క్షణికావేశానికి రెండు ప్రాణాలు బలి | - | Sakshi
Sakshi News home page

క్షణికావేశానికి రెండు ప్రాణాలు బలి

Jun 7 2025 1:04 AM | Updated on Jun 7 2025 1:04 AM

క్షణి

క్షణికావేశానికి రెండు ప్రాణాలు బలి

కామారెడ్డి క్రైం: క్షణికావేశంలో ఓ తల్లి తీసుకున్న నిర్ణయం కుటుంబంలో విషాదాన్ని నింపింది. కుమారుడితో సహా తల్లి చెరువులో దూకడంతో ఇద్దరి ప్రాణాలు నీట మునిగాయి. నర్సన్నపల్లి గ్రామంలో చోటు చేసుకున్న విషాద ఘటన వివరాలిలా ఉన్నాయి. నర్సన్నపల్లి గ్రామానికి చెందిన రాచమొల్ల ప్రశాంత్‌కు భిక్కనూరు మండలం పెద్దమల్లారెడ్డి గ్రామానికి చెందిన స్రవంతి(25)తో వివాహమైంది. వీరికి శ్రీవల్లి అనే కూతురు, రుద్రేశ్వర్‌(4) అనే కుమారుడు ఉన్నారు. కొన్నాళ్ల క్రితం స్రవంతి అత్తగారికి చెందిన బంగారాన్ని తల్లి గారి కుటుంబ సభ్యులకు ఇచ్చింది. వారు ఆ బంగారాన్ని తాకట్టు పెట్టి రుణం తీసుకున్నారు. నగలను తిరిగి ఇవ్వకపోవడంతో ఇటీవల ఇరు కుటుంబాల మధ్య గొడవలు జరిగినట్లు తెలిసింది. శుక్రవారం నగల విషయమై స్రవంతితో కుటుంబ సభ్యులు గొడవ పడ్డట్లు సమాచారం. కొద్దిసేపటి తర్వాత స్రవంతి తన ఇద్దరు పిల్లలను వెంట తీసుకుని ఇంట్లో నుంచి బయటకు వెళ్లింది. పక్కనే ఉన్న చిన్నమల్లారెడ్డి చెరువు కట్టకు వద్దకు చేరుకున్నారు. నీటిలో దూకడానికి కూతురు నిరాకరించడంతో స్రవంతి కుమారుడు రుద్రేశ్వర్‌తో కలిసి నీటిలో దూకి మరణించింది. దీనిని గమనించిన స్థానికులు రూరల్‌ పోలీసులకు సమాచారం ఇచ్చారు. వారు వచ్చి ఇద్దరి మృతదేహాలను బయటికి తీయించారు. కుటుంబంలో జరిగిన గొడవల కారణంగానే స్రవంతి తన కొడుకుతో కలిసి ఆత్మహత్యకు పాల్పడినట్లు ఆమె తల్లి రాధమణెమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నామని రూరల్‌ సీఐ రామన్‌ తెలిపారు.

కొడుకుతో కలిసి చెరువులో

దూకిన తల్లి

ఇద్దరి మృతితో నర్సన్నపల్లిలో

విషాదం

క్షణికావేశానికి రెండు ప్రాణాలు బలి1
1/1

క్షణికావేశానికి రెండు ప్రాణాలు బలి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement