
థాంక్యూ సర్!
● రంగనాథ్ను కలిసినపీర్జాదిగూడ వాసులు ● శ్మశాన స్థల సమస్య తీర్చినందుకుకృజ్ఞతలు
సాక్షి, సిటీబ్యూరో: శ్మశాన స్థలాన్ని కబ్జా కోరల నుంచి విడిపించినందుకు పీర్జాదిగూడ వాసులు హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్కు కృతజ్ఞతలు తెలిపారు. సోమవారం హైడ్రా ప్రధాన కార్యాలయానికివచ్చిన పలువురు రంగనాథ్తో పాటు హైడ్రా అధికారులు హేమ మాలిని, సైదులు, బాచిరెడ్డిలను సత్కరించారు. ఎన్నో ధర్నాలు, ఆందోళనలు చేసినా తమకు న్యాయం జరగలేదని, హైడ్రాకు ఫిర్యాదు చేసిన 24 గంటల్లో పరిష్కారం లభించిందని ఈ సందర్భంగా వారు గుర్తు చేశారు.