ్రన్‌ ఆర్ట్స్‌ కాంటెస్ట్‌లో విజయ్‌ డ్రాయింగ్‌ క్లాసెస్‌ విద్యార్థులు ప్రతిభను కనబర్చారు. ప్రతిభను కనబరిచిన వారిలో డ్రాయింగ్‌ క్లాస్‌కు చెందిన మూడో తరగతి చదువుతున్న ఎం. అద్వైత, పి. ఆధ్య, ఎనిమిదో తరగతి చదువుతున్న కె. రిత్విక్‌రెడ్డిలు వేసిన చిత్రాలకు బంగారు పథకాలతో పాటు సర్టిఫికెట్లు లభించాయని చిత్రకారుడు యినుగుర్తి విజయ్‌కుమార్‌ తెలిపారు. ఈ సందర్భంగా ప్రతిభను కనబర్చిన విద్యార్థులను స్థానిక ప్రముఖులు ప్రత్యేకంగా అభినందించారు.

Advertisement
Advertisement