ఉపాధి కూలీల ఆందోళన | Sakshi
Sakshi News home page

ఉపాధి కూలీల ఆందోళన

Published Mon, Mar 25 2024 12:30 AM

ఆందోళన చేస్తున్న ఉపాధి కూలీలు - Sakshi

హవేళిఘణాపూర్‌(మెదక్‌): మండల పరిధిలోని పోచమ్మరాల్‌ గ్రామంలో శనివారం ఉపాధి కూలీలు ఆందోళన దిగారు. వారం రోజులుగా పని చేయగా చివరి రోజు ఆన్‌లైన్‌లో పేర్లు లేవంటూ చెప్పడంపై నిరసన వ్యక్తం చేశారు. గ్రామంలో గతంలో 300 మందికిపైగా జాబ్‌కార్డులు కలిగి ఉన్నామని.. ప్రస్తుతం ఆన్‌లైన్‌లో పేర్లు తొలగిపోవడం ఏమిటని ప్రశ్నించారు. అవగాహన లేని ఫీల్డ్‌ అసిస్టెంట్‌తో ఇబ్బంది పడుతున్నామని మండిపడ్డారు. అధికారులు స్పందించి తమకు కూలీ డబ్బులు వచ్చే విధంగా చూడాలని కోరారు. సాంకేతిక లోపంతో పేర్లు తొలగిపోయాయని, చేసిన పనులకు డబ్బులు ఇప్పించే విధంగా కృషి చేస్తామని ఎంపీడీఓ రవీశ్వర్‌గౌడ్‌ పేర్కొన్నారు.

Advertisement
Advertisement