
పాఠశాలల్లో సమస్యలు పరిష్కరించండి
ఇబ్రహీంపట్నం రూరల్: విద్యా సంస్థలు పునఃప్రారంభమయ్యే నాటికి పాఠశాలల్లో సౌకర్యాలు కల్పించాలని కలెక్టర్ సి.నారాయణరెడ్డి ఆదేశించారు. కలెక్టర్ క్యాంపు కార్యాలయం నుంచి గురువారం పాఠశాలలు, హాస్టళ్లలో మౌలిక సదుపాయాలు, ఇందిరమ్మ ఇళ్లు, రాజీవ్ యువ వికాసం పథకం, తాగునీటి వసతిపై ఎంపీడీఓలు, సంబంధిత అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. పాఠశాలలు, హాస్టళ్లు, అంగన్వాడీ కేంద్రాలు ఈ నెల 12న ప్రారంభం అవుతున్న సందర్భంగా సమస్యలు ఉంటే పరిష్కరించాలన్నారు. ఇందిరమ్మ ఇళ్లు త్వరలోనే గ్రౌండ్ చేయాలని తెలిపారు. రాజీవ్ యువ వికాసం పథకంపై మాట్లాడుతూ లబ్ధిదారులు అందరూ ఒకే విధమైన యూనిట్ ఎంపిక కాకుండా చూసుకోవాలని సూచించారు. పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ ప్రతిమాసింగ్, డీఆర్ఓ సంగీత, డీఆర్డీఓ పీడీ శ్రీలత, హౌసింగ్ పీడీ హన్మంత్, తదితరులు పాల్గొన్నారు.
వసతి గృహాల్లో సౌకర్యాలు కల్పించండి
విద్యా సంవత్సరం ప్రారంభానికి సిద్ధం కండి
అధికారులకు కలెక్టర్ నారాయణరెడ్డి ఆదేశం