పిల్లలకు విషమిచ్చి తల్లి ఆత్మహత్యాయత్నం | Sakshi
Sakshi News home page

పిల్లలకు విషమిచ్చి తల్లి ఆత్మహత్యాయత్నం

Published Thu, Mar 28 2024 12:30 AM

-

చిలమత్తూరు: కుటుంబ కలహాల నేపథ్యంలో పిల్లలకు విషమిచ్చి తల్లి ఆత్మహత్యాయత్నం చేసింది. గ్రామస్తులు తెలిపిన మేరకు... చిలమత్తూరు మండలం మరువకొత్తపల్లి బీసీ కాలనీకి చెందిన అనితకు ఐదుగురు కుమార్తెలు ఉన్నారు. భర్త గోపాల్‌ మద్యానికి బానిసగా మారి జులాయిగా తిరుగుతుండడంతో కుటుంబ పోషణ భారమైంది. పలుమార్లు భర్తను ప్రాధేయపడినా తాగుడు మానేయకపోవడంతో జీవితంపై విరక్తి పెంచుకున్న ఆమె బుధవారం తన పిల్లలకు విషమిచ్చి, తానూ ఆత్మహత్యాయత్నం చేసింది. సకాలంలో ఈ విషయాన్ని గుర్తించిన చుట్టుపక్కల వారు వెంటనే వారిని కర్ణాటకలోని బాగేపల్లి ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లారు. ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం చిక్కబళ్లాపురానికి తరలించారు. పిల్లల పరిస్థితి మెరుగ్గా ఉన్నట్లు సమాచారం. పరిస్థితి విషమంగా ఉన్న అనితను ఐసీయూలో ఉంచి వైద్యులు చికిత్స అందజేస్తున్నారు.

Advertisement
Advertisement