
పాల వ్యాన్ను ఢీకొన్న బైక్
ప్రమాదంలో యువకుడి మృతి
మాడ్గుల: రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందిన సంఘటన మండలంలోని కోల్కులపల్లి గ్రామంలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన మేకల గోపయ్య(23) శనివారం రాత్రి శుభకార్యానికి వెళ్లి తిరుగు ప్రయాణంలో స్నేహితుడి బైక్పై ఇంటికి వస్తున్నారు. మార్గమధ్యలో గ్రామ శివారులోని వైన్స్ సమీపంలో అదుపు తప్పి పాల వ్యాన్ను ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో గోపయ్యకు తీవ్ర గాయాలవ్వడంతో మాల్లోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. స్నేహితుడు మహేశ్ తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతున్నాడు. మృతుడి తండ్రి సాయిలు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.