
అంతరాయం లేకుండా విద్యుత్ సరఫరా చేస్తాం
కామారెడ్డి టౌన్ : అంతరాయం లేకుండా వి ద్యుత్ సరఫరా చేస్తామని వినియోగదారుల ఫిర్యాదుల పరిష్కార వేదిక(సీజీఆర్ఎఫ్) చైర్మన్ ఎరుకల నారాయణ పేర్కొన్నారు. శు క్రవారం జిల్లా కేంద్రంలోని కలేక్టరేట్ సబ్స్టేషన్లో ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్ర మం చేపట్టారు. వినియోగదారుల నుంచి ఫి ర్యాదులను స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వినియోగదారుల స మస్యలను పరిష్కరిస్తామన్నారు. సబ్స్టేషన్లలో నెలకొన్న సమస్యలను పరిష్కరించామన్నారు. కార్యక్రమంలో వేదిక ఫైనాన్స్ మెంబర్లు శ్రీకాంత్, రాజగౌడ్, విద్యుత్ శాఖ జిల్లా సూపరింటెండెంట్ శ్రవణ్కుమార్, డీ ఈ కళ్యాణ్ చక్రవర్తి, ఏడీఈ కిరణ్ చైతన్య, సిబ్బంది పాల్గొన్నారు.
బక్రీద్ ఏర్పాట్ల పరిశీలన
కామారెడ్డి టౌన్ : బక్రీద్ సందర్భంగా జిల్లా కేంద్రంలో బల్దియా ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేశారు. ఈద్గాల వద్ద పరిసరాలను శుభ్రం చేసి, రంగులు వేసి, విద్యుత్ దీపాలు, టెంట్లు వేశారు. ముస్లీంలు ప్రత్యేక ప్రార్థనలు చేయనున్నారు. బక్రీద్ సందర్భంగా ఆర్డీవో కార్యాలయం ముందు, పెద్దమ్మ కాలనీలో, పెద్ద బజార్, పాతబస్టాండ్, అశోక్నగర్కాలనీ, ఇస్లాంపురా ప్రార్థన మందిరాలలో ప్రత్యేక ప్రార్థన చేయనున్నారు. ప్రభుత్వ సలహాదారు షభ్బీర్ అలీ శనివారం ఆర్డీవో కార్యాలయం ముందు జరిగే ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొననున్నారు. స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ చందర్నాయక్, మున్సిపల్ కమిషనర్ రాజేందర్రెడ్డి ఏర్పాట్లను పరిశీలించారు.
ఎన్కౌంటర్లు నిలిపేయాలి
కామారెడ్డి టౌన్ : కగార్ పేరుతో మావోయిస్టులను ఎన్కౌంటర్ చేసి చంపడం సరికాదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యురాలు పశ్య పద్మ పేర్కొన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో జరిగిన జిల్లా కౌన్సిల్ సమావేశంలో ఆమె మాట్లాడారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానాలపై ప్రజలు పోరాటాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీలన్నీ అమలు చేయాలని డిమాండ్ చేశారు. సమావేశంలో పార్టీ జిల్లా కార్యదర్శి దశరథ్, సహాయ కార్యదర్శి బాలరాజు, నాయకులు రాజమణి, శంకర్, దేవయ్య, ఈశ్వర్, మల్లేష్ తదితరులు పాల్గొన్నారు.

అంతరాయం లేకుండా విద్యుత్ సరఫరా చేస్తాం

అంతరాయం లేకుండా విద్యుత్ సరఫరా చేస్తాం