కొనసాగుతున్న నీటి విడుదల | Sakshi
Sakshi News home page

కొనసాగుతున్న నీటి విడుదల

Published Wed, Apr 17 2024 2:20 AM

-

పెద్దఅడిశర్లపల్లి: తాగునీటి అవసరాల కోసం ఏఎమ్మార్పీ నుంచి ఉదయ సముద్రానికి నీటి విడుదల కొనసాగుతోంది. ఈ నెల 2 నుంచి అక్కంపల్లి బ్యాలెన్సింగ్‌ రిజర్వాయర్‌ నుంచి 900 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. సాగర్‌ వెనుక జలాల నుంచి 800 క్యూసెక్కుల నీటిని లింక్‌ కెనాల్‌ ద్వారా ఏకేబీఆర్‌కు పంపిస్తున్నట్లు అధికారులు తెలిపారు. అక్కడి నుంచి మెయిన్‌ కెనాల్‌ ద్వారా హైదరాబాద్‌ జంట నగరాలకు 525 క్యూసెక్కులు, మిషన్‌ భగీరథకు 45 క్యూసెక్కుల, ఉదయ సముద్రానికి 900 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నట్లు ప్రాజెక్టు ఈఈ జీజేవీ సత్యనారాయణ తెలిపారు. సాగర్‌ వెనుక జలాలలో ఏర్పాటు చేస్తున్న ప్రత్యామ్నాయ మోటార్ల బిగింపు పనులు పూర్తి కావొస్తున్నాయని, రెండు రోజుల్లో ట్రయల్‌ రన్‌ నిర్వహిస్తామని హైదరాబాద్‌ జలమండలి అధికారులు తెలిపారు.

Advertisement
Advertisement