YSRCP: గుంటూరు అధ్యక్షుడు, తాడిపత్రి ఎన్నికల పరిశీలకుల నియామకం | Sakshi
Sakshi News home page

YSRCP: గుంటూరు అధ్యక్షుడు, తాడిపత్రి ఎన్నికల పరిశీలకుల నియామకం

Published Mon, Apr 29 2024 10:58 AM

YSRCP Guntur President And Tadipatri Election Observer Appointed

సాక్షి, తాడేపల్లి: ఏపీలో ఎన్నికల సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. గుంటూరు జిల్లా వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడిని, తాడిపత్రి ఎన్నికల పరిశీలకులను సీఎం జగన్‌ నియమించారు.

కాగా, గుంటూరు జిల్లా వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడిగా మందపాటి శేషగిరిరావు నియామకమయ్యారు. అలాగే, తాడిపత్రి అసెంబ్లీ నియోజకవర్గ ఎన్నికల పరిశీలకులుగా డాక్టర్ మలికిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని నియమించారు. ఇక, ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్ ఆదేశాలతో పార్టీ కేంద్ర కార్యాలయం తాజాగా ప్రకటన విడుదల చేసింది. 

Advertisement
Advertisement