
సీఈఐఆర్ పోర్టల్లో ఫిర్యాదుల నమోదు : ఎస్పీ
నాగర్కర్నూల్ క్రైం: ఎవరైనా తమ విలువైన సెల్ఫోన్లను పోగొట్టుకుంటే సీఈఐఆర్ పోర్టల్లో నమోదు చేసి దరఖాస్తును సంబంధిత పోలీస్స్టేషన్లలో అందజేయాలని ఎస్పీ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్ సూచించారు. బుధవారం జిల్లా పోలీసు కార్యాలయంలో బాధితులకు పోగొట్టుకున్న ఫోన్లు అందజేసి మాట్లాడారు. జిల్లాలోని 22 పోలీస్స్టేషన్ల పరిధిలో సెల్ఫోన్లు పోగొట్టుకున్న వారి నుంచి ఫిర్యాదులు స్వీకరించి ఐటీసెల్ విభాగంలోని నిష్ణాతులైన పోలీసు సిబ్బందితో గుర్తించి రికవరీ చేసినట్లు వివరించారు. ఇప్పటి వరకు రూ.18 లక్షల విలువైన 100 ఫోన్లను గుర్తించి అందించినట్లు చెప్పారు. కార్యక్రమంలో ఐటీకోర్ సిబ్బంది విక్రమ్ తదితరులు పాల్గొన్నారు.