‘దళితుల మధ్య చిచ్చుపెడుతున్న మోదీ’ | Sakshi
Sakshi News home page

‘దళితుల మధ్య చిచ్చుపెడుతున్న మోదీ’

Published Tue, Nov 14 2023 1:18 AM

-

నెహ్రూసెంటర్‌: ఎస్సీ వర్గీకరణ పేరుతో దక్షిణాది దళితుల మధ్య ప్రధాని మోదీ చిచ్చుపెడుతున్నాడని తెలంగాణ మాలమహానాడు రాష్ట్ర అధ్యక్షుడు పిల్లి సుధాకర్‌ అన్నారు. జిల్లా కేంద్రంలోని అంబేడ్కర్‌ సెంటర్‌లో ఆ సంఘం ఆధ్వర్యంలో సోమవారం నిరసన తెలిపారు. ఈ సందర్భంగా పిల్లి సుధాకర్‌ మాట్లాడుతూ.. ఇటీవల హైదరాబాద్‌లో జరిగిన సభకు హాజరైన మోదీ ఎస్సీ వర్గీకరణకు అనుకూలమని ప్రకటించి, దళితుల మధ్య చిచ్చుపెట్టడానికి కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. మాదిగలపై ప్రేమ ఉంటే శీతాకాల పార్లమెంట్‌ సమావేశాల్లో బిల్లు ప్రవేశపెడుతామని ఎందుకు ప్రకటించలేదని ప్రశ్నించారు. మనువాద మాయమాటలకు మాదిగలు మోసపోవద్దని, రిజర్వేషన్ల పెంపు, రాజ్యాంగ పరిరక్షణ కోసం కలిసి పనిచేయాలని కోరారు. ప్రస్తుతం జరగనున్న అసెంబ్లీ ఎన్నికలతో పాటు రానున్న పార్లమెంట్‌ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థుల ఓటమే లక్ష్యంగా టీఎంఎం పని చేస్తుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో సంఘం రాష్ట్ర నాయకులు తవ్వల జయపాల్‌, చీదురు వెంకన్న, బెజ్జం రమేష్‌, బూర్గుల రమేష్‌చందర్‌, కొత్తపల్లి కేశవరావు, గండమల్ల జానీ, పల్లి సాయి, బూర్గుల శ్రీనివాస్‌, పప్పుల వెంకన్న, కందుల తిరుపతయ్య తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement