బైక్‌ అదుపుతప్పి వ్యక్తి మృతి | Sakshi
Sakshi News home page

బైక్‌ అదుపుతప్పి వ్యక్తి మృతి

Published Sat, Nov 11 2023 2:02 AM

సంఘటనా స్థలంలో మృతదేహం   - Sakshi

కంభం: ద్విచక్ర వాహనం అదుపు తప్పడంతో ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందారు. ఈ సంఘటన శుక్రవారం కంభం మండలంలోని యర్రబాలెం గ్రామ సమీపంలో చోటుచేసుకుంది. వివరాలు.. బేస్తవారిపేట మండలం చిన్నఓబినేనిపల్లికి చెందిన రంజిత్‌రెడ్డి(39) కాలువపల్లెలోని అత్తగారింటికి ద్విచక్ర వాహనంపై వెళ్తున్నారు. ఈ క్రమంలో యర్రబాలెం గ్రామ సమీపంలో ద్విచక్ర వాహనం అదుపు తప్పడంతో రోడ్డుపై పడి అక్కడికక్కడే మృతి చెందారు. మృతదేహాన్ని కంభం ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.

Advertisement
Advertisement