పీడీఎస్‌ బియ్యం పట్టివేత | Sakshi
Sakshi News home page

పీడీఎస్‌ బియ్యం పట్టివేత

Published Thu, Mar 28 2024 1:05 AM

స్వాధీనం చేసుకున్న బియ్యంతో అధికారులు  - Sakshi

నందిగాం : మండలంలోని కాపుతెంబూరు, దేవుపురం తదితర గ్రామాల నుంచి అక్రమంగా తరలిస్తున్న పీడీఎస్‌ బియ్యాన్ని అధికారులు బుధవారం పట్టుకున్నారు. సివిల్‌ సప్లయ్‌ డీటీ మురళీకృష్ణ ఆధ్వర్యంలో కాపుతెంబూరులో తనిఖీలు చేస్తుండగా అక్రమంగా వ్యాన్‌లో తరలిస్తున్న 953 కిలోల పీడీఎస్‌ బియాన్ని గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. సోంపేటకు చెందిన సానా మనోహర్‌ పలు గ్రామాల్లో ఈ బియ్యాన్ని కిలో రూ.10 నుంచి రూ.12లకు కొని రూ.20కు అమ్ముకుంటున్నాడని, అక్రమంగా తరలిస్తున్నందున 6ఏ కేసు నమోదు చేసి వాహనాన్ని సీజ్‌ చేసి నందిగాం పోలీస్‌ స్టేషన్‌కు తరలించామని, బియ్యాన్ని టెక్కలి ఎంఎల్‌ఎస్‌ పాయింట్‌కు తరలించామని డీటీ మురళీకృష్ణ తెలిపారు. తనిఖీల్లో ఆర్‌ఐ కిరణ్‌, కాపుతెంబూరు వీఆర్వో తారకేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement