పీఎం పర్యటన నేపథ్యంలో రేపు ట్రాఫిక్‌ ఆంక్షలు | - | Sakshi
Sakshi News home page

పీఎం పర్యటన నేపథ్యంలో రేపు ట్రాఫిక్‌ ఆంక్షలు

May 1 2025 1:50 AM | Updated on May 1 2025 1:50 AM

పీఎం పర్యటన నేపథ్యంలో రేపు ట్రాఫిక్‌ ఆంక్షలు

పీఎం పర్యటన నేపథ్యంలో రేపు ట్రాఫిక్‌ ఆంక్షలు

విజయవాడస్పోర్ట్స్‌: రాజధాని పునఃనిర్మాణ పనుల శంకుస్థాపన కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ ఈ నెల 2వ తేదీన గుంటూరు జిల్లా వెలగపూడికి విచ్చేస్తున్న నేపధ్యంలో విజయవాడ నగరంలోని పలు ప్రాంతాల్లో ట్రాఫిక్‌ ఆంక్షలు విధిస్తున్నట్లు ఇన్‌చార్జ్‌ పోలీస్‌ కమిషనర్‌ సర్వశ్రేష్ఠ త్రిపాఠి బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. శుక్రవారం ఉదయం ఐదు గంటల నుంచి రాత్రి పది గంటల వరకు ఈ ఆంక్షలు అమలులో ఉంటాయని వెల్లడించారు. ఈ ఆంక్షల సమయంలో వీఐపీ, వీవీఐపీలు నోవాటల్‌ హోటల్‌ నుంచి మహానాడు జంక్షన్‌, రమేష్‌ హాస్పిటల్‌ జంక్షన్‌, బెంజ్‌ సర్కిల్‌కు చేరుకుని అక్కడ నుంచి కుడివైపునకు తిరిగి ఎంజీ రోడ్డు మీదుగా పీసీఆర్‌ జంక్షన్‌, వినాయక టెంపుల్‌, సీతమ్మవారిపాదాలు, ప్రకాశంబ్యారేజ్‌ నుంచి సభా ప్రాంగణానికి చేరుకోవాలని పేర్కొన్నారు.

లారీలు, భారీ వాహనాలు మళ్లింపు

● గుంటూరు–విశాఖపట్నంకు రాకపోకలు సాగించే వాహనాలు బుడంపాడు క్రాస్‌, తెనాలి, వేమూరు, కొల్లూరు, వెల్లటూరు, పెనుమూడి బ్రిడ్జి, మోపిదేవి, చల్లపల్లి, పామర్రు, గుడివాడ, హనుమాన్‌ జంక్షన్‌ మార్గాన్ని అనుసరించాలి.

● విశాఖపట్నం–చైన్నెకు రాకపోకలు సాగించే వాహనాలు హనుమాన్‌జంక్షన్‌, గుడివాడ, పామర్రు, చల్లపల్లి, మోపిదేవి, పెనుమూడి బ్రిడ్జి, రేపల్లె, బాపట్ల, చీరాల, త్రోవగుంట మార్గాన్ని అనుసరించాలి.

● చైన్నె–హైదరాబాద్‌కు అద్దంకి, పిడుగురాళ్ళ, నడికుడి, దామరచర్ల మిర్యాలగూడ, నార్కెట్‌పల్లి మీదుగా రాకపోకలు సాగించాలి.

సభా ప్రాంగణానికి వెళ్లే బస్సులు,

కార్లు మళ్లింపు

● ఏలూరు వైపు నుంచి వాహనాలు చినఅవుటపల్లి వద్ద పశ్చిమ బైపాస్‌ మీదుగా ముస్తాబాద, నున్న, ఇన్నర్‌ రింగ్‌ రోడ్‌, కండ్రిక జంక్షన్‌, పైపుల రోడ్‌, వై.వి రావు ఎస్టేట్‌, పాములకాలువ, వెస్ట్‌ బైపాస్‌ సర్వీస్‌ రోడ్డు, నల్లకుంట అండర్‌ బైపాస్‌ బ్రిడ్జి, కృష్ణానది ఐకానిక్‌ నుంచి వెలగపూడి సభా ప్రాంగణానికి చేరుకోవాలి.

● ఏలూరు జిల్లా కై కలూరు, కలిదిండి, మండవల్లి, ముదినేపల్లి నుంచి వచ్చే బస్సులు, కృష్ణాజిల్లా నుంచి వచ్చే బస్సులు బెంజ్‌సర్కిల్‌, స్క్యూ బ్రిడ్జి, వారథి, తాడేపల్లి, మంగళగిరి, ఎన్‌ఆర్‌ఐ, ఎర్రుబాలెం మీదుగా సభా ప్రాంగణానికి చేరుకోవాలి.

● ఎన్టీఆర్‌ జిల్లా జగ్గయ్యపేట, నందిగామ, మైలవరం, తిరువూరు నియోజకవర్గాల నుంచి వచ్చే బస్సులు ఇబ్రహీంపట్నం రింగ్‌, నల్లకుంట, పశ్చిమ బైపాస్‌ సర్వీస్‌ రోడ్‌, కృష్ణానది ఐకానిక్‌ మీదుగా వెలగపూడి సభా ప్రాంగణానికి చేరుకోవాలి.

● విజయవాడ నగరం నుంచి వెళ్లే బస్సులు, కార్లు బెంజ్‌సర్కిల్‌, స్క్యూ బ్రిడ్జి, వారథి, తాడేపల్లి, మంగళగిరి ఒక మార్గంగా, పైపుల రోడ్‌, వైవీ రావు ఎస్టేట్‌, పాములకాలువ, వెస్ట్‌ బైపాస్‌, కృష్ణానది ఐకానిక్‌ మీదుగా వెలగపూడి సభా ప్రాంగణానికి చేరుకోవాలి. సభ ముగిసే వరకు విశాఖపట్నం నుంచి వచ్చే భారీ వాహనాలను పొట్టిపాడు టోల్‌ ప్లాజా వద్ద, హైదరాబాద్‌ నుంచి వచ్చే భారీ వాహనాలను ఇబ్రహీంపట్నం ట్రక్‌ టెర్మినల్‌ వద్ద నిలిపి వేస్తామని ఇన్‌చార్జ్‌ సీపీ ప్రకటించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement