
పేదల అభ్యున్నతికి ప్రభుత్వం పెద్దపీట
తాడూరు/తెలకపల్లి/బిజినేపల్లి: ఇల్లు అనేది ప్రతి మనిషి కల.. ఆ కలను సాకారం చేయడమే ఇందిరమ్మ ఇళ్ల పథకం లక్ష్యమని, పేదల అభ్యున్నతికి కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని నాగర్కర్నూల్ ఎమ్మెల్యే రాజేశ్రెడ్డి అన్నారు. శనివారం తాడూరు ఎంపీడీఓ కార్యాలయ సమావేశ మందిరం, తెలకపల్లి, బిజినేపల్లిలోని ఏంజేఆర్ ఫంక్షన్హాల్లో జరిగిన కార్యక్రమాల్లో ఆయన పాల్గొని లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాలను అందజేసి మాట్లాడారు. తాడూరు మండలం తమకు కలిసొచ్చిందని.. అందుకే ఈ కార్యక్రమాన్ని ఇక్కడే ప్రారంభిస్తున్నామని చెప్పారు. అర్హులైన ప్రతి ఒక్కరికి ఇల్లు మంజూరు చేయాలన్నదే తమ లక్ష్యమని.. ప్రజల మద్దతుతో సంక్షేమ పథకాలను అమలు చేస్తామని వివరించారు. పేదల సంక్షేమానికి ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి కట్టుబడి ఉన్నారని.. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను తప్పక అమలు చేస్తారని చెప్పారు. తాడూరు మండలానికి 500 మంజూరయ్యాయని.. లబ్ధిదారులందరూ త్వరగా నిర్మించుకోవాలని కోరారు. అలాగే తెలకపల్లిలో 619 మంది, బిజనేపల్లి మండలంలో 685 మంది లబ్ధిదారులకు మంజూరు పత్రాలు అందజేశారు. తాడూరులో జరిగిన కార్యక్రమంలో ఎంపీడీఓ ఆంజనేయులు, చైర్మన్ రామచంద్రారెడ్డి, పీడీ సంగప్ప, ఏఈ రాజవర్ధన్రెడ్డి, సంద రేణుక, యూత్ కాంగ్రెస్ నాయకుడు వినోద్కుమార్, తెలకపల్లిలో జరిగిన కార్యక్రమంలో ఎంపీడీఓ శ్రీనివాసులు, వైస్ చైర్మన్ మామిళ్లపల్లి యాదయ్య, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ చిన్న జంగయ్య, ప్రకాష్, ఖుర్షిద్, బండ పర్వతాలు వెంకటయ్యగౌడ్, నిరంజన్, బిజనేపల్లిలో జరిగిన కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు నసీర్, తిరుపతయ్య, మిద్దె రాములు, బంగరి పర్వతాలు, పండ్ల పాషా, ముద్ద మధుసూదన్రెడ్డి, ముక్తార్, అధికారులు, ఆయా గ్రామాల కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొన్నారు.
చెక్కుల పంపిణీ..
నాగర్కర్నూల్ రూరల్: జిల్లాకేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో 73 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్, సీఎంఆర్ఎఫ్ చెక్కులను ఎమ్మెల్యే డా. రాజేశ్రెడ్డి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సంక్షేమ పథకాలను అర్హులందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు వినోద్కుమార్, మాజీ కౌన్సిలర్లు, స్థానిక ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.