
‘పది’ టాపర్స్కు ఘన సత్కారం
వన్టౌన్(విజయవాడపశ్చిమ): పదో తరగతి పబ్లిక్ పరీక్షల్లో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులను కలెక్టర్ లక్ష్మీశ గురువారం తన కార్యాలయంలో సత్కరించారు. జిల్లా ప్రభుత్వ పాఠశాలలకు సంబంధించి చెందిన పసుపులేటి నందిని (593)(ఎంబీఎం జిల్లా పరిషత్ హైస్కూల్ మైలవరం), గాదంశెట్టి సాయిచరణ్ (593) (శ్రీ తేలప్రోలు బాపనయ్య హైస్కూల్, విజయవాడ), కొంపిల్లి ప్రణీత్కుమార్ (592) (ఏకేటీపీ మున్సిపల్ హైస్కూల్, విజయవాడ), ప్రైవేట్ విద్యాసంస్థలకు చెందిన కొల్లి స్వాతి (598) (నవోదయ హైస్కూల్, విజయవాడ) తదితరులను కలెక్టర్ అభినందించి సత్కరించారు. వారితో పాటుగా జిల్లా పాఠశాల విద్యాశాఖాధికారి యూవీ సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు.