సీఎం బహిరంగ సభకు అంతా సిద్ధం | Sakshi
Sakshi News home page

సీఎం బహిరంగ సభకు అంతా సిద్ధం

Published Fri, Mar 29 2024 2:20 AM

ఎమ్మిగనూరులో ముస్తాబైన సీఎం సభా వేదిక 
 - Sakshi

ఎమ్మిగనూరుటౌన్‌: ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి బహిరంగ సభకు ఎమ్మిగనూరు పట్టణంలోని వైడబ్ల్యూసీఎస్‌ మైదానం సిద్ధమైంది. గురువారం సాయంత్రానికే ఏర్పాట్లు పూర్తి చేశారు. సీఎం ప్రసంగించేందుకు సభా వేదిక, ప్రజలకు అభివాదం చేసేందుకు ర్యాంప్‌ నిర్మించారు. ప్రజలు కూర్చునేందుకు కుర్చీలు ఏర్పాటు చేశారు. విద్యుత్‌ లైట్ల ఏర్పాట్లు, బ్యారికేడ్ల ఏర్పాటు ప్రక్రియలు పూర్తయ్యాయి. లక్షమందికి పైగా సభలో కూర్చొనేందుకు వీలుగా ఏర్పాట్లు చేశారు. సభా ప్రాంగణం వద్ద భద్రతా ఏర్పాట్లను పోలీసు అధికారులు పర్య వేక్షించారు.

Advertisement
Advertisement