అలంపూర్‌ తేనేటి విందుతో ప్రకంపనలు | - | Sakshi
Sakshi News home page

అలంపూర్‌ తేనేటి విందుతో ప్రకంపనలు

Jun 7 2025 12:23 AM | Updated on Jun 7 2025 12:23 AM

అలంపూర్‌ తేనేటి విందుతో ప్రకంపనలు

అలంపూర్‌ తేనేటి విందుతో ప్రకంపనలు

ఎంపీ మల్లు రవి, మాజీ ఎమ్మెల్యే సంపత్‌ కుమార్‌ మధ్య కొన్నాళ్లుగా అంతర్గత వైరం కొనసాగుతున్నట్లు సమాచారం. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మల్లురవి.. బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే విజయుడితో కలిసి జెడ్పీ మాజీ చైర్‌పర్సన్‌న్‌ సరిత ఇంట్లో తేనేటి విందులో పాల్గొనడం కాంగ్రెస్‌లో ప్రకంపనలు సృష్ట్టించింది. దీంతో నేతల మధ్య విభేదాలు మరోసారి భగ్గుమన్నాయి. సంపత్‌కుమార్‌ వర్గీయులు మల్లు రవికి వ్యతిరేకంగా గళం వినిపించారు. అలంపూర్‌లో సంపత్‌ అన్నీ తానై ఎంపీగా మల్లు రవిని గెలిపించాడని.. ఆయనేమో సంపత్‌ను రాజకీయంగా దెబ్బతీసేలా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేను కాంగ్రెస్‌లోకి రప్పించే ప్రయత్నం చేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. పార్టీ క్రమశిక్షణ సంఘం చైర్మన్‌ అయి ఉండి క్రమశిక్షణ తప్పారని.. వివిధ ప్రభుత్వ, ఇతర పనుల్లో పెద్ద ఎత్తున డబ్బులు చేతులు మారాయని ఆరోపించడం పార్టీలో కాక రేపింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement