No Headline | Sakshi
Sakshi News home page

No Headline

Published Mon, Mar 25 2024 9:15 AM

-

ఉమ్మడి జిల్లాలో సుప్రసిద్ధమైన నాచగిరి లక్ష్మీనృసింహ క్షేత్రం ఆదివారం భక్తులతో కిటకిటలాడింది.

అర్చనలు, అభిషేకాలతో అలరారింది. హైదరాబాద్‌, సికింద్రాబాద్‌ జంట నగరాలు, సిద్దిపేట, సంగారెడ్డి, మెదక్‌ జిల్లాల నుంచి అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. హరిద్రానది వాగులో పుణ్యస్నానాలాచరించారు. భక్తిశ్రద్ధలతో వ్రతక్రతువు, అభిషేకం, సేవలు తదితర మొక్కులు తీర్చుకున్నారు. గర్భగుడిలో శ్రీవారిని దర్శించుకుని తరించారు. తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఆలయ ఈఓ అన్నపూర్ణ ఆధ్వర్యంలో సిబ్బంది తగు ఏర్పాట్లు చేశారు. – వర్గల్‌(గజ్వేల్‌)

Advertisement

తప్పక చదవండి

Advertisement