దర్శనానికి వెళ్లొస్తుండగా.. | Sakshi
Sakshi News home page

దర్శనానికి వెళ్లొస్తుండగా..

Published Sun, Mar 17 2024 7:30 AM

ప్రమాదానికి గురైన ఆటో - Sakshi

నారాయణఖేడ్‌: ప్రయాణికులతో వెళ్తున్న ఆటోను ఎదురుగా వచ్చిన మరో ఆటో ఢీకొట్టడంతో బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఏడుగురికి గాయాలయ్యాయి. ఈ ఘటన ఖేడ్‌ మండలం వెంకటాపూర్‌ చౌరస్తా వద్ద చోటు చేసుకుంది. బాధిత కుటుంబీకులు తెలిపిన వివరాల ప్రకారం.. సిర్గాపూర్‌ మండలం ఖాజాపూర్‌కు చెందిన ఓ కుటుంబం ఆటోలో శనివారం ఏడుపాయలకు వెళ్లి దర్శనం చేసుకొని తిరుగు పయనమయ్యారు. ఆటోలో గ్యాస్‌ అయిపోవడంతో నారాయణఖేడ్‌కు వచ్చి గ్యాస్‌ నింపుకొని గ్రామానికి బయలుదేరారు. ఖేడ్‌ మండలం వెంకటాపూర్‌ చౌరస్తావద్ద ఎదురుగా వస్తున్న ఓ గుర్తు తెలియని ఆటో వేగంగా వచ్చి వీరి ఆటోను ఢీకొట్టడంతో బోల్తాపడింది. అందులో ప్రయాణిస్తున్న భాగవ్వ (45)కు తీవ్రగాయాలు కాగా మరో ఆరుగురికి స్వల్ప గాయాలయ్యాయి. ఢీ కొట్టిన ఆటో ఆగకుండా వెళ్లిపోయింది. క్షతగాత్రులను స్థానికుల సాయంతో ఆస్పత్రికి తరలించారు.

ఆటోను ఢీకొట్టిన మరో ఆటో

పలువురికి గాయాలు

Advertisement
Advertisement