అచ్చంపేట: స్థానిక డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ఆంద్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ బాలుర గురుకుల కళాశాలకు చెందిన ముగ్గురు విద్యార్థులు జాతీయ స్థాయి రెజ్లింగ్ (కుస్తీ) పోటీలకు అర్హత సాధించారు. ఎంపికై న విద్యార్థులను మంగళవారం కళాశాల అధ్యాపకులు అభినందించారు. విద్యార్థులకు తర్ఫీదునిచ్చిన ఫిజికల్ డైరెక్టర్ జి.భూషణం మాట్లాడుతూ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆద్వర్యంలో ఈనెల 11, 12, 13 తేదీలలో కృష్ణా జిల్లా నున్న గ్రామంలోని జిల్లా పరిషత్ హైస్కూలు ఆవరణలో జరిగిన రాష్ట్ర స్థాయి రెజ్లింగ్ (కుస్తీ) పోటీలలో తమ కళాశాలకు చెందిన 10 మంది విద్యార్థులు పాల్గొన్నట్లు చెప్పారు. వారిలో ఇంటర్ సెకండియర్ విద్యార్థులు కె.కిరణ్కుమార్, జి.ఇసాక్, కె.ప్రభాకర్ బంగారు పతకాలు సాధించి జాతీయ రెజ్లింగ్ పోటీలకు ఎంపికై నట్లు వెల్లడించారు. వీరితో పాటు బి.మహేంద్ర రజిత పతకం సాధించగా, వి.చంటి, బి.సాగర్ మహేష్ కాంస్య పతకాలు సాధించినట్లు వివరించారు. బంగారు పతకాలు సాధించిన ముగ్గురు విద్యార్థులు త్వరలో దేశ రాజధాని ఢిల్లీలో జరిగే జాతీయ స్థాయి రెజ్లింగ్ పోటీలలో పాల్గొంటారని పేర్కొన్నారు. విద్యార్థులను అభినందించిన వారిలో ప్రిన్సిపాల్ టి.అరుణ్కుమార్, వైస్ ప్రిన్సిపాల్, టి.జె.ఎస్.సంపత్కుమార్ తదితరులు ఉన్నారు.
జాతీయ రెజ్లింగ్కు గురుకుల విద్యార్థులు
Published Wed, Nov 15 2023 12:54 AM
Advertisement
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
తప్పక చదవండి
- తెలంగాణ లోక్సభ ఎన్నికల ఫైనల్ పోలింగ్ 65.67 శాతం
- మోదీకి సొంత ఇళ్లు, కారు కూడా లేదట!.. ప్రధాని ఆస్తులివే..
- మాజీ భర్త గే అన్న సుచిత్ర.. స్పందించిన నటుడు
- Royal Challengers Bengaluru: తిరుమల శ్రీవారి సేవలో ఆర్సీబీ క్రికెటర్లు (ఫొటోలు)
- MS Dhoni: అందుకే వాళ్లంటే నాకు, జడ్డూకు చిరాకు!
- ప్రోటీన్ సప్లిమెంట్లను వాడుతున్నారా? హెచ్చరిస్తున్న మెడికల్ రీసెర్చ్
- స్వాతిమలివాల్పై దాడి.. ఆందోళనకు దిగిన బీజేపీ కార్పొరేటర్లు
- ఢిల్లి లిక్కర్ కేసులో కవిత జ్యుడీషియల్ రిమాండ్ పొడిగింపు
- Tandur: పసికందు ప్రాణం తీసిన పెంపుడు కుక్క
- టీడీపీ కార్యకర్తల్లా పోలీసులు: అనిల్కుమార్ ఆగ్రహం
Advertisement