కోలారు: వచ్చే లోక్సభ ఎన్నికల్లో హైకమాండ్ సూచించిన అభ్యర్థిని అందరూ కలిసి భారీ మెజాక్టీతో గెలిపించాలని జిల్లా ఇన్చార్జి మంత్రి భైరతి సురేష్ సూచించారు. సోమవారం తాలూకాలోని రామసంద్ర వద్ద ఉన్న ప్రైవేటు హోటల్లో కోలారు లోక్సభ అభ్యర్థి ఎంపిక విషయంపై ఏర్పాటు చేసిన కాంగ్రెస్ నాయకుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కోలారులో సమర్థుడైన అభ్యర్థిని ఎంచుకుని హైకమాండ్ సిఫార్సుకు పంపించామన్నారు. ఇందుకు పలువురు అభ్యంతరం తెలిపారు. అభ్యర్థి ఎంపిక విషయంలో ఎవరూ గందరగోళం సృష్టించవద్దన్నారు. హైకమాండ్ సూచించిన అభ్యర్థి విజయం కోసం అందరూ కలిసి పని చేయాలన్నారు. ఎమ్మెల్యే కొత్తూరు మంజునాథ్ మాట్లాడుతూ హైకమాండ్ సూచించిన వ్యక్తికి మద్దతు తెలపాలని సూచిస్తే ఇక ఈ సమావేశాన్ని ఎందుకు ఏర్పాటు చేశారు? అందరి అభిప్రాయాలు సేకరించాల్సిన అవసరం ఏముంది? అని ప్రశ్నించారు. మంజునాథ్ అభిప్రాయంతో కొందరు ఏకీభవించారు. సమావేశంలో మంత్రి రామలింగారెడ్డి, కెహెచ్ మునియప్ప, ఎమ్మెల్యేలు ఎస్ ఎన్ నారాయణస్వామి, కె వై నంజేగౌడ, మంత్రి సుధాకర్, ఎమ్మెల్సీ ఎంఎల్ అనిల్కుమార్, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.
పార్టీ అభ్యర్థినే గెలిపించాలి
Published Tue, Dec 5 2023 5:06 AM
Advertisement
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
తప్పక చదవండి
- తెలంగాణ లోక్సభ ఎన్నికల ఫైనల్ పోలింగ్ 65.67 శాతం
- మోదీకి సొంత ఇళ్లు, కారు కూడా లేదట!.. ప్రధాని ఆస్తులివే..
- మాజీ భర్త గే అన్న సుచిత్ర.. స్పందించిన నటుడు
- Royal Challengers Bengaluru: తిరుమల శ్రీవారి సేవలో ఆర్సీబీ క్రికెటర్లు (ఫొటోలు)
- MS Dhoni: అందుకే వాళ్లంటే నాకు, జడ్డూకు చిరాకు!
- ప్రోటీన్ సప్లిమెంట్లను వాడుతున్నారా? హెచ్చరిస్తున్న మెడికల్ రీసెర్చ్
- స్వాతిమలివాల్పై దాడి.. ఆందోళనకు దిగిన బీజేపీ కార్పొరేటర్లు
- ఢిల్లి లిక్కర్ కేసులో కవిత జ్యుడీషియల్ రిమాండ్ పొడిగింపు
- Tandur: పసికందు ప్రాణం తీసిన పెంపుడు కుక్క
- టీడీపీ కార్యకర్తల్లా పోలీసులు: అనిల్కుమార్ ఆగ్రహం
Advertisement