బాస్కెట్‌బాల్‌, టగ్‌ ఆఫ్‌ వార్‌ జట్ల ఎంపిక | Sakshi
Sakshi News home page

బాస్కెట్‌బాల్‌, టగ్‌ ఆఫ్‌ వార్‌ జట్ల ఎంపిక

Published Sun, Nov 19 2023 12:16 AM

టగ్‌ ఆఫ్‌ వార్‌ బాలికల జట్టుతో అధికారులు - Sakshi

ఖమ్మం స్పోర్ట్స్‌: జిల్లా స్కూల్‌గేమ్స్‌ ఫెడరేషన్‌ ఆధ్వర్యాన శనివారం ఖమ్మంలోని సర్దార్‌ పటేల్‌ స్టేడియంలో ఉమ్మడి జిల్లా స్థాయి బాలబాలికల అండర్‌–17 బాస్కెట్‌బాల్‌, అండర్‌–14, 17 టగ్‌ ఆఫ్‌ వార్‌ జట్ల ఎంపిక చేశారు. ఈ ఎంపిక పోటీలకు రెండు జిల్లాల నుంచి 190 మంది క్రీడాకారులు హాజరయ్యారు. పోటీలను పీఈటీలు కృష్ణమూర్తి, పీ.వీ.రమణ, కె.రామారావు, షఫీక్‌ అహ్మద్‌, రంజాన్‌, సైదేశ్వర్‌రావు, ఖుద్దూస్‌, రాజకుమారి, రవి పర్యవేక్షించగా.. రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొనే జిల్లా జట్ల వివరాలను జిల్లా పాఠశాలల క్రీడా కార్యదర్శి కె.నర్సింహామూర్తి ప్రకటించారు. బాలుర అండర్‌–17 బాస్కెట్‌బాల్‌ జట్టుకు ఆర్‌.దివాకర్‌, ఎన్‌.జాయిదీప్‌, అకిబోయాం, సిద్దు, అబిద్‌, వినయ్‌కుమార్‌, వెంకట్‌సాయి, లోకేశ్‌, ఖాదర్‌, సోహెల్‌, వెంకటరామ సత్యసాయికిరణ్‌, నవ్యనాథ్‌ ఎంపికకాగా, బాలికల జట్టుకు భానుస్పందన, రింశా, సాగరిక, మౌనిక, అఖిల, మంజుల, ధాత్రి, తియ, రూపా, ఆరిఫా, రిఫత్‌ జైన్‌ ఎంపకయ్యారని తెలిపారు. అలాగే, టగ్‌ ఆఫ్‌ వార్‌ అండర్‌– 14 బాలురు జట్టుకు భాను, శ్రవణ్‌, బి.మహేశ్‌, భార్గవ్‌, మోబిన్‌, తరుణ్‌, శ్రీనాథ్‌, అభిలాష, చైతన్య, అభిలాశ్‌, శివశంకర్‌, శరణ్‌సాయి, రాంచరణ్‌, బాలికల జట్టుకు దీక్షిత, కార్తీక, భవాని, మాధురి, సుప్రియ, మధు శ్రీ,అమూల్య, సంజన, ఉష, కల్యాణి, మేఘన, మనీషా ఎంపికయ్యారు. ఇక అండర్‌– 17 బాలుర జట్టులో తరుణ్‌, గణేశ్‌, మహేశ్‌, చరణ్‌, ప్రదీప్‌, వీరభద్రం, భాను ప్రసాద్‌, అరవింద్‌, చరణ్‌, సాయి మణికంఠ, వెంకటేశ్‌, ఫరీద్‌, మణికంఠ, జశ్వంత్‌, బాలికల జట్టులో మనీషా, భార్గవి, మౌక్షిత, వైష్ణవి, ఝూన్సీ శృతి, భవాని, పూజిత, అఖిల, శ్రీలక్ష్మిదుర్గ, హర్షిత, మౌనిక, అనుష్క ఎంపికయ్యారని వెల్లడించారు.

Advertisement
Advertisement