మూత్రపిండాల సంబంధిత వ్యాధితో మృతి | Sakshi
Sakshi News home page

మూత్రపిండాల సంబంధిత వ్యాధితో మృతి

Published Sat, May 4 2024 4:20 AM

-

కామారెడ్డి టౌన్‌: రాజంపేట మండలం కొండాపూర్‌కు చెందిన నీరడి ఎల్లవ్వ వడ దెబ్బ కారణంగా మృతి చెందలేదని, ఆమెకు మూత్రపిండాల సంబంధిత వ్యాధి ఉందని జిల్లా వైద్యారోగ్య శాఖాధికారి లక్ష్మణ్‌సింగ్‌ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఎల్లవ్వ వడదెబ్బతో మృతి చెందినట్లు గురువారం మీడియాలో వార్తలు రావడంతో తాము విచారణ చేపట్టినట్లు తెలిపారు. బుధవారం మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఆరోగ్యంగా ఉన్న ఎల్లవ్వ మేకల పెంపకం పనిలో నిమగ్నమై ఉండగా.. అకస్మాత్తుగా కుప్పకూలిందని పేర్కొన్నారు. కుటుంబ సభ్యులు ఆమెను వెంటనే కామారెడ్డిలోని ప్రభుత్వ ఆస్పత్రికి, మెరుగైన చికిత్స కోసం అక్కడి నుంచి హైదరాబాద్‌లోని గాంధీ ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందిందని తెలిపారు.

Advertisement
 

తప్పక చదవండి

Advertisement